June 30, 2013




మహానటుడు నందమూరి తారకరామారావు కడుపున జన్మించడం తన అదృష్టమని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. తన తండ్రి జీవితమే తనకు స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న బాలయ్య ఫిలడెల్ఫియాలో డెలావేర్ వ్యాలీ తెలుగు సంఘం 40వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నందమూరి హీరోను లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ తో పురస్కరించారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, ప్రేక్షకుల ఆదరణతోనే తాను ఇంతటి వాణ్ణయ్యానని వినమ్రంగా చెప్పారు. వారికోసం ఇకపైనా సినిమాల్లో కొనసాగుతానని, ఫ్యాన్స్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని స్పష్టం చేశారు. ఇక రాజకీయాలపై వ్యాఖ్యానిస్తూ.. రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతోందని, అవినీతిని అంతమొందించేందుకు ప్రవాసాంధ్రులు కలిసిరావాలని పిలుపునిచ్చారు.

ఈ సభలో సినీతారలు హంసనందిని, రజిత, సంగీత దర్శకుడు మణిశర్మ, గాయని సునీత, రచయిత వడ్డేపల్లి కృష్ణ, నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డితో పాటు పలు తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ కడుపున పుట్టడం పూర్వ జన్మ సుకృతం

సీఎం కిరణ్‌ ఔరంగజేబు తరహా పాలన చేస్తున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. ఎన్నికల ఎజెండాలో దశల వారీగా మద్యం నిషేధిస్తున్నామన్న హామీని కాంగ్రెస్‌ తుంగలో తొక్కిందని ఆయన చెప్పారు. నూతన మద్యం విధానం చెత్త విధానమని ఆయన అన్నారు. నూతన మద్యం విధానాన్నినిరసిస్తూ రేపు అన్ని ఆబ్కారీ కార్యాలయాల వద్ద ధర్నాలు చేస్తామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడగానే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు నిలిపివేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

సీఎం కిరణ్‌ది ఔరంగజేబు తరహా పాలన



విజయవాడ: కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీలో విజయవాడ లోకసభ స్థానం రగడ కొలిక్కి వచ్చినట్లుగా కనిపిస్తోంది. 2014 ఎన్నికలలో విజయవాడ పార్లమెంటు టిక్కెట్‌ను టిడిపి తరఫున గద్దె రామ్మోహన్ రావు, కేశినేని నానిలు ఆశించిన విషయం తెలిసిందే. అప్పటికే కేశినేనిని పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇంఛార్జిగా ప్రకటించారు. ఇంఛార్జి ప్రకటన తర్వాత కూడా గద్దె అధినేతను కలిసి విజయవాడ టిక్కెట్‌‍ను కోరారు.

ఈ రగడ ఇటీవల బెజవాడలో చర్చనీయాంశమైంది. అయితే ఇప్పుడు ఇద్దరు నేతలు రాజీకి వచ్చినట్లుగా కనిపిస్తోంది. దీంతో విజయవాడ పార్లమెంటు టిక్కెట్ కేశినేని నానికి, విజయవాడ తూర్పు టిక్కెట్ గద్దె రామ్మోహన రావుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చే ఉద్దేశ్యంలో భాగంగా ఇరువురు నేతలు రాజీకి వచ్చినట్లుగా కనిపిస్తోంది.

ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ తామిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని, పార్టీ అధినేత ఏది చెబితే అది చేయడమే తమ విధి అన్నారు. టిడిపి క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, దానికి అనుగుణంగానే తాము నడుచుకుంటున్నామని కేశినేని నాని చెప్పారు.

గద్దె రామ్మోహన రావు మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రం చాలా సమస్యల్లో ఉందని, వాటిని తీర్చడమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ఆయన ఆదేశాలను తాము పాటిస్తామని చెప్పారు. విజయవాడ ఇంఛార్జిగా నానిని నియమించానని, తూర్పు నియోజకవర్గం చూసుకోవాలని తనకు అధినేత సూచించారన్నారు.

బెజవాడ'పై రాజీ: తూర్పుకు గద్దె, ఎంపీ టిక్కెట్‌కు నాని

హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో గవర్నర్ దంపతులను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పరామర్శించారు. గవర్నర్ అత్త మూడు రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే.

గవర్నర్ దంపతులను పరామర్శించిన బాబు

June 29, 2013


నెల్లూరు జిల్లాలోనూ వైకాపాలో ధిక్కారస్వరం తారస్థాయికి చేరింది. అక్కడ మేకపాటి సోదరులకు వ్యతిరేకంగా చిరంజీవిరెడ్డి వేరుకుంపటిని పెట్టుకున్నారు. మేకపాటి సోదరుల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడటానికే రాజన్నదళం పేరిట ప్రత్యేక సంస్థను ఆయన ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. చిరంజీవిరెడ్డికి ఉదయగిరి నియోజకవర్గంలో గట్టిపట్టుంది. ఆ నియోజకవర్గంలో రాజన్నదళం తరఫునా అన్ని పంచాయితీలలో సర్పంచ్ స్థానాలకు అభ్యర్థులను పోటీకి పెడుతున్నట్లు ఆయన ప్రకటించారు. అంతేకాకుండా ఆ మేరకు పోస్టర్లు కూడా ఏర్పాటు చేయించారు. మేకపాటి సోదరుల వల్ల పార్టీకి జరుగుతున్న నష్టం గురించి ఎంతగా చెప్పినా అధినాయకత్వం నుంచి కట్టడి చర్యలు లేకపోవడంతో పార్టీని కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇదివరేక మేకపాటి కార్యకలాపాల తో విభేదించిన కాకాని గోవర్థన్‌రెడ్డి ఆశీస్సులు చిరంజీవిరెడ్డి వర్గానికి అందిస్తున్నట్లు సమాచారం. తాజా పరిణామంతో ఇతర నియోజకవర్గాల్లోనూ మేకపాటికి వ్యతిరేకంగా మరికొందరు నిరసన గళాన్ని వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎల్.ఎం. మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజక వర్గానికి వైకాపాకు సమన్వయ కర్తగా చాలా కాలంగా పని చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు పదవులు ఎరచూపినప్పటికీ తలొగ్గకుండా జగన్‌పై, వైఎస్‌పై వున్న అభిమానాన్ని చాటుకున్నారు. తొలి నుంచి వైకాపాకు అంకితభావంతో పనిచేస్తున్నారు. అందుకు గుర్తింపుగానే ఆయనకు ఇన్‌ఛార్జి పదవిని అప్పగించారు. ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఇక రాబోయే ఎన్నికలకు తానే అభ్యర్థి అనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నారు. పార్టీ కూడా గతంలో ఆ మేరకు హామీ ఇచ్చింది. అయితే ఇటీవల అనూహ్య రీతిలో మరొకరిని ఇన్‌ఛార్జిగా నియమించారు. ఆ నిర్ణయంతో ఖంగుతిన్న మోహన్ రెడ్డి పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం అక్కడ జరిగిన పార్టీ సమావే శంలో ఆయన నిరసన వ్యక్తం చేశారు. కొత్త సమన్వయ కర్త అనుయాయులకు, ఎల్‌ఎం మోహన్‌రెడ్డి వర్గీయులకు మధ్య ముష్టియుద్ధం జరిగింది. పార్టీ నిర్ణయం తెలిసిన వెంటనే మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. వైకాపాలో నమ్ముకుని పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని వాపోయారు. డబ్బున్నవారికే పెద్దపీట వేస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇకపోతే గుంటూరు జిల్లాలో అసమ్మతి నేతలు సమావేశ మయ్యారు. డబ్బున్నవారికి, పార్టీఫండ్ బాగా ఇచ్చిన వారికి ఇన్‌ఛార్జి పదవులు కట్టబెడుతూ పాతవారిని మారుస్తూ తీసుకున్న నిర్ణయాలతో పదవులు కోల్పోయిన వారంతా ఇందులో పాల్గొన్నారు. పార్టీ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. జగన్ జైలుకు వెళ్ళాక పార్టీలోని కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, పార్టీకి విధేయతలతో సంబంధం లేకుండా ఎవర్వు ఎక్కువగా డబ్బులు ముట్టజెబితే వారికి ఇన్‌ఛార్జి పదవులు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. త్వరలోనే జగన్‌ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించాలని వారు నిర్ణయానికి వచ్చారు. అంతేకాకుండా స్థానికేతరులను ఇన్‌ఛార్జిలుగా నియమించడం ఏమిటని ఆక్షేపిస్తున్నారు. స్థానికంగా కార్యకర్తలతో, ప్రజలతో సంబంధాలు వున్న నేతలు కాకుండా బయటి వారిని ఇన్‌ఛార్జిలుగా నియమిస్తే ప్రయోజనం ఏమిటని, ఎలా గెలుస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ఫండ్, పార్టీ ఫండ్ వస్తే చాలని అనుకుంటున్నారా, లేక ఎన్నికల్లో పార్టీ గట్టెక్కాలని భావిస్తున్నారా, ఎలాగో జగన్ బయటకు వచ్చేది లేదు, గెలిచే అవకాశాలు అంతకన్నా లేవనే ఉద్దేశ్యంతో ఇన్‌ఛార్జిల పోస్టులను అమ్ముకుంటున్నారా అని గుంటూరు జిల్లాకు చెందిన అసంతృప్తి నేతలు పార్టీ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడినట్టు తెలుస్తోంది.

వైకాపాలో నమ్ముకుని పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని వాపోయారు.

స్థానిక సంస్థల ఎన్నికలు, మద్యం విధానంపై చర్చించేందుకు అందుబాటులో ఉన్న ముఖ్యనేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం సాయంత్రం తన నివాసంలో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయాలని నిర్ణయించారు. 34 శాతానికి తక్కువగా కాకుండా బీసీ రిజర్వేషన్లను ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.మద్యం విధానంపై టీడీపీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. మద్యాన్ని కేవలం ఆదాయ వనరుగా చూస్తు, ప్రభుత్వం పేదవారి జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. చంద్రబాబుతో సమావేశమైన అనంతరం టీడీపీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి, ప్రధాన కార్యదర్శి బుచ్చయ్యచౌదరి విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సత్వరమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సమాయాత్తం చేసేందుకు ఐదు చోట్ల ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. బీసీ రిజర్వేషన్లను తగ్గించాలని చూస్తే చూస్తు ఊరుకునేది లేదని హెచ్చరించారు. టీడీపీ అధికారంలోకి వస్తే పర్మిట్‌ రూమ్‌లను, బెల్ట్‌షాపులను ఎత్తివేస్తుందని పేర్కొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి పెద్దిరెడ్డి బుచ్చయ్యచౌదరి

ఉత్తరాఖండ్ విలయంలో చిక్కుకుపోయిన తెలుగువారి కోసం చేపట్టిన సహాయ కార్యక్రమాల వేగం పెంచడానికి టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. అక్కడ ఉన్న తమ పార్టీ ఎంపీలు, వైద్య బృందాలతో శనివారం ఆయన నాలుగు గంటలకోసారి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎంపీలు నామా నాగేశ్వరరావు, రమేష్ రాథోడ్, కొనకళ్ల నారాయణరావు, నిమ్మల కిష్టప్ప ప్రస్తుతం ఢిల్లీ, డెహ్రాడూన్‌లలో ఉన్నారు. ఇంకా 150 మంది తెలుగువారి ఆచూకీ దొరకడం లేదని తెలియడంతో.. బదరీనాథ్, జోషీమఠ్ ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు జరపాలని ఆయన వారిని కోరారు.

బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పాలని, వైద్య బృందం వారికి అవసరమైన వైద్యం, మందులు ఇవ్వాలని ఆయన కోరారు. అవసరమైతే ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలని నామా నాగేశ్వరరావును ఆదేశించారు. ఇక.. ఉత్తరాఖండ్ బాధితుల కోసం టీడీపీ, ఎన్టీఆర్ ట్రస్టు చేపట్టిన సహాయ కార్యక్రమాలకు మద్దతుగా శనివారం ఆశయ ఫౌండేషన్ తరపున వాసిరెడ్డి ప్రసాదరాజా రూ. 5 లక్షలు అందజేశారు. కూకట్‌పల్లికి చెందిన జాస్తి శ్రీధర్ తమ కుమార్తె అన్విత పేరు మీద రూ. 50 వేలు విరాళం అందచేశారు.

ఖానాపూర్ నియోజకవర్గ పార్టీ నేతలు, సభ్యులు రూ. 1.20 లక్షలు, ఏవీఎం రావు రూ. 50 వేలు, బుక్కా వేణుగోపాల్ రూ.50 వేలు, జి. శివ ప్రసాదరావు రూ.20 వేలు, రామినేని సంయుక్త రూ. 10 వేలు విరాళంగా ఇచ్చారు

టీడీపీ సహాయం ముమ్మరం

స్థానిక ఎన్నికల సమరానికి శ్రేణులను సమాయత్తం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఐదు ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని టీడీపీ నిర్ణయించింది. శనివారం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసంలో నిర్వహించిన భేటీలో తీర్మానించినట్లు ముఖ్య నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఇ.పెద్దిరెడ్డి విలేకరులకు తెలిపారు. గ్రామ, మండలస్థాయి నేతలను ఈ సదస్సులకు ఆహ్వానించి ఎన్నికలకు సిద్ధం చేయనున్నట్లు చెప్పారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ తగ్గకుండా చూడాలని, లేకపోతే గట్టిగా పోరాడాలని నేతలకు సూచించినట్లు తెలిపారు

'స్థానికం'పై టీడీపీ సదస్సులు

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు శనివారం సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. మర్యాదపూర్వకంగానే అక్కినేని కలిశారని టీడీపీ వర్గాలు చెప్పాయి. ఉత్తరాఖండ్ బాధితుల విషయంలో చంద్రబాబు చూపిన చొరవ పట్ల అక్కినేని ఆయనను అభినందించారని, చంద్రబాబు ఆయనకు ధన్యవాదాలు చెప్పారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.

చంద్రబాబును కలిసిన అక్కినేని

ఉత్తరాఖండ్ చార్‌ధామ్‌లో వరదలు టిడిపి అందించిన సహాయ సహకారాలపై టిడిపి ఏకంగా ఒక వీడియోను రూపొందించిన ప్రచారం చేస్తోంది. ప్రమాదంలో మనుషులు కొట్టుకు పోవడం, ఆలయం వద్ద శవాల గుట్టలు, సైన్యం సహాయం చేయడం, భవనాలు కూలిపోవడం వంటి దృశ్యాలు వివిధ చానల్స్‌లో వచ్చిన వాటిని సేకరించి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు అందజేస్తున్న సహాయ కార్యక్రమాలను వీటిలో చేర్చి టిడిపి ఆధ్వర్యంలో వీడియో రూపొందించారు. టిడిపి అధికారిక వెబ్‌సైట్ ద్వారా, ఫేస్‌బుక్‌లో టిడిపి పేజీ ద్వారా దీనిని ప్రచారం చేస్తున్నారు. చార్‌ధామ్‌లో టిడిపి అందజేసిన సేవల వల్ల ప్రజల్లో మంచి సంకేతాలు వెళ్లాయని, కచ్చితంగా ఇది ప్రజలపై ప్రభావం చూపుతుందని టిడిపి నాయకులు చెబుతున్నారు. కదలిరండి మనుషులైతే అనే పాటను వినిపిస్తూ చార్‌ధామ్ వరద ప్రమాద దృశ్యాలతో వీడియో రూపొందించారు. చంద్రబాబు,లోకేశ్‌తో పాటు పార్టీ నాయకులు అందిస్తున్న సేవలను చూపించారు.

ఉత్తరాఖండ్‌పై టిడిపి వీడియో

ఒకే నెలలో పెట్రోలు రేట్లు రెండు సార్లు విపరీతంగా పెరగడం, రాష్ట్ర మద్యం విధానంలోని వైరుధ్యాలపై తె లుగుదేశం పార్టీ తీవ్రంగా విరుచుకుపడింది. పార్టీ సీనియర్ నాయకులతో పార్టీ అధినేత చంద్రబాబు శనివారం నాడు భేటీ అయ్యారు.

త్వరలో జరుగనున్న పంచాయతీ ఎన్నికలు, పెట్రోల్ ధరల పెంపు, మద్యం పాలసీలపై ఈ భేటీలో వారు చర్చించినట్లు తెలుస్తున్నది. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ఇష్టం వచ్చినట్టు పరిపాలన సాగిస్తున్నారని సీనియర్లు ఈ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది.

టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ

రాష్ట్రంలో పేద ప్రజల కష్టాలకు కేంద్రమంత్రి చిరంజీవే కారణమని తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష ఉపనేత పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. విజయనగరం జిల్లా డెంకాడ మండలం పెదతాడివాడ పంచాయతీ గుండాలపేటలో స్థానికులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని అశోక్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పాలనపై విసిగి ప్రజలు టీడీపీకి అధికారాన్ని కోరుకుంటున్న సమయంలో చిరంజీవి ప్రజారాజ్యాన్ని స్థాపించి, ఓట్లను చీలిక చేశారని పేర్కొన్నారు.

'పులినిచూసి నక్క వాతలు' పెట్టుకున్నట్టుగా ఎన్టీఆర్‌లా తాను కూడా ముఖ్యమంత్రి అయిపోవాలని కలలుగన్న చిరంజీవి ఎన్నికల్లో పార్టీ బోల్తాపడడంతో దుకాణం మూసేశారని ఎద్దేవా చేశారు. చిరంజీవి తనను నమ్ముకున్నవారిని నట్టేట ముంచి, తాను మాత్రం కేంద్రమంత్రి అయ్యారని అన్నారు. వెండితెరపైగాని, రాజకీయాల్లో గాని రియల్ హీరో ఒక్క ఎన్టీఆరేనని అశోక్ పేర్కొన్నారు.

పేదల కష్టాలకు చిరంజీవే కారణం: అశోక్ గజపతిరాజు

కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావుకు వృద్దాప్యం పైనబడినా దాదాగిరీ తగ్గలేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బోడకుంట్ల వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. 'ఏదో ఒకటి తగాదా పెట్టుకొని వివాదంలోకి చంద్రబాబును కూడా లాగాలన్న తాపత్రయం విహె చర్యల్లో స్పష్టంగా కనిపించింది. ముందు రోజు ఢిల్లీలోని ఎపి భవన్లో చంద్రబాబును పొగిడాడు. తమ పార్టీవాళ్ళు తిట్టేసరికి డెహ్రాడూన్ విమానాశ్రయంలో చంద్రబాబుతో తగాదా పెట్టుకోవాలని చూశాడు. ఆయన మూడుసార్లు రాజ్యసభ సభ్యునిగా చేశాడు. వయసు పైబడింది. ఓపిక లేకపోయినా దాదాగిరీ చేయాలని తాపత్రయపడుతున్నాడు' అని బోడకుంట్ల విమర్శించారు.

తెలుగుదేశం పార్టీ పంపిన వైద్య బృందాన్ని ఎపి భవన్ నుంచి రెసిడెంట్ కమిషనర్ బయటకు పంపడం తప్పేనని మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారని, కాని ఆయనపై చర్యలు మాత్రం ఏవీ తీసుకోవడం లేదని వెంకటేశ్వర్లు అన్నారు. మొత్తం సహాయ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాత్రే కనిపించలేదని, ఏదో కంటి తుడుపుగా బాధితులను పరామర్శించి వచ్చారు తప్ప సహాయ కార్యక్రమాలను పట్టించుకొన్న దాఖలాలు ఏవీ లేవని ఆయన అన్నారు.

విహెచ్‌కు వృద్ధాప్యం పైబడినా దాదాగిరీ తగ్గలేదు: వెంకటేశ్వర్లు

ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న వారిని ఆదుకునేందుకు ఎలా చురుకుగా స్పందించాలో ప్రధాన ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాలకుల కళ్లు తెరిపించేలా ఆచరించి చూపించారు. ఛార్‌దామ్‌ యాత్రకు వెళ్లిన తెలుగు వారు ఆకస్మికంగా కురిసిన భారీ వర్షాలతో పోటెత్తిన వరదల్లో చిక్కుకున్నారు. తమను కాపాడి స్వస్థలాలకు తరలించేవారి కోసం వెయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించి మొద్దునిద్రలో జోగుతుండడంతో, వరదల్లో చిక్కుకుని ఇబ్బందులెదుర్కొంటున్న యాత్రికులను సురక్షితంగా వారి స్వస్థలాలకు తరలించేందుకు చంద్రబాబు చూపిన చొరవ ప్రశంసనీయం. ప్రభుత్వం చేయలేని పనిని ప్రతిపక్షనేతగా చంద్రబాబు చేసి చూపించారు.

బాధితులను విమానాల్లో సొంత ఖర్చుతో హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నగరాలకు తరలించారు. అప్పటి వరకు తాము ఎప్పుడూ ఇళ్లకు చేరుతామో తెలియని యాత్రికులు చంద్రబాబు చూపిన చొరవతో ఒక్కరోజులోనే డెహ్రాడూన్‌ నుండి ఢిల్లీకి చేరుకుని అక్కడి నుండి తమ సొంతూళ్లకు పయనమయ్యారు. విమానాశ్రయాల్లో దిగిన తరువాత వరద బాధిత యాత్రికులను స్వస్థలాలకు తరలించేందుకు పార్టీ నేతల ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయించి చంద్రబాబు తానే అసలు, సిసలైన పాలనాధ్యక్షుడినని మరోసారి నిరూపించుకున్నారు. ఛార్‌దామ్‌ యాత్రకు వెళ్లి వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న తెలుగువారిని ఢిల్లీకి తరలించి అక్కడి నుండి ప్రత్యేక విమానంలో 167 మందిని నేరుగా హైదరాబాద్‌కు తరలించింది. ప్రభుత్వం చేయలేని పనిని పార్టీపరంగా చంద్రబాబు చేసి చూపించి అందరి మన్నలను పొందారు.

టీడీపీ నాయకత్వం 25వ తేదీన మరో 51 మందిని స్వస్థలాలకు తరలించగా, 26వ తేదీన డెహ్రాడూన్‌ నుండి 140 సీట్ల సామర్ధ్యం కలిగిన స్పెస్‌జెట్‌ విమానాన్ని యాత్రికుల సౌకర్యార్ధం ఏర్పాటు చేసి ప్రభుత్వం విఫలమైన ప్రతి చోటా తామున్నమని యాత్రికులకు భరోసాను కల్పించింది. ఛార్‌దామ్‌ యాత్రకు వెళ్లిన వారు భారీ వరదల్లో చిక్కుకున్న తెలిసిన తరువాత మూడు రోజులకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రభుత్వం కంటితుడుపు చర్యలతో సరిపెట్టుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లినా చంద్రబాబు ఆదివారం ఉదయమే నగరానికి చేరుకుని, అదే రోజు సాయంత్రం హుటా, హుటీనా తెలుగు యాత్రికులను పరామర్శించేందుకు ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో యాత్రికుల కల్పిస్తున్న సౌకర్యాలను చూసి చంద్రబాబు చలించిపోయారు. యాత్రికులకు మైరుగైన సౌకర్యాలు కల్పించాలంటూ పార్టీ ఎంపీలతో కలిసి ఏపీ భవన్‌ ముందు ధర్నాకు దిగారు.

బాధితులకు కల్పిస్తున్న అరకొర సౌకర్యాలపై ఏపీ భవన్‌ రెసిడెంట్‌ అధికారి శశాంక్‌ గోయల్‌, చంద్రబాబు ఆగ్రహానికి గురికావాల్సివచ్చింది. మైరుగైన సౌకర్యాల కల్పిస్తామని పేర్కొనడంతో బాబు ధర్నా విరమించారు. యాత్రికులను పరామర్శించి వారికీ ఎన్టీఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో వైద్యసేవలు అందేలా చర్యలు తీసుకున్నారు. ఢిల్లీ నుండి నేరుగా డెహ్రాడూన్‌కు వెళ్లి అక్కడి యాత్రికులను పరామర్శించారు. వారు చెప్పిన బాధలు విని చలించిపోయిన చంద్రబాబు ఎంపీలు రమేష్‌ రాథోడ్‌, కొనకళ్ల నారాయణలను అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించాలని సూచించారు. నేరుగా ఉత్తరాఖండ్‌ సీఎం విజయ్‌ బహుగుణను కలిసి తెలుగువారిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. రుషికేష్‌, బద్రీనాథ్‌, హర్షలీ ప్రాంతాల్లో చిక్కుకుపోయి ఆర్మీ క్యాంపుల్లో తలదాచుకున్న తెలుగువారిని ఒక్కచోటకు చేర్చి వారికీ భోజన, వసతి, వైద్య సౌకర్యాలు కల్పించి ప్రత్యేక విమానాల్లో స్వస్థలాలకు తరలించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఎంపీలు కృషి చేశారు.

వరదల్లో అన్ని కోల్పోయిన యాత్రికులను ఆదుకునేందుకు చంద్రబాబు ఒక్కొరికీ పది వేల చొప్పున ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. మొత్తం 12 లక్షల రూపాయలను వరద బాధితులకు అందజేసి ప్రభుత్వ సహాయాన్ని వెనక్కి నెట్టారు. ప్రభుత్వ పక్షాన కేవలం రెండు వేల రూపాయల ఆర్ధిక సహాయమందజేయగా, టీడీపీ నాయకత్వం ఐదింతల అధిక సహాయమందజేసి యాత్రికుల మెప్పును పొందింది. దీనితో ప్రభుత్వం మెల్కోని నష్ట నివారణ చర్యల్లో భాగంగా బాధితులకు ఐదేసీ వేల చొప్పున ఆర్ధిక సహాయాన్ని అందజేస్తున్నట్లు ప్రకటించింది. టీడీపీ విస్త్రృతస్థాయిలో చేపట్టిన సహాయక చర్యలు ఆ పార్టీ భవిష్యత్తులో రాజకీయంగా ఎంతో మేలు చేస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు నాయుడు 218 రోజులు చేపట్టిన ‘వస్తున్నా...మీకోసం’ పాదయాత్ర ద్వారా కంటే ఛార్‌దామ్‌ యాత్రికులకు చేసిన సహాయక చర్యల ద్వారానే ఎక్కువ ప్రాచూర్యం లభించిందంటున్నారు.

ది లీడర్‌

రాబోయే ఎన్నికల్లో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీని ఎలా దెబ్బతీయాలన్నదే కాంగ్రెస్ పార్టీ ప్రధాన వ్యూహంగా కనిపిస్తుంది. ప్రస్తుతం రాష్ర్టంలో ప్రత్యేక తెలంగాణ సమైఖ్యాంధ్ర ఉద్యమాలు బలంగా నడుస్తున్న క్రమంలో రెండు ప్రాంతాల్లో టీడీపీని దెబ్బతీయాలంటే ఏ వ్యూహంతో ముందుకు వెళ్ళాలన్న ప్రణాళికతో కాంగ్రెస్ తర్జన భర్జన పడుతుంది. రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా.. ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉంది. కాగా, ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలలో తెలంగాణలో టీఆర్‌ఎస్, సీమాంధ్రలో వైకాపాలు బలపడ్డాయన్న ప్రచారం ఉంది. అయితే తెలుగుదేశం పార్టీని పూర్తిగా దెబ్బతీయాలన్న ఆలోచనలో కాంగ్రెస్ వ్యూహాలకు పదునుపెట్టినట్లు సమాచారం. చంద్రబాబు నాయుడు స్వతహాగా కరుడుగట్టిన సమైక్యవాదిగా ముద్రపడ్డ వ్యక్తి. అయితే ఆ పార్టీ ప్రత్యేక తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని కేంద్రం తెలంగాణ ఏర్పాటు విషయంలో తీసుకునే ఏ చర్యకు తాము అడ్డుకోబోమని పార్లమెంట్‌లో బిల్లుపెట్టే మద్ధతిస్తామని ప్రకటించడంతో తెలంగాణలో టీడీపీ పట్ల కొంత సానుకూల ధోరణి ఏర్పడింది. దీంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వలా..లేక సమైక్యంగా ఉంచాలా అన్న అంశాల్లో ఆచితూచి అడుగు వేసేందుకు తర్జన భర్జన పడుతుంది. రాష్ర్టంలో తెలుగుదేశం పార్టీ దెబ్బతీయడమే లక్ష్యంగా ప్రత్యేక తెలంగాణ అంశాన్ని కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. రాష్ర్టంలో ప్రాంతీయ పార్టీలుగా ఉన్న టీడీపీ, వైసీపీ, టీఆర్‌ఎస్‌లు కాంగ్రెస్‌తో సమానంగా రాజకీయంగా పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌పార్టీ, టీఆర్‌ఎస్ రెండు కూడా తెలుగుదేశం పార్టీతో బద్ధ వైరుధ్యాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు కాంగ్రెస్‌తోకూడా అంతే దూరం ఉన్నా.. టీఆర్‌ఎస్ ఇప్పటికే అనేక సందర్భాలలో ప్రత్యేక తెలంగాణ ఇస్తే.. తమ పార్టీ కాంగ్రెస్‌లో వీలినం చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రకటించింది. ఇకపోతే వైసీపీ కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థగానే టీడీపీ ప్రచారం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సీఎం దివంగత నేత రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్ ఏర్పాటు చేసిన ఈ పార్టీకి కేంద్రంలో కాంగ్రెస్‌లోని అనేక మంది పెద్ద నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్, వైకాపాలు సీట్లు సంపాదించినా కాంగ్రెస్ పార్టీ ఆ రెండు పార్టీలను తమకు అనుకూలంగా మలుచుకోవడం పెద్ద కష్టం కాదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం టీడీపీని ప్రధాన శత్రువుగా కాంగ్రెస్ భావిస్తుంది. అందుకే రాబోయే ఎన్నికలలో టీడీపీనే టార్గెట్‌గా చేసి ఎన్నికల వ్యూహానికి పదునుపెడుతున్నట్లు సమాచారం. తెలుగు దేశం పార్టీ రెండు ప్రాంతాలలో దెబ్బతినేలా ఏ రకమైన వ్యూహంతో ముందుకు పోతే బాగుంటుందో కాంగ్రెస్ కోర్ కమిటీ భావిస్తుంది. అటు సీమాంధ్రలో వైకాపా, తెలంగాణలో టీఆర్‌ఎస్ బలంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఆ రెండు పార్టీలను కాంగ్రెస్‌కు రాజకీయంగా పెద్దగా ఇబ్బంది ఉండదని అందువల్ల ఆ పార్టీ గెలిచినా భవిష్యత్‌లో కాంగ్రెస్‌తోనే జతకట్టే అవకాశాలున్నా యని అందువల్ల టార్గెట్ టీడీపీగా కాంగ్రెస్ రాజకీయ ఎత్తుగడలతో ముందుకు పోతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాబోయే ఎన్నికల్లో ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీని ఎలా దెబ్బతీయాలన్నదే కాంగ్రెస్ పార్టీ ప్రధాన వ్యూహంగా కనిపిస్తుంది.

ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న బాధితుల అనుభవాలు మాటల్లో చెప్పాలేమని, చార్‌ధామ్‌లో యాత్రికులు నరకం అనుభవించారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. బాధితులను ఆదుకునేందుకు ఉత్తరాఖండ్ వెళ్ళిన చంద్రబాబు వారిని పరామర్శించారు. వారు అనుభవించిన బాధలను తెలుసుకున్న ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ చాలా భయంకరమైన అనుభవాలు ఎదురైనాయని అన్నారు. బాధితులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు..

ఉత్తరాఖండ్‌లో ఒక చోట బాధితులు తిండి నీళ్లు లేక, బాతకాలి కాబట్టి తాము కట్టుకున్న బట్టలతో శవాలు పడిఉన్న నీటిలో తడిపి ఆ నీటినే తాగామని తెలిపారని బాబు అన్నారు. మరో మహిళ తన కళ్లముందే తన కుమార్తె వరదలో కొట్టుకుపోయిందని వాపోయింది. ఆ చలిలో బిక్కుబిక్కుమంటూ ఉందని, కట్టుకోడానికి చీర లేక కేవలం లంగా, జాకెట్టుతో ఉందని, అక్కడ ఒక చోట మంట ఉంటే అటుగగాపోయిన గుర్రం ఆమెను తన్నడంతో మంట పక్కన పడిందని, కనీసం లేవలేని స్థితిలో ఉండగా అటుగా పోయినవాళ్ళు ఆమెను తీసి పక్కన పడేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆమె డెహ్రాడూన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నదని చంద్రబాబు తెలిపారు. ఆమె ఎవరో తెలుసుకుని వారి కుటుంబ సభ్యులకు తెలియజేశామని చంద్రబాబు తెలిపారు.

మరో పద్మా అనే మహిలా తన కళ్లముందే కుటుంబ సభ్యులు ఐదుగురు వరదలో కొట్టుకుపోతుంటే ఒంటరిగా మిగిలిన ఆమె బాధ వర్ణనాతీతం అని, ఇలాంటి సంఘటనలు కోకొల్లలు జరిగాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీ ఏపీ భవన్‌కు చేరుకున్న బాధితులకు అక్కడి అధికారులు సరైన సదుపాయాలు కల్పించలేదని, కనీసం స్నాన, భోజన వసతులు కూడా కల్పించలేదని చంద్రబాబు నాయుడు ఆదేదన వ్యక్తం చేశారు.

ఉత్తరాఖండ్‌లో తెలుగు బాధితుల పట్ల అధికారులు వివక్ష చూపుతున్నారని, సహాయం అందించడం లేదని తన దృష్టికి రావడంతో ఆ రాష్ట్ర సిఎం విజయ బహుగుణ తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోయినా ఆయన ఇంటికి వెళ్లి అన్ని విషయాలు వివరించానని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తర్వాత టీడీపీ నేతలు రమేష్ రాథోడ్, కొనకళ్ల డెహ్రాడూన్‌లో మకాం వేసి, ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి, బాధితులకు సహాయ కార్యక్రమాలు చేపట్టామని చంద్రబాబునాయుడు తెలిపారు.

బాధితుల అనుభవాలు మాటల్లో చెప్పలేం : చంద్రబాబు


హైదరాబాద్ : చార్‌ధామ్ యాత్రికుల అనుభావాలు తనను తీవ్రంగా బాధించాయి అని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్రికులు నరకం అనుభవించారని తెలిపారు. వరద బాధితుల విషయంలో ఢిల్లీలో జరిగిన ఘటన తనను చాలా బాధించింది అని చెప్పారు. తెలుగు వారి కోసం ఢిల్లీలో కట్టిందే ఏపీ భవన్ అని గుర్తు చేశారు. వరద బాధితులను ఏపీ భవన్ బయట టెంటు వేసి ఉంచడం దారుణమన్నారు. మానవతా దృక్పథంతోనే వరద బాధితులను ఆదుకునేందుకు ప్రయత్నం చేశామని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలు పలు బృందాలను ఏర్పాటు చేసి తమ వారిని సురక్షితంగా తీసుకెళ్లాయని తెలిపారు. మన రాష్ట్రం మాత్రం అందుకు వ్యతిరేకంగా వ్యవహరించిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

యాత్రికుల అనుభావాలు బాధించాయి:బాబు

ఛార్‌దామ్‌ యాత్రికులను ఆదుకోవాలన్న ఆలోచన తొలుత కాంగ్రెస్‌ నేతలకు లేదని, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించిన తరువాతే వారు మొద్దునిద్ర వీడి హడావుడి చేశారని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయ సమన్వయ కార్యదర్శి టీడీ జనార్దనరావు అన్నారు. చంద్రబాబు బురద రాజకీయాలు చేస్తున్నారంటూ కాంగ్రెస్‌నేతలు చేస్తున్న విమర్శలపై ఆయన ఘాటుగా స్పందించారు. అమెరికా పర్యటన ముగించుకుని నగరానికి చేరుకున్న చంద్రబాబు అదే రోజు హుటా, హుటీనా ఢిల్లీకి వెళ్లి బాధితులను పరామర్శించే వరకూ కాంగ్రెస్‌ నేతలు ఏమీ పట్టనట్లు వ్యవహరించారని గుర్తు చేశారు. ఢిల్లీ నుండి నేరుగా డెహ్రాడూన్‌కు వెళ్లి ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి విజయ్‌బహుగుణను కలిసి తెలుగు యాత్రికులను కాపాడాలని కోరారన్నారు.

సహాయక చర్యలు జరుగుతున్న తీరును ఆయన్ని అడిగి తెలుసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. తెలుగు యాత్రికుల తరలింపులో జరుగుతున్న వివక్షను విజయ్‌ బహుగుణ దృష్టికి తీసుకువెళ్లి, తెలుగువారిని వీలైనంత త్వరగా స్వస్థలాలకు తరలించేందుకు చొరవ చూపించాలని కోరడం జరిగిందన్నారు. ఆర్మీ క్యాంపులలో ఉన్న తెలుగు వారిని ఒక చోటకు చేర్చి వారికీ భోజన, వైద్య, వసతి సౌకర్యాన్ని కల్పించేందుకు చంద్రబాబు అన్ని చర్యలు తీసుకున్నారని టీడీ జనార్దనరావు తెలిపారు.

మూడు రోజుల పాటు డెహ్రాడూన్‌, రుషికేష్‌లో టీడీపీ ఎంపీలు మకాం వేసి బాధితుల యోగ, క్షేమాలు తెలుసుకుని వారిని సురక్షితంగా స్వస్థలాలకు తరలించేందుకు కృషి చేసిన వారితో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ ఘర్షణకు దిగడం దారుణమన్నారు. సోనియా మెప్పు కోసమే వీధి పోరాటానికి సిద్ధపడ్డారని విరుచుపడ్డారు. చంద్రబాబు దగ్గరుండి బాధితులను తరలిస్తున్నారని పేర్కొన్న నోటితోనే టీడీపీ నేతలను విమర్శించడం వీహెచ్‌కే చెల్లిందని ఎద్దేవా చేశారు. ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులను ఆదుకోవాలన్న ఏకైక లక్ష్యంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగి సేవా కార్యక్రమాలు కొనసాగించారన్నారు.

బాబు వచ్చే వరకు మీ బుద్ధి ఏమైంది?


నెల్లూరు జిల్లాలో థర్మల్‌ విద్యుత్‌ సంస్థలకు వైఎస్‌, రోశయ్య హయాంలో వేల ఎకరాల భూములను అప్పనంగా కట్టబెట్టారని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. నవయుగ, మీనాక్షి, కెనాటో, సింహపురి సంస్థలకు ఎకరా భూమి కేవలం 80 వేల రూపాయలు అంతకంటే కారు చౌక ధరకే కేటాయించారన్నారు. అదే సుబ్బారామిరెడ్డికి చెందిన గాయత్రి సంస్థకు మాత్రం ఎకరా భూమి ఎనిమిదిన్నర లక్షల చొప్పున వసూలు చేశారన్నారు. శుక్రవారం ఎన్టీఆర్‌ట్రస్టుభవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేపీఐఎల్‌కు 4700 ఎకరాల భూమిని వైఎస్‌ హయాంలో నోటి మాటగా కేటాయిస్తే, సాక్షి పత్రిక బుకాయిస్తోందని విమర్శించారు.

రెండు ఎకరాల భూమి కంటే ఎక్కువ కేటాయిం పులకు మంత్రివర్గ అమోదం తప్పనిసరన్నారు. కేపీఐఎల్‌కు కేటా యించిన భూముల్లో నుండి 100 ఎకరాలు తనఖా పెట్టి 800 వందల కోట్ల రూపాయల రుణాన్ని తీసుకున్నారన్నారు. అందులో నుండి 400 కోట్ల రూపాయలు జగన్‌కు ముడు పుల రూపంలో చెల్లించారని ఆరోపించారు. క్విడ్‌ప్రొకో పద్దతి లో హిమూర్జ ప్రాజెక్టు ద్వారా మరో 200 కోట్ల రూపాయల విలువ చేసే వాటాలను వైఎస్‌ భారతికి కేటాయించారన్నారు. లక్ష కోట్ల రూపా యలు దోచుకున్న జగన్‌ కుటుంబం ఉత్తరాఖండ్‌ బాధితులకు ఒక్క రూపాయ సహాయం చేసేందుకు ముందుకు రాలేదని విమర్శించారు.

అప్పనంగా వేల ఎకరాలు కట్టబెట్టారు


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చొరవతో డెహ్రాడూన్ నుంచి ప్రత్యేక విమానం హైదరాబాద్‌కు, అక్కడ నుంచి కేశినేని నాని తన ట్రావెల్ బస్సుల ద్వారా ఇప్పటి వరకు మొత్తం 125 మందిని క్షేమంగా చేర్చారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో బయలు దేరిన బస్సు లో ఎక్కిన యాత్రికులను చంద్రబాబు నాయుడు, కేశినేని నాని అప్యాయంగా పలకరించారు. ప్రతి ఒక్కరిని పలకరించి, వారికి భోజనాలు ఏర్పాటు చేసి ఆరోగ్యంగా ఉందా అంటూ పలకరించి పంపించడం విశేషం. శుక్రవారం ఉదయం విజయవాడలో దిగిన యాత్రికులు అందరు కూడా ముక్త కంఠంతో చంద్రబాబు నాయుడును, కేశినేని నానిలకు కృతజ్ఞతలు తెలిపారు.

యాత్రికులకు ఉమా, గద్దె స్వాగతం
విజయవాడకు చెందిన 16 మంది, గుడివాడకు చెందిన 22 మంది, గుంటూరుకు చెందిన ముగ్గురు మొత్తం 41 మంది శుక్రవారం ఉదయం బస్సులో వచ్చారు. వీరికి ఎమ్మెల్యే దేవినేని ఉమా, మాజీ ఎంపీ గద్దె, మాజీ కార్పోరేటర్ ఎరుబోతు రమణ, చెన్నుపాటి గాంధీ, వీరంకి డాంగేకుమార్, రవీంద్ర వర్మ, కొట్టేటి హనుమంతరావు తదితరులు స్వాగతం పలికారు. యాత్రికులు వారి వారి స్వస్థలాలకు చేరేందుకు సహకరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన రంగమ్మ, సిహెచ్ వెంకటలక్ష్మి, శాఖమూరి రుక్మిణి వచ్చారు. వీరిలో చాలామంది గంగోత్రి వద్ద ఏడురోజులు అన్నపానీయాలు లేకుండా గడిపారు. అక్కడి భయానక సంఘటన మనసును కలిచివేస్తున్నదని చాలా మంది వాపోయారు, శివరావు, సూర్యకుమారి, విజయలక్ష్మి, రత్తమ్మ, మొత్తం విజయవా డకు చెందిన 16 మంది వచ్చారు.

దేవుడల్లే చంద్రబాబు సాయపడ్డారు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం మహబూబ్‌నగర్ వెళ్లనున్నారు. జమ్మూ-కాశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వీర జవాన్ యాదయ్య కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించనున్నారు.

మహబూబ్‌నగర్ వెళ్లనున్న చంద్రబాబు

 పిల్ల కాంగ్రెస్ నేతలు తమ బ్యానర్లలో ఎన్టీఆర్ ఫోటో పెడితే చెప్పుతో కొట్టండి అని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో 1994 ఫలితాలు పునరావృత్తం అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ సమస్యను పరిష్కరించకుండా కాంగ్రెస్ పార్టీ మరింత జఠిలం చేస్తోందని మండిపడ్డారు. వైఎస్ తన కుమారుడు నెంబర్ వన్‌గా ఉండాలని కోరుకున్నారని, ఇప్పుడు చంచల్‌గూడా జైళ్లో వైఎస్ జగన్ నెంబర్ వన్ గానే ఉన్నారని రేవంత్‌రెడ్డి యెద్దేవా చేశారు.

ఎన్టీఆర్ ఫోటోలు పెడితే చెప్పుతో కొట్టండి : రేవంత్‌రెడ్డి

ఉత్తరాఖండ్‌లో వరద బాధితులకు సహాయసహకారాలు అందజేస్తున్న టీడీపీ నేతలు కొనకళ్ల నారాయణ, రమేష్‌రాథోడ్‌తో అధినేత చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జోష్‌మఠ్‌కు కొనకళ్ల, బద్రీనాథ్‌కు రమేష్‌రాథోడ్ వెళ్లాల్సిందింగా బాబు ఆదేశించారు. అక్కడున్న తెలుగు వారిని సురక్షితంగా రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని నేతలకు సూచించారు.

టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

June 27, 2013


హైదరాబాద్: కేంద్ర మంత్రి చిరంజీవి వరద బాధితులను పట్టించుకోకుండా జోకర్‌లా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగువారికి సహాయం అందించడంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు.

ముఖ్యమంత్రి వరద బాధితులను పట్టించుకోవడం లేదని, రాష్ట్ర చరిత్రలో కిరణ్ కుమార్ రెడ్డి అంతటి అసమర్థ ముఖ్యమంత్రిని చూడలేదని ఆయన అన్నారు బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం వల్లనే తమ పార్టీ చొరవ చూపిందని ఆయన చెప్పారు. కాంగ్రెసు దొంగల ముఠా పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు.

డెహ్రడూన్‌లో తమ పార్లమెంటు సభ్యుల పట్ల కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు వ్యవహరించిన తీరుపై ఆయన మండిపడ్డారు. అధికారం పొతుందనే భయంతో కాంగ్రెసు నాయకులు విచక్షణ కోల్పోయారని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయం చేస్తూ బాధితులను నిర్లజ్జగా గాలికి వదిలేశారని ఆయన అన్నారు. కాళ్లుపట్టుకుంటే ముఖ్యమంత్రి పదవి ఉంటుందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిగ్విజయ్ సింగ్ చుట్టూ తిరుగుతున్నారని అన్నారు.

మధ్యప్రదేశ్ ఎన్నికలకు నిధుల కోసమే దిగ్విజయ్ సింగ్‌ను రాష్ట్రానికి పంపిస్తున్నారని ఆయన అన్నారు. తమ పార్లమెంటు సభ్యుల పట్ల వ్యవహరించిన తీరుకు కాంగ్రెసు నాయకులపై కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణపై తమ పార్టీ స్పష్టంగా చెప్పిందని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెసు పార్టీ పంచాయతీ మెంబర్ పదవిని కూడా గెలువలేదని ఆయన అన్నారు.

చిరంజీవి జోకర్‌లా వ్యవహరిస్తున్నారు: రేవంత్ రెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలుగు యాత్రీకులతో కలిసి హైదరాబాద్‌ చేరుకున్నారు. డెహ్రాడూన్‌ నుంచి 110 మంది తెలుగు యాత్రీకులతో టీడీపీ విమానం హైదరాబాద్‌కు చేరుకుంది.

హైదరాబాద్‌కు చేరుకున్న చంద్రబాబు

ఏపీ భవన్‌లో వరద బాధితులను పరామర్శిస్తున్నట్టు సీఎం కిరణ్‌ నటిస్తున్నారని టీడీపీ నేత తలసాని శ్రీనివాసయాదవ్‌ అన్నారు. ఢిల్లీలో ఆయన మూడు రోజులుగా సోనియా అనుమతి కోసం ప్రదక్షిణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలుగువారి పట్ల కేంద్రానికి ఎంత చిన్న చూపు ఉందో, సీఎంకు కూడా అంతే ఉండడం విచారకరమని ఆయన చెప్పారు.

సీఎం పరామర్శ ఓ నటన : తలసాని

June 26, 2013


ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న తెలుగు వారిని రాష్ట్రానికి తీసుకువచ్చే క్రమంలో తమ ఎంపీలపై కాంగ్రెస్‌ ఎంపీలు విహెచ్‌, బలరాం నాయక్‌ తదితరులు అడ్డుకోవడం విచారకరమని టీపీపీ నేతలు ఈ. పెద్దిరెడ్డి, యనమల రామకృష్ణుడు ఒక ప్రకటనలో విమర్శించారు. గత 10 రోజులుగా డెహ్రాడూన్‌, బదరీనాథ్‌, హార్సిలీ పర్వతాల్లో చిక్కుకున్న తెలుగువారి సమాచారం తెలుసుకుని, వాతావరణ అనుకూలించనప్పటికీ పార్లమెంటు సభ్యులు రమేష్‌రాథోడ్‌ బదరీనాథ్‌ చేరి అక్కడ బాధితుల యోగక్షేమాలు తెలుసుకొన్నారు. బాధితులను డెహ్రాడూన్‌ తీసుకువచ్చి వీలైనంత త్వరగా విశాఖపట్టణానికి తరలించే యత్నం చేయగా కాంగ్రెస్‌ నాయకులు ఎంపీ హన్మంతరావు, మంత్రి బలరాంనాయక్‌ బస్సులో ఎక్కిన యాత్రికులను ఏయిర్‌ పోర్టుకు రాకుండా అటకాయించి నేరుగా విశాఖపట్నం వెళ్లే యాత్రికులను హైదరాబాద్‌లో దించే ప్రయత్నం చేయడం ఎంత వరకు సమంజసం అని వారు ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ నాయకుల దిగజారుడు తనాన్ని, నీచ రాజకీయ సంస్కృతిని తీవ్రంగాఖండిస్తున్నామన్నా రు. అలసి సొలసిన తెలుగు ప్రయాణికులను తాము నేరుగా వారి గమన్యస్థానాలైన విశాఖకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తే.. మధ్యలో కాంగ్రెస్‌ ఎంపీలు వచ్చి అడ్డుకున్నారని ఆరోపించారు. ప్రభుత్వం చేయలేని పనిని తెలుగుదేశం పార్టీ చేయడం వల్ల ప్రజల్లో వచ్చిన ఆదరణను జీర్ణించుకోలేకే వారు తమ ఎంపీలపై దాడికి పూనుకున్నారని మండిపడ్డారు.

వీహెచ్‌ది అత్యుత్సాహం : టీడీపీ నేత టీడీ జనార్ధనరావు
కాంగ్రెస్‌ ఎంపీ వి. హనుమంతరావు తమ ఎంపీలు రమేష్‌ రాథోడ్‌ తదితరుల పట్ల అత్యుత్సాహం ప్రదర్శించారని తెలుగుదేశం నేత టీడీ. జనార్దనరావు విమర్శించారు. ఈ ఉత్సాహాన్ని సోనియా, ప్రధాని మన్మోహన్‌, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిల వద్ద ప్రదర్శించి ఉంటే బాధితులకు సత్వరమే న్యాయం జరిగేదోమోనని ఎద్దేవా చేశారు.

వీహెచ్‌,బలరాం నాయక్‌లపై క్రిమినల్‌ కేసులు పెట్టాలి

ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించేందుకు తాము ప్రత్యేక విమానం పెట్టినందుకే ప్రభుత్వం తమకు పోటీగా విమానం ఏర్పాటు చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. సేవా భావంతో ప్రభుత్వం ముందుకు వచ్చి ఉంటే స్వాగతించేవారమని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకున్న తెలుగు ప్రజలను ఆంధ్రప్రదేశ్‌కు తరలించే వరకు తాను ఉత్తరాఖండ్‌లోనే ఉంటానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఉత్తరాఖండ్‌లో ఉన్న తెలుగువారందరినీ రాష్ట్రానికి చేర్చే బాధ్యత తమదేనన్నారు. డెహ్రాడూన్‌ నుండి విశాఖ వెళ్లే యాత్రికులను హైదరాబాద్‌ తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు.

బుధవారం డెహ్రాడూన్‌ విమానాశ్రయంలో చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. చార్‌ధామ్‌ యాత్రికులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మొదట పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాట్లు చేసి ఉంటే తాము ప్రత్యేక విమానం ఏర్పాటు చేసే అవసరమే వచ్చేది కాదన్నారు. తమకు వనరులు లేక పోయినా యాత్రికులను ఆదుకునేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేశామన్నారు.

విహెచ్‌ది అత్యుత్సాహం ః

టీడీపీ నేత టీడీ జనార్ధనరావు కాంగ్రెస్‌ ఎంపీ వి. హనుమంతరావు తమ ఎంపీల పట్ల అత్యుత్సాహం ప్రదర్శించారని తెలుగుదేశం నేత టీడీ. జనార్దనరావు అన్నారు. ఈ ఉత్సాహాన్ని సోనియా, ప్రధాని మన్మోహన్‌, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిల వద్ద ప్రదర్శించి ఉంటే బాధితులకు సత్వరమే న్యాయం జరిగేదోమోనని ఎద్దేవా చేశారు.

సేవా భావంతో ప్రభుత్వం ముందుకు వచ్చుంటే స్వాగతించేవారం

ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకున్న తెలుగువారందరిని క్షేమంగా వారి స్వస్థ లాలకు చేరేవరకు సహాయ, పునరావాస కార్య్ర మాలు కొనసాగించాలని పార్టీ శ్రేణులను ఆదేశించా రు. నేడు ఉత్తరాఖండ్‌ వరదలలో అమలవుతున్న సహాయ కార్యక్రమాల గురించి సమీక్షించారు. సహా య కార్యక్రమాలు అమలుచేస్తున్న ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో మానిటరింగ్‌ కమిటీ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, బద్రినాథ్‌, డెహ్రాడూన్‌, ఢిల్లీలో ఉన్న నాయకులతో పాటు ఎంపీల బృందంతో టెలికా న్ఫరెన్స్‌ నిర్వహించారు. మెరుగైన సహాయక చర్యల గురించి పార్టీ శ్రేణులకు సూచనలు, సలహాలు చేశారు. సేవా కార్య్ర మాలలో చురుకుగా పాల్గొంటు న్న నాయకులు, కార్యకర్తలు, ట్రస్టు ప్రతినిధులతో పాటు విరాళాలు అందజేస్తు న్న వారిని అభినందించారు. బద్రీనాథ్‌లో తెలుగువారు పడుతున్న ఇబ్బందుల ను చూసి చలించి ప్రాణాలను తెగించి బద్రీనాథ్‌కు ఎంపీ రమేశ్‌రాథోడ్‌ వెళ్లడా న్ని చంద్రబాబు అభినందించారు.

రాష్ట్రానికి చెందిన సుమారు 350మంది గత పది రోజులుగా ఇబ్బందిపడుతున్నట్లు వారిలో కొంతమందికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు జోషి అనే యాత్రికుడు చంద్రబాబు దృష్టికి తీసుకవచ్చారు. డెహ్రాడూన్‌ నుంచి ఎన్టీఆర్‌ ట్రస్టు వైద్య బృంధాన్ని పంపించి వారికి వైద్య సేవలు అందించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ, సిఎల్‌ వెంకటరావును బాబు కోరారు. బద్రీనాథ్‌తో తెలుగు వారికి భోజనం ఏర్పాటు చేసేందుకు వెంటనే రూ.4లక్షలు అందజేయాలని ఆదేశించారు. యాత్రికులను తరలించేందుకు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వంతో మాట్లాడి త్వరితగతిన చర్యలు చేపట్టాలని కోరారు. వరదల్లో చిక్కుకున్న తెలుగువారందరిని క్షేమంగా స్వస్థలాలకు చేరేంతవరకు డెహ్రాడూన్‌లోనూ, ఢిల్లీలో మకాం వేసి ఎంపీల బృందం సహాయం అందించాలని సూచించారు.

తెలుగువారంతా క్షేమంగా వెళ్లేవరకు సహాయం అందించండి

గౌరీకుండ్‌ ప్రాంతంలో సహాయ చర్యల్లో పాల్గొంటున్న భారత వాయుసేన హెలికాప్టర్‌ కూలిపోయి 19మంది దుర్మరణం పాలవడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బుధవారం తీవ్ర దిగ్భ్రాం తి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియ జేశారు. అపశ్రుతి చోటుచేసుకున్నా ముక్కవోని ధైర్యంతో సహాయ చర్యలు కొనసాగిస్తున్న సైనిక సిబ్బందిని ఆయన కొనియాడారు. ఇదే స్ఫూర్తితో స్వచ్ఛం ద సంస్థల ప్రతినిధులు, రాజకీయపార్టీల నేతలు, కార్యకర్తలు వరద బాధితుల సహాయ చర్యల్లో చురుకుగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

హెలికాప్టర్‌ ప్రమాదంపై చంద్రబాబు దిగ్భాంతి

'ఉత్తరాఖండ్ బాధితుల విషయంలో చొరవ చూపి సహాయం అందించిన చంద్రబాబు నాయుడును చూసి తెలుగుదేశం పార్టీలో మేం అంతా గర్వపడుతున్నాం. ఆయనను అభినందిస్తున్నాం. ఆయనను అనవసరంగా కాంగ్రెస్ నాయకులు విమర్శించాలని చూస్తే సహించేది లేదు' అని టిడిపి అధికార ప్రతినిధి నన్నపనేని రాజకుమారి హెచ్చరించారు. బుధవారం ఆమె ఇక్కడ ఎన్టీఆర్ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. బాధితులను ఆదుకోవడానికి చంద్రబాబు ఢిల్లీలో తిరుగుతుంటే కాంగ్రెస్ నాయకులు తమ పదవులు, రాజకీయ ఎత్తుగడల కోసం తిరుగుతున్నారని, చంద్రబాబు వెళ్ళడం వల్లే ప్రభుత్వంలో ఈ మాత్రం కదలిక అయినా వచ్చి బాధితులను పట్టించుకోవడం మొదలు పెట్టిందని ఆమె వ్యాఖ్యానించారు.

'ముగ్గురు మహిళా మంత్రులు రాష్ట్రం నుంచి కేంద్రంలో ఉన్నారు. ఒక్కరంటే ఒక్కరు కూడా ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకొన్న మహిళల పరిస్ధితి ఎలా ఉందో పట్టించుకోలేదు. బాధితులను పరామర్శించలేదు. మగవారు గోచీ పెట్టుకొని అయినా తిరగగలరు. మహిళల పరిస్ధితి అది కాదు. వారికి కనీసం కట్టుకోను చీర ఉందో లేదో కూడా పట్టించుకోలేదు. ఒక మహిళా మంత్రి పనబాక లక్ష్మి తన నియోజకవర్గానికి చిరంజీవిని తీసుకువెళ్ళి అక్కడ సంబరాలు చేస్తోంది. ఇదేనా వీరి బాధ్యత? ఉత్తరాఖండ్ విలయం భోపాల్ ఘటనను మించిందని అంటుంటే ప్రభుత్వంలో ఉన్నవారి స్పందన చాలా నాసిగా ఉంది. అధికారం, ముఠా కుమ్ములాటలపై ఉన్న శ్రద్ధ బాధితులపై లేదు' అని ఆమె విమర్శించారు.

చంద్రబాబును చూసి గర్వపడుతున్నాం: నన్నపనేని

ఉత్తరాఖండ్‌లోని బద్రీనాధ్‌లో చిక్కుకొన్న యాత్రికుల వద్ద భోజన ఖర్చులకు డబ్బులు లేవని తెలియడంతో వారికి రూ. నాలుగు లక్షలు పంపాలని ఎన్టీఆర్ ట్రస్టు నిర్వాహకులను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశించారు. బుధవారం ఉదయం ఆయన ఢిల్లీ నుంచి పార్టీ నేతలు, ట్రస్టు నిర్వాహకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

బద్రీనాధ్‌లో ఉన్న టిడిపి ఎంపీ రమేష్ రాధోడ్ అక్కడ ఉన్న యాత్రికులతో ఈ సందర్భంగా టెలిఫోన్లో మాట్లాడించారు. అక్కడ 350 మంది తెలుగువారు గత పది రోజులుగా చిక్కుకొని ఉన్నారని, వారిలో కొందరు తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఉన్నారని జోషి అనే యాత్రికుడు చంద్రబాబుతో చెప్పారు. అక్కడకు వెంటనే ఒక వైద్య బందాన్ని పంపాలని చంద్రబాబు ఆదేశించారు.

ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో మాట్లాడి బద్రీనాధ్‌లో ఉన్న వారిని తరలించే ఏర్పాట్లు చేయాలని కూడా ఆయన ఎంపీలకు సూచించారు. ప్రాణాలకు తెగించి బద్రీనాధ్ వెళ్ళిన ఎంపీ రాధోడ్‌ను ఆయన అభినందించారు. బద్రీనాధ్‌లో ఉన్న వారి వివరాలు వెబ్‌సైట్లో పెట్టి వారి బంధువులకు వివరాలు తెలపాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు.

బద్రీనాధ్ యాత్రికులకు టిడిపి ఆర్ధిక సాయం

చార్‌ధామ్ యాత్ర బాధితులకు టీడీపీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. చార్‌ధామ్ యాత్రలో అయినవారిని కోల్పోయి విషాదంతో తిరిగి వచ్చిన మురహరిరెడ్డి కుటుంబాన్ని తూర్పు ఇబ్రహీంపట్నంలో బుధవారం ఆయన పరామర్శించారు. విపత్తు జరిగి మూడు రోజు లు గడిచినా అక్కడ ప్రభుత్వం ఎలాం టి సాయం చేయకపోవడం వల్ల ఎం తో మంది ప్రాణాలు కోల్పోయారని మురహరిరెడ్డి దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆహారం, తాగునీరు లేకపోయినా కనీసం చలికి తట్టుకునేందుకు దుప్పట్లు ఉన్నా తన తల్లి ప్రాణా లు దక్కేవని కన్నీళ్ల పర్యంతమయ్యారు.

తమిళనాడు, గుజరాత్ ప్రభుత్వాలు ఆ రాష్ట్రాల బాధితులను ప్రత్యేక హెలికాప్టర్‌ల ద్వారా తరలించారని మన ప్రభుత్వం ఎలాంటి సహా య కార్యక్రమాలు చేపట్టలేదని వాపోయారు. టీడీపీ ఏర్పాటు చేసిన హెలికాప్టర్, కేశినేని బస్సుల ద్వారా ఇళ్లకు చేరుకున్నామని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే దేవినేని ఉమా మాట్లాడుతూ చార్‌ధామ్ యాత్రలో అచూకీ లభ్యం కాని కొల్లి రజని కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేసే విధంగా కృషి చేస్తామన్నారు. రజని కుమర్తె అనూష ఇంజనీరింగ్ చదివేందుకు కళాశాల యాజమన్యంతో మాట్లాడనున్నట్లు తెలిపారు. ఉమా వెంట టీడీపీ నాయకులు జంపాల సీతారామయ్య, రామినేని రాజశేఖర్, లంబు వాసు, జాస్తి శ్రీనివాసరావు, నల్లమోతు ప్రసన్నబోసు, కోయ నెహ్రూ, వెలగపూడి రామకృష్ణ, జాస్తి వెంకటేశ్వరరావు, ఎం.వి.ప్రసాద్ పాల్గొన్నారు.

బాధితులకు టీడీపీ అండ

ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న యాత్రికుల తరలింపు ప్రక్రియలో ఇప్పటి దాకా సుమారు 85 లక్షల రూపాయలను వ్యయం చేసినట్లు ఎన్టీఆర్‌ ట్రస్టు సీఈఓ మొటపర్తి వెంకట్‌ తెలిపారు. ఆయన బుధవారం ఎన్టీఆర్‌ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మొత్తం 20 మంది వైద్యులు పెద్ద మొత్తంలో మందులు తీసుకుని వెళ్లి సేవాకార్యక్రమాల్లో పాల్గొంటున్నారని చెప్పారు. ఏపీ భవన్‌, డెహ్రాడూన్‌, బద్రీనాథ్‌లో వారు సేవలను అందిస్తున్నారన్నారు. బాధితుల్లో అధికులు చర్మ సంబంధ రుగ్మతలతో బాధపడుతున్నారని చెప్పారు. తమ వైద్య బృందం ఎంపీ రమేశ్‌ రాథోడ్‌ నేతృత్వంలో సోమవారం బద్రీనాథ్‌లో విస్తృతంగా సేవలందించిందన్నారు. తాము ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు రోజు అయిదారు వందల ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయన్నారు. ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం అక్కడ ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ బృందాలకు చక్కని సహకారం అందిస్తోందని వివరించారు. ట్రస్టు ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందించారన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే ఎల్‌. రమణ 50వేల రూపాయల విరాళం అందించారని తెలిపారు. చివరి తెలుగు బాధితున్ని తీసుకువచ్చేదాకా ట్రస్టు సేవలను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. బాధితుల తరలింపు కోసం విరివిగా విరాళాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.

నమ్మకం లేకే...

కాంగ్రెస్‌ ప్రభు త్వంపై నమ్మకం లేనం దువల్లే తమ నేత చంద్ర బాబు నాయుడు ఉత్తరా ఖండ్‌ తరలిపోయారని విలేక రుల సమావేశంలో ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి చెప్పారు. స్వచ్ఛందంగా బాధితుల శ్రేయస్సు కోసం కృషి చేస్తోన్న తమ నేత పట్ల అనుచిత విమర్శలు చేస్తే సహించమని ఆమె హెచ్చరించారు. బాధిత మహిళల పట్ల కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి సరిగా లేదని దుయ్యబట్టారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే దిశలో తమ పార్టీ ముందు వరుసలో ఉంటుందని రాజకుమారి చెప్పారు.

యాత్రికుల తరలింపునకు ఎన్టీఆర్‌ ట్రస్టు వ్యయం రూ.85 లక్షలు

డెహ్రాడూన్ లో తెలుగుదేశం సహాయక చర్యలను అడ్డుకోవడంపై హరిక్రిష్ణ స్పందించారు. టిడిపి ఎంపీలు రాథోడ్ రమేష్, కొనగళ్ల నారాయణలపై కాంగ్రేస్ ఎంపీ వి.హన్మంతరావు చేయి చేసుకున్నంత పని చేయడం, వారిని తోసేయడంపై హరిక్రిష్ణ మండి పడ్డారు.

దమ్ముంటే సహాయం చేయాలి కాని, చేసే వారిని నిలవరించడం దారుణమని హరిక్రిష్ణ ఆక్షేపించారు. ఇది దురదృష్టకరమని ఆయన వాఖ్యానించారు. కాంగ్రేస్ వారి దుష్ట రాజకీయం మరోసారి బయటపడిందన్నారు.

తెలుగుదేశం ప్రతినిధులపై దౌర్జన్యానికి దిగడం తగదు:హరికృష్ణ

డెహ్రాడూన్ లో జరిగిన ఘటనను దురదృష్టకరంగా టిడిపి అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. బాధితులు ఏ విమానంలో వెళ్లదలుచుకుంటే వెళ్లవచ్చని ఆయన అన్నారు. దేశస్థాయిలో పరువు పోయే విధంగా ఘటన జరగడం బాధ కలిగిస్తున్నదని ఆయన అన్నారు.ఎవరైనా సేవలో పోటీ పడాలి తప్ప గొడవలు పడడం తగదని ఆయన అన్నారు.ఇక్కడ ఉండే బాధితులు అందరూ క్షేమంగా వెళ్లేవరకు తాను ఇక్కడే ఉంటానని చంద్రబాబు అన్నారు.తాము నేరుగా విశాఖపట్నం వరకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశామని ఆయన అన్నారు.

దురదృష్టకరం-చంద్రబాబు

డెహ్రాడూన్ విమానాశ్రయంలో ఏపీ తెదేపా, కాంగ్రెస్ ఎంపీల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదంపై తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఎంపీల గొడవపై బాబు మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్ వరద బాధితులను తరలించడంలో ప్రభుత్వం తెదేపాను అడ్డుకుంటుందని పేర్కొన్నాడు. కాంగ్రెస్ నిజంగా బాధితులను ఆదుకుంటామంటే.. మాకేమీ అభ్యంతరం లేదని, కానీ వారు అలా చేయకుండా బురద రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఏపీ భవన్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వైద్యులను బాధితులకు చికిత్స అందించకుండా అడ్డుకున్నారు. ఇప్పుడేమో.. ప్రయాణికులు విశాఖపట్నం వెళ్తారని చెబుతామంటే.. హైదరాబాద్ కు చేరుస్తామని.. చెబుతున్నారంట. మేము ప్రయణికులకు వైజాగ్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేశామని బాబు అన్నారు. కాంగ్రెస్ నేతలు ఎన్ని బురద రాజకీయాలకు దిగినా.. బాధితులను తరలించే వరకూ ఇక్కడే ఉంటాని బాబు స్పష్టం చేశారు.

కావాలనే అడ్డుకుంటున్నారు : బాబు

ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న యాత్రీకులను తరలించడంలో కాంగ్రెస్, తెదేపా ఎంపీల మధ్య పోటీ నెలకొంది. డెహ్రాడూన్ విమాన్రాయంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, తెదేపా ఎంపీ రమేష్ రాథోడ్ లు తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఓ దశలో వీరి మధ్య తోపులాట చేసుకుంది. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది వీరిని అదుపుచేశారు. ఈ ఘటనతో బాధితులు అయోమయానికి గురయ్యారు. ప్రత్యేక విమానంలో డెహ్రాడూన్ చేరుకున్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు… అదే విమానంలో బాధితులను తరలించేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే, ప్రభుత్వం కూడా ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసిందని బాధితులను మేము తరలిస్తామని కాంగ్రెస్ నేతలు అడ్డుపడినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటన కేంద్ర మంత్రి బలరాం నాయక్, తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో జరగడం విశేషం. నేతల మధ్య పోటీతో యాత్రీకులు సైతం రెండు విడిపోయి నినాదాలు చేసినట్లు సమాచారం. యాత్రీకులను తరలించడం మాట అటుంచితే.. ఏపీ రాజకీయ నేతల వాగ్వాదంతో తెలుగు వారి పరువును మాత్రం తీశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

బాధితుల తరలింపులో.. నేతల బురద రాజకీయం..!

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చాలా తెలివైన వాడు. సైలెంట్ గా తన వ్యవహారాలు తాను చక్కబెట్టుకోవడంలో దిట్ట. అయితే చంద్రబాబు ఇంకా తెలివైనవాడు. అవకాశాలు అందిపుచ్చుకోవడంలో ఆయన అందరికన్నా ముందుంటారు. ఉత్తరాఖండ్ దుర్ఘటన ప్రభావాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ సరిగ్గా అంచనావేయలేకపోయారు. పైగా ఎవరో కొందరు పర్యాటకులు వెళ్లి వుంటారు. చిక్కుకుని వుంటారు. అధికారులు చూసుకుంటారు అని ధీమా పడ్డారు. ఆయనే కాదు పర్యాటక మంత్రి చిరంజీవి కూడా ఫొటోలకు ఏరువాక ఫోజులిస్తూ, కాలక్షేపం చేశారు. అయితే ముందు దూకడంలో, జనాల్ని ముందుకు దూకించడంలో అద్భుతంగా వ్యవహరించగల మేనేజ్ మెంట్ గురూ.. చంద్రబాబు ఉత్తరాఖండ్ వ్యవహారాన్ని సరిగ్గా పసిగట్టాడు. క్షణాల్లో ఢిల్లీ చేరిపోయారు. హడావుడి చేశారు. ఆంధ్రాభవన్ లో హల్ చల్ చేసారు. చంద్రబాబు సరిజోడు ఎన్టీఆర్ ట్రస్ట్ సిఇఓ వెంకట్. 108 అంబులెన్స్ నెట్ వర్క్ ను ఆంధ్రాలో పరిచయం చేయడం వెనక మేథస్సు ఆయనది. చంద్రబాబుకు ఆయన తోడు రావడంతో, చకచకా ప్రణాళికలు రచించారు. వైద్య శిబిరాలు, ప్రత్యేక విమానాలు.. ఇలా ఆ దిశగా బాబు దూసుకుపోయారు.బాబు హుషారు, దానికి వచ్చిన ప్రతి స్పందన చూసి, మిగిలిన నాయకులు కూడా పాదం కలిపారు. దీంతో మొత్తం సీను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా తిరిపోయింది.
ఇది సహించలేని బొత్సబాబు, దానం నాగేందర్, శవరాజకీయాలు చేస్తున్నారంటూ, బాబుపై మండిపడ్డారు. కానీ ప్రతిగా జనం మండిపడ్డారు. చేసేవారిని కూడా చేయనివ్వారా? అని. దాంతో కిరణ్ హూటా హుటిన ఢిల్లీ వెళ్లక తప్పలేదు. కానీ, పాపం , కిరణ్ అడుగు, చంద్రబాబు వెనకనే తప్ప, ముందు కాలేకపోయింది. వ్యూహరచనలో ఒక్క క్షణం ఆలస్యంగా ఆలోచించినా ఫలితం ఇలాగే ఉంటుంది. కిరణ్ కొంచెం ఆలస్యంగా ఆలోచించడం సరే. మరి అనుభవం పండిన బొత్స దానంల ప్రకటనలేమిటి? జనం మండిపడ్డారంటే, పడరా? పైగా దీనివల్ల మరో మైనస్ కూడా తప్పలేదు. కేంద్ర కాంగ్రెస్ ట్రక్కుల కొద్దీ సహాయ సామగ్రిని ఉత్తరాఖండ్ కు పంపింది. అదంతా ఇప్పుడు బాబు హవా ముందు కొట్టుకుపోయింది. ఆ సంగతి కూడా పాపం, కాంగ్రెస్ వారికి తెలియదేమో, కనీసం ఆ ప్రస్తావన కూడా లేదు వారి మాటల్లో. ఇప్పుడు బాబు మరో అడుగు ముందుకు వేసి, వాడవాడలా సంతాప ప్రదర్శనలకు దిగారు. కాంగ్రెస్ ఇప్పుడేం చేస్తుందో?

బాబు వెనుక కిరణ్

రాజకీయ ప్రత్యర్థులపై తెదేపా అధినేత నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మరోసారి చురకలంటించారు. ఉత్తరాఖండ్ లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించడానికి, అదేవిధంగా రక్షించబడి ఏపీ భవన్ లో చికిత్స పొందుతున్న వారికి సరైన వైద్యం అందేలా.. తెదేపా అధినేత చేస్తున్న సహాయ సహకారాలను అధికార కాంగ్రెస్ నేతలు రాజకీయ లబ్ధికోసమే అని విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఇక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అయితే.. “చింతా చచ్చినా.. పులుపు చావదాయె” అంటూ వ్యంగ్యాస్త్రాలు కూడా విసిరారు.
కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై చంద్రబాబు తనయుడు నారా లోకేష్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్‌లో భిన్నంగా స్పందించారు. “ఉత్తరాఖండ్ వరదబాధితులకు సహాయ కార్యక్రమాలు ఎలా కొనసాగుతున్నాయో తెలుసుకోవడం రాజకీయమా? అని ప్రశ్నించారు. అంతేకాకుండా రాజకీయమే అనుకుంటే… ఆయన రాజకీయం బాధితులకు అన్నం పెట్టేలా చేసిందని” అభిప్రాయపడ్డారు.
నిన్న బాబు ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమాలపై ఓ వార్తా పత్రిక వార్తను కూడా అందులో ఉంచారు. ’బాబు వచ్చే.. పప్పూ, కూర వచ్చే! అనే వార్త ఓ పత్రికలో వచ్చింది. దానిని కూడా లోకేష్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఢిల్లీలోని ఎపి భవన్‌కు బాబు రాకముందు సాంబరు అన్నం, పెరుగు మాత్రమే పెట్టేవారని… బాబు ఫిర్యాదు చేయడంతో రాత్రికి రాత్రే మెనూ మారిపోయిందని, అన్నం, పప్పు, పెరుగులతో పాటు కూరగాయలు పెడుతున్నారని అందులో పేర్కొన్నారు.
ట్విట్టర్ లో పోస్ట్ తో లోకేష్ ఊరుకోలేదు విలేకర్ల సమావేశంలో పెట్టి మరీ ప్రభుత్వం వైఖరిని ఎండగట్టారు. లోకేష్ విలేకర్లతో మాట్లాడుతూ.. బాధితులకు ఎలా చేయాలో తాము చేసి చూపించామని, రాజకీయ లబ్ధి కోసమనే విమర్శలు సరికావని, తాము సహాయం చేయడంలో నిమగ్నమై ఉన్నామని చెప్పారు. కాగా, తెలుగుదేశం పార్టీ బాధితుల కోసం ప్ర్తత్యేక విమానం ఏర్పాటు చేయడంతో పాటు.. చికిత్స కోసం వైద్య బృందాన్ని పంపించిన విషయం తెలిసిందే.

బాబు వచ్చే.. పప్పూ, కూర వచ్చే!

దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు తెలుగుదేశం పార్టీ ఆదర్శంగా నిలిచింది. ఏపీ భవన్ లో చికిత్సపొందుతున్న తెలుగువారిని ఆదుకునేందుకు తెదేపా ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. ఉత్తారఖండ్ లో చిక్కుకున్న తెలుగు యాత్రీకులను హైదరాబాద్ తీసుకుని వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది.హైదరాబాదులో వరదబాధితుల సహాయార్ధం ఓ కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. 040 30269999, 040 39156425 నంబర్లకు బాధితుల బంధువులు ఫోన్ చేయాల్సిందిగా సూచించింది. అంతేకాకుండా సికింద్రాబాద్, ఖాజీ పేట, విజయవాడ రైల్వేస్టేషన్లలో పార్టీ యంత్రాంగం ద్వారా సేవా కేంద్రాలు ఏర్పాటు చేసింది. నిన్న ఏపీ భవన్ లో తెలుగు వారిని పరామర్శించిన తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రత్యేక విమానంలో ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లో పర్యటించిన విషయం తెలిసిందే.

దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు తెలుగుదేశం పార్టీ ఆదర్శంగా నిలిచింది.

ఢిల్లీలోని ఏపీ భవన్ లో టీడీపీ నాయకులతో తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్తరాఖండ్ వరద బాధితులకుఅందుతున్న సహాయక చర్యల వివరాల గురించి బాబు అడిగి తెలుసుకున్నారు. ఏపీ భవన్ నుంచి తెలుగు వారిని స్వస్థలాలకు చేర్చే బాధ్యతను ఎంపీలు రమేష్ రాథోడ్, నారాయణలకు అప్పగించారు. ప్రత్యేక విమానాల ద్వారా లేదా అవసరమైతే.. విమాన టికెట్లు కొనివ్వమని బాబు నేతలకు సూచించారు.

ప్రత్యేక విమానాల ద్వారా లేదా అవసరమైతే.. విమాన టికెట్లు కొనివ్వమని బాబు నేతలకు సూచించారు.

బదరీనాథ్ లోని బాధితులతో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్లో మాట్లాడారు. బాధితులు అనారోగ్యానికి గురైనట్టు బాబుకు చెప్పారు. దీంతో.. ఇద్దరు వైద్యులతో కూడిన బృందాన్ని ప్రత్యేక హెలీకాప్టర్ లో పంపుతున్నట్టు బాబు తెలిపారు. బాధితుల్లో తెలుగువారు తీవ్ర వివక్షకు గురౌతున్నారని పలువురు ఆరోపిస్తున్న నేపధ్యంలో బాబు సేవల్ని అందరూ కొనియాడుతున్నారు. కాగా, మొదటి నుంచి కూడా బాధితులను ఆదుకోవడంలో బాబు చూపివకు చొరవ సర్వత్రా అభినందనలు అందుకుంటోంది.

బాధితులను ఆదుకోవడంలో బాబు భేష్..!

పరామర్శించనున్నారు. ఆయన వెళ్లిన విమానంలోనే తెలుగు యాత్రికులు రాష్ట్రానికి తిరిగి చేరుకోనున్నారు. తెలుగువారిని రాష్ట్రానికి తరలించే వరకు బాబు అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు.

డెహ్రాడూన్ బయల్దేరిన చంద్రబాబు

బద్రీనాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోన్‌లో మాట్లాడారు. అనారోగ్యంతో బాధపడుతున్నామని త్వరగా రాష్ట్రానికి చేర్చాలని కోరిన బాధితులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. మరోవైపు డెహ్రాడూన్ నుంచి యాత్రికులతో క లిసి చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.

బాధితులతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు

ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగు వారిని రక్షించేందుకు అక్కడి వెళ్లిన టీడీపీ ఎంపీలు రమేష్‌రాథోడ్, కొనకళ ్ళ నారాయణ సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అయితే బద్రీనాథ్‌లో ప్రాంతంలో 350 మంది, చినజీయర్ మఠంలో 50 మంది యాత్రికులను తరలించేందుకు వాతావరణం అనుకూలించడం లేదని, వాతావరణం అనుకూలించే వరకు ఇక్కడు ఉండి యాత్రికులను తీసుకువస్తామని ఎంపీలు తెలిపారు.

యాత్రికులను తరలించేందుకు వాతావరణం అనుకూలించడం లేదు : రమేష్, కొణకళ్ల

ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుని తీవ్ర అవస్థలకు గురైన యాత్రికులను సురక్షితంగా తరలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. 160 మంది యాత్రికులను డెహ్రాడూన్ నుంచి బుధవారం సాయంతం 5 గంటలకు విమానంలో తరలించనున్నారు.

బాధితుల కోసం ప్రత్యేక విమానం

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీ నుంచి హుటాహుటిన డెహ్రాడూన్ బయలుదేరి వెళ్ళారు. అక్కడ తెలుగు బాధితులు ఆందోళనలో ఉన్నట్లు తెలియడంతో ఆయన బయలుదేరి వెళ్ళారు. హెలికాఫ్టర్‌లో ఎక్కడానికి తెలుగు బాధితులకు టోకెన్లు ఇవ్వడం లేదని, వారు తిందితిప్పలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతుండడంతో అక్కడ పరిస్థితిని సమీక్షించిన అనంతరం చంద్రబాబు నాయుడు ఉత్తరాఖండ్ సీఎం విజయబహుగుణ దృష్టికి తీసుకువెళ్ళనున్నారు.

బధిరీనాథ్, కేధార్‌నాథ్‌లో తెలుగు బాధితులను అధికారులు పట్టించుకోవడంలేదని, భోజన వసతి కూడా కల్పించడంలేదని బాధితులు వాపోయారు. ఈ పరిస్థితిని అక్కడ సిఎం దృష్టికి తీసుకువెళ్ళి బాధితులను ఆదుకోవాలని చంద్రబాబునాయుడు విజ్ఞప్తి చేయనున్నారు. అవసరమైతే అక్కడ ధర్నా చేయడానికి కూడా చంద్రబాబు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ ఉత్తరాఖండ్ సీఎం చేతులు పైకిఎత్తివేస్తే చంద్రబాబు నాయుడు టీడీపీ తరఫున హెలికాఫ్టర్లను ఏర్పాటు చేసి తెలుగు బాధితులను ఆంధ్రప్రదేశ్‌కు తరలించనున్నారు. ఇందు కోసం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలియవచ్చింది.

అంతకు ముందు బుధవారం ఉదయం బద్రీనాథ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులతో చంద్రబాబు నాయుడు ఫోన్‌లో మాట్లాడారు. అనారోగ్యంతో బాధపడుతున్నామని త్వరగా రాష్ట్రానికి చేర్చాలని కోరిన బాధితులకు చంద్రబాబు ధైర్యం చెప్పారు.

డెహ్రాడూన్ నుంచి టీడీపీ నేత రమేష్ రాథోడ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఫోన్ ద్వారా మాట్లాడుతూ బధిరీనాథ్‌లో తెలుగు బాధితుల పట్ల అధికారులు వివక్ష చూపుతున్నారని హెలికాఫ్టర్‌లో ఎక్కేందుకు టోకెన్లు ఇవ్వడంలేదని అన్నారు. భోజన సదుపాయం కూడా లేదని, వారి బాధను చూసి చలించిపోయానని ఆయన చెప్పారు. ఏది ఏమైనా తెలుగు బాధితులను ఆంధ్రప్రుదేశ్ తరలించే వరకు ఇక్కడే ఉంటామని, వారికి సహాయం అందిస్తామని రాథోడ్ అన్నారు.

బధిరీనాథ్‌లో సుమారు 250 మంది తెలుగు బాధితులు ఉన్నారని, వారిలో షుగర్, బీపీ రోగులు ఉన్నారని, వారికి వైద్య సదుపాయం కూడా లేదని రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు బాధితులు అందరూ వారి స్వస్థలాలకు వెళ్లే వరకు ఇక్కడే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. మరికొద్ది సేపట్లో తమ నేత చంద్రబాబు నాయుడు డెహ్రాడూన్ చేరుకోనున్నారని రాథోడ్ చెప్పారు.

హుటాహుటిన డెహ్రాడూన్ బయలుదేరిన చంద్రబాబు

June 25, 2013

 ఉత్తరాఖండ్‌ వరదల్లో చిక్కుకుపోయిన వరద బాధితుల సంరక్షణ విషయంలో తెలుగు దేశం పార్టీ చురుకైన పాత్రను పోషిస్తోంది. బాధిత తెలుగు వారిని ఢిల్లిd నుంచి స్వగ్రామంలోని సొంత ఇంటికి చేర్చేదాకా బాధ్యతలను స్వీకరించి కొత్త ఒరవడిని సృష్టించింది. ఆ పార్టీ అధినేత నారా చంద్ర బాబు నాయుడు ఒకవైపు పార్టీ శ్రేణులను, మరోవైపు ఎన్‌టీఆర్‌ ట్రస్టు సిబ్బందిని సమన్వయం చేస్తున్నారు. అదే సమయంలో ఉత్తరాఖండ్‌ అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసా గిస్తున్నారు. దాంతో భక్తుల తరలింపు వేగం పుంజుకుంటోంది. అధి నేత ఆదేశాల మేరకు టీడీపీపీ నేత నామా నాగేశ్వరరావు ఢిల్లిdలో మకాం వేసి సహాయ కార్యక్రమాలను సమన్వయం చేస్తున్నారు. అదే రీతిలో డెహ్రాడూన్‌లో రమేశ్‌ రాథోడ్‌, రుషికేష్‌లో కె. నారాయణ సహాయ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. నాలుగు బేస్‌ క్యాంపుల వద్ద టీడీపీ వలంటీర్లను మోహరించారు. వారు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, ట్రస్టు బాధ్యులతో బాబు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు.

ఫోన్ల వెల్లువ: ఎల్వీఎస్సార్కే

ట్రస్టు ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ కాల్స్‌ వెల్లువెత్తుతున్నాయని టీడీపీ మీడియా కమిటీ చైర్మన్‌ ఎల్వీఎస్సార్కే ప్రసాద్‌ చెప్పారు. వరద బాధితులు, వారి బంధువుల నుంచి వచ్చే సమాచారాన్ని ఉత్తరాఖండ్‌ అధికారులకు చేరవేస్తున్నట్లు చెప్పారు.

విరాళాలు: ఎన్టీఆర్‌ ట్రస్టు విరాళాల కోసం కోసం చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన తెలుగు సాంకేతిక నిపుణుల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు నంబూరు నరసింహా రావు లక్ష రూపాయలను ట్రస్టు సీఈఓ వెంకట్‌కు అందించారు. శాసన మండలిలో విపక్ష నేత యనమల 50 వేల విరాళాన్ని ప్రకటించారు.

బాధితులకు అండగా 'దేశం'

చార్‌ధామ్ బాధితుల కన్నీటి గాథలు వింటుంటే.. వారిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంగ్రెస్ నాయకులను ఉరితీయాలనిపిస్తోందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కేశినేని ట్రావెల్స్‌లో విజయవాడకు చేరుకున్న 45 మంది యాత్రికులకు మంగళవారం ఉదయం స్వాగతం పలికారు. వారిని పరామర్శించిన రాజేంద్రప్రసాద్.. వారు తాము పడ్డ కష్టాల గురించి చెబుతుంటే కాంగ్రెస్ నాయకులను ఉరితీయాలనిపిస్తోందన్నారు. ఢిల్లీలో తెలుగు యాత్రికులు చాలా అవమానాలకు గురయ్యారని ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో టీడీపీ ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని తొలగించడం హేయమైన చర్య అని పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ధ్వజమెత్తారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. యాత్రికుల విషయంలో ప్రభుత్వం ఇంతవరకూ సరైన రీతిలో స్పందించకపోవడం శోచనీయమని ఆదిలాబాద్ ఎంపీ రమేశ్ రాథోడ్ విమర్శించారు.

కాగా.. "చార్‌ధామ్ బాధితుల కోసం ఏపీ భవన్‌లో మేం నెలకొల్పిన వైద్య శిబిరాన్ని తొలగించాలన్న నిర్ణయం ఎవరిది? అది శశాంక్ గోయల్‌ది అయితే ఆయన్ను సస్పెండ్ చేయాలి. సీఎం కిరణ్ ఆదేశాలతో ఆయన చేస్తే.. సీఎం ప్రజలకు క్షమాపణ చెప్పాలి'' అని టీడీపీ పార్టీ ఉపాధ్యక్షుడు ఎల్‌వీఎస్ఆర్‌కే ప్రసాద్ డిమాండ్ చేశారు. "సేవచేయడంలో మాతో పోటీ పడండి. అది వదిలిపెట్టి మాపై ఈర్ష్య పడటం ఎందుకు?'' అని పెద్దిరెడ్డి మండిపడ్డారు. ఉత్తరాఖండ్ బాధితులను ఆదుకుంటున్న బాబును అభినందించాల్సిందిపోయి.. కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడం సిగ్గుచేటని సీనియర్ నేత యనమల అన్నారు.
చంద్రబాబూ.. శవరాజకీయాలు మానుకో: సారయ్య
టీడీపీ అధినేత చంద్రబాబు శవరాజకీయాలు మానుకోవాలని రాష్ట్ర మంత్రి బస్వరాజు సారయ్య అన్నారు. ఉత్తరాఖండ్ విషాదానికి దేశమంతా శోకసంద్రంలో మునిగిపోతే చంద్రబాబు మాత్రం రాజకీయం చేస్తున్నారన్నారు.

కాంగ్రెస్ నేతల్ని ఉరి తీయాలనిపిస్తోంది : టీడీపీ నేతలు

కాంగ్రెస్ పార్టీలో స్వదేశీ వాసనలు పోయి విదేశీ గబ్బు కొడుతోందని శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు, టిడిపి నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. టిడిపి, వైఎఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలు అని ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. దీనిపై యనమల స్పందిస్తూ తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన టిడిపి ముఖ్యమంత్రికి ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా కనిపించడం విడ్డూరమని అన్నారు. విదేశాల నుండి వచ్చిన వ్యక్తి నేతృత్వంలో పని చేసే కాంగ్రెస్ పార్టీ మల్టీ నేషనల్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్‌గా తయారైందని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇటలీకి చెందిన వారని, ఉపాధ్యక్షుడు రాహుల్ జీన్స్ కూడా అక్కడివేనని అన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ , ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ బొమ్మలతో వారసత్వ రాజకీయాల పార్టీ కాంగ్రెస్‌లో పని చేస్తూ టిడిపిపై రాళ్లు విసిరితే అవి వాళ్ల నెత్తినే పడతాయని అన్నారు. కుర్చీ నిలబెట్టుకోవడానికి ఢిల్లీ చుట్టూ 80 సార్లు ప్రదక్షిణలు చేసిన ముఖ్యమంత్రి వరద బాధితులను పరామర్శించేందుకు ఒక్కసారి ఢిల్లీ వెళ్లే తీరిక లేదా? అని యనమల ప్రశ్నించారు. వరద బాధితుల సహాయం కోసం ఎన్టీఆర్ ట్రస్ట్‌కు టిఎన్‌ఎస్‌వి ఉపాధ్యక్షుడు నరసింహారావు లక్ష రూపాయల విరాళం ఇచ్చినట్టు టిడిపి ప్రకటనలో తెలిపింది.

కాంగ్రెస్‌ది విదేశీ గబ్బు: టిడిపి

కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ ఎస్పీకి టీడీపీ నేతలు మంగళవారం ఉదయం వినతి పత్రం అందజేశాయి. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎస్పీ జులై తొలి వారంలో నీటిని విడుదల చేస్తామని నేతలకు హామీ ఇచ్చారు.

విజయవాడ : ఇరిగేషన్ ఎస్పీకి టీడీపీ వినతి పత్రం

ఏపీ భవన్‌లో అధికారుల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్ వరదబాధితుల కోసం టీడీపీ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని తొలగించడం దారుణమని ఆయన మండిపడ్డారు. బాధితులకు గదులు కేటాయించాలన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ఏపీ భవన్ అధికారుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం

ఉత్తరాఖండ్ వరదలను రాజకీయం చేస్తున్నారన్న కాంగ్రెసు నేతల వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. తాను రాజకీయాలు చేయడం లేదని, ఓ మనిషిగా సహాయం చేసేందుకు వచ్చానని చెప్పారు. ఇలాంటి విపత్కర పరిస్థితిని రాజకీయం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. వరద బాధితుల ఇబ్బందులను చూసి చలించిపోయానన్నారు. పలువురు యాత్రికులను ప్రత్యేక విమానంలో స్వస్థలాలకు పంపినట్లు చెప్పారు. తాను సాయం చేసేందుకే వచ్చానని, రాజకీయం చేసేందుకు రాలేదన్నారు.

ఎపి భవన్ అధికారుల తీరుపై టిడిపి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్టీఆర్ ట్రస్ట్ వైద్యుల వైద్య శిబిరాన్ని అధికారులు తొలగించడమేమిటని ప్రశ్నించారు. వరద బాధితులకు వైద్యం అందకుండా అధికారులు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఎపి భవన్ అధికారుల వ్యవహార శైలిపై మంత్రి శ్రీధర్ బాబు విస్మయం వ్యక్తం చేసారు. ఎన్టీఆర్ ట్రస్ట్ వైద్య సహాయం నిరాకరించడంపై టిడిపి నేతలు శ్రీధర్ బాబుకు ఫిర్యాదు చేశారు.

తెలుగు వారికి సౌకర్యాలు కల్పించని ఎపి భవన్ అధికారి శశాంక్ గోయల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని టిడిపి నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. కాంగ్రెసు పార్టీ చేతకానితనానికి ఇది నిదర్శనమన్నారు. ఎపి భవన్‌లో ఉన్న 1500మందిలో వంద మందికే రవాణా ఖర్చులు చెల్లించడమేమిటని ప్రశ్నించారు.

రాజకీయంపై బాబు స్పందన!

వరదల్లో చిక్కుకున్న 20 మంది తెలుగువారిని స్వస్థలాలకు పంపించేందుకు టీడీపీ విమాన ప్రయాణ ఏర్పాట్లు చేసింది. సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీ-విశాఖ ఎయిరిండియా విమానంలో విశాఖకు తిరిగొచ్చేందుకు 20 మందికి ఉచితంగా టికెట్లు అందజేశారు. విశాఖ నుంచి విమానాశ్రయం నుంచి ఇంటికి వెళ్లేందుకు స్థాని టీడీపీ నేతలు వారికి వాహనాలు సమకూరుస్తున్నారు.

20మందికి విమాన టికెట్లు ఇప్పించిన టీడీపీ

ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న బాధితుల పరిస్థితిని చూసి చలించిపోయానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ సహాయక కార్యక్రమాలు ముమ్మరం చేయాలన్నారు. బాధితులకు తమ వంతు సాయం చేస్తున్నామని బాబు తెలిపారు. తెలుగు ప్రజాలను రాష్ట్రానికి సురక్షితంగా పంపిస్తామన్నారు.

బాధితులను ఆదుకునేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఉత్తారాఖండ్ వరదల్లో చిక్కుకున్న యాత్రికుల కోసం వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహాయ సహకారాలు ముమ్మరం చేస్తుంటే, మన సీఎంకు మాత్రం ఏదీ పట్టడం లేదని ధ్వజమెత్తారు. తనపై ఆరోపణలు చేసే బదులు తెలుగు ప్రజలను రాష్ట్రానికి తరలించేందుకు కృషి చేయాలని చంద్రబాబు సూచించారు.

వరద బాధితుల పరిస్థితిని చూసి చలించిపోయా : చంద్రబాబు

తెలుగు బాధితులను ఆదుకోడానికి మాత్రమే వచ్చానని, రాజకీయాలు చేయడం లేదని, వరద రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకులేదని, ఓ మనిషిగా సహాయం చేయడానికి వచ్చానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

ఉత్తరాఖండ్ బాదితులను రాజకీయం చేస్తున్నారన్న కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై స్పందించిన చంద్రబాబు నాయుడు మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వరద బాధితుల ఇబ్బందులను చూసి చలించిపోయానన్నారు. పలువురు యాత్రికులను ప్రత్యేక విమానంలో స్వస్థలాలకు పంపినట్లు చెప్పారు. తాను సాయం చేసేందుకే వచ్చానని, రాజకీయం చేసేందుకు రాలేదన్నారు.

ఎపి భవన్ అధికారుల తీరుపై టిడిపి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్టీఆర్ ట్రస్ట్ వైద్యుల వైద్య శిబిరాన్ని అధికారులు తొలగించడమేమిటని ప్రశ్నించారు. వరద బాధితులకు వైద్యం అందకుండా అధికారులు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఎపి భవన్ అధికారుల వ్యవహార శైలిపై మంత్రి శ్రీధర్ బాబు విస్మయం వ్యక్తం చేసారు. ఎన్టీఆర్ ట్రస్ట్ వైద్య సహాయం నిరాకరించడంపై టిడిపి నేతలు శ్రీధర్ బాబుకు ఫిర్యాదు చేశారు. తెలుగు వారికి సౌకర్యాలు కల్పించని ఎపి భవన్ అధికారి శశాంక్ గోయల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని టిడిపి నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. కాంగ్రెసు పార్టీ చేతకానితనానికి ఇది నిదర్శనమన్నారు.

తెలుగు బాధితులను ఆదుకోడానికి వచ్చా : చంద్రబాబు

ఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న తెలుగువారికి అందించాల్సిన సహాయ చర్యలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను కలవనున్నారు.

సహాయ చర్యలపై పీఎం ను కలవనున్న బాబు

June 24, 2013

ఉత్తరాఖండ్‌లో రాష్ట్రానికి చెందిన యాత్రికులు పడుతున్న నరక యాతనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చలించి పోయారు. హైదరాబాద్‌ నుండి ఎంపీలు నామా నాగేశ్వరరావు, రమేష్‌ రాథోడ్‌లతో కలిసి డెహరాడూన్‌లో పర్యటించిన బాబు అక్కడి పరిస్థితులను యాత్రికులను అడిగి తెలుసు కున్నారు. ఉత్తరాఖండ్‌ సీఎంను కలిసి తెలుగువారిని ఆదుకుని ఆంధ్రప్రదేశ్‌కు పంపించే ఏర్పాట్లు చేయాల్సిందిగా అభ్యర్తించారు. అటు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కేంద్ర మంత్రులు షిండే, ప్రభృతులకూ చంద్రబాబు నాయుడు సోమవారం నాడు లేఖలు రాశారు. వరదల్లో చిక్కుకున్న యాత్రికులను సైన్యం హెలీకాఫ్టర్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు వారిని తరలించాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్‌కు తెలుగుదేశం పార్టీ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయించిన చంద్రబాబు వారిని స్వంత జిల్లాలకు తరలించేందుకు నేతలను పురమాయించారు. కేసినేని నాని ఆధ్వర్యంలో విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌, కాజీపేట ప్రాంతాలకు తరలించేందుకు ముమ్మరంగా పన్నాహాలు చేశారు. అటు ఎన్టీఆర్‌ట్రస్ట్‌ కూడ ఉత్తరాఖండ్‌కు డాక్టర్ల బృందాన్ని పంపించింది. అలాగే పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనూ రెండు ెహెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసి 24 గంటలూ పర్యవేక్షిస్తున్నారు. బాధితులు ఎక్కడి నుండి ఫోన్‌ చేసినా తక్షణమే స్పందించేందుకు ఎన్టీఆర్‌ భవన్‌లోనూ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ బాధ్యతతో విధులు నిర్వర్తిస్తున్నారు. మొత్తం మీద అమెరికా పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చిన బాబు ఉత్తరాఖండ్‌ బాధితులను ఆదుకోవడంలో తన ఉదారతను చాటుకున్నారు. ప్రభుత్వం కంటే ముందే స్పందించిన తీరుపై పలువురు ప్రశంశల జల్లులు కురిపించారు.

రాష్ర్ట ప్రభుత్వం ముఖ్యమంత్రి, రెవిన్యూ మంత్రులు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కూడా ఇప్పటి వరకు ఉత్తరాఖండ్‌ వెళ్లక పోవడాన్ని టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు. అయితే ప్రతిపక్ష నాయుకుడై ఉండి ప్రభుత్వంలో ఉన్న వారి కంటే ఎక్కువగా స్పందించడం పార్టీ నేతలు, కార్యకర్తల్లో స్పూర్తిని నింపుతోంది. కాగా ఉత్తరాఖండ్‌ నుండి రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో విచ్చిన బాధితులకు శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చిన బాధితులను వారిని వారివారి గ్రామాలకు తరలించడానికి కేసినేని ట్రావెల్‌ వారు బస్సులను ఏర్పాటు చేశారు.

బాధితులకు బాబు ఓదార్పు

ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకుండా కేంద్రం తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించినట్లు వస్తున్న వార్తల వెనుక టీఆర్‌ఎస్‌ అధినేత కేసిఆర్‌ హస్తం ఉందని తెలుగుదేశం పార్టీ సందేహం వ్యక్తం చేసింది. పార్టీ ఉపాధ్యక్షుడు ఇనుగాల పెద్దిరెడ్డి సోమవారం నాడిక్కడ ఎన్టీఆర్‌ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేసిఆర్‌ అసలు రంగును ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. కేసిఆర్‌తో సంప్రదింపులు జరిపాకే కేంద్రం ప్యాకేజీ నిర్ణయానికి వచ్చిందని పెద్దిరెడ్డి ఆరోపించారు. తెలంగాణ సెంటిమెంటును అడ్డంపెట్టుకుని కేసిఆర్‌కోట్లు దండుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికలు ఓట్లు సీట్లు ఇదే కేసిఆర్‌ విధానమని, వాదంతో ఓట్లు వేసుకుని ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసి రాహుల్‌ను పీఎంను చేసేందుకు తోడ్పడాలన్నది టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్యన కుదిరిన రహస్య ఒప్పందం అని పెద్దిరెడ్డి ఆరోపించారు.

ప్యాకేజీ నిర్ణయం వెనుక కేసీఆర్‌


కేసీఆర్ కుటుంబ సభ్యుల నిజస్వరూపం, అవినీతి విశ్వరూపం బయట పడిందని పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ చైర్మన్ రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం హన్మకొండ హంటర్‌రోడ్‌లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డంపెట్టుకొని అడ్డదారిలో అక్రమార్జనకు పాల్పడేందుకు కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్‌రావులు సాగిస్తు న్న దందాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయన్నారు. 'వీరంతా ఇప్పటికే తెలంగాణ సమాజం ముందు దోషులుగా నిలబడ్డారు.

అక్రమాలు, సాగిస్తున్న దుర్మార్గాలు రాబోయే రోజుల్లో మరి న్ని బయటకు వస్తాయి. వీరిని ఛీకొట్టే రోజులు దగ్గర పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు' అని ప్రకాశ్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు తెలంగాణ రావాలని ఏ కోశాన లేదని, ఆలోచనంతా సెంటిమెంట్‌తో ఎట్లా లాభం పొందుతామా అని ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో 100 అసెంబ్లీ, 10 పార్లమెంట్ స్థానాల్లో టీఆర్ఎస్‌ను గెలిపించాలని కోరుతున్నాడంటేనే అర్థం చేసుకోవ చ్చు.. గంపగుత్తగా అధికారం ఇస్తే చె న్నారెడ్డిలాగా ఆ సీట్లన్ని సోనియాకు తాకట్టెలని చూస్తున్నారమండిపడ్డారు.

తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ రెండో వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనే తీరిక కేసీఆర్‌కు లేదా? ఆయన అంత అనారోగ్యం తో బాధపడుతున్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం ముసుగులో కేటీఆర్ పాల్పడుతున్న భూదందాలు, సెటిల్‌మెంట్ల బాగోతాన్ని సాక్ష్యాలతో ఏబీఎన్ చానెల్, ఆంధ్రజ్యోతి బయట పెడితే...దానికి సమాధానం ఇవ్వాల్సింది పోయి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడమేకాక, బెదిరింపులకు పాల్పడుతుండడం వి డ్డూరంగా ఉందన్నారు.

కాంగ్రెస్‌కు కాపలా కుక్క
ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ కేటీఆర్‌కు ఉద్యమ నాయకుడికి ఉండాల్సి న లక్షణాలు, సంస్కారం లేదన్నారు. తప్పులు ఎత్తి చూపినప్పుడు వాటికి తగిన విధంగా వివరణ ఇవ్వాల్సి పో యింది సీమాంధ్ర మీడియా అని విరుకుపడడం విడ్డూరంగా ఉందన్నారు. తప్పులను బయటపెట్టేవారంతా తె లంగాణ ద్రోహులుగా ప్రచారం చే యడం ఆయన నీచ సంస్కృతిని స్పష్టం చేస్తోందన్నారు.

తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్ ఇప్పుడు కాం గ్రెస్‌కు కాపలా కుక్కలా మారిపోయారన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు కష్టకాలం వచ్చినప్పుడలా ఏదో గొడవను సృష్టించి సభ జరగకుండా చేయడం ద్వారా ఆ పార్టీని కాపాడుతున్నది టీఆర్ఎస్ కాదా? అని ప్రశ్నించారు. కడియం శ్రీహరి టీడీపీని వదిలి వెళ్ళినా ఆర్థిక లావాదేవీలను మాత్రం వదులుకోవడం లేదన్నారు. పార్టీకి చెం దిన ఎమ్మెల్యే క్వార్టర్‌లోనే ఇంకా ఎం దుకు నివాసముంటున్నారని ప్రశ్నించా రు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యం వచ్చే ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి తాను పోటీ చేయకుండా మరో దళిత సోదరుడికి గెలిపించాలని సవాల్ చేశారు.

టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎడబోయిన బస్వారెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. రానున్న రోజుల్లో ఆయనకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ సమావేశంలో వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం ఇన్‌చార్జి దొమ్మటి సాంబయ్య, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేశం, పరకాల నియోజకవర్గం ఇన్‌చార్జి చల్లా ధర్మారెడ్డి, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ఇన్‌చార్జి కట్టా మనోజ్ రెడ్డి, టీడీఎల్‌పీ కార్యదర్శి కేలిక కిషన్ ప్రసాద్, పుప్పాల సమ్మయ్య, పుల్లూరి ఆశోక్ కుమార్, మార్గం సారంగం, మునిగె వెంకట్రాజం, లొడంగి రాజు, షేఖ్‌బాబా ఖాదర్ అలీ పాల్గొన్నారు.

కేసీఆర్ కుటుంబాన్ని ఛీకొట్టే రోజులొచ్చాయి

విజయవాడ : కృష్టా జిల్లకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమ కృష్ణా నదిలో నిరసనకు దిగారు. డెల్టాకు నీరు విడుదల చేయాలంటూ ఎమ్మెల్యే ఉమ ఈ నిరసనను చేపట్టారు.

కృష్ణా నదిలో ఎమ్మెల్యే దేవినేని నిరసన

ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుని సురక్షితంగా ఢిల్లీకి చేరిన తెలుగువారికి ఏపీ భవన్‌లో జరుగుతున్న అవమానం చూస్తుంటే రక్తం మరుగుతోందని టీడీపీ నేత వైవీబి రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. యాత్రికులు కటిక నేలపై పడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 25 ఎకరాల ఏపీ భవన్ ప్రాంగణం కాంగ్రెస్ నేతలు గంజాయి పండించడానికేనా అని ఆగ్రహించారు. తెలుగు యాత్రికులకు వసతులేవి అని రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు.

యాత్రికులు కటికనేలపై పడుకుంటున్నారు : రాజేంద్రప్రసాద్

రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కాకిలెక్కలతో ప్రజలను మోసం చేస్తోందని టీడీపీ నేత వర్లరామయ్య ఆరోపించారు. ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుని బాధితులు అవస్థలు పడుతుంటే సీఎం కిరణ్ ప్రారంభోత్సవాల్లో బిజీగా ఉన్నారని మండిపడ్డారు. వరద బాధితులను కాపాడే విషయంలో ప్రభుత్వం సరైన రీతిలో స్పందించడం లేదని వర్లరామయ్య వ్యాఖ్యనించారు.

రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కాకిలెక్కలు చూపుతోంది : వర్లరామయ్య

హైదరాబాద్‌ : నెల్లూరు కలెక్టర్‌గా పని చేసిన కేవీపీ బంధువు నాలుగేళ్లలో రూ.300 కోట్లు సంపాదించారని టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపించారు. కృష్ణపట్నం భూ ఆక్రమణను జగన్‌ కేసులో భాగంగా సీబీఐ విచారించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సహజ వనరులను ఓ కుటుంబానికి ధారదత్తం చేసే అధికారం వైఎస్‌కు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు.

కేవీపీ బంధువుపై విచారణ చేయాలి