September 24, 2013

బీజేపీతో పొత్తు పర్యవసానాలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమ పార్టీలో అంతర్గతంగా చర్చకు తెరదీశారు. మంగళవారం రాత్రి ఇక్కడ ఖమ్మం జిల్లా పార్టీ నేతలతో సమావేశమైనప్పుడు ఆయన ఈ అంశంపై వారి అభిప్రాయం కోరినట్లు సమాచారం. 'బీజేపీ మనతో కలిసి వస్తానని అడుగుతోంది. మీ అభిప్రాయం ఏంటి?' అని చంద్రబాబు వారిని అడిగారు. కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉన్న జిల్లా కావడంతో ఖమ్మం జిల్లా నేతలు ఆచితూచి మాట్లాడారు. 'ఖమ్మం సహా రెండు మూడు జిల్లాల్లో కమ్యూనిస్టులకు పట్టు ఉంది. మిగిలిన చోట్ల లేదు. బీజేపీకి గట్టిగా ఏ జిల్లాలోనూ పట్టు లేదు. కానీ, రాష్ట్రం అంతటా అన్నిచోట్లా ఎంతో కొంత ఓట్లు ఉన్నాయి. మీరు రాష్ట్రం మొత్తం మీద పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోండి. మీరు ఏ నిర్ణయం తీసుకొన్నా మేం నిలబడి పనిచేస్తాం' అని వారు చెప్పారు.


మైనారిటీ కోణం గురించి కూడా చర్చ జరిగింది. బీజేపీతో పొత్తు ఉన్నా లేకపోయినా మైనారిటీల ఓట్లు టీడీపీకి పెద్దగా వచ్చే అవకాశం లేదని, మొదటి నుంచి పార్టీతో ఉన్నవారు ఎలాగూ వేస్తారని, మిగిలిన వారివి కాంగ్రెస్‌కు వెళ్ళే అవకాశం ఉందని కొందరు నాయకులు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు మాత్రం తన అభిప్రాయం ఏదీ చెప్పకుండా వ్యూహాత్మకంగా మాట్లాడారు. 'ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉంది. పొత్తులపై మనం అప్పుడే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. మున్ముందు పరిస్ధితులు ఎలా రూపుదిద్దుకొంటాయో చూసి దానిని బట్టి నిర్ణయం తీసుకొందాం. పొత్తు ఉన్నా లేకపోయినా... మనతో ఎవరు కలిసి వచ్చినా... ఎవరూ రాకపోయినా మనం సొంతంగా గెలవటానికి తగిన వ్యూహంతో వెళ్ళాలి. ఆ దిశగా పనిచేయాలి.

రాష్ట్రం ఒకటిగా ఉన్నా, రెండుగా విడిపోయినా రెండు ప్రాంతాల్లో మనం బలంగా ఉండాలి. రెండువైపులా గెలవాలి. కాంగ్రెస్ ఒకవైపు టీఆర్ఎస్‌ని, రెండోవైపు వైసీపీని కలుపుకొని బలపడాలని చూస్తోంది. టీఆర్ఎస్‌ను విలీనం చేసుకొంటుంది. వైసీపీని తాను ఎలా ఆడిస్తే అలా ఆడే పరిస్థితిలోకి తెచ్చుకొంది. ఇప్పుడు బెయిల్ వచ్చినా రేపు తేడా వస్తే ఈడీని రంగంలోకి దించి మరోసారి జైలుకు పంపిస్తామని అంతర్గతంగా హెచ్చరికలు జారీ చేసింది. ఆ పార్టీ గేమ్ ప్లాన్‌ను అమలు చేయడం తప్ప జగన్‌కు ఇప్పుడు మరో ప్రత్యమ్నాయం లేదు' అని ఆయన పేర్కొన్నారు. రెండు ప్రాంతాల్లో రెండు పార్టీలను ముందు పెట్టుకొని కాంగ్రెస్ ఆటాడుతోందన్న అంశం ప్రజల్లోకి బలంగా వెళ్తే ఆ మూడు పార్టీలు మట్టి కరవడం ఖాయమని, మంచి పాలన కావాలంటే టీడీపీయే శరణ్యమన్న అభిప్రాయాన్ని ప్రజల్లో బలంగా కలిగించాలని ఆయన వారికి సూచించారు.
 

