December 25, 2012



ఉత్తర తెలంగాణకు సింగరేణి సంస్థ మణిహారం. గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ విద్యుత్ వెలుగులు విరజిమ్మడానికి ఆధారం. మూడు, నాలుగు జిల్లాల పరిధిలో లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న సంస్థ అది. సింగరేణిని నడిపించే ప్రధాన శక్తులు కార్మికులే. ప్రాణాలకు తెగించి మరీ గని బావుల్లో పనిచేస్తారు. మనకు వెలుగులు అందించడం కోసం చీకటి గుయ్యారాల్లోకి నడుస్తారు. ఊపిరి బలిపెట్టి నల్ల బంగారం బయటకు తీస్తారు.

దీన్నంతా దృష్టిలో ఉంచుకొని నా హయాంలో కంపెనీ లాభాల్లో వారికీ వాటా ఇచ్చే ప్రయత్నం చేశాను. సంస్థ ఆర్జించే మొత్తం లాభాల్లో 12 శాతం వారికే ఇచ్చేలా యాజమాన్యాన్ని ఒప్పించాం. నష్టంలో ఉన్న సంస్థను బయటపడేయటంలో నా ప్రభుత్వం పాత్రతో పాటు కార్మికుల భూమిక కూడా విస్మరించరానిది. కేంద్రంలో చక్రం తిప్పే పరిస్థితిలో అప్పట్లో నేను ఉండటం, కార్మికుల శ్రమ కలగలిసి మూత ముప్పు నుంచి సింగరేణి బయటపడింది.

" సార్..మీరు ఉండగా మాకు బతుకు బెంగ లేదు. మేమూ ప్రభుత్వ ఉద్యోగుల్లా వెలిగిపోయాం. బోనస్ నుంచి ప్రత్యేక ప్రోత్సాహకాల దాకా..ఎన్నో విధాల మమ్మల్ని మీ ప్రభుత్వం ఆదుకుంది'' అని కొలనూరులో కలిసిన ఆ కార్మికులు గుర్తు చేస్తున్నప్పుడు, సింగరేణి కోసం మా నేత ఎన్టీఆర్, ఆ తరువాత నేను తీసుకొచ్చిన సంస్కరణల జాడ ఎక్కడ అని బాధనిపించింది. అప్పటి ఆనందం ఆ కార్మికుల్లో ఇప్పుడు కనిపించడం లేదు. ఉద్యోగ సంక్షేమం గురించి పట్టించుకునేవారు లేరు. కొత్త కొలువులు అస్సలే లేవు. ఓపెన్‌కాస్ట్ వచ్చిన తరువాత ఉన్నవారికీ దినదినగండంగానే గడిచిపోతుందని వాళ్ల మాటలను బట్టి అర్థమయింది. ఏవీ ఆ వెలుగు ప్రస్థానాలు?

సంక్షేమాన్ని బదిలీ చేయాల్సిన పథకం కాస్తా పేదల బతుకుల్లోకి మరింత సంక్షోభాన్ని బదిలీ చేస్తున్నదనే విషయం గోపర పల్లి మహిళలతో మాట్లాడినప్పుడు తేటతెల్లం అయింది. నగదు బదిలీ పథకంలో భాగంగా ఇక డబ్బులే గానీ చౌక బియ్యం ఉండవని అధికారులు చెబుతున్నారట. "సార్ బియ్యమిస్తే గంజి కాసుకొని తాగుతాం..అదే డబ్బులిస్తే మా మొగుళ్లు తీసుకెళ్లి సారా తాగుతారు'' అన్న మహిళల మాటలు, నన్నూ ఒక్కక్షణం ఆందోళనకు గురిచేశాయి.

ఏవీ ఆ వెలుగు ప్రస్థానాలు?



సీమాంధ్ర నేతలతో చర్చిస్తా..
పొలిట్‌బ్యూరోలో నిర్ణయం తీసుకుంటా
తెలంగాణ నేతలతో చంద్రబాబు

అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ పట్ల సానుకూలత వ్యక్తం చేస్తూనే సీమాంధ్రలోనూ పార్టీకి ఇబ్బంది కలగని వైఖరి తీసుకొనే ఆలోచన ఉందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నట్లు సమాచారం. కరీంనగర్ జిల్లా రేగడిమద్దికుంట గ్రామం వద్ద తెలంగాణ ప్రాంత ముఖ్య నేతలతో మంగళవారం సమావేశమైన ఆయన వారి అభిప్రాయాలు తెలుసుకోవడంతోపాటు తన మనసులోని ఆలోచనలను కూడా వారితో పంచుకొన్నారు.

"కేంద్రం ఏదో ఒకటి తేల్చేస్తుందని అఖిలపక్షం కోరాం. తీరా ఇప్పుడు చూస్తే ఎవరేమనుకొంటున్నారో విషయం తెలుసుకోవడానికి పెడుతున్నామని చెబుతున్నారు. వాళ్లు అడుగుతుంటే మనం ఎదురుగా కూర్చుని చేతులు కట్టుకొని చెప్పాలా? మనం తెలంగాణ పట్ల సానుకూలంగా ఉన్నామని చాలాకాలంగా చెబుతున్నాం. ఆ విషయం అఖిలపక్షంలో మనతో చెప్పించి తర్వాత సీమాంధ్రలో మనని ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అందుకే అటూఇటూ ఇబ్బంది రాకుండా ఏం చెప్పాలో ఆలోచిస్తున్నాం. బుధవారం సీమాంధ్ర నేతలతో కూడా మాట్లాడతాను.

పొలిట్‌బ్యూరోలో తుది నిర్ణయం చేస్తాను. కాంగ్రెస్‌ను మాత్రం వదిలిపెట్టేది లేదు. అఖిలపక్షంలో ఆ పార్టీని ఒక పట్టు పడదాం'' అని ఆయన అన్నారు. అయితే.. తెలంగాణపై సానుకూలతను స్పష్టంగా వ్యక్తం చేస్తే రాజకీయంగా చాలా మేలు కలుగుతుందని, ఈ అవకాశాన్ని జారవిడుచుకోవద్దని తెలంగాణ నేతలు ఆయనను కోరారు. "కేసీఆర్ ప్రతిష్ఠ బాగా దెబ్బ తింది. అఖిలపక్ష సమావేశం మనకు అందివచ్చిన అవకాశం. దీనిని జార్చుకోవద్దు. గతంలో ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని మనం పదేపదే చెబుతున్నాం. దానినే పునరుద్ఘాటిద్దాం'' అని వారు ఆయన వద్ద పేర్కొన్నారు.

వారి అభిప్రాయాలను కూడా తాను పరిగణనలోకి తీసుకొంటానని బాబు చెప్పారు. అఖిలపక్షంలో పార్టీ వైఖరిని లిఖితపూర్వకంగా ఇస్తే ఎలా ఉంటుందన్నదానిపై కూడా చర్చ జరిగింది. ఇతర పార్టీలు అనుసరించే వైఖరి ఎలా ఉంటుందన్న అంశం కూడా చర్చకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తన వైఖరి చెప్పే అవకాశం లేదని, వైసీపీ తన అభిప్రాయం చెప్పకుండా ముందు కాంగ్రెస్ చెప్పాలని పట్టుబట్టే అవకాశం ఉందని నేతలు అభిప్రాయపడ్డారు. బాబు బుధవారం సీమాంధ్రకు చెందిన నేతలతో భేటీ కానున్నారు.

గురువారం ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం జరగనుంది. కాగా..అఖిలపక్షానికి చంద్రబాబే స్వయం గా హాజరై తెలంగాణపై స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని తెలంగాణ రాజకీయ జేఏసీ నేతలు ఆయన్ను కోరారు. ఈమేరకు జేఏసీ కో-చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు వినతిపత్రం అందజేశారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తమ నిర్ణయం ఉంటుందన్నారు. "అయితే ఒకసారి జై తెలంగాణ అనండి'' అని కోరగా బాబు మౌనంగా ఉండిపోయారు.

అఖిలంలో కాంగ్రెస్‌ను ఓ పట్టు పడదాం



పేద అట్టడుగు వర్గాలకు కల్పిస్తున్న రాయితీలను ఉపసంహరించి బియ్యం, పంచదార వంటి కనీస నిత్యావసరాలను అందకుండా చేసేందుకే కేంద్రం నగదు బదిలీ పథకం పేరుతో కుట్ర పన్నుతోందని, ఈ పథకాన్ని ప్రజలంతా మూకుమ్మడిగా వ్యతిరేకిస్తే అండగా ఉండి పోరాటం చేస్తానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం కరీంనగర్ జిల్లా పెద్దపల్లి శాసనసభా నియోజకవర్గ పరిధిలోని రేగడిమద్దికుంట, గోపరపల్లి, కొలనూరు గ్రామాల్లో ఆయన పాదయాత్ర నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలకు తినేందుకు బియ్యం కావాలి తప్ప, కేంద్రం ఇచ్చే ముష్టి డబ్బులు కాదని అన్నారు. ఈ పథకం పేరు చెప్పి సబ్సిడీలన్నీ ఎత్తివేసేందుకు ప్రభుత్వం వ్యూహరచన చేస్తోందని ఆరోపించారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆడపిల్లలు అర్ధరాత్రి తిరుగకూడదంటూ మాట్లాడడం నీచాతి నీచమని, ఆయనకు కూడా ఆడపిల్లలు ఉన్నారు, అలాగే చేస్తారా? అని ప్రశ్నించారు. దేశ రాజధాని నడిబొడ్డున ఓ ఆడబిడ్డపై అత్యాచారం జరిగిందంటే దేశంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ సంఘటనపై నిరసన వ్యక్తం చేసేందుకు వేలాది యువజనం ఢిల్లీకి వస్తే వారిని సముదాయించాల్సింది పోయి హోం మంత్రి షిండే యువకులను తీవ్రవాదులతో పోల్చడం ఏమిటని? ప్రశ్నించారు. తెలంగాణ పేరుతో కాంగ్రెస్ తెలుగు ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తోందని, ఈ సమస్యను పరిష్కరించాలన్న చిత్తశుద్ధి దానికి ఎంతమాత్రం లేదని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కరీంనగర్ జిల్లాలోని ప్రతీ పల్లెకు తాగునీటి కోసం గోదావరి జలాలు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యేలతో బాబు మంతనాలు
ఈ నెల 28న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలంగాణ అంశంపై అఖిలపక్ష భేటీ నిర్వహించనున్న నేపథ్యంలో టిడిపి వైఖరిని ఖరారు చేసేందుకు చంద్రబాబు ఇరు ప్రాంతాల నేతల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఆయన విడిదిచేసిన రేగడిమద్దికుంట గ్రామంలో తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలతో దాదాపు గంటసేపు సమావేశమయ్యారు. బుధవారం సీమాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఆ తరువాత ఈ నెల 27న పొలిట్‌బ్యూరోలో తెలంగాణపై ఎలాంటి వైఖరిని అనుసరించాలి, ఎవరిని పంపాలన్నదానిపై తుది నిర్ణయం తీసుకుంటారని టిడిపి ముఖ్యనేత ఒకరు వెల్లడించారు. సమావేశం ముగిసిన తరువాత టి-టిడిపి ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ అఖిలపక్ష భేటీలో ఏం చెప్పాలన్నదానిపై బాబు తమ అభిప్రాయం కోరారని, అయితే సీమాంధ్ర ఎమ్మెల్యేలు నాయకులతో మాట్లాడిన తరువాత దీనిపై నిర్ణయం ప్రకటిస్తానని చెప్పినట్లు వెల్లడించారు.

నిత్యావసరాలను అందకుండా చేసేందుకే కేంద్రం నగదు బదిలీ పథకం పేరుతో కుట్ర



ఢిల్లీ గ్యాంగ్ రేప్ ఘటనపై పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. కరీంనగర్ జిల్లాలో 11వ రోజు వస్తున్నా… మీకోసం పాదయాత్రను ఆయన సుల్తానాబాద్ మండలం రేగడిమద్దికుంట వద్ద మంగళవారం ప్రారంభిచారు.

ఈ సందర్భంగా ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. బొత్స సత్యనారాయణవి సిగ్గు లేని మాటలని ఆయన వ్యాఖ్యానించారు. తన కుటుంబ సభ్యులకు ఈ పరిస్థితి తలెత్తితే బొత్స సత్యనారాయణ ఇలాగే వ్యాఖ్యానించేవారా అని ఆయన అడిగారు. కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే వ్యాఖ్యలను కూడా ఆయన తప్పు పట్టారు. విద్యార్థులను తీవ్రవాదులతో పోల్చడం విచారకరమని ఆయన అన్నారు. గ్యాంగ్ రేప్ నిందితులను ఉరి తీయాలని ఆయన వ్యాఖ్యానించారు.

ఆ సంఘటనకు ప్రతి ఒక్కరు అవమానంతో తల దించుకోవాలని ఆయన అన్నారు. కాంగ్రెసు పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డితో ప్రారంభమైన దేవుడ్ని అమ్ముకునే దుష్ట సంప్రదాయం ఇంకా కొనసాగుతోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమ నాయుడు వ్యాఖ్యానించారు. తిరుమల బంగారం శుద్ధిలో 40 శాతం తరుగు చూపిస్తూ దేవుడి సొమ్మును దోచుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ మరో నేత బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి అన్నారు.

శ్రీవారి భక్తులకు కీలకమైన డిసెంబర్ నెలలోనే తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నారని, దీనివల్ల భక్తులకు ఇబ్బంది కలుగుతోందని ఆయన అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలకు అవినీతి మహాసభలని పేరు పెడితే బాగుంటుందని గాలి ముద్దుకృష్ణమ నాయుడు మంగళవారం హైదరాబాదులో మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. మహిళల పట్ల మనసులో ఉన్న దురుద్దేశాన్ని బొత్స సత్యనారాయణ బయటపెట్టి ఆ తర్వాత క్షమాపణ చెప్పారని ఆయన వ్యాఖ్యానించారు. గాంధీ వ్యతిరేక సిద్ధాంతాలు అవలంబిస్తున్న బొత్స వంటి నాయకులకు ఆ పేరు వాడుకునే నైతిక హక్కు లేదని ఆయన అన్నారు.

తన కుటుంబ సభ్యులకు ఈ పరిస్థితి తలెత్తితే బొత్స సత్యనారాయణ ఇలాగే వ్యాఖ్యానించేవారా



సమస్యలు అడిగి.. సమాధానాలిచ్చిన బాబు..

పెద్దపల్లి: వస్తున్నా మీకోసం.. పేరిట టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సోమవారం సుల్తానాబాద్‌లో నిర్వహించిన బహిరంగసభలో ప్రజలు ఎదుర్కొంటు న్న సమస్యలను వారినుంచే రాబట్టి వా టికి తగిన సమాధానాలిచ్చారు. విద్యు త్ సమస్య, అవినీతి, ఎస్సీ వర్గీకరణ, తె లంగాణతోపాటు పలు అంశాలపై సభికుల నుంచి ప్రశ్నలు తెప్పించుకొని వా టికి సమాధానాలిచ్చారు.

కరెంటు సమస్య తొలగించండి..- రాజేశ్వర్‌రెడ్డి, లాలపల్లి

ఎలిగేడు మండలంలో కరెంటు బా ధలు తొలగించండి.. ఏఈని అడిగితే ఏ డీ అంటాడు. ఏడీని అడిగితే డీఈ అం టాడు. దీనికి విముక్తి లేదా.

బాబు: మేం అధికారంలోఉన్నపుడు రైతులకు 9 గంటల కరెంటు ఇవ్వడంతోపాటు మిగులు విద్యుత్‌ను సాధించాం. మీ ఎమ్మెల్యే పోరాటాలతోనే మీకు ఈ మాత్రమైనా కరెంటు వస్తోంది.

వర్గీకరణతో న్యాయం చేయండి- మాతంగి ఓదెలు, ఎమ్మార్పీఎస్ నాయకుడు

వర్గీకరణతో మాదిగలు, ఉపకులాలకు న్యాయం చేయాలి. విద్యా, ఉపాధి అవకాశాలను మెరుగు పర్చి జాతి అభివృద్ధికి కృషి చేయాలి.

బాబు: తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎస్సీ వర్గీకరణ బిల్లులను ఆ మోదించాం. ఈ కారణంగానే వేలాది మంది మాదిగ కులస్తులకు విద్యా, ఉ పాధి అవకాశాలు దక్కాయి.

తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలి..- అశోక్, డిగ్రీ విద్యార్థి, పెద్దపల్లి

తెలంగాణకు టీడీపీ వ్యతిరేకమని ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై పార్టీ పరంగా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి.

బాబు: నేను ఎవరికి వ్యతిరేకం కా దు. తెలంగాణను ఇప్పటివరకు అడ్డుకోలేదు. భవిష్యత్తులో కూడా అడ్డుకోం.

సమస్యలు అడిగి.. సమాధానాలిచ్చిన బాబు..