'బీజేపీ మనతో కలిసి వస్తానని అడుగుతోంది. మీ అభిప్రాయం ఏంటి?

 
అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్‌కు సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై టీడీపీ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈకేసులో 10 చార్జిషీట్లలో 1200 కోట్ల అక్రమాలు జరిగాయని సీబీఐ చెప్పింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ సుప్రీం కోర్టు వరకు వెళ్లినా బెయిల్ రాలేదని, ఇంత భారీగా అక్రమాలకు పాల్పడిన జగన్‌కు బెయిల్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు.
ఈ కేసు మధ్యలో విచారణ అధికారిని ఎలా బదిలీ చేశారని విమర్శించారు. జగన్ బెయిల్‌ను సీబీఐ ఎందుకు అడ్డుకోలేదన్నారు. బెయిల్‌పై వాదనలు జరుగుతున్న సమయంలో హడావుడిగా అఫిడవిట్ దాఖలు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. నాలుగు కేసుల్లో ముద్దాయిగా ఉన్న కార్మెల్ ఏషియాలో క్విడ్‌ప్రోకో లేదని ఎలా చెబుతారన్నారు. జగన్ కేసులో దొంగ, పొలీస్ ఒకటయ్యారని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

నిమ్మగడ్డ ప్రసాద్ సుప్రీం కోర్టు వరకు వెళ్లినా బెయిల్ రాలేదని, ఇంత భారీగా అక్రమాలకు పాల్పడిన జగన్‌కు బెయిల్ ఎలా వచ్చింది

  కాంగ్రెస్‌తో వైసీపీ కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగానే జగన్‌కు బెయిల్ మంజూరైందని తెలంగాణ తెలుగుదేశం ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. మంగళవారం వరంగల్ జిల్లా కేంద్రం హన్మకొండలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడారు. తెలంగాణపై 2008లో తీసుకున్న నిర్ణయానికి టీడీపీ కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్, వైసీపీ, టీఆర్ఎస్ కుమ్ముక్కై టీడీపీనీ టార్గెట్ చేస్తున్నాయన్నారు.


ఈ ప్రాంతానికి చెందిన వేల కోట్లు దాచుకున్న జగన్‌కు బెయిల్ రావడంపై కేసీఆర్ స్పందించకపోవడం . వైసీపీ ఓ గజదొంగ పార్టీ అని, అలాంటి పార్టీతో కేసీఆర్ కుమ్ముక్కవడం ఎంత వరకు సమంజసమన్నారు. పార్టీని విలీనం చేసేందుకు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుంటున్న కేసీఆర్‌కు టీడీపీని విమర్శించే అర్హత లేదని విమర్శించారు. సీమాం«ద్రుల కృషితోటే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, తమకే హైదరాబాద్‌పై హక్కు ఉందని మాట్లాడుతున్న ఏపీఎన్జీవో నేత నోరు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరించారు. బతుకుదెరువు కోసం వచ్చారు కదాని కనుకరిస్తే ఇష్టం ఉన్నట్లు మాట్లాడడం సరికాదన్నారు.

నర్సంపేట ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ సీబీఐపై కాంగ్రెస్ ఒత్తిడి మేరకు జగన్‌కు బెయిల్ వచ్చిందని ఆరోపించారు. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే ధ్యేయంతో కాంగ్రెస్ ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని దుయ్యబట్టారు.

వేల కోట్లు దాచుకున్న జగన్‌కు బెయిల్ రావడంపై కేసీఆర్ స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు