September 29, 2013

తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కావడమే తుది లక్ష్యమంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి. లోక్‌సభలో జైపాల్ రెడ్డి సమక్షాన ప్రజా సమస్యలపై మాట్లాడి దేశ ప్రజలను మెప్పించడమే తన పంతమన్నారు. పలు అంశాలపై 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే'లో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో తన మనోభావాలను పంచుకున్నారిలా...



తమనుతాము సమర్థించుకోవడానికే. విప్రోలో ఉంటే విప్రో.. ఇన్ఫోసిస్‌లో ఉంటే ఇన్ఫోసిస్ గొప్పదన్నట్లు ఉంది పరిస్థితి. సిద్ధాంతపరమైన రాజకీయాలు తగ్గి, వ్యక్తిగత, ఆర్థిక ప్రయోజనాలు ముందుకొచ్చాయి. పార్టీలు కూడా ఆర్థికంగా బలంగా ఉన్న వారినే ప్రోత్సహించడమూ ఓ కారణం. కాబట్టే ఎదుటి పార్టీల్లో తమను తిట్టేవారిని దగ్గరకు తీస్తే సరిపోతుందని ఆయా పార్టీలు భావిస్తున్నాయి.


బాగానే ఉంది. అయితే, నేనొచ్చిన ఆర్గనైజేషన్, పెరిగిన వాతావరణం ప్రభావం ఉంటుంది కదా. టీఆర్ఎస్‌లో చాలా తక్కువ కాలం కాబట్టి పట్టించుకోనక్కర్లేదు.


నేనెప్పటికీ నో అనలేను. నొప్పించకుండా కాదనేలా తీర్చలేని ప్రతిపాదన చేస్తాను. డబ్బుతో కొనగలుగుతాం అనుకుని వచ్చినవాళ్లకు 'మీరిచ్చే పది, పదిహేను కోట్లు జీవితంలో ఏ మార్పు తీసుకులేవు. ఓ నాలుగైదు వందల కోట్లిస్తే ఆలోచిస్తా అని చెప్పాను. అలాగే వాళ్లు ఊహించనివిధంగా సీఎం పదవి అడిగాను. ఇక వాళ్లేం చెప్పగలరు?


ఇంత డబ్బుపెడితే చాలామందిని తెచ్చుకోవచ్చని వాళ్లనుకుంటారు కదా. అలాగే మనల్ని భరించడం కష్టం. నేను ఇమడటమూ కష్టమే. మేమిద్దరం ఒకరకం వ్యక్తులమే.
ఎమ్మెల్యేలకు ఎంతవరకూ ఆఫర్లుంటాయి?
పది, ఇరవై కోట్లు ఉండవచ్చు. ప్రజలలో నాయకులంటే గౌరవం లేదు. నాయకులకూ ప్రజలపై సరైన అభిప్రాయం లేదు.
తొలిసారి ఎమ్మెల్యేగా ఉన్నారు కదా... ఎలా ఉంది?
రాకముందు రాజకీయాలంటే బాగా మోజు ఉండేది. అసెంబ్లీలో లేచి మాట్లాడితే మన జిల్లా.. మన ప్రాంతం ప్రజలకు ఏదైనా చేయొచ్చు అనుకున్నా. అయితే, ఇప్పుడు ప్రజలు గందరగోళంలో ఉన్నారో.. నేను గందరగోళంలో ఉన్నానో అర్థం కావట్లేదు. ఒక ప్రాంత దుర్మార్గుడైన ఒక అధికారిని చూశాను. అతడు 500కోట్ల నుంచి వెయ్యి కోట్లకు పడగలెత్తి ఉంటాడు. అతడిపై మూడేళ్లు పోరాడాను. రోజూ 30, 40మంది వరకూ మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకూ ఆయన ఇంటి ముందు బారులు తీరేవారు.


ఇపుడు లేదులే.. నిన్నోమొన్నో కొట్టేసినం. నానా తిప్పలు పడి అతడి అవినీతిని బయటపెట్టగలిగాం. నన్ను దారిలోకి తెచ్చుకోవడానికి 20మంది మంత్రులు, 50మంది ఎమ్మెలేల వరకూ ఒత్తిడి తెచ్చారు. అతడిపై సభలో లేవనెత్తడానికి ప్రయత్నిస్తే ఒక ప్రాంత పార్టీ సభను రోజు మొత్తం అడ్డుకుంది. మర్నాటికి పోస్టు చేయించుకున్నా అడ్డుకుంది.
అది టీఆర్ఎస్ పార్టీయే కదా?
నేను దానిగురించి చెప్పను. ప్రతిపక్ష పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి నాలుగేళ్లుగా పోరాడితే చివరకు కోర్టు జోక్యంతోగానీ అతడి అవినీతిని నిలువరించలేకపోయాం.



రాత్రి 2 గంటలకు చేతిలో బీఫారంతో అడ్రసు తెలుసుకుని నియోజకవర్గానికి వెళితే 14 రోజులలో అక్కడి ప్రజలు నన్ను గెలిపించారు. మరి వారికి ఏదో ఒకటి చేయాలన్నది నా ఉద్దేశం. అందుకే అనేక అభివృద్ధి పనులు తెచ్చుకున్నాను. వాటిని రద్దుచేసి వేరే కాంట్ట్రాక్టర్‌కు ఇప్పించాడు. అందుకే ఆ కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టించాను.
ఆ అధికారి శివారెడ్డి అయ్యుంటారు?
నేను పేర్లు చెప్పను.
ఈ ఐదేళ్లలో ఏదైనా సంతృప్తి ఉందా?
నియోజకవర్గం వరకూ చాలా పనులు చేయగలిగాను. వెయ్యి కోట్లు సంపాదించినా రానంత గుర్తింపు సాధించాను. అయితే, రాజకీయాలపై ప్రజలలో ఈసడింపు ధోరణి ఎవరికీ మంచిది కాదన్న బాధ ఉంది. దేశంలో సమూల ఎన్నికల సంస్కరణలు తేవడం తక్షణావసరం. ఒకనాడు హత్యనే పెద్ద నేరంగా భావించి సీఆర్‌పీసీలో ఎక్కువగా దానిపైనే దృష్టి పెట్టారు. ఇప్పుడు వెయ్యి హత్యలకన్నా ఒక అవినీతి పెద్ద ప్రమాదకరమైంది.


చాలా సాదాసీదాగా ఉండేవారికైనా రోజుకు పది వేలు ఉండాల్సిందే. సాధారణంగా అయితే.. నెలకు 10 నుంచి 15 లక్షలు కావాల్సిందే. అంటే ఎన్నికైన తర్వాత నియోజకవర్గంలో సరాసరి రూ.5 కోట్లు ఖర్చు పెట్టాల్సివస్తుంది.
ఇదంతా భరించాలంటే ఎవరైనా దందా చేయాల్సిందేనా?
కచ్చితంగా అలాగే ఉంది. సిద్ధాంతపునాదిగల వాళ్లకైనా విధిలేని పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో నేను కొంచెం సంపాదించుకున్నాను. ప్రస్తుతం అడుక్కునే పరిస్థితో.. బెదిరించుకునే పరిస్థితో రాలేదు. తొందర్లోనే నాకు అలాంటి పరిస్థితి తప్పదనిపిస్తోంది.
ఈ క్రమంలోనే రేవంత్‌పైనా ఆరోపణలు వచ్చాయి కదా?
నా దగ్గరికి చాలా మంది వస్తుంటారు. వారి పనులు చేసిపెట్టే క్రమంలో ఆరోపణలు తప్పట్లేదు. అమెరికాలో ఉండే ఎవరిదో భూమిని కబ్జాపెడితే సాయం చేయాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు కోరారు. బాధితుల పక్షాన వెళ్లి ప్రయత్నిస్తే ఇలా ఆరోపించారు.


ఇప్పుడు చెప్పిన స్థల వివాదంలోనే వారి విషయం ముందుకొచ్చింది. ఆ స్థలం కోసం భానుకిరణ్ తదితరులతో పోరాడాను. ఆ క్రమంలోనే భాను, మంగలి కృష్ణలతో మాట్లాడింది నిజమే. ఇదంతా జరిగింది 2005-06లో. అప్పట్లో వాళ్లెవరో కూడా లోకానికి తెలియదు. ఇప్పుడు నేను ఏ పార్టీనైతే నేను తిడుతున్నానో వాళ్లే నాపై తప్పుడు ముద్ర వేయడానికి వాళ్ల పత్రికలోనే రాసుకుని ఆరోపణలు చేశారు. అమెరికాలోనివారిని నాపై ఫిర్యాదుకు ఒత్తిడి తెచ్చారు. అయితే, సాయం చేసింది నేనేనని వాళ్లకి తెలియదు. ఆ విషయమే వాళ్లు చెప్పారు. దీనిపై రెండు పార్టీల మీడియాలో రాద్ధాంతం చేశారు.

రాజకీయ ప్రవేశం ఎలా...
మొదట ఏబీవీపీ.. తర్వాత ఆర్ఎస్ఎస్‌లో ఫుల్‌టైం పనిచేశాను. ఆ తర్వాత కొన్నాళ్లు వ్యాపారం. అప్పట్లో కిషన్‌రెడ్డికున్న సన్నిహితులలో నేనూ ఒకడినని అనుకునే వాడిని.
బీజేపీకి ఎందుకు దూరమయ్యారు?
అప్పట్లో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుందనే ఆర్ఎస్ఎస్‌ని వదిలేశాను. పార్టీ సొంతంగా నిలదొక్కుక్కోవాలి.. రాష్ట్రాన్ని బీజేపీ పాలించాలి అన్న ఆలోచనతో ఉన్న నాకు అనవసరంగా పార్టీని టీడీపీకి అప్పజెప్పారన్న కోపం వచ్చింది. అయితే, ఆ తర్వా త అటూఇటూ తిరిగి చివరకు వద్దనుకున్న టీడీపీలోనే కీలకం కావాల్సి వచ్చింది.


తెలంగాణపై హరీశ్, నేనూ బాగా దగ్గరగా ఉండేవాళ్లం. 2003లో కల్వకుర్తిలో పార్టీకి ఎవరూ లేరని ప్రత్యక్షంగా టీఆర్ఎస్‌లోకి రావాలని కోరారు. అప్పట్లో పాలమూరు గర్జన అని పెట్టాం. అదే నా రాజకీయ ప్రవేశం అనుకోండి. అప్పట్లో టికెట్ వచ్చేస్తుందనుకోగా కాంగ్రెస్‌కు చెందిన ఢిల్లీలోని కీలక నాయకుడు టీడీపీలోని తన సన్నిహితుడిని గెలిపించుకోవడానికి ఆ సీటును కాంగ్రెస్‌కు తీసుకుని టీఆర్ఎస్‌కి వేరే సీటు ఇచ్చేలా ఒత్తిడి చేసి విజయం సాధించారు. ఇక్కడ ఒక విషయం నిజం. కేసీఆర్ మీద భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. నా విషయంలో మాత్రం ఆయన నాకు ఆ సీటు ఇవ్వడానికే పట్టుబట్టారు. కానీ, జరగలేదు. 2006 జడ్పీ ఎన్నికలలో చైర్మన్‌గా నా పేరును ప్రకటించారు. కానీ ఏం జరిగిందో కానీ, అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలలో సగం స్థానాలు పొత్తులో తీసుకుని 64 జెడ్‌పీటీసీలలో రెండు స్థానాలు మాత్రమే టీఆర్ఎస్‌కు తీసుకున్నారు. ఆ రెండింటిలో కూడా నాకు ఇవ్వాల్సిన స్థానం లేదు. దాంతో నాకు కోపం వచ్చింది.


జడ్పీటీసీ ఎన్నికలప్పుడు కూడా నన్ను అవమానించారు. దాంతో పార్టీలను పక్కనబెట్టి స్వతంత్రంగా ముందుకు రావాలనుకున్నా. ప్రజలలో నేనేంటో తెలుసుకోవాలనుకుని నామినేషన్ వేసి కాంగ్రెస్ మినహా అన్ని పార్టీల అభ్యర్థులను ఉపసంహరింపజేశాను. ఎన్నికలలో నేను, కాంగ్రెస్ అభ్యర్థి మాత్రమే బరిలో ఉండేలా చూసుకున్నా. ఆ ఎన్నికలలో అన్ని పార్టీల జెండాలు కప్పుకొని ప్రచారం చేసింది నేనొక్కడినే. అప్పుడు జడ్పీటీసీగా గెలిచాను. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా స్వతంత్రంగా పోటీ చేయాలనుకున్నా. అప్పుడు కూడా అలాగే, చంద్రబాబుతో మాట్లాడి కాంగ్రెస్‌కు ఏకగ్రీవంగా అవుతుందనుకున్న స్థానంలో పోటీకి దిగాను. ఆ ఎన్నికలలో గెలిస్తే పార్టీలోకి వస్తానని చంద్రబాబుకు చెప్పాను. అప్పుడు 18 ఓట్లతో గెలిచాను. ఆ వెంటనే తమ పార్టీలోకి రావాలంటూ నాకు చాలా పెద్దపెద్ద వాళ్లు ఫోన్ చేశారు. అయితే, నేరుగా చంద్రబాబు దగ్గరకు వెళ్లి పార్టీలో చేరాను. 2007లో వైఎస్ హవా చాలా ఎక్కువగా ఉండేది. అప్పట్లో టీడీపీలో ముఖ్యులు కూడా ఎందుకు ఈ పార్టీలోకి రావడం అని అడిగారు.


వాజ్‌పేయి తదితర నేతలను చూశాక.. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నతమైన పార్లమెంట్‌లో దేశ సమస్యలపై మాట్లాడి జనంతో వీడురా నాయకుడు అని అనిపించుకోవాలని కోరిక. అలాగే, 'మీకెందుకురా రాజకీయాలు' అని అన్న ఓ నాయకుడు ఉన్న సభలో నేను మాట్లాడాలని నా పంతం. ఈ సారి మాత్రం పార్లమెంట్‌కు వెళ్లాలి అన్నది నా కోరిక. తర్వాత అయితే, ఆ నాయకుడు పోటీ చేస్తారో చేయరో తెలియదు కదా. గతంలోనే చేద్దామనుకున్నా అయితే కుదరలేదు.
జైపాల్ రెడ్డితో మీ తగదా ఏమిటీ? ప్రేమ పెళ్లి విషయంలోనా?
అదేం కాదు. ఆ విషయంలో ఆయనకు ఏ ప్రమేయం లేదు. ఆర్థికంగా బాగా ఉన్నతమైన కుటుంబం కాబట్టి పెళ్లి విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి.


జానారెడ్డిని ఎవరితోనూ పోల్చలేను. నాయకుడిగా ఆయన ఎవరికి ఎలా కనిపించినా వ్యక్తిగా మంచివాడు. ఎవరైనా ఏదైనా సమస్యతో వెళితే ముందు కూర్చోబెట్టి సావధానంగా వింటారు. అలాగే, ఆయనతో దగ్గరి బంధుత్వం ఉంది. జానారెడ్డి, సబిత అక్క పిల్లలతో నాకు బాగా సాన్నిహిత్యం ఉంది. అందుకే వారి విషయంలో చర్చ జరిగే సందర్భాలలో నేను అక్కడ ఉండను అన్న విషయాన్ని మా నాయకుడికి కూడా చెప్పాను.


యూపీలో అయోధ్య అంశం ఉన్నంత కాలం బీజేపీని ఎవరూ టచ్ కూడా చేసేవాళ్లు కాదు. అక్కడున్న మసీదును కూల్చివేసిన తర్వాత ఆ పరిస్థితి లేదు. అక్కడ బీజేపీ కోలుకోలేనంత దెబ్బతింది. అలాగే, రాష్ట్రంలో తెలంగాణ సమస్య పరిష్కారం అయిపోతే ఆ తర్వాత ఏమీ ఉండదు. దానికోసం పోరాడే వారికి ఏమీ ఉండదు. టీడీపీ అనేది ఒక కాలేజీ. ఫైనలియర్ వాళ్లు వెళితే కొత్తగా వచ్చే వాళ్లు వస్తుంటారు. ప్రస్తుత భావోద్వేగాల పరిస్థితి తొలగిపోతే టీడీపీ మళ్లీ కచ్చితంగా పుంజుకుంటుంది.

చంద్రబాబు వద్దనుకున్నా కూడా ఈ పార్టీ బలపడుతుంది. అదైతే నిజం. అన్ని వర్గాల ప్రజలకు ఈ పార్టీ ఒక వేదికగా ఉండడమే కారణం. ఆ వేదిక అవసరం చాలా ఉంది. ఎంతోమంది మహామహులతో పోరాడిన చంద్రబాబు ఒకవేళ అలసిపోయినా ఆ పార్టీ మాత్రం కొనసాగాల్సిన ఆవశ్యకత ఉంది. అన్ని వర్గాల నుంచి నేతలను తీసుకొచ్చిన ఘనత టీడీపీదే.


దేశంలోని పరిస్థితుల రీత్యా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, బీజేపీ సహా అందరూ ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది. కమ్యూనల్ ఎజెండా ఉందనుకుంటే దాన్ని పక్కనపెట్టి కామన్ మినిమమ్ కార్యక్రమం రాసుకుని దగ్గర కావాల్సిన ఆవశ్యకత నెలకొంది. పాకిస్థాన్ ఉగ్రవాదం.. చైనా రెచ్చగొట్టే చర్యలను చూస్తూ ఊరుకున్న బలహీనమైన నాయకత్వం దేశంలో ఉన్న నేపథ్యంలో ఇంకా సిద్ధాంతాలు పట్టుకుని వేళ్లాడితే జాతికి నష్టం చేసినట్లే. కాబట్టి లెఫ్ట్, రైట్ ఒక్కటి కావాల్సిందే. దీనిపై ఒక చర్చకు తెర లేవాలన్న ఉద్దేశంతో నేను ఈ విషయాన్ని ముందుకు తెస్తున్నా. రేపు మా పిల్లలు గౌరవించేది మేం చేసిన పనులన బట్టే. అందుకే ఈ దేశానికి ఏదైనా చేయాలన్న తపనతోనే మాట్లాడుతున్నా. ఒక పౌరుడిగా ఈ దేశానికి ఒక బలమైన నాయకత్వం.. సామాన్య ప్రజలకు విశ్వాసం కల్పించేలా చూడాలని కోరుతున్నా.



కచ్చితంగా. ఆ కోరిక లేదని నేను చెప్పను. తెలంగాణ వచ్చాక ఆ పదవిని చేపట్టాలని ఎందుకుండదు. ఏ రాజకీయ నాయకుడైనా అనుకుంటారు. అలాగే నేనూ.
 

'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే'లో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి

September 28, 2013




  కేసీఆర్, జగన్ కాం గ్రెస్ అధినేత్రి సోనియా విసిరిన బాణాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆమె నివాసంలో తయారుచేసి పంపిన స్క్రిప్టును వారిక్కడ చదువుతున్నారని దుయ్యబట్టారు. శనివారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ... ఇక ముఖ్యమంత్రి కిరణ్ ఎవరు విసిరిన బాణమో చూడాల్సి ఉందన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్‌తో, సీమాంధ్రలో వైసీపీతో లాలూచీపడి నాలుగు సీట్లు గెలుచుకోవాలని, టీడీపీని దెబ్బ తీయాలని కాంగ్రెస్ కక్కుర్తి పడుతోందన్నారు. ఇటీవలి రాష్ట్ర పరిణామాలన్నీ అడుగడుగునా కుట్రలు, మ్యాచ్ ఫిక్సింగులేనని, వీటన్నింటికీ కేంద్ర బిందువు సోనియాగాంధీ యేనని విమర్శించారు. చీకటి ఒప్పందాలు, తెరచాటు కుట్రలతో తమను బలిపశువులు చేశారని ఆ పార్టీ నేతలే వాపోతున్నారని చెప్పారు. 'సొంత పార్టీ పోయినా నాలుగు సీట్లు వచ్చి మళ్లీ అధికారం దక్కితే చాలని భావించే మహా నాయకురాలిని ఇప్పుడే చూస్తున్నాం' అని ధ్వజమెత్తారు.

తమ పార్టీ ఇటువంటి కుట్రలను చేధించేందుకు ఎన్టీఆర్ విసిరిన రామబాణమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనపై తమ వైఖరి స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. 'రెండు ప్రాంతాల నాయకులతో ఢిల్లీవెళ్లి మూడు రోజులు అందరితో మాట్లాడాను. వారిని మేనేజ్ చేయడం కాకుండా ఇరుపక్కలా ఉన్న జేఏసీలు, విద్యార్థులు, ప్రభావిత వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడి, సమస్యలేమిటో తెలుసుకొని పరిష్కరించమని చెప్పా. ఇదే మా వైఖరి. ఇది సున్నితమైన సమస్య అనే సంగతి మరచి, రాజకీయ లబ్ధికోసం జటిలం చేయడం వల్లే రాష్ట్రం తగలబడుతోంది' అని వ్యాఖ్యానించా రు. సమస్యల గురించి ఇప్పుడు మాట్లాడుతు న్న సీఎం, ముందుగా తమ అధిష్ఠానంవద్ద ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. '60 రోజుల తర్వాత లేచి వచ్చి మాట్లాడుతున్నారు.

ఇన్ని రోజులూ ఏం చేశారు? ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడేందుకు కనీసం పార్టీ నాయకత్వాన్ని ఒప్పించలేకపోయారే? పార్టీలో మీ పలుకుబడి ఇదేనా? సీఎంగా చేయాల్సిన సమయంలో చేయకుండా ఇప్పుడు మాట్లాడితే ఉపయోగం ఏమిటి? సీడబ్ల్యూసీ తీర్మానానికి ముందు సీఎం, డిప్యూటీ సీఎం, పిీసీసీ అధ్యక్షులను నాలుగైదుసార్లు పిలిపించి మాట్లాడారు. అప్పుడే ఇవన్నీ ఎందుకు చెప్పలేదు? చెప్పినా వినకపోతే అప్పుడే బయటకొచ్చి చెప్పాల్సింది. ఆ రోజు సహకరిస్తామని చెప్పి, ఇప్పుడు ఇక్కడ సమైక్యాంధ్ర అంటూ మాట్లాడుతున్నారు. ఇతర పార్టీలతో మ్యాచ్ ఫిక్సింగులు చేసుకొని పార్టీ అధిష్ఠానమే కుట్రలకు పాల్పడుతోందని స్వయంగా కాంగ్రెస్ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ఆ కుట్రలు మీకు తెలియదా? తెలిసీ చెప్పడం లేదా? ఢిల్లీలో జరిగిన జాతీయ సమగ్రత మండలి సమావేశంలో నేను రాష్ట్రంలో పరిస్థితులు వివరిస్తుంటే మైక్ కట్ చేశారు.

నిరసనగా వాకౌట్ చేశాను. అదే వేదికపై ఉన్న ముఖ్యమంత్రి కనీసం నోరు తెరిచారా? రాష్ట్రంలో అంతా బాగుందని చెప్పి వచ్చారు. ఢిల్లీలో సోనియా ముందు మాట్లాడటానికి భయం. ఇక్కడికి వచ్చి లీకులు. నేను సీనియర్ రాజకీయవేత్తగా చేయాల్సింది చిత్తశుద్ధితో చేస్తున్నాను. జాక్‌పాట్‌తో సీఎం పోస్టులోకి వచ్చిన వారు కూడా నా గురించి మాట్లాడితే ఎలా? మేం ఏనాడూ అధికారం కోసం లేం. మేం ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం సిన్సియర్‌గా చేశాం. ప్రజల్లో మా పట్ల ఉన్న మంచిని పోగొట్టడానికే కాంగ్రెస్, టీఆర్ఎస్, వైసీపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయి' అని విమర్శించారు. కిరణ్ తానే మాట్లాడుతున్నారా లేక ఢిల్లీ పెద్దలు మాట్లాడిస్తున్నారా అన్నది తనకు తెలియదని ఈ సమయంలో ఏదైనా జరగవచ్చని ఒక ప్రశ్నకు జవాబిచ్చారు.

అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎంత చిచ్చుకైనా, ఎవరితో చేతులు కలపడానికైనా వెనకాడటం లేదని, ఆ పార్టీని ఇంటికి పంపితేనే దేశం బాగుపడుతుందన్నారు. ఇందుకోసం తాను జాతీయ స్థాయిలో ఎవరెవరిని కలుపుకుంటానో ఇప్పుడే చెప్పలేన న్నారు. బీజేపీతో పొత్తుపై సమాధానం దాటవేశారు. దేశం ఇప్పుడు సంక్షోభంలో చిక్కుకొందని, దానికి కారణమైన కాంగ్రెస్ ఓటమికోసం అన్ని పార్టీలతో మాట్లాడతానని చెప్పారు. అక్టోబర్ 4 నుంచి మళ్లీ జిల్లాల పర్యటనకు వెళ్తున్నానని బాబు తెలిపారు.

'సీమాంధ్రలో కాంగ్రెస్ ప్రజాగ్రహంలో కొట్టుకుపోయింది. ఆ పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్‌ద్వారా బెయిలుపై వచ్చిన జగన్ కూడా విలువ కోల్పోయాడు. ప్రజల విశ్వాసం మనవైపే ఉంది. మీరు ప్రజల్లో ఉండి, బాగా పనిచేయండి. వారి నమ్మకాన్ని నిల బెట్టుకుందాం' అని చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. శనివారం ఆయన తన నివాసంలో ఉభయ గోదావరి జిల్లాల పార్టీ నేతలతో మాట్లాడారు.

ఆ కుట్రలు మీకు తెలియదా? తెలిసీ చెప్పడం లేదా?


విభజనపై సీడబ్ల్యూసీ తీర్మానాన్ని బహిరంగంగా ధిక్కరిస్తున్నా కాంగ్రెస్ అధిష్ఠానం సీఎం కిరణ్‌పై ఎందుకు మౌనం వహిస్తోందని టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు ప్రశ్నించారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. 'కాంగ్రెస్ గేమ్ ప్లాన్‌లో భాగంగానే తెలంగాణ తామే ఇస్తున్నట్లు ఇక్కడ ప్రచారం చేస్తూ తామే అడ్డుకుంటున్నట్లు సీమాంధ్రలో ప్రజలను నమ్మించేందుకు యత్నిస్తున్నారు' అని విమర్శించారు. 'సీఎం ప్రజలను రెచ్చగొడుతున్నారు. తప్పుడు లెక్కలు చెబుతున్న ఆయనపై చీటింగ్ కేసుపెట్టి అరెస్టు చేయాలి. ఆయన చెప్పే అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఒక చేతిలో జగన్‌ను... మరో చేతిలో కిరణ్‌ను పెట్టుకొని ఆటాడిస్తోందని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ ఒక చేతిలో జగన్‌ను... మరో చేతిలో కిరణ్‌ను పెట్టుకొని ఆటాడిస్తోంది........

చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ దిశగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పయనిస్తోందని మైలవరం ఎమ్మెల్యే, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఎంపీ కొనకళ్ళ నారాయణరావు కార్యాలయంలో శనివారం టీడీపీ జిల్లా సమావేశం జరిగింది.


ఈ సమావేశంలో దేవినేని ఉమా మాట్లాడుతూ, చిరంజీవి మాదిరిగానే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి దాసోహం అయ్యారన్నారు. ఫలితంగానే ఆయనకు బెయిలొచ్చిందని లోకం కోడై కూస్తోందన్నారు. సామాజిక న్యాయం అంటూ రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసినట్టే సమైక్య సంగతులు చెబుతున్న జగన్ పార్టీ కాంగ్రెస్ లో కలసి పోవడం ఖాయమన్నారు.

చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ దిశగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పయనిస్తోంది............

దేశంలో జరుగుతున్న ప్రతి దుష్పరిణామానికీ ప్రధాని మన్‌మోహన్, యూపీఏ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధిలే బాధ్యులు అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు, ప్రధానమంత్రి డాక్టర్ మన్‌మోహన్ సింగ్‌కు ఇక ఎంత మాత్రం పదవిలో కొనసాగరాదనితీవ్రంగా విమర్శించారు. ఆయన ఇక పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతే మంచిది అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆర్థిక నేరస్తులను కట్టడి చేయకపోతే దేశం ఎంతో నష్టపోతుందని ఆయన హెచ్చరించారు.
లక్ష కోట్లు తిన్న వ్యక్తికి జైలులో సకల మర్యాదలు చేశారని చంద్రబాబు ఆక్షేపించారు. జగన్‌ను విడిపించడంలో కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ లేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రత్యర్థులపై సీబీఐని ప్రయోగించి బెదిరిస్తారని, తర్వాత వారి పబ్బం గడుపుకుంటారని ఆయన నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంటే అసలు పట్టించుకోవడం లేదని ఆయన ఆక్షేపించారు. ఆఖరికి కాంగ్రెస్ నాయకులే తమ అగ్ర నాయకత్వం జగన్‌తో ఒప్పందం కుదుర్చుకుందని వారే చెబుతున్నారని ఆయన అన్నారు.
నేషనల్ ఇంటెగ్రేషన్ సమావేశంలో నేను రాష్ట్ర సమస్యను ప్రస్తావిస్తే కాంగ్రెస్ గాని, ముఖ్యమంత్రి గాని ఆ రోజున తమను మాట్లాడనివ్వలేదని, ఆరోజున మాట్లాడింది సొంత సమస్య కాదని ఆయన చెప్పారు. ఆ రోజున తాను మాట్లాడింది ముఖ్యమైన విషయం కాదా అని ఆయన ప్రశ్నించారు. అప్పుడు తాను మాట్లాడితే మాట్లాడనివ్వలేదు, ఇప్పుడు ముఖ్యమంత్రి తానే గుర్తించినట్టు మాట్లాడుతూన్నారని ఆయన దుయ్యబట్టారు.
దేశంలో అన్ని రాజ్యాంగ వ్యవస్థలనూ అన్ని విధాలా నిర్వీర్యం చేస్తున్నారు అని ఆయన విరుచుకుపడ్డారు. దేశంలో పెరిగిపోతున్న అవినీతిపై గొంతెత్తిన ప్రజలను సర్వ శక్తులు ఒడ్డి ఆ ఉద్యమాన్ని నీరుగార్చారంటూ అన్నా హజారే విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నేర చరితుల విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా, దానికి తూట్లు పొడిచేందుకు యత్నిస్తున్నారు. అవినీతిపరులను, నేరచరితులను కాపాడడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా మునిగిపోయింది. గనులు, మద్యం అన్నీ మాఫియాగా తయారైపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఉంటే ఈరోజున సీబీఐని కూడా పాడుచేశారు. సీబీఐని కూడా ప్రక్షాళన చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. ఆకస్మికంగా నిద్ర లేచి, అటువంటిది రాహుల్ ఇప్పుడే జ్ఞానోదయం అయినట్టు మాట్లాడడం విచిత్రంగా ఉందని ఆయన అన్నారు. రూపాయి విలువ పడిపోయింది, ధరలు పడిపోయాయి, ఉపాధి అవకాశాలు పడిపోయాయి. ఈ మొత్తానికి ప్రధాని మన్‌మోహన్ సింగ్, యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధిదే బాధ్యత అని ఆయన మండిపడ్డారు. ఆ రోజున సోనియా చెబితే చేశారు, ఇప్పుడు రాహుల్ ఒక మాట మాట్లాడితే ఇండియాకు వచ్చాక మాట్లాడతాను అంటున్నారు. అసలు ఏం ప్రధాని మీరు ? మీకు ఆ పదవిలో ఉండడానికి అర్హత ఉందా అని ఆయన చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
నేర చరిత్ర గలవారిని కాపాడడంకోసం చేసిన ఆర్డినెన్స్‌ను ఇప్పుడు రాహుల్ ఆక్షేపించడాన్ని ఆయన ఆక్షేపించారు. నేర చరితులు ఎవరైనా సరే పోటీ చేయడానికి వీలులేదని మేము స్పష్టం చేశాం. నేను చాలా రోజుల నుంచి ఈ విషయమే చెబుతున్నాను, అయినా
పార్లమెంటులో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అందరూ వ్యతిరేకించిన తర్వాత ఆర్డినెన్స్ తీసుకువచ్చారు. ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చారని అడుగుతున్నా. రాహుల్ గాంధి ఇన్నాళ్లు ఎందుకు పట్టించుకోలేదు? ఎక్కడ నిద్ర పోతున్నారు? ఈ బిల్లుపై ఇంత చర్చ జరుగుతున్నప్పుడు రాహుల్ ఏం చేస్తున్నారు? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు వచ్చి బిల్లును చింపేయాలని ఆయన అంటున్నాడేమిటని ఆయన ఆక్షేపించారు. మీ వల్ల దేశం మొత్తం భ్రష్టు పట్టించారు, సర్వనాశనం అయిపోయింది. నేరస్థులు జైలులో ఉంటే వారు కూడా పోటీ చేసి చట్ట సభలలోకి వచ్చేటట్టు మీరు చేస్తున్నారు. ఒకటి రెండు కాదు, 15 లక్షల కోట్ల కుంభకోణం దేశంలో జరిగింది. కోల్ గేట్, 2 జి స్పెక్ట్రమ్, రాష్ట్రంలో వైఎస్సార్ చేసిన కుంభకోణం. వీటన్నిటిపైనా రాహుల్ ఎప్పుడైనా మాట్లాడారాఇన్నాళ్లుగా మాఫియాలు దోచుకుంటుంటే ఈయన ఏం చేస్తున్నాడు? ఇలాగే రాబర్ట్ వాధ్రా చేసిన కుంభకోణాలు... దాదాపు 11 వేల కోట్ల రూపాయల విలువైన కుంభకోణాలు జరిగినట్టు ఆయనమీద ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వాన్ని ఉపయోగించుకుని ఇన్ని రకాల కుంభకోణాలు చేస్తుంటే రాహుల్ ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు.
నెగటివ్ వోటు పెట్టమని సుప్రీం కోర్టు చెప్పింది. ఇష్టం లేని అభ్యర్థులను ప్రజలు త్రోసిపుచ్చే అవకాశం ఇప్పుడు వచ్చింది. సమాజంలో మాఫియాలు తయారయ్యాయి. ఆర్థిక సంస్కరణలు వచ్చాక పెద్ద ఎత్తున డబ్బు వస్తోంది. దీన్ని అరికట్టాలి. మీరు సుప్రీం కోర్టు తీర్పును గౌరవించి చట్టసభలను బలోపేతం చేయవలసింది పోయి దానికి తూట్ల పొడుస్తున్నారని ఆయన విమర్శించారు.

అసలు ఏం ప్రధాని మీరు ? మీకు ఆ పదవిలో ఉండడానికి అర్హత ఉందా?

సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపించే కాంగ్రెస్సే అని, సీఎం కిరణ్‌ను హైకమాండ్ నడిపిస్తోందని తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఇరుప్రాంతాలను రెచ్చగొట్టే విధంగా కిరణ్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం కిరణ్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని, ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి సీఎంపై కేసు పెట్టి అరెస్ట్ చేయాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.


తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేశారని ఆరోపించారు. అబద్దాలు మాట్లాడి సీమాంధ్రుల మెప్పుపొంది సమైక్యాంధ్ర హీరో కావాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఆనాడు రోశయ్యతో ఈనాడు కిరణ్‌తో కాంగ్రెస్ డ్రామాలాడిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ది ఉంటే సీఎం కిరణ్, బొత్సలను బహిష్కరించాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.

అబద్దాలు మాట్లాడి సీమాంధ్రుల మెప్పుపొంది సమైక్యాంధ్ర హీరో కావాలనుకుంటున్నారా ..........

September 27, 2013

జగన్ పర్యటనల గురించి వైసీపీ ముందే ప్రకటనలు చేస్తోందని, దీన్ని బట్టి చూస్తే హైదరాబాద్ వదిలి వెళ్లరాదన్న నిబంధనలను కోర్టు సడలిస్తుందని వైసీపీకి ముందే తెలుసా అని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. విభజన తీర్మానం ఆమోదం పొందడం కోసమే వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని ఆయన ఆరోపించారు. విభజనకు సహకరిస్తున్న జగన్ పార్టీలో కాంగ్రెస్ నేతలు ఎలా చేరతారని యనమల ప్రశ్నించారు.


జగన్ విభజనకు ఒప్పుకున్నందునే హైకమాండ్ కేబినేట్‌నోట్‌ను వేగవంతం చేసిందన్నారు. పొత్తుల గురించి ప్రస్తుతం టీడీపీ ఆలోచించడంలేదని, తెలుగు జాతి మధ్య ఏర్పడ్డ సమస్యను ఎలా పరిష్కరించాలన్నదే తమ ఎజెండా అని ఆయన తెలిపారు. వ్యతిరేక ఓటు విధానం ఉండాలన్న సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామని, ఈ మేరకు చట్టాలలో సవరణ చేయాలని యనమల కోరారు.

హైదరాబాద్ వదిలి వెళ్లరాదన్న నిబంధనలను కోర్టు సడలిస్తుందని వైసీపీకి ముందే తెలుసా......?

వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు ఆమోదించుకునేవాళ్లని అయితే రాజీనామాలపై ఏబీఎన్‌లో వచ్చిన కథనంతో వైసీపీ తోకముడించదని టీడీపీ నేత దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏబీఎన్ -ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ తెలుగు జాతిని చీల్చడానికి కాంగ్రెస్ పెద్దలు ఎవరు అని ఆయన ప్రశ్నించారు.


దొంగలంతా కలిసి రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని, కాంగ్రెస్ ఎంపీలు చవట దద్దమ్మలని దేవినేని మండిపడ్డారు. కాంట్రాక్టులకు ఆశపడి సోనియాకు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. సీమాంధ్ర నేతలు చేతులు కాలాక ఇవాళ ఏడిస్తే ఏం లాభమని దేవినేని ఎద్దేవా చేశారు.

కాంట్రాక్టులకు ఆశపడి సోనియాకు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు.

September 26, 2013

అతిభయంకర ఆర్థిక చోర బిరుదాంకిత యైన వైఎస్‌ జగన్‌ నటించిన జగన్‌ (అత్తారింటికి) జైలుకు దారేది సినిమా, విభజించి పాలిం చుటలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన సోనియా గాంధీ దర్శకత్వంలో, ఈ సినిమా నిర్మాణం చేసుకొని, నేడే విడుదల అయ్యిందని, ప్రతిఒక్కరూ ఈ సిమాను చూడాలని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి

గురువారం ఎన్టీర్‌ భవన్‌లో పత్రికా ప్రతినిధులతో రామయ్య మాట్లాడుతూ అత్తారింటికి (జైల్‌కు)దారేది సినిమా బాగా ఆడుతుందని భావించినా పైరసీ దెబ్బతో ప్లాఫ్‌ అయి, డీలా పడ్డాడని తెలిపారు. ఇక నుంచి సోనియా డైరెక్షన్‌ లేకుండా జగన్‌ యాక్షన్‌ చేయగలనని ధైర్యంగా చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. కడప, ఢిల్లీకి మధ్య, ఇడుపులపాయకు, 10జన్‌పథ్‌కు మధ్య, సోనియాకు, జగన్‌కు మధ్య పోటీ అని వైకాపా నేతలు, విజయమ్మ చెప్పగలరా అని ప్రశ్నించారు.
బుధవారం రాత్రి వరకు తమ రాజీనామాను గురువారం ఆమోదించుకుంటామని చెప్పిన వైకాపా, తెల్లవారే సరికి ప్లేట్‌ ఫిరాయించారని, సోనియా సూచనల మేరకు శాసన సభను సమావేశ పరచమని వైకాపా నేతలు కోరుతున్నారని తెలిపారు.సోనియా ఆడుతున్న నాటకంలో జగన్‌, వైకాపాలు పాత్రదారులని తెలిపారు. సోనియా చేతిలో జగన్‌ భవిష్యత్‌ ఉందన్నారు.అందుకే సోనియా చెప్పినట్లు జగన్‌ నడవాల్సిందేనన్నారు.

ఈ విషయాన్ని రాష్ర్ట ప్రజలు అర్ధం చేసుకున్నారని రామయ్య తెలిపారు. రాష్ట్రంలో 13 జిల్లాలకే పరిమితమైన జగన్‌ సమైక్య వాదినని ఎలా చెప్పగలడన్నారు. విభజనకు బాటలు వేసిందే వైకాపా వారని, ఇప్పుడు సమైఖ్యమని డ్రామాలు ఆడుతున్నారన్నారు. సీమాంధ్ర ఉద్యోగుల నేత అశోక్‌ బాబుకు కోపం వస్తుందన్న భయంతో జగన్‌ సమైక్య బాట పట్టారని విమర్శించారు. రాజినామాలు ఇచ్చిన మీరు, అసెంబ్లీని సమావేశ పరచమని ఏ ముఖ్యం పెట్టుకొని అడుగుతారని ఆయన ప్రశ్నించారు. సోనియా డైరెక్షన్‌ ప్రకారమే అసెంబ్లీలో తీర్మానం పెట్టమని అడుగుతున్నారని తెలిపారు.అసెంబ్లీలో ఏ తీర్మానం జరిగినా రాష్ట్ర విభజన ఖాయమని కాంగ్రెస్‌ పెద్దలు చెపుతున్నారని రామయ్య తెలిపారు.ఇలాంటి సమయంలో అసెంబ్లీని సమావేశ పరచాలని జగన్‌ సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నాడని తెలిపారు.సోనియాకు పెద్దకొడుకు కెసిఆర్‌, చిన్నకొడుకు జగన్‌ అని, కాంగ్రెస్‌ రాష్ట్రంలో బ్రతికి బట్టకట్టదని తెలసుకున్న సోనియా కెసిఆర్‌, జగన్‌లతో క్విడ్‌ప్రోకోకు పాల్పడుతుందన్నారు.

తెలుగు దేశం బలపడితే తన ఆటలు సాగవని సోనియా ఈ కుట్రలకు పాల్పడుతుందని తెలిపారు.తనను ఆదు కుంటాడనే సోనియా జగన్‌ను బైటకు తీసుకు వచ్చిం దన్నారు.జగన్‌ బైటకు రావటంలో కోర్టులది తప్పులేదని, సీబీఐ వ్యవహారంపై అనుమానాలు ఉన్నాయన్నారు. జగన్‌ బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ ఏమాత్రం కోర్టును అడగలేదన్నారు.సీబీఐ తన స్థాయిన దిగజార్చుకుందని రామయ్య తెలిపారు.గతంలో జగన్‌ అ్ర మాస్తులు కేసులో సూట్‌కేసు కంపెనీలు ఉన్నాయని చెప్పిన మీరు, ఆ కంపెనీ సూట్‌కేసులను 10జన్‌పథ్‌కు, లోటాస్‌ పాండ్‌కు పింపించారా అని రామయ్య ప్రశ్నించారు.

రాజ్యాంగం, చట్టం,న్యాయం ప్రకారం సీబీఐ దర్యాప్తు చేయలేదన్నారు.వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, జగన్‌లు లగ్జంబర్గ్‌లో నెలకొల్పిన ఏషియా ఇన్‌ఫ్రాస్ట్రక్షన్‌,సికార్‌ సంస్థ కోటి రూపాయలతో ప్రారంభించి, 5 సంవత్స రాలలో వెయ్యి కోట్లు రూపాయలు ఎలా సంపాదించారో తెలపాలన్నారు.సీబీఐ దర్యాప్తు కోరిన వెంటనే ఆ కంపెనీని మూసివేశారని తెలిపారు. మారిషన్‌లోని 2కంపెనీ క్యాపిటల్‌ ప్లూరీ ఎమర్జింగ్‌ కంపెనీల నుండి నేరుగా 1246 కోట్లు జగన్‌ కంపెనీలోకి వచ్చాయన్నారు.ఇలాంటి కంపెనీల మీద సీబీఐ దర్యాప్తు చేయాల్సిన బాధ్యత లేదా అని రామయ్య ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో కిరణ్‌ అసమర్ధ పాలన మూలంగా ప్రజలు అనేక ఇబ్బందుల పడుతున్నారని తెలిపారు.
వర్ల రామయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇది మామూలు సినిమా కాదని, సోనియా గాంధీ దర్శకత్వంలో.. అదిభయంకర చోర సామ్రాట్‌ వైఎస్‌ జగన్‌ హీరోగా నటించగా, విలన్‌గా నటబీభత్స అంబటి రాంబాబు, కథ దిగ్విజయ్‌ సింగ్‌, స్క్రీన్‌స్లే అహ్మద్‌ పటేల్‌, ఎగస్ట్రా ఆర్టిస్టులుగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎం.పి.లు నటించగా, ప్రత్యేక క్యారక్టర్‌ ఆరిస్టు, ఏ పార్టీలోనైనా ఇమిడి పోగల శోభానాగిరెడ్డితో చంచల్‌గూడ జైల్‌, లోటాస్‌పాండ్‌, టెన్‌జన్‌పథ్‌, ఇడుపుల పాయ, నాంపల్లి తదితర ప్రాంతాలలో లక్ష కోట్ల రూపాయల బడ్జెట్‌తో, 16 నెలలుగా నిరంతరం షూటింగ్‌ నిర్వహించిన అద్బుతమైన సినిమా పైరసీ బారిన పడిందని, సోనియా, జగన్‌ డీల్‌ను తెలుగు దేశం పార్టీ బైట పెట్టింద వర్ల తెలిపారు.

సోనియా దర్శకత్వంలో ...‘జగన్‌ జైలుకు దారేది’పూర్తి !!!

 యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ కనుసన్నల్లో దిగ్విజయ్, మొయిలీ నడుస్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమా విమర్శించారు. బొత్స, జగన్ కుట్ర చేస్తున్నార ని మండిపడ్డారు. జగన్ కుట్రలు, కుతంత్రాలను బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. సమైక్య రాష్ట్రం కోసం ఏ త్యాగాలకైనా సిద్ధమని వెల్లడించారు. ఉద్యమం చేస్తున్న ఉద్యోగులకు అండగా ఉంటామని దేవినేని ప్రకటించారు.

జగన్ కుట్రలు, కుతంత్రాలను బట్టబయలు చేస్తా.......

తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ దెబ్బతీస్తోందని టీడీపీ నేత కావూరి సాంబశివరావు ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ 20 రాష్ట్రాల్లో విభజనవాదం ఉన్నా పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్‌నే విచ్చిన్నం చేయాలనుకోవడం కుట్రే అని మండిపడ్డారు. రాహుల్‌ను ప్రధాని చేయడానికే విభజన ప్రకటన చేశారని, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు నూకలు చెల్లాయని విమర్శించారు.

కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభం నెలకొందన్నారు. రాష్ట్రాన్ని విభజించాల్సిన అవసరం కాంగ్రెస్‌కు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. వైసీపీ సమైక్యాంధ్ర ముసుగురు ప్రజలు గమనించాలని సూచించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో ఉద్యమం ఉధృతమవుతోందని, నిర్ణయం వెనక్కి వెళ్లే వరకు ఉద్యమం కొనసాగుతుందని కోడెల తెలిపారు.
 courtessy: andhrajyothy

20 రాష్ట్రాల్లో విభజనవాదం ఉన్నా పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్‌నే విచ్చిన్నం చేయాలనుకోవడం కుట్రే

September 25, 2013

మోదీ.. బాబు.. కలుసుకుంటారా?



గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఒకే వేదికపై కలుసుకొంటారా? ఒకరినొకరు పలకరించుకుంటారా? ఢిల్లీలో జరిగే ఒక రాజకీయేతర సమావేశంలో ఈ సన్నివేశం చోటు చేసుకోనుందా? అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. 'సిటిజన్స్ ఫర్ అకౌంటింగ్ గవర్నెన్స్' అనే స్వచ్ఛంద సంస్థ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2నఢిల్లీలోని త్యాగరాజ స్టేడియంలో విద్యార్థులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ భేటీ ప్రారంభోపన్యాసానికి చంద్రబాబును.. ముగింపు ఉపన్యాసానికి మోదీని ఆహ్వానించింది. బాబు ప్రసంగం ఉదయం ఉంటే.. మోదీ ప్రసంగం సాయంత్రం ఉంది.

ఈ సమావేశంలో వీరిద్దరూ కలిసి పక్కపక్కన కూర్చుంటారా లేక కనీసం మాట్లాడుకొంటారా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. సమయాలను బట్టి చూస్తే ఈ ఇద్దరూ కలిసి పాల్గొనే అవకాశం లేదని చెబుతున్నారు. కానీ కలవాలని అనుకొంటే మాత్రం ఈ ఇద్దరూ ఈ భేటీని ఒక అవకాశంగా వినియోగించుకొనే చాన్స్ లేకపోలేదనీ అంటున్నారు. విద్యార్థులతో నిర్వహిస్తున్న ఈ సమావేశానికి తాను వెళ్తున్నట్లు చంద్రబాబు తమ పార్టీ నేతలకు తెలిపారు. మోదీ-బాబు సుమారు ఒక దశాబ్ద కాలంగా కలుసుకోలేదు. గుజరాత్ మత కల్లోలాలకు బాధ్యునిగా మోదీని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని అప్పట్లో చంద్రబాబు పట్టుబట్టడం వీరి మధ్య సంబంధాలను తెంచివేసింది. 2004 ఎన్నికలకు ముందు హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగినప్పుడు ఆ పార్టీ ముఖ్యమంత్రులు, ఇతర ముఖ్య నేతలకు చంద్రబాబు ఇక్కడి జూబిలీ హాల్‌లో విందు ఇచ్చారు.

ఆ సమయంలో మోదీ నగరంలోనే ఉన్నా ఆ విందుకు హాజరు కాలేదు. ఇవన్నీ జరిగి పదేళ్లు కావడంతో ఆ సంఘటలన్నీ పాతబడ్డాయి. కొత్త సంబంధాలపై ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. 'పదేళ్ల కిందట ఎలా ఉన్నామో అలాగే ఉండాలా? మార్పులు రావా' అని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ప్రశ్నించారు . కాగా, అక్టోబర్ ఐదో తేదీ నుంచి చంద్రబాబు మలి విడత యాత్ర మొదలు కానుంది. ఈసారి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్నారు.

ఒకే వేదికపై కలుసుకొంటారా? ఒకరినొకరు పలకరించుకుంటారా?

జాతీయ రాజకీయాల్లో నా పాత్ర పెంచుతా: చంద్రబాబు


వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భూస్ధాపితం చేసే నిమిత్తం జాతీయ రాజకీయాల్లో తన పాత్ర పెంచాలని అనుకొంటున్నట్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బుధవారం రాత్రి ఆయన ఇక్కడ తన నివాసంలో వరంగల్ జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ తొమ్మిదేళ్ళ పాలనలో అవినీతి కనీవినీ ఎరుగని స్ధాయికి పెరిగిపోయి దేశం భ్రష్టు పట్టి పోయిందని, ఆ పార్టీని దించకపోతే దేశం సర్వ నాశనమయ్యే పరిస్ధితి వచ్చిందని ఆయన అన్నారు.
'బొగ్గు గనుల కుంభకోణంలో ఫైళ్ళు మాయం కావడంతో ఏకంగా ప్రధాని కూడా సిబిఐ విచారణను ఎదుర్కోవాల్సిన దుస్ధితి వచ్చింది. లక్షల కోట్ల కుంభకోణాలు జరిగినా కాంగ్రెస్ పార్టీ దులుపుకొని తిరుగుతోంది. ఇదే పరిస్ధితి ఉంటే దేశం కుప్పకూలడం ఖాయం. అవినీతి కేసుల్లో నిందితులందరికీ కఠిన శిక్షలు పడేలా చేసి మళ్ళీ ఇటువంటివి పునరావృతం కాకుండా చేస్తేనే మన దేశాన్ని, సమాజాన్ని కాపాడుకొన్నవారం అవుతాం. అది జరగాలంటే కాంగ్రెస్ పార్టీ దిగిపోవాలి. అందుకే జాతీయ రాజకీయాల్లో నా పాత్ర పెంచాలని అనుకొంటున్నాను. మనతో భావసారూప్యం ఉన్న పార్టీలు కొన్ని ఉన్నాయి. వాటిని కూడగట్టి కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను బలోపేతం చేస్తాను. గతంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రతి కాంగ్రెస్ వ్యతిరేక కూటమిలో టిడిపి ప్రధాన పాత్ర పోషించింది. ఈసారి కూడా అటువంటి పాత్రను తీసుకొందాం. అది జరగాలంటే ఇక్కడ రెండు ప్రాంతాల్లో మనం బలంగా ఉండాలి. రెండు వైపులా మెజారిటీ సీట్లు సాధించాలి. ఇదే మన లక్ష్యం' అని ఆయన వారితో అన్నారు.
courtessy: andhrajyothy

లక్షల కోట్ల కుంభకోణాలు జరిగినా కాంగ్రెస్ పార్టీ దులుపుకొని తిరుగుతోంది

బెయిల్‌పై విడుదలైన వైఎస్ జగన్‌ను పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేయడంపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్థిక నేరస్థుడు జగన్‌కు రెడ్‌కార్పెట్‌తో స్వాగతం పలుకుతారా అని ప్రశ్నించారు. జగన్‌కు గవర్నర్ ప్రోటోకాల్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని విమర్శించారు.

పోలీసులు దగ్గరుండి సెక్యూరిటీ కల్పించారని, ఇలా చేస్తే సాక్షుల భయపడరా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. సీబీఐ ఎందుకు బలహీనమతోందన్నారు. కాంగ్రెస్, జగన్, కేసీఆర్ ఒక టీం అని, అందుకే జగన్‌ను కేసీఆర్ పొగుడుతున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ మంచి పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందని సోమిరెడ్డి తెలిపారు. సమైక్య ఉద్యమానికి జగన్ నాయకత్వం వహిస్తే ఉద్యమానికి చెడ్డపేరు వస్తుందన్నారు.
జగన్‌కు బెయిల్ వచ్చిన రాత్రి విజయలక్ష్మి సోనియాకు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారన్నారు. రాహుల్ కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చాక రాహుల్ ప్రధాని పదవి చేపట్టేందుకు భయపడ్డారని సోమిరెడ్ది ఎద్దేవా చేశారు.

జగన్‌కు బెయిల్ వచ్చిన రాత్రి విజయలక్ష్మి సోనియాకు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు.......................

సోనియా, జగన్ మధ్య క్విడ్‌ప్రోకో జరిగిందని, రాహుల్‌ను ప్రధాని చేయడానికే కుమ్మక్కయ్యారని టీడీపీ నేతఆరోపించారు. ఢిల్లీలో కాంగ్రెస్, వైసీపీ నేతల భార్యలు కలుసుకున్నట్లు త్వరలో వాళ్ల భర్తలు కలుస్తారని ఆయన వ్యాఖ్యానించా

రాహుల్‌ను ప్రధాని చేయడానికే కుమ్మక్కయ్యారు...........

September 24, 2013

బీజేపీతో పొత్తు పర్యవసానాలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమ పార్టీలో అంతర్గతంగా చర్చకు తెరదీశారు. మంగళవారం రాత్రి ఇక్కడ ఖమ్మం జిల్లా పార్టీ నేతలతో సమావేశమైనప్పుడు ఆయన ఈ అంశంపై వారి అభిప్రాయం కోరినట్లు సమాచారం. 'బీజేపీ మనతో కలిసి వస్తానని అడుగుతోంది. మీ అభిప్రాయం ఏంటి?' అని చంద్రబాబు వారిని అడిగారు. కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉన్న జిల్లా కావడంతో ఖమ్మం జిల్లా నేతలు ఆచితూచి మాట్లాడారు. 'ఖమ్మం సహా రెండు మూడు జిల్లాల్లో కమ్యూనిస్టులకు పట్టు ఉంది. మిగిలిన చోట్ల లేదు. బీజేపీకి గట్టిగా ఏ జిల్లాలోనూ పట్టు లేదు. కానీ, రాష్ట్రం అంతటా అన్నిచోట్లా ఎంతో కొంత ఓట్లు ఉన్నాయి. మీరు రాష్ట్రం మొత్తం మీద పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోండి. మీరు ఏ నిర్ణయం తీసుకొన్నా మేం నిలబడి పనిచేస్తాం' అని వారు చెప్పారు.


మైనారిటీ కోణం గురించి కూడా చర్చ జరిగింది. బీజేపీతో పొత్తు ఉన్నా లేకపోయినా మైనారిటీల ఓట్లు టీడీపీకి పెద్దగా వచ్చే అవకాశం లేదని, మొదటి నుంచి పార్టీతో ఉన్నవారు ఎలాగూ వేస్తారని, మిగిలిన వారివి కాంగ్రెస్‌కు వెళ్ళే అవకాశం ఉందని కొందరు నాయకులు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు మాత్రం తన అభిప్రాయం ఏదీ చెప్పకుండా వ్యూహాత్మకంగా మాట్లాడారు. 'ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉంది. పొత్తులపై మనం అప్పుడే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. మున్ముందు పరిస్ధితులు ఎలా రూపుదిద్దుకొంటాయో చూసి దానిని బట్టి నిర్ణయం తీసుకొందాం. పొత్తు ఉన్నా లేకపోయినా... మనతో ఎవరు కలిసి వచ్చినా... ఎవరూ రాకపోయినా మనం సొంతంగా గెలవటానికి తగిన వ్యూహంతో వెళ్ళాలి. ఆ దిశగా పనిచేయాలి.

రాష్ట్రం ఒకటిగా ఉన్నా, రెండుగా విడిపోయినా రెండు ప్రాంతాల్లో మనం బలంగా ఉండాలి. రెండువైపులా గెలవాలి. కాంగ్రెస్ ఒకవైపు టీఆర్ఎస్‌ని, రెండోవైపు వైసీపీని కలుపుకొని బలపడాలని చూస్తోంది. టీఆర్ఎస్‌ను విలీనం చేసుకొంటుంది. వైసీపీని తాను ఎలా ఆడిస్తే అలా ఆడే పరిస్థితిలోకి తెచ్చుకొంది. ఇప్పుడు బెయిల్ వచ్చినా రేపు తేడా వస్తే ఈడీని రంగంలోకి దించి మరోసారి జైలుకు పంపిస్తామని అంతర్గతంగా హెచ్చరికలు జారీ చేసింది. ఆ పార్టీ గేమ్ ప్లాన్‌ను అమలు చేయడం తప్ప జగన్‌కు ఇప్పుడు మరో ప్రత్యమ్నాయం లేదు' అని ఆయన పేర్కొన్నారు. రెండు ప్రాంతాల్లో రెండు పార్టీలను ముందు పెట్టుకొని కాంగ్రెస్ ఆటాడుతోందన్న అంశం ప్రజల్లోకి బలంగా వెళ్తే ఆ మూడు పార్టీలు మట్టి కరవడం ఖాయమని, మంచి పాలన కావాలంటే టీడీపీయే శరణ్యమన్న అభిప్రాయాన్ని ప్రజల్లో బలంగా కలిగించాలని ఆయన వారికి సూచించారు.
 

'బీజేపీ మనతో కలిసి వస్తానని అడుగుతోంది. మీ అభిప్రాయం ఏంటి?

 
అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్‌కు సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై టీడీపీ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈకేసులో 10 చార్జిషీట్లలో 1200 కోట్ల అక్రమాలు జరిగాయని సీబీఐ చెప్పింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ సుప్రీం కోర్టు వరకు వెళ్లినా బెయిల్ రాలేదని, ఇంత భారీగా అక్రమాలకు పాల్పడిన జగన్‌కు బెయిల్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు.
ఈ కేసు మధ్యలో విచారణ అధికారిని ఎలా బదిలీ చేశారని విమర్శించారు. జగన్ బెయిల్‌ను సీబీఐ ఎందుకు అడ్డుకోలేదన్నారు. బెయిల్‌పై వాదనలు జరుగుతున్న సమయంలో హడావుడిగా అఫిడవిట్ దాఖలు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. నాలుగు కేసుల్లో ముద్దాయిగా ఉన్న కార్మెల్ ఏషియాలో క్విడ్‌ప్రోకో లేదని ఎలా చెబుతారన్నారు. జగన్ కేసులో దొంగ, పొలీస్ ఒకటయ్యారని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

నిమ్మగడ్డ ప్రసాద్ సుప్రీం కోర్టు వరకు వెళ్లినా బెయిల్ రాలేదని, ఇంత భారీగా అక్రమాలకు పాల్పడిన జగన్‌కు బెయిల్ ఎలా వచ్చింది

  కాంగ్రెస్‌తో వైసీపీ కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగానే జగన్‌కు బెయిల్ మంజూరైందని తెలంగాణ తెలుగుదేశం ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. మంగళవారం వరంగల్ జిల్లా కేంద్రం హన్మకొండలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడారు. తెలంగాణపై 2008లో తీసుకున్న నిర్ణయానికి టీడీపీ కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్, వైసీపీ, టీఆర్ఎస్ కుమ్ముక్కై టీడీపీనీ టార్గెట్ చేస్తున్నాయన్నారు.


ఈ ప్రాంతానికి చెందిన వేల కోట్లు దాచుకున్న జగన్‌కు బెయిల్ రావడంపై కేసీఆర్ స్పందించకపోవడం . వైసీపీ ఓ గజదొంగ పార్టీ అని, అలాంటి పార్టీతో కేసీఆర్ కుమ్ముక్కవడం ఎంత వరకు సమంజసమన్నారు. పార్టీని విలీనం చేసేందుకు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుంటున్న కేసీఆర్‌కు టీడీపీని విమర్శించే అర్హత లేదని విమర్శించారు. సీమాం«ద్రుల కృషితోటే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, తమకే హైదరాబాద్‌పై హక్కు ఉందని మాట్లాడుతున్న ఏపీఎన్జీవో నేత నోరు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరించారు. బతుకుదెరువు కోసం వచ్చారు కదాని కనుకరిస్తే ఇష్టం ఉన్నట్లు మాట్లాడడం సరికాదన్నారు.

నర్సంపేట ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ సీబీఐపై కాంగ్రెస్ ఒత్తిడి మేరకు జగన్‌కు బెయిల్ వచ్చిందని ఆరోపించారు. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే ధ్యేయంతో కాంగ్రెస్ ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని దుయ్యబట్టారు.

వేల కోట్లు దాచుకున్న జగన్‌కు బెయిల్ రావడంపై కేసీఆర్ స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు

September 23, 2013

దేశవ్యాప్తంగా ఉన్న పది కోట్ల మంది తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెట్టి జాతీయ సమగ్రత ఎలా సాధిస్తారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన సోమవారం జరిగిన జాతీయ సమగ్రతా మండలి సమావేశంలో ఆ యన మాట్లాడారు. తొలుత అజెండా ప్రకారం మత సామరస్యం, మహిళలు, ఎస్సీ, ఎస్టీలపై దాడుల గురించి మాట్లాడిన చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఉద్యమాలను ఎందుకు అజెండాలో పేర్కొనలేదని ప్రశ్నించారు.


"2009 నుంచి తెలంగాణలో వరుస ఉద్యమాలు జరిగాయి. వందలాది యువత ఆత్మహత్యలు చేసుకున్నా రు. తెలంగాణ ఉద్యోగుల పిలుపుతో ప్రజలంతా 42 రోజులపాటు సకల జనుల సమ్మె నిర్వహించారు. ఇప్పుడు సీమాంధ్ర ప్రజలు 55 రోజులుగా సమ్మె చేస్తున్నారు. ఆ ప్రాంతంలో యంత్రాంగం స్తంభించింది. ప్రజా జీవనం అస్తవ్యస్తమైంది. సచివాలయంలోను, ఇతర కేంద్ర కార్యాలయాల్లోను ఉద్యమాలు జరుగుతున్నాయి. ఉద్యోగుల మ« ద్య సామరస్యం దెబ్బతింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ప్రధానికి రెండు లేఖలు రాశాను.

కానీ, కేంద్రం నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు లేవు. రాష్ట్ర ప్రజలంతా మనో వేదనతో ఆందోళనలు చేస్తోంటే కేంద్రానికి పట్టదా?'' అని బాబు ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిస్థితులు ఎంతో తీవ్రంగా ఉంటే ఉన్నతస్థాయి వేదిక అయిన ఎన్ఐసీలో దానిని ఒక అంశంగా చేర్చి చర్చించరా? అని నిలదీశారు. దీంతో, వేదికపై ఉన్న సోనియా గాంధీ అప్రమత్తమయ్యారు. చంద్రబాబు ఆ విషయాలన్నీ మాట్లాడుతుంటే మీరేం చేస్తున్నారని ఆమె సుశీల్‌కుమార్ షిండే, చిదంబరం తదితరులను ప్రశ్నించారు. దీంతో, తొలుత షిండే జోక్యం చేసుకుని..
'రాష్ట్ర విభజనకు మీరు కూడా లేఖ ఇచ్చారు కదా!?' అని ప్రశ్నించారు. "అవును ఇచ్చాను. అయితే, ఇప్పుడు తలెత్తిన పరిస్థితులను పరిష్కరించరా? ఆందోళన చెందుతున్న ప్రజలకు సామరస్యపూర్వక పరిష్కారం చూపించరా?'' అని బాబు ప్రశ్నించారు.

దీంతో 'అసలు ఆ విషయం అజెండాలో లేదు. కాబట్టి మీరు మాట్లాడటం కుదరదు' అని చిదంబరం స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతుంటే కేంద్రం పట్టించుకోకపోవడం సరికాదని చంద్రబాబు అన్నారు. 'అయితే మీరు చెప్పాల్సింది చెప్పారు కదా! ఇంకేంటి?' అని చిదంబరం ప్రశ్నించారు. మైక్ కట్ చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో, ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.. 'కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా నేను వాకౌట్ చేస్తున్నాను' అని ప్రకటించి బయటకు వచ్చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ, కేంద్రం తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని అవమానించాయని విమర్శించారు. తెలంగాణ అంశంపై మాట్లాడేందుకు అసోం సీఎంకి అవకాశం ఇచ్చిన వాళ్లు తాను మాట్లాడుతుంటే మాత్రం ఎందుకు మైక్ కట్ చేశారని ప్రశ్నించారు.


కేంద్రం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటుపై ప్రకటన చేసిన వెంటనే తమ రాష్ట్రంలో మూడు ప్రత్యేక రాష్ట్రాల కోసం నిరసనలు మొదలయ్యాయని, వాటిని సమర్థంగా పరిష్కరించామని అసోం సీఎం తరుణ్ గొగోయ్ తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి ఎన్ఐసీ భేటీలో వివరిస్తూ.. మధ్యలో ఈ అంశాన్ని ప్రస్తావించారు.

'రాష్ట్ర విభజనకు మీరు కూడా లేఖ ఇచ్చారు కదా!?'

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయిందని తాను ముందే చెప్పానని, జగన్‌కు బెయిల్ రావడం ఇందులో భాగమేనని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రపతికి ఇచ్చిన వినతిపత్రంలోనే స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం జగన్, టిఆర్ఎస్‌లతో కాంగ్రెస్ కుమ్మక్కయిందని తాను వివరించానని ఆయన చెప్పారు. కాంగ్రెస్ అవినీతి రాజకీయాలపై ఇక ఉధృతంగా పోరాడతామని, జగన్‌కు బెయిల్ ఇవ్వడంపై న్యాయస్థానాల్లోనేగాక, ప్రజాకోర్టుల్లోనూ పోరాటం చేస్తామని ఆయన అన్నారు. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్‌లను దోషులుగా నిలబెడతామని చంద్రబాబు చెప్పారు. సోనియాగాంధీని దయ్యంగా అభివర్ణించిన వైఎస్సార్ కాంగ్రెస్‌కు... జగన్‌కు బెయిల్ వచ్చిన తర్వాత ఆమె దేవతగా మారిందని ఆయన అన్నారు.

ప్రజలు ఈ రాజకీయాలను ఏవగించుకుని తెలుగుదేశం పార్టీకి పట్టం కడతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అనేక కుంభకోణాలకు, అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్న కాంగ్రెస్... దేశాన్ని ఆర్థిక సంక్షోభంలో ముంచిందని, ద్రవ్యోల్బణం, రూపాయి విలువ పడిపోయిందని, దేశం ప్రతిష్ట అంతర్జాతీయంగా దిగజారిందని ఆయన అన్నారు. ఇప్పుడు జగన్‌తో కుమ్మక్కయిందని, ఈ పరిణామాలపై దేశవ్యాప్తంగా చర్చ లేవదీస్తామని చెప్పారు. అవినీతి కుంభకోణాలపై పోరాడిన చరిత్ర తెలుగుదేశం పార్టీదని, గతంలో బోఫోర్స్ కుంభకోణంపై, రాజశేఖర్‌రెడ్డి అవినీతిపై పోరాడామని ఆయన గుర్తు చేశారు. ఒక కుటుంబాన్ని ఆ«ధికారంలోకి తేవడం కోసం కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పాల్పడిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని నాశనం చేసిందని, తెలుగు ప్రజల జీవితాలతో ఆడుకుంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడిందన్న చంద్రబాబు... సీడబ్ల్యూసీ తీర్మానాన్ని ప్రకటించిన రోజే టిఆర్ఎస్ విలీనం అవుతుందని దిగ్విజయ్ సింగ్ ప్రకటించారని, జగన్ డీఎన్ఏ కాంగ్రెస్ డీఎన్ఏ ఒకటేనని ఆయనే చెప్పారని గుర్తు చేశారు. తెలంగాణపై నిర్ణయం తీసుకుంటారన్న విషయం వారం రోజుల క్రితమే జగన్ పార్టీకి తెలుసునని, అందుకే వారి ఎమ్మెల్యేలు ముందే రాజీనామా చేశారని చంద్రబాబు అన్నారు. తాజాగా వైఎస్సార్‌కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల నేతల భార్యలు రాష్ట్రపతికి ఒకే వినతిపత్రం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. సీబీఐ పది ఛార్జిషీటుల్లో 73 మందిపై కేసులు మోపిందని, వీటన్నింటిలోనూ జగన్ ఏ-1 నిందితుడుగా ఉన్నాడని ఆయన గుర్తు చేశారు. ఏ-2, ఏ-3, ఏ-4, ఏ-5 నిందితులకు బెయిల్ రాకుండా జగన్‌కు బెయిల్ ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు.

మరో రెండు ఛార్జిషీట్లు దాఖలు చేయకుమందే జగన్ బెయిల్‌కు దరఖాస్తు పెట్టుకున్నారని, ఆ తర్వాత ఈ ఛార్జిషీట్లు దాఖలు చేశారని చంద్రబాబు అన్నారు. నిజానికి ఛార్జిషీట్లు అన్నీ దాఖలు చేసిన తర్వాత బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలని సుప్రీం కోర్టు చెప్పిందని తెలిపారు. మధుకోడా నాలుగున్నరేళ్లుగా జైలులో ఉన్నారని, ఆయన ఆస్తులను అటాచ్ చేశారని, గాలి జనార్దన్‌రెడ్డి రెండేళ్లుగా జైలులో ఉన్నారని చెప్పారు. సత్యం రామలింగరాజు వ్యక్తిగత ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నారని అన్నారు. వీరిపై ఉన్న కేసుల కంటే జగన్ పై ఉన్న కేసుల తీవ్రత ఎంతో ఎక్కువని చంద్రబాబు అన్నారు. గాలిపై ఒక్క ఇనుపఖనిజం కేసు ఉంటే... జగన్‌పై మనీలాండరింగ్, వాన్‌పిక్, అక్రమ కేటాయింపుల వంటి అనేక కేసులున్నాయన్నారు. ఒక పకడ్బందీ వ్యూహం ప్రకారం అంతా కూడబలుక్కున్నట్లే జరిగిందని ఆయన అన్నారు.

ఏడు కేసుల్లో క్విడ్ ప్రో కో లేదని తేలిందని, తమ విచారణ పూర్తయిందని, ఇతర అంశాలపై ఐటీ, ఈడీలకు లేఖ రాశామని సీబీఐ కోర్టుకు చెప్పడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం చేశారు. ఇదే సీబీఐ జగన్‌పై విచారణ సాగుతున్నదని, విదేశాలకు కూడా లేఖలు రాశామని వివరించి, బెయిల్‌ను తీవ్రంగా వ్యతిరేకించిందని చంద్రబాబు తెలిపారు. ఈ రీత్యా జగన్‌కు బెయిల్ ఇవ్వాలనడం సాంకేతికంగానే చెల్లదని ఆయన అన్నారు. ఇంకా విచారణ జరగాల్సి ఉన్నదని కోర్టుకు సీబీఐ చెప్పలేకపోయిందని అయన అన్నారు. కొద్దినెలల ముందు సీబీఐ జేడీని, డీఐజీని బదిలీ చేశారని, కోర్టు ముందు ఇంతకుముందున్న అడ్వకేట్‌ను పెట్టుకోలేదని ఆయన అన్నారు. సీబీఐ... కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా వ్యవహరిస్తున్నదని, కాంగ్రెస్‌కు, జగన్‌కు మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని దీనితో ధ్రువపడుతున్నదని, ఇది చాలా దారుణమని చంద్రబాబు అన్నారు.

ఇటీవల ములాయం సింగ్‌పై సీబీఐ ఆదాయానికి మించిన ఆస్తుల కేసును మూసివేసిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. సీమాంధ్రలో విద్వేషాలు పెంచేందుకు వైఎస్సార్ కాంగ్రెస్‌కు వీలు కల్పిస్తున్నారని ఆయన చెప్పారు. ఈడీకి కేసులను నివేదించామని సీబీఐ చెబుతోందని, 16 నెలల నుంచి అసలు ఇంతవరకూ ఈడీ ఏ చర్య తీసుకున్నదని ఆయన ప్రశ్నించారు. కోల్‌కటాకు చెందిన ఒక సూట్‌కేస్ కంపెనీ, గౌహతికి చెందిన ఒక సూట్‌కేస్ కంపెనీల ద్వారా జరిగిన మనీ లాండరింగ్‌పై ఏం చేశారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇంత బరితెగించి అడ్డగోలుగా ఏం చేసినా మనను అడిగేవారేలేరన్నట్లు ప్రవర్తించడం దారుణమని అన్నారు.

సోనియాగాంధీని దయ్యంగా అభివర్ణించిన వైఎస్సార్ కాంగ్రెస్‌కు... జగన్‌కు బెయిల్ వచ్చిన తర్వాత ఆమె దేవతగా మారింది


  కాంగ్రెస్ పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవడంవల్లే అక్రమాస్తుల కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి బెయిల్ వచ్చిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ సీబీఐ కాంగ్రెస్ బ్యూరో ఇన్వెస్టిగేషన్‌గా మారిందని విమర్శించారు. రాష్ట్ర విభజన ప్రకటన రోజే జగన్ కాంగ్రెస్ డీఎన్ఏగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ ప్రకటన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు.

జగన్ ఆస్తుల కేసును నీరు గార్చేందుకు కాంగ్రెసు ప్రయత్నించిందని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ని, సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని విలీనం చేసుకోవాలని కాంగ్రెసు ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. ఓట్లు సీట్లు కావాలి, ఎవరు ఏమైనా ఫర్వాలేదనే పద్ధతిలో కాంగ్రెసు వ్యవహరిస్తోందని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వైయస్ జగన్‌కు సంబంధించి కొన్ని కేసుల్లో క్విడ్ ప్రోకో లేదని సిబిఐ హడావిడిగా చెప్పిందని, వైయస్ జగన్ కేసులో ఇప్పటి వరకు ఈడి విచారణ జరగకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు.

ఎ2, ఎ4 బయటకు రాలేని స్థితిలో ఎ1గా ఉన్న జగన్ ఎలా బయటకు వస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ కేసులో సాధారణ స్థాయిలో పెట్టాల్సిన న్యాయవాదులను కూడా సిబిఐ పెట్టలేదని ఆయన అన్నారు. చార్జీషీట్లు మొత్తం దాఖలు చేసిన తర్వాతే జగన్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని బాబు గుర్తు చేశారు. చార్జిషీట్లు దాఖలు చేయకముందే జగన్ బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారని ఆయన అన్నారు. వైయస్ జదగన్ బరి తెగించి, అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు.
ఓఎంసీ కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన్‌రెడ్డి రెండేళ్లుగా జైలులో ఉన్నారని, సత్యం రామలింగరాజు ఆస్తులను జప్తు చేశారని, రామలింగ రాజు నాలుగేళ్ల పాటు జైలులో ఉన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. కోల్‌కతా కంపెనీలు జగన్ కంపెనీల్లో అక్రమంగా పెట్టుబడులు పెడితే ఈడి ఏం చేస్తోందని ఆయన అడిగారు. 16 నెలల పాటు ఈడి ఏ విధమైన చర్యలూ తీసుకోలేదని, ఈడి, సిబిఐల ఉదాసీనతలపై పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఎన్ఐసీ సమావేశంలో చెప్పాలని తాను భావిస్తే తనకు మైక్ ఇవ్వలేదని చంద్రబాబు చెప్పారు. సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని కాంగ్రెసు పార్టీ పురమాయించి పరిస్థితులను దిగజారుస్తోందని ఆయన విమర్శించారు. సిడబ్ల్యుసి తీర్మానం చేయడానికి ముందే సమాచారం ఇచ్చి వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యులతో కాంగ్రెసు రాజీనామాలు చేయించిందని ఆయన ఆరోపించారు. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి సీవీసీని కలిసామని చంద్రబాబు పేర్కొన్నారు. మొదటి నుంచి అవినీతిపై టీడీపీ అలుపెరగని పోరాటం చేస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్-వైసీపీ పార్టీలను ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

జగన్ ఆస్తుల కేసును నీరు గార్చేందుకు కాంగ్రెసు.......

  వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్ జగన్ బెయిల్ ఉహించిందేనని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శోభా హైమావతి వ్యాఖ్యానించారు. సోమవారం విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ఆమె మాట్లాడుతూ తల్లి కాంగ్రెస్ పిల్లకాంగ్రెస్ నేత జగన్‌కు బెయిల్ ఇప్పస్తుందని తమకు ముందే తెలుసన్నారు. సీబీఐ జేడీ లక్ష్మీనారాయణను బాధ్యతలనుంచి ఇందుకే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించిందన్నారు. రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గ్రహించారన్నారు.


తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సమితితోను, సీమంధ్రలో జగన్ పార్టీతోను పొత్తు పెటుకుని వచ్చే ఎన్నికల్లో నెగ్గుకు రావాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు పూనుకుందన్నారు. ఇందులో భాగంగానే జగన్‌కు కోర్టులో బెయిల్ వచ్చేవిదంగా సిీబీఐని పావులా వాడుకున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర 53రోజులుగా రగిలిపోతుంటే కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చోద్యం చుస్త్తున్నారన్నారు. జగన్‌కు బెయిల్ ఇప్పించడంలో వున్న శ్రద్ధ తెలుగు వారిని ఐక్యంగా ఉంచడంలో చూపించడం లేదన్నారు.

తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర సమితితోను, సీమంధ్రలో జగన్ పార్టీతోను పొత్తు పెటుకుని వచ్చే ఎన్నికల్లో నెగ్గుకు రావాలన్న ఉద్దేశం


కాంగ్రెస్ పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవడంవల్లే అక్రమాస్తుల కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి బెయిల్ వచ్చిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ సీబీఐ కాంగ్రెస్ బ్యూరో ఇన్వెస్టిగేషన్‌గా మారిందని విమర్శించారు. రాష్ట్ర విభజన ప్రకటన రోజే జగన్ కాంగ్రెస్ డీఎన్ఏగా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్ సింగ్ ప్రకటన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు.

జగన్ ఆస్తుల కేసును నీరు గార్చేందుకు కాంగ్రెసు ప్రయత్నించిందని చంద్రబాబు అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ని, సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని విలీనం చేసుకోవాలని కాంగ్రెసు ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. ఓట్లు సీట్లు కావాలి, ఎవరు ఏమైనా ఫర్వాలేదనే పద్ధతిలో కాంగ్రెసు వ్యవహరిస్తోందని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వైయస్ జగన్‌కు సంబంధించి కొన్ని కేసుల్లో క్విడ్ ప్రోకో లేదని సిబిఐ హడావిడిగా చెప్పిందని, వైయస్ జగన్ కేసులో ఇప్పటి వరకు ఈడి విచారణ జరగకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు.

ఎ2, ఎ4 బయటకు రాలేని స్థితిలో ఎ1గా ఉన్న జగన్ ఎలా బయటకు వస్తారని చంద్రబాబు ప్రశ్నించారు.  జగన్ కేసులో సాధారణ స్థాయిలో పెట్టాల్సిన న్యాయవాదులను కూడా సిబిఐ పెట్టలేదని ఆయన అన్నారు. చార్జీషీట్లు మొత్తం దాఖలు చేసిన తర్వాతే జగన్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని బాబు గుర్తు చేశారు. చార్జిషీట్లు దాఖలు చేయకముందే జగన్ బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారని ఆయన అన్నారు. వైయస్ జదగన్ బరి తెగించి, అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు.
ఓఎంసీ కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్థన్‌రెడ్డి రెండేళ్లుగా జైలులో ఉన్నారని, సత్యం రామలింగరాజు ఆస్తులను జప్తు చేశారని, రామలింగ రాజు నాలుగేళ్ల పాటు జైలులో ఉన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. కోల్‌కతా కంపెనీలు జగన్ కంపెనీల్లో అక్రమంగా పెట్టుబడులు పెడితే ఈడి ఏం చేస్తోందని ఆయన అడిగారు. 16 నెలల పాటు ఈడి ఏ విధమైన చర్యలూ తీసుకోలేదని, ఈడి, సిబిఐల ఉదాసీనతలపై పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.
 రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఎన్ఐసీ సమావేశంలో చెప్పాలని తాను భావిస్తే  తనకు మైక్ ఇవ్వలేదని చంద్రబాబు చెప్పారు. సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీని కాంగ్రెసు పార్టీ పురమాయించి పరిస్థితులను దిగజారుస్తోందని ఆయన విమర్శించారు. సిడబ్ల్యుసి తీర్మానం చేయడానికి ముందే సమాచారం ఇచ్చి వైయస్సార్ కాంగ్రెసు శాసనసభ్యులతో కాంగ్రెసు రాజీనామాలు చేయించిందని ఆయన ఆరోపించారు. జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి సీవీసీని కలిసామని చంద్రబాబు పేర్కొన్నారు. మొదటి నుంచి అవినీతిపై టీడీపీ అలుపెరగని పోరాటం చేస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెస్-వైసీపీ పార్టీలను ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

 

ఎ2, ఎ4 బయటకు రాలేని స్థితిలో ఎ1గా ఉన్న జగన్ ఎలా బయటకు వస్తాడు?


ఎన్ఐసీ నుంచి బాబు వాకౌట్
తెలుగువారికి అవమానం:బాబు



  నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ (ఎన్ఐసీ) సమావేశాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బహిష్కరించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సమస్యలు ప్రస్తావించవద్దని అడ్డుకున్నారు. అందుకే ఎన్ఐసీ సమావేశాన్ని బహిష్కరించినట్లు ఆయన తెలిపారు. సోమవారం ఎన్ఐసీ భేటీ నుంచి బయటకు వచ్చిన అనంతరం చంద్రబాబు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ రాష్ట్ర సమస్యలను ప్రస్తావించవద్దని కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, చిదంబరం అడ్డుకున్నారని అన్నారు. సమావేశంలో తెలుగువారికి అవమానం జరిగిందని, అందుకే నిరసనగా సమావేశం నుంచి వాకౌట్ చేశామని చంద్రబాబు ఆవేదనగా పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ అధిష్టానం కనుసన్నలలో నడుస్తున్నారని, ఆయన సీటు కోసం పాకులాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. సమావేశంలో రాష్ట్ర సమస్యల గురించి ప్రస్తావిస్తున్నప్పుడు కనీసం తనకు మద్దతు తెలపలేదని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగేళ్ళుగా రాష్ట్రం తగలబడుతుంటే ఎన్ఐసీలో చర్చించాల్సిన అవసరం లేదా? అంటూ ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో సమస్యలు లేనట్లే సీఎం ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

రాజకీయ లబ్దికోసమే కాంగ్రెస్ రాష్ట్రంలో సమస్యలు సృష్టిస్తోందని చంద్రబాబు «నాయుడు ధ్వజమెత్తారు. సీమాంధ్రలో 55 రోజులుగా ఆందోళనలు జరుగుతున్నా, సమస్యల గురించి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మకం కోల్పోతున్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర విభజనపై దేశంలో ఉన్న మేధావులు అందరూ ఆలోచించాలని ఆయన అన్నారు.

అస్సాం రాష్ట్ర సమస్యలపై మాట్లాడేందుకు ఎన్ఐసీలో అవకాశం కల్పించారని అన్న మీడియా ప్రశ్నకు సమాధానంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి అవకాశం ఇచ్చారని టీడీపీ ప్రతిపక్షం కాబట్టి అడ్డుకున్నారని ఆయన చెప్పారు. ఇది తెలుగువారి ఆత్మగౌరవానికి అవమానమని అన్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు రాష్ట్రంలో ఎలా పోరాటం చేయాలో తెలుసునని, అలాగే ఢిల్లీలో కూడా పోరాటం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

ఆ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి అవకాశం ఇచ్చారని టీడీపీ ప్రతిపక్షం కాబట్టి అడ్డుకున్నారు.. .......


ఎనిమిది కంపెనీలకు సంబంధించి జగన్ కేసులో క్విడ్ ప్రో జరగలేదని సిబిఐ నాంపల్లి కోర్టుకు మెమో ఇవ్వడంపై టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అభ్యంతరం వ్యక్తం చేశారు.సరిగ్గా బెయిల్ వచ్చే రోజున సిబిఐ ఇలాంటి మెమో ఎలా దాఖలు చేస్తుందని ఆయన ప్రశ్నించారు.ఇదే కాంగ్రెస్,వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ల కుమ్మక్కుకు నిదర్శనమని ఆయన అన్నారు.

సరిగ్గా బెయిల్ వచ్చే రోజున సిబిఐ ఇలాంటి మెమో ఎలా దాఖలు చేస్తుంది

September 22, 2013

తెదేపా. ముప్పైఏళ్ళ రాజకీయ ప్రస్తానంలో సంచలనాలు సృష్టించిన పార్టీ. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సర్కారును కూలదోయడంలో, విభిన్న ధృవాల్లాంటి పార్టీలను ఒకే గొడుగుకిందకు చేర్చి ఢిల్లీ సర్కారును ఏర్పాటు చేసిన చరిత్ర పారీే్టక సొంతం. అన్న ఎన్టీఆర్, వారసునిగా చంద్రబాబునాయుడు జాతీయ రాజకీయాలలో తమదైన ముద్ర వేసినవారే. ఈ పార్టీకి సెక్యులర్ పార్టీగా పేరుంది. భాజపా. దేశంలో కాంగ్రెస్ తర్వాత అతిపెద్ద పార్టీ. మతతత్వ ముద్ర కలిగిన పార్టీ. దాదాపు ఆరేళ్ళ పాటు కేంద్రంలో సంకీర్ణ సర్కారుకు సారథ్యం వహించిన పార్టీ. కొన్ని అంశాల్లో ఈ రెండు పార్టీల మధ్య సారూప్యత లేకున్నా ఒక అంశంలో మాత్రం రెండింటిదీ ఒకే వైఖరి. అదే కాంగ్రెస్ వ్యతిరేక విధానం. ఈ విధానంతోనే 199, 1999ల్లో ఏర్పాటైన ఎన్డీయేసర్కారుకు తెదేపా మద్దతు ప్రకటించింది. ఎన్డీయే సర్కారుకు తెలుగుదేశం పార్టీ అప్పట్లో ఆయువు పట్టులా నిలవగా... 1999లో చంద్రబాబు సర్కారు విజయం సాధించడానికి ఎన్డీయే హయాంలో జరిగిన కార్గిల్ వార్ వంటి విజయాలు దోహదకారిగా నిలిచాయనడంలో సందేశం లేదు. తదనంతర పరిణా మాల్లో వామపక్షాలతో తెదేపా అడుగులు వేయడంతో బిజెపికి దూరమయింది. మారిన పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ రాజకీయ పొత్తుల గురించి దీర్ఘంగానే ఆలోచించింది. ఈ అంశంలో తమిళనాడు పార్టీల అనుభవాలను అవలోకనం చేసుకుంది. బద్దశత్రువైన కాంగ్రెస్‌ను తుదముట్టించే మార్గాల్లో ముందుగా తృతీయ ఫ్రంట్‌తో ముందుకు నడిచే అంశాన్ని పరిశీలించింది. ములాయం, మాయా వంటి అవకాశవాద రాజకీయాలకు మారుపేరుగా నిలిచిన నేతలతో అయ్యేపని కాదని గత అను భవాలతో నిర్థారించుకుంది. కాంగ్రెస్‌ను ఎదుర్కోవాలంటే జాతీయ స్థాయి పార్టీ అవసరమని గట్టిగా అభిప్రాయపడింది. మతతత్వ ముద్ర వుందికదా అనే అంశంపై తర్జనభర్జన చేసింది. ముస్లిం ఓటర్లలో కొందరు దూరమయ్యేది ఖాయమని అంచనా వేసుకుంది. అయితే మోడీకి వున్న ప్రజాదరణ దేశవ్యాప్తంగా ఆయన నాయకత్వంపై యువత, విద్యావంతుల్లో పెరుగుతున్న అంచనాలతో పోల్చుకుంటే నష్టపోయేది తక్కువే, లాభపడేది ఎక్కువనే తనదైన విశ్లేషణలో నిర్థారించుకుంది. మోడీ గుజరాత్‌లో చూపించిన అభివృద్ధి నమూనా ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి నమూనాకు లభించిన ప్రశంసలు, మోడీని ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేశాక దేశవ్యాప్తంగా పెరిగిన క్రేజీ ఇవన్నీ తెలుగుదేశం పార్టీని కమలదళంతో స్నేహానికి అడుగులు వేయించాయని చెప్పవచ్చు. హైదరాబాద్‌లో మోడీ చేసిన ప్రసంగం, జనస్పందన కూడా తెలుగుదేశం శిబిరాన్ని ఆలోచింపజేసింది. ఎన్టీఆర్ తరహాలో కాంగ్రెస్‌ను జాతీయ స్థాయిలో ఓడించేందుకు తమతో కలిసిరావాలని మోడీ తెదేపాకు పిలుపునిచ్చిన విషయం విధితమే. కాంగ్రెస్‌తో ఆదినుంచి శతృపార్టీగా చూసే చరిత్ర కలిగిన తెలుగుదేశం దానికి శతృవైన బిజెపితో కలిస్తే రాష్ర్ట ప్రయోజనాలు కూడా కాపాడుకోవచ్చుననే ఆలోచన తెదేపాలో మొగ్గతొడిగింది. మొన్నటి వరకు ఈ రెండుపార్టీలను శతృపార్టీలగానే చూడగా, అయితే కాంగ్రెస్ కంటే బిజెపి బెటర్ అనే అభిప్రాయం వినవస్తోంది. అందునా ఓబీసీలను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంతో ఇప్పటికే బీసీల్లో గట్టి పట్టువున్న తెదేపా ఓటు బ్యాంకు మరింత సుస్థిరమవుతున్నదన్నది అంచనా. రాష్ర్ట పరిస్థితుల విషయానికి వస్తే గతంలో ఎన్నడూ లేని విచిత్ర పరిస్థితి నెలకొన్నది. కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా తనతో కలిసే, విలీనమయ్యే తెరాస, వైకాపాలతో లోపాయికారి ఒప్పందాలతో ముందుకు సాగుతోంది. విభజన తర్వాత ఎన్నికలు జరుగుతాయా లేక సమైక్య రాష్ర్టంలోనే ఎన్నికలు జరుగుతాయా అన్న అనిశ్చితి ఇంకాకొనసాగుతూనే వుంది. రాష్ర్టంలో కాంగ్రెస్ పరిస్థితి అంతకంతకు దిగజారి పోతోంది. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో కేడర్ కలిగిన భాజపాతో కలిస్తే దానికి తమకు వున్న ఓటు బ్యాంకు కూడా తోడైతే ఉభయతారకంగా వుంటుందని అంచనా వేసుకుంది. అటు సీమాంధ్రలోనూ విద్యావంతులు, యువత, మధ్యతరగతి కుటుంబీకుల ఓట్లతో పాటు బీసీలు, భాజపా సాంప్రదాయ ఓటు కూడా తమకు అనుకూలంగా వుంటుందన్నది ఒక అంచనా. ముస్లిం ఓటర్లు సహజంగానే కాంగ్రెస్, వైసీపీ, తెరాస ఇతర సెక్యులర్ ముద్ర కలిగిన పార్టీల మధ్య చీలిపోతాయికనుక తమ పార్టీ ఈ రకంగా నష్టపోయే ఓట్లను భాజపా స్నేహంతో పూడ్చుకోవడంతో పాటు, అదనంగా మోడీ ఆదరణను మరిన్ని ఓట్ల రూపంలో పొందవచ్చునన్నది అంచనా. రాష్ర్ట ప్రయోజనాలను కాపాడుకోవాలి, కేంద్రంలో అనుకున్న అభివృద్ధి పనులు సాధించుకోవాలంటే ప్రధాన పార్టీ అయిన భాజపాతో కలిసి నడవటమే శ్రేయస్కరమని తెదేపా ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. గత కొన్ని నెలలుగా ఈ అంశంపై తెదేపా శ్రేణులు అధినేతపై ఒత్తిడి చేస్తూనే వున్నారు. ముస్లింలను దూరం చేసుకుంటామనే సంకోచం ఆయన్ను ఇన్నాళ్ళూ వెనుకంజ వేయించింది. అయితే మారుతున్న సమీకరణలు కాంగ్రెస్ పరిస్థితి అంతకంతకు దిగజారిపోతున్న వైనం, మోడీకి గతంలో వున్న మైనస్‌లకు అతీతంగా అన్ని వర్గాల్లో పెరిగిన ఆదరణ, మూడో ఫ్రంట్‌పై ఆవిరైన ఆశలు, తమిళనాడు అనుభవాలు వెరసి చంద్రబాబును భాజపా దోస్తీవైపు అడుగులు వేయించినట్టుగా తెలుస్తోంది.అక్టోబర్ మొదటి వారం నుంచే భాజపా, తెదేపాలు కలిసి పనిచేయ బోతున్నాయి. ఈ అంశంపై చంద్రబాబు, మోడీలు ఒక అవగాహనకు వచ్చారని విశ్వసనీయ సమాచారం. ఏపీలోని 42 లోక్ సభ సీట్లను మెజార్టీని సొంతం చేసుకోవాలనే వ్యూహంతో ఈ ఇద్దరూ కలిసి అడుగులు వేయబోతున్నారు. దాంధీ జయంతి వేదికగా ఇందుకు ముహూర్తం ఖరారయిందని సమాచారం. అదే రోజున మోడీ, బాబు ఒకే వేదికను పంచుకో బోతున్నారు. అయితే వేదిక ఎక్కడ అనేది సస్పెన్స్.

త్వరలో తెదేపా, భాజపాల... పరిణయం

 సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టీడీపీ నేత దేవినేని చంద్రశేఖర్ సోమవారం 72 గంటల దీక్షకు దిగారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ నేతలు దేవినేని ఉమా, గద్దెరామ్మోహన్, విద్యాసాగర్ దీక్షకు మద్దతు తెలిపారు.

దేవినేని చంద్రశేఖర్ 72 గంటల దీక్

రాష్ట్రాభివృద్ధే నాకు ముఖ్యం
ఏ ఒక్కరికీ అన్యాయం జరగొద్దనే ఢిల్లీ వచ్చా
కానీ, కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది
టీఆర్ఎస్ విలీనం, వైసీపీ పొత్తుపైనే దాని దృష్టి: చంద్రబాబు

సున్నితమైన రాష్ట్ర విభజన వ్యవహారాన్ని అడ్డుపెట్టుకొని టీఆర్ఎస్‌ను విలీనం చేసుకునేందుకు, వైసీపీతో పొ త్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. "నాది టీటర్నో, యూటర్నో కాదు.. పీ టర్న్. అంటే ప్రజల టర్న్. ఇరు ప్రాంతాల బాగోగుల కోసం, తెలుగుజాతి కోసం పోరాడుతున్నాను. ఒక తండ్రికి ముగ్గురు పిల్లలు ఉంటే ఎవరో ఒక్కరి సంక్షేమాన్నే కోరుకోడు. నేను కూడా మూడు ప్రాంతాల ప్రజల ను పిల్లల మాదిరిగా భావిస్తున్నాను. వారందరి బాగోగులు కోరుకుంటున్నా ను'' అని వివరించారు.


రాష్ట్రంలో పరిస్థితుల్ని చక్కదిద్దేందుకు చొరవ చూ పాలంటూ పార్టీ ఎంపీలతో కలిసి శనివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన ఆయన ఆదివారం జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్, సీపీఐ వృద్ధనేత ఏబీ బర్ధన్‌లతో భేటీ అయ్యారు. ఆ వివరాలను విలేకరుల సమావేశంలో వివరించారు. రాష్ట్ర ప్రజల సమస్యల కంటే రాజకీయాలే కాంగ్రెస్‌కి ముఖ్యమని ఈ సందర్భంగా ఆయన దుయ్యబట్టారు. తన ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని ఆ పార్టీ తగలబెడుతోందని, ప్రజల జీవితాలతో ఆడుకుంటోందని విమర్శించారు. రాజకీయ లబ్ధి పొందేందుకు ఆ పార్టీలోని ఇరు ప్రాంత నాయకులు ద్వం ద్వ వైఖరి అవలంభిస్తున్నారన్నారు.

"తెలంగాణలో టీఆర్ఎస్‌ను విలీనం చేసుకుని, సీమాంధ్రలో జగన్ పార్టీతో పొత్తు పెట్టుకుని..రెండు చోట్లా లబ్ధి పొందాలన్నదే కాంగ్రెస్ తాపత్రయం. కాబట్టే, తెలంగాణకు మద్దతు ఇస్తున్న బీజేపీ, సీపీఐలతో పాటు జాతీయ పార్టీలైన జేడీయూ, డీఎంకే, ఏఐడీఎంకే, ఏజీపీ, టీఎంసీ, నేషనల్ కాన్ఫరెన్స్ వంటి పార్టీలు సైతం కాంగ్రెస్ వైఖరిని తీవ్రంగా తప్పుపడుతున్నాయి'' అన్నారు. విభజన వ్యవహారాన్ని కాంగ్రెస్ పరిష్కరించిన విధానం తప్పన్నారు. "రాష్ట్రంలో ఎన్నో పార్టీలు అధికారంలోకి వస్తా యి. పోతాయి. ఆంధ్రప్రదేశ్ అంటే కాంగ్రెస్ కాదు. అది కాంగ్రెస్ సొంత జాగీ రూ కాదు. కానీ, కాంగ్రెస్ మాత్రం అదే ధోరణిలో ఉంది. విభజన ప్రక్రియను సొంత పార్టీ అంతర్గత వ్యవహారంగా మార్చేసింది'' అని ఆరోపించారు.

తెలంగాణలో 42 రోజులు సకల జనుల సమ్మె జరిగి, వందలాది మంది యువత బలిదానాలు చేసుకోగా, సీమాంధ్రలో గత 57 రోజులుగా ప్రజలు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొంటున్నారని గుర్తు చేశారు. "పంచాయితీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పైచేయి సాధించటంతో ఇటు టీఆర్ఎస్‌తోనూ, అటు వైసీపీతోనూ ఒప్పందాలు కుదుర్చుకుని, సమస్యను పరిష్కరించాల్సిన కాంగ్రెస్సే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది. తెలంగాణ ప్రకటన చేసిన వేదికపై నుంచే టీఆర్ఎస్‌ను తమ పార్టీలో విలీనం చేసుకుంటామని ఏఐసీసీ జాతీయ కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు.

వైసీపీదీ తమదీ ఒకటే డీఎన్ఏ అన్నారు. తమను విమర్శించినా అది తమకు మేలే చేస్తుందని రాజ్యసభలో చిదంబరం వ్యాఖ్యానించారు. ఇవన్నీ చూసిన తరువాతే ప్రధానమంత్రికి నేను లేఖలు రాయగా ఆయన పట్టించుకోలేదు. దీంతో రాష్ట్రపతి జోక్యం కోరుతూ ఢిల్లీకి వచ్చాను'' అని వివరించారు. వాస్తవానికి కాంగ్రెస్‌దీ, వైసీపీదీ దేశాన్ని దోచుకునే డీఎన్ఏ అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కేంద్రం, కాంగ్రెస్ నేతలు స్పందించకుంటే, వారి సంగతి ప్రజలే చూసుకుంటారని హెచ్చరించారు. సోనియాగాంధీ టెన్ జన్‌పథ్ నుంచి రాస్తున్న స్క్రిప్ట్ ప్రకారం కిరణ్, కేసీఆర్, జగన్ నడుచుకుంటున్నారని దుయ్యబట్టారు.

కాగా, రాష్ట్ర పరిస్థితుల గురించి చంద్రబాబు వివరించగా, జేడీయూ చీఫ్ శరద్ యాదవ్ ఆయన వాదనను ఒకింత ఆందోళనతో ఆలకించారు "ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితుల్ని చక్కదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ప్రజలంతా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయం కోరుతున్నప్పుడు వారి డిమాండ్లకు స్పందించకపోవటం సరికాదు. దేశాన్ని నడిపే పద్ధతి ఇది కాదు. అభివృద్ధిపథం నుంచి ఆంధ్రప్రదేశ్‌ను పక్కదోవ పట్టించారు. తిరిగి ఆంధ్రా అభివృద్ధి పథంలోకి రావాలి'' అని శరద్ యాదవ్ ఆకాంక్షించారు.

కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్న చంద్రబాబు విజ్ఞప్తిపై సీపీఐ నేత బర్ధన్ సానుకూలంగా స్పందించారు. "అన్నదమ్ముల్లా కలిసి ఉండాల్సిన తెలుగు ప్రజలను కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ లబ్ధి కోసం అంధకారంలోకి నెట్టింది. ఇరు ప్రాంతాల నేతలను కేంద్రం పిలిచి చర్చలు జరపాలి. కానీ, కేంద్రం అచేతనంగా ఉంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోంది'' అని బర్ధన్ విమర్శించారు. ఇదిలాఉండగా, ఢిల్లీలో సోమవారం జరగనున్న జాతీయ సమగ్రతా మండలి సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు.

బిడ్డల బాగు కోరుకునే తండ్రిని ఇరు ప్రాంతాలవారూ నా పిల్లలే....

జాతీయ రాజకీయాల్లో సానుకూల పాత్ర పోషిస్తాం
ఢిల్లీలో చంద్రబాబు వెల్లడి

దేశం తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయిందని, ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ.. జాతీయ స్థాయిలో సానుకూల పాత్ర పోషిస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో ఎన్డీయేతో కలిసి దేశాన్ని ఎంతో అభివృద్ధి చేశామని ఆదివారమిక్కడ ఆయన వ్యాఖ్యానించారు. "ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న విశాలమైన రోడ్లు,సెల్‌ఫోన్లు అప్పటి మా కృషి ఫలితమే. దేశం గర్వించే రీతిలో పనిచేశాం'' అని వివరించారు. కాంగ్రెస్, యుపీఏ మాత్రం దేశాన్ని దోచుకుంటోం దని, ఆర్థిక రంగం అధోగతి పాలైందన్నారు. "ప్రజలంతా నిరాశలో ఉన్నారు. జాతి మొత్తం ఇలా సమస్యల్లో పడినప్పుడు టీడీపీ మరోసారి కీలక పాత్ర పోషిస్తుంద''ని వెల్లడించారు. అదే సమయంలో బీజేపీతో పొత్తు ఎప్పుడు పెట్టుకుంటున్నారు? అన్న ప్రశ్నకు సమాధానం దాటవేశారు.


"రాజ్‌నాథ్‌ని కలిశాను. రాష్ట్రం సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు ఆయనతో రాజకీయాలు ఎలా మాట్లాడగలను. సమస్యలు ముగియగానే తప్పకుండా దేశంపై దృష్టి సారిస్తాను. దానికి ఇంకా సమయం ఉం ది'' అని వివరించారు. "ఎన్డీయే కన్వీనర్‌గా మిమ్మల్ని చూడొచ్చా?''.."మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపై మీ వైఖరి ఏమిటి?'' అంటూ పలు విధాలుగా ప్రశ్నించినప్పటికీ చంద్రబాబు నవ్వుతూ.. వ్యాఖ్యానించేందుకు సున్నితంగా తిరస్కరించారు. విలేకరులు తెలివైన వారని, అయితే ఇప్పుడు తాను రాజకీయాల గురించి మాట్లాడదల్చుకోలేదని బదులిచ్చారు.

"ఎన్డీయే కన్వీనర్‌గా మిమ్మల్ని చూడొచ్చా?''.."మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపై మీ వైఖరి ఏమిటి?''

హైదరాబాద్, సెప్టెంబర్ 22 : ఎన్నికల ముందే కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు కలుసుకున్నాయని, వైసీపీ ఎందుకోసం పనిచేస్తోందో అర్థమవుతోందని, జగన్మోహన్‌రెడ్డిని బెయిల్‌పై బయటకు తెచ్చేందుకే కాంగ్రెస్‌తో కలిసిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదివారం అన్నారు.  కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల సతీమణులు రాష్ట్రపతిని కలవడం ఆ రెండు పార్టీలు ఒక్కటే అనడానికి నిదర్శనమని అన్నారు.

కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కలిసి నాటకమాడుతున్నాయని సోమిరెడ్డి విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీల నాయకుల సతీమణులు భర్తలకు తెలియకుండా రాష్ట్రపతి వద్దకు వెళ్లారా అని ప్రశ్నించారు. కాంగ్రెసు నేతలను సీమాంధ్రలో అడ్డుకుంటుంటే వారి సతీమణులతో కలిసి ఎలా వెళ్లారని ప్రశ్నించారు. విభజన విషయంలో సీమాంధ్ర నేతలను ఒప్పించేందుకే కాంగ్రెసు పార్టీ ఆంటోని కమిటీని వేసిందని, ఇక్కడి ప్రజలను మెప్పించేందుకు ఏం కమిటీ వేస్తారని సోమిరెడ్డి ప్రశ్నించారు.

భర్తలకు తెలియకుండా రాష్ట్రపతి వద్దకు వెళ్లారా ?

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 22 : ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులను చూస్తుంటే కొన్ని సార్లు నిద్ర పోలేక పోతున్నానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం సీపీఐ జాతీయ నేత ఏబి బర్దన్‌ను కలిసిన అనంతరం బాబు మీడియాతో మాట్లాడారు. బర్దన్‌కు రాష్ట్ర పరిస్థితి వివరించానని అన్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నానని బర్దన్ చెప్పారని అన్నారు.

కాంగ్రెస్‌కు ఇప్పటికైనా కనువిప్పు కలిగిన సమస్యను పరిష్కరించాలని చంద్రబాబు నాయుడు ఆశిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. సీమాంద్రలో పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సమస్యను పరిష్కరించాల్సిన అవసరం కేంద్రానికి ఉందన్నారు.

పరిస్థితులను చూస్తుంటే కొన్ని సార్లు నిద్ర పోలేక పోతున్నా...........

రాజ్యాంగాధినేతగా జోక్యం చేసుకోండి
కేంద్రానికి ఆదేశాలు జారీచేయండి
ఇరు వర్గాలనూ పిలిచి మాట్లాడాలి
సానుకూల పరిష్కారం సాధించాలి
రెండు లేఖలు రాసినా స్పందించని ప్రధాని
చిదంబరం, షిండే బాధ్యాతారాహిత్యం
రాష్ట్రపతికి చంద్రబాబు ఫిర్యాదు
రాష్ట్రంలో పరిస్థితి వివరణ

రాష్ట్రంలో పరిస్థితి దిగజారుతోందని, తక్షణం జోక్యం చేసుకుని చిచ్చు చల్లార్చాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కోరారు. ఇరుప్రాంతాలకు చెందిన నేతలతో శనివారం ఆయన రాష్ట్రపతి ప్రణబ్‌ను కలిశారు. కేంద్రం వైఖరి వల్ల ప్రజల్లో రాజకీయ వ్యవస్థపైనే విశ్వాసం సన్నగిల్లుతోందని, ఇది ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కాదని చంద్రబాబు చెప్పారు. వివిధ జేఏసీలు, పౌర సమాజ సంస్థలు, సమస్యతో ముడిపడి ఉన్న ఇతర వర్గాలతో వెంటనే చర్చలు జరపాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి దృష్టికి తెచ్చారు.

"రాష్ట్రంలో దిగజారిన పరిస్థితులపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు ఆగస్టు 9, 29 తేదీల్లో లేఖలు రాశాను. ఉద్యమిస్తున్న వర్గాల మధ్య సయోధ్య ఏర్పర్చాల్సిన అవసరాన్ని గుర్తు చేశాను. ఇప్పటిదాకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఒక రాజనీతిజ్ఞుడిగా క్రియాశీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రధానమంత్రి.... 'ఆంటోనీ కమిటీకి చెప్పుకోండి' అని ఎన్జీవో నేతలకు సూచించడం అభ్యంతరకరమన్నారు. పార్టీ ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీని ఇతరులెలా కలుస్తారని ఆయన ప్రశ్నంచారు. అంటే విభజన వ్యవహారం కాంగ్రెస్ తన అంతర్గత సమస్యగా భావిస్తోందని అన్నారు.


"అభివృద్ది పథంలో ముందంజ వేస్తూ, శాంతియుత వాతావరణానికి పేరెన్నికగన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రం అనుసరిస్తున్న వైఖరి వల్ల కనీవినీ ఎరగని రీతిలో నష్టపోయింది. గత నాలుగుదేళ్లుగా అభివృద్ధి ఆగిపోయింది. ఉపాధి అవకాశాలపై తీవ్ర ప్రభావం పడింది. టీఆర్ఎస్‌ను విలీనం చేసుకునేందుకు కాంగ్రెస్ రాజకీయ కుతంతాలు పన్నింది. వైసీపీ, కాంగ్రెస్ కూడా కుమ్మక్కయినట్లు ఆ పార్టీల వైఖరిని బట్టి తెలుస్తోంది'' అని చంద్రబాబు రాష్ట్రపతికి తెలిపారు. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ దర్యాప్తు మందగించిందని తెలిపారు. ఈ కుమ్మక్కు వల్ల జగన్‌కు త్వరలో బెయిల్ కూడా వ స్తుందని అంటున్నారని చంద్రబాబు వివరించారు.

విభజన సమస్యను కాంగ్రెస్ తన సొంత రాజకీయ ప్రయోజనాలకోసం ఉపయోగించుకుంటోందని రాజ్యసభలో అన్ని రాజకీయ పార్టీలు విమర్శించినప్పుడు చిదంబరం నిర్లక్ష్యంగా, తప్పించుకునే ధోరణిలో సమాధానం ఇచ్చారని చంద్రబాబు ఫిర్యాదు చేశారు. షిండే, ఇతర కాంగ్రెస్ నేతలు పొంతనలేని ప్రకటనలు చేస్తూ మరింత అయోమయం సృష్టిస్తున్నారని రాష్ట్రపతికి తెలిపారు. అప్పట్లో సకల జనుల సమ్మె, ఇప్పుడు సీమాంధ్రలో ఉద్యోగుల సమ్మె గురించి వివరించారు. అన్నిరకాల ప్రజా సేవలకు పూర్తిగా విఘాతం కలుగుతోందన్నారు.

"ప్రజలు తమంతట తాము తీవ్ర ఆందోళనకు దిగారు. ఆశ్చర్యకరంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున వీధుల్లోకి వస్తున్నారు. చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. సీమాంధ్రలో కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు పోటాపోటీ ఆందోళనలు చేస్తున్నారు. దీని వల్ల ఉద్యోగుల మధ్య అశాంతి ఏర్పడి, సంబంధాలు దెబ్బతినే ప్రమాదముంది. ఇది వాంఛనీయం కాదు'' అని రాష్ట్రపతికి తెలిపారు.


రాష్ట్రపతిని, బీజేపీ, సీపీఎం నేతలను కలిసిన తర్వాత అక్కడికక్కడే చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. "రాష్ట్రంలో ముఖ్యమంత్రి పనిచేయడంలేదు. మంత్రులూ పని చేయడంలేదు. కాంగ్రెస్ తన స్వార్థ రాజకీయాలకోసం ప్రజలతో క్రూరపరిహాసం ఆడింది'' అని తెలిపారు. తాను రాజకీయాలు మాట్లాడడానికి, పొత్తుల గురించి చర్చించడానికి ఢిల్లీ రాలేదని, రాష్ట్రంలో నెలకొన్న దారుణమైన పరిస్థితిని జాతీయ స్థాయి నేతలకు వివరించేందుకే వచ్చానని తెలిపారు. జాతీయ స్థాయిలో తమ సంబంధాలను ఉపయోగించి రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దాలని బీజేపీ, ఇతర పార్టీల నేతలను కోరానన్నారు. జేఏసీల నేతలు, సమస్యతో సంబంధం ఉన్న ఇతర వర్గాలతో చర్చించడం ద్వారానే ఒక పరిష్కార మార్గం కుదురుతుందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో కాంగ్రెస్ తుఫాను సృష్టించిందని ఆయన అన్నారు. తెలంగాణలో రెండు సంవత్సరాలు ఉద్యమం జరిగి వందలాది మంది ఆత్మహత్యలకు పాల్పడితే... అదే పరిస్థితి సీమాంధ్రలో పునరావృతం అవుతోందని ఆయన చెప్పారు. రాజకీయ పార్టీల పట్ల ప్రజల్లో విశ్వాసం కోల్పోయేలా చేసిన పాపం కాంగ్రెస్‌కు దక్కుతుందన్నారు.


సీమాంధ్రలో ప్రజల ఆందోళన గురించి చంద్రబాబు తమకు వివరించారని రాజ్‌నాథ్ మీడియాతో అన్నారు. తెలంగాణకు సంబంధించి బీజేపీ వైఖరి మారదని... అదే సమయంలో సీమాంధ్రను పట్టించుకుని తీరాల్సిందేనని స్పష్టం చేశారు. చంద్రబాబు ద్వారా రాష్ట్రంలోని పరిస్థితులపై విస్తృత సమాచారం అందిందని చెప్పారు. ఈ విషయం మినహా... పొత్తులు, ఇతర రాజకీయ అంశాలు తమ మధ్య చర్చకు రాలేదన్నారు.


రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలని, ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని సీపీఎం నేత ప్రకాశ్ కరత్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రతిష్టంభన గురించి, సీమాంధ్రలో ఆందోళన గురించి చంద్రబాబు వివరించారన్నారు. చంద్రబాబుతోపాటు ఢిల్లీకి వచ్చిన నేతల్లో నామా నాగేశ్వరరావు, కొనకళ్ల నారాయణ, సీఎం రమేశ్, సుజనా చౌదరి, నిమ్మల కిష్టప్ప, గుండు సుధారాణి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కోడెల శివప్రసాద్ రావు, దయాకర్ రావు, సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పయ్యావుల కేశవ్, మోత్కుపల్లి నర్సింహులు, రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

టీఆర్ఎస్‌ను విలీనం చేసుకునేందుకు కాంగ్రెస్ రాజకీయ కుతంతాలు పన్నింది.

September 21, 2013

 టెన్‌జన్‌పథ్, లోటస్‌పాండ్ మధ్య మద్యవర్తిత్వానికే కేవీపీని సీబీఐ వదిలేసిందని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. మొదట కేవీపీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కేవీపీ పాత్రపై సూరీడు సాక్ష్యం చెప్పినా సీబీఐ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. జగన్ డబ్బును విదేశాలకు చేరవేసిన మయాంక్ మెహతా హాంకాంగ్ నుంచి రాలేదని సీబీఐ కోర్టు చెప్పిందని...ఇప్పుడు దర్యాప్తు అయిపోయిందని ఎలా ప్రకటించిందని వర్లరామయ్య ప్రశ్నించారు.

జగన్ డబ్బును విదేశాలకు చేరవేసిన మయాంక్ మెహతా హాంకాంగ్ నుంచి రాలేదని సీబీఐ కోర్టు చెప్పింది


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా బాబు మీడియాతో మాట్లాడుతూ మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉంటానని, ప్రధాన రాజకీయ నేతలందరినీ కలువనున్నట్లు తెలిపారు. వారికి రాష్ట్రంలోని పరిస్థితులను వివరిస్తానన్నారు. ఎవరితోనూ రాజకీయాలు మాట్లాడనని చంద్రబాబు తెలిపారు. మరికాసేపట్లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో చంద్రబాబు భేటీ కానున్నారు.

ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు




రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల నేతలతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శనివారం ఢిల్లీ వెళ్తున్నారు. పార్టీ ఎంపీలు కాకుండా సీమాంధ్ర ప్రాంతం నుంచి ఆరుగురు, తెలంగాణ ప్రాంతం నుంచి ఆరుగురు నేతలు ఆయన వెంట ఈ యాత్రలో పాల్గొంటున్నారు. సీమాంధ్ర నుంచి కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, కోడెల శివ ప్రసాదరావు, సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, అయ్యన్న పాత్రుడు, పయ్యావుల కేశవ్, తెలంగాణ నుంచి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఎల్. రమణ, రావుల చంద్రశేఖరరెడ్డి, మహేందర్ రెడ్డి ఢిల్లీ వెళుతున్నారు. శనివారం సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకోనున్నారు. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ మాత్రమే కోరినట్లు తెలుగుదేశం కార్యాలయ వర్గాలు తెలిపాయి.

తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఆయన రాష్ట్రపతికి వివరించనున్నట్లు తెలిసింది. శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు ఢిల్లీ చేరుకుంటున్న చంద్రబాబు బృందం సోమవారం ప్రధాని అధ్యక్షతన జరిగే జాతీయ సమగ్రతా మండలి సమావేశం తర్వాత తిరుగు ప్రయాణమవుతుంది. కాగా ఈ పర్యటనలో భాగంగా బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, సీపీఐ, సీపీఎం, జనతాదళ్(ఎస్), బీజేడీ, అకాలీదళ్, ఐఎన్ఎల్‌డీ, ఆర్ఎల్‌డీ, ఎస్‌పీ తదితర పార్టీల నేతలను కూడా కలిసి తెలంగాణ అంశం, ఇతర రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లు తెలిసింది.
 

నేడు రాష్ట్రపతితో బాబు భేటీ

September 20, 2013

తాము మేధావులు కామని, కాని తెలంగాణ,ఆంద్రలలో జరిగిన అభివృద్దిపై చర్చకు కెసిఆర్ వస్తారా అని టిడిపి ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి సవాల్ చేశారు. హైదరాబాద్ లో ఎంత అభివృద్ది చేశారో,దానిలో ఎవరి వాటా ఉందో చెప్పడానికి సిద్దంగా ఉన్నామని ఆమె అన్నారు. లక్షలాది జనం ఇప్పుడు సీమాంద్రలో రోడ్లపైకి వచ్చారంటే పనిపాట లేక వచ్చారని అనుకున్నారా అని ఆమె అన్నారు. కెసిఆర్ కన్నా ఎక్కువగా పిట్టకధలు తాము కూడా చెప్పగలమని ఆమె అన్నారు.

కెసిఆర్ కన్నా పిట్టకదలు చెప్పగలను

జార్కండ్ మాజీ ముఖ్యమంత్రి ని మూడున్నరేళ్లు జైలులో ఉంచితే, జగన్ ను అప్పుడే వదలిపెడతారా అని టిడిపి ప్రశ్నించింది. జగన్ ను పదహారు నెలలకే వదలిపెట్టే ప్రయత్నం చేస్తోందని రాజకీయాలకు పనికి వస్తారనే అలా చేస్తున్నారని టిడిపి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జగన్ కేసులో ఒక్క ఆస్తి కూడా జప్తు చేయలేదని ఆయన విమర్శించారు. పేదవాడు దొంగతనం చేస్తే జైలులో పెడతారని, వేల కోట్లు దోచుకున్న వ్యక్తిని వదలిపెడతారా అని ఆయన ప్రశ్నించారు. పొట్లూరు వరప్రసాద్ పేరును ఛార్జీషీట్లలో ఎందుకు చేర్చలేదని ఆయన అన్నారు. సండూర్ పవర్ పై కూడా కేసు పెట్టలేదని ఆయన అన్నారు. మంత్రి గీతారెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.

పేదవాడు దొంగతనం చేస్తే జైలులో పెడతారని, వేల కోట్లు దోచుకున్న వ్యక్తిని వదలిపెడతారా



అక్రమాస్తుల కేసులో అరస్టయి చంచల్‌గూడ జైల్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి త్వరగా బెయిల్‌పై బయటకు రావడం కోసమే హడావుడిగా సీబీఐ చార్జీషీట్లను దాఖలు చేసిందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో గతంలో సిబిఐ అదనపు సంచాలకులుగా పని చేసిన లక్ష్మీ నారాయణ ఏడాదిన్నరకు పైగా విచారణ జరిపి ఐదు ఛార్జీషీట్లు వేస్తే, తర్వాత వచ్చిన అధికారులు మాత్రం వారం రోజుల్లోనే ఐదు ఛార్జీషీట్స్ వేశారని అన్నారు. జగన్ బెయిల్ కోసమే తాజాగా హడావుడిగా ఐదు ఛార్జీషీట్లు వేశారని ఆరోపించారు.

గతంలో ఐదు ఛార్జీషీట్లు వేసేందుకు అన్ని రోజులు తీసుకుంటే తాజా ఐదు ఛార్జీషీట్లను వారం రోజుల్లోనే ఎలా వేశారని యనమల ప్రశ్నించారు. జగన్ ఓ విషపు చేప అని ఆయన బయటకు వస్తే చాలా ప్రమాదమన్నారు. జగన్ లాంటి విషపు చేప సముద్రంలో ఉన్నా, చెరువులో ఉన్నా తోటి చేపలను చంపేస్తుందన్నారు. అలాగే అతను జైలు నుండి బయటకు వస్తే సమాజాన్ని అవినీతి విషంతో నింపి వ్యవస్థలను అంతం చేస్తాడని ఆయన ఆరోపించారు. సీమాంధ్రలో ఉద్యమాలను పట్టించుకోకుండా ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.

జగన్ లాంటి విషపు చేప సముద్రంలో ఉన్నా, చెరువులో ఉన్నా తోటి చేపలను చంపేస్తుంది

September 19, 2013




  ఈ నెల 21వ తేదీన ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలిసి రాష్ట్ర పరిస్థితులను వివరిస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించా రు. 'అందరికీ న్యాయం జరగాలని టీడీపీ కోరుకుంటోం ది. ఎన్నికల కోసమో, రాజకీయ లబ్ధికోసమో విద్వేషాలు రగిలించడం సరికాదు. మీకు ఇబ్బంది ఉంటే పార్టీలను పక్కనపెట్టండి. ఇరువైపులా జేఏసీలు, విద్యార్థులు, ప్రజా సంఘాలను పిలిచి మాట్లాడండి. సమస్యలు తెలుసుకొని పరిష్కరించండి. రాష్ట్రపతికి ఇదే విజ్ఞప్తి చేస్తాను' అని వెల్లడించారు. ఎక్సయిజ్ శాఖలో డిప్యూటీ కమిషనర్ (విజయవాడ)గా చేసి ఇంకా పదేళ్ళు సర్వీసు ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన బాణోత్ మోహన్‌లాల్ గురువారం ఇక్కడ టీడీపీలో చేరారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణను అభివృద్ధి చేసింది, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సమస్యలపై పోరాడింది ఒక్క టీడీపీయేనన్నారు. తెలంగాణ ప్రజల హృదయాల నుం చి తమను దూరంచేయడం ఎవరితరమూ కాదన్నారు. బయ్యారంలో లక్షన్నర ఎకరాల ఇనుప ఖనిజం గనులను వైఎస్ తన అల్లుడికి రాసిచ్చినప్పుడు టీడీపీ ఒక్కటే నిలబడి పోరాడిందని, ఆ రోజు టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. 'మూడేళ్లు తెలంగాణలో ఆందోళనలు. కొందరు చనిపోయారు. ఇప్పుడు రెండో వైపు ఉద్యమాలు. సమస్య పరిష్కరించాలని మనం కోరితే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేశారు.

చిత్తశుద్ధి ఉంటే ఈ తొమ్మిదేళ్లు ఏంచేశారు? సరిగ్గా ఎన్నికల ముందే గుర్తుకొచ్చిందా? ప్రకటన చేసిన నోటితోనే టీఆర్ఎస్ విలీనం గురించి మాట్లాడతారు. విలీనం కోసం చేసిన ప్రకటనా లేక ప్రజల కోసం చేసిందా? జగన్ పార్టీ డీఎన్ఎ, తమ డీఎన్ఎ ఒకటేనని గొప్పగా చెప్పుకొంటున్నారు. దొంగల డీఎన్ఎ మీదీ ఒకటేనంటే ఇద్దరూ ఒకటేనన్నమాట. మొద్దబ్బాయి ప్రధాని కావాలి... ఇక్కడ దొంగబ్బాయి సీఎం కావాలి. ఎలాగైనా టీడీపీ గెలవకూడా చేయాలి. ఖబడ్దార్... మీరెన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్‌కు సమాధానం చెబుతాం. తిరుగులేని శక్తిగా అవతరిస్తాం. ఈ సారి టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరు' అని ఆయన ప్రకటించారు.

ఈసారి టీడీపీ గెలిస్తే ఐదు వందల జనాభా ఉన్న ప్రతి గిరిజన గ్రామాన్ని పంచాయతీ చేస్తామని, జిల్లా యూనిట్‌గా గిరిజనులకు రిజర్వేషన్లు అమలు చేస్తామని, గిరిజనుల పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య అందిస్తామని, గిరిజన రైతులకు రూ.ఐదు లక్షల వరకూ పూచీలేని రుణం ఇప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మోహన్‌లాల్‌ను వరంగల్ జిల్లా మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తెలంగాణలో ఈసారి మెజారిటీ ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు గెలుస్తామని టిడిపి తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు ధీమా వ్యక్తం చేశారు. కాగా, చంద్రబాబు ఈ నెల 21న ఢిల్లీ వెళ్లి 23వరకు అక్కడే ఉంటారు. 21న ఆయనకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ లభించగా, వివిధ పార్టీల నేతలను కలిసేందుకు 22న అక్కడే ఉంటున్నారు. మరునాడు జాతీయ సమగ్రతా మండలి సదస్సులో పాల్గొంటారు.


courtesy: andhrajyothy

. తెలంగాణ ప్రజల హృదయాల నుం చి తమను దూరంచేయడం ఎవరితరమూ కాదు...........

'రాష్ట్రం తగలబడుతుంటే దానిని వదిలిపెట్టి చంద్రబాబు తన ఆస్తులు ఇప్పుడు ఎందుకు ప్రకటించాలని జగన్ పార్టీ నేతలు అడుగుతున్నారు. రాష్ట్రం తగలబడుతుంటే ఇప్పుడు జగన్ బెయిల్‌కు ఏం తొందర వచ్చిందని దాని కోసం మీరంతా తిరుగుతున్నారు? ఆయన ఇంకో ఏడాదో, ఆరు నెల్లో జైల్లో ఉంటే ఏం కొంపలంటుకు పోవుగదా! వాళ్ళు కూడా టైం ప్రకారం భోజనం, టిఫిన్ పెడతానే ఉంటారు. ఇప్పుడు ఆయన బయటకు వచ్చి చేసేది కూడా ఏమీ లేదు' అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అనుముల రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. అవినీతిపై పోరాటంలో ఆదర్శంగా నిలవాలన్న ఉద్దేశంతో చంద్రబాబు తన ఆస్తులు, కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు ప్రకటించారని, జగన్ సహా వైఎస్ కుటుంబంలోని వారంతా తాము కూడా తమ ఆస్తులు ప్రకటించి సగర్వంగా నిలబడే బదులు చంద్రబాబును తిట్టిపోయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. 'చంద్రబాబు తనకు ఉన్న మొత్తం ఆస్తుల వివరాలు ఇచ్చేశారు. ఇంకా తనకు ఏవైనా ఉంటే చూపించమని సవాల్ విసిరారు. దాని జోలికి పోకుండా కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లు అందులో ఏవో వెతికే ప్రయత్నం చేస్తున్నారు. తన ఆస్తులు తాను కొన్ననాటి రేటును చంద్రబాబు చెప్పారు. ఈ రోజు రేటు చెప్పలేదు. మార్కెట్ ధరలు రోజుకో రకంగా మారుతుంటాయి. వాటిని అమ్మితే నిజంగా ఆ రోజు ధర తెలుస్తుంది. జగన్ కుటుంబంలో ఏ ఒక్కరూ తమ ఆస్తులు చెప్పరు...తమకు ఎన్ని కంపెనీలుఉన్నాయో...వాటికి అన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పరు. ఎవరైనా స్వచ్ఛందంగా చెబితే వారిపై ఒంటి కాలిపై లేస్తున్నారు. తమను కూడా ప్రజలు నిలదీస్తారేమోనన్న భయం వారిని పట్టుకొంది' అని రేవంత్ విమర్శించారు.
వైఎస్ కుటుంబంలోని వారు తమ ఆస్తులేగాక చివరకు తమ కుటుంబ సభ్యులు ఎవరో కూడా చెప్పుకోలేకపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 'షర్మిల తాను రాజన్న కూతురునని...జగనన్న చెల్లెలని చెప్పుకొంటారుగాని బ్రదర్ అనిల్ భార్య అని ఎక్కడా చెప్పుకోరు. లక్ష్మీ పార్వతి ఎన్టీ రామారావు కుటుంబంలో చేరి చిచ్చు పెట్టినట్లు షర్మిల బ్రదర్ అనిల్ కుటుంబంలో చేరి చిచ్చు పెట్టారు. అనిల్ భార్యా బిడ్డలకు షర్మిల చేసింది ద్రోహం కాదా? చంద్రబాబు కోడలు బ్రాహ్మణి పెట్టుకొన్న వజ్రాల గొలుసు లెక్కేదంటూ జగన్ పార్టీ నేతలు కుంటి కూతలు కూస్తున్నారు. బ్రాహ్మణి తాత ఒక పెద్ద అగ్ర హీరో. ముఖ్యమంత్రిగా చేశారు. ఆమె తండ్రి సినీ పరిశ్రమలో మరో పెద్ద హీరో. ఆమెకు వజ్రాల గొలుసు కొనుక్కొనే తాహతు లేదా? జగన్‌ను చూడటానికి భారతి జైలుకు వెళ్ళేటప్పుడు పెట్టుకొనే వజ్రాల దిద్దుల లెక్కలు మీరు ఏనాడైనా చెప్పారా? అధికారాన్ని అడ్డు పెట్టుకొని లక్ష కోట్లు దోచుకొన్న మీరు కూడా ఇతరుల గురించి మాట్లాడతారా? మీరు అబద్ధాలు మాట్లాడటం మానకపోతే మేం మీ గురించి మరిన్ని నిజాలు మాట్లాడాల్సి ఉంటుంది' అని ఆయన హెచ్చరించారు.
గుమస్తా ఉద్యోగం ఇచ్చిన గని యజమాని వెంకట నరసయ్యను చంపి ఆ గనిని హస్తగతం చేసుకొన్న వైఎస్ కుటుంబానికి ఉన్న నేర చరిత్ర తరాల తరబడి కొనసాగుతోందని, చంద్రబాబు కుటుంబానికి అటువంటి నేర చరిత్ర లేదని జగన్ పార్టీ నేతలు గుర్తించాలని ఆయన సూచించారు.

జగన్ బెయిల్‌కు ఏం తొందర వచ్చిందని దాని కోసం మీరంతా తిరుగుతున్నారు?

September 18, 2013


రాష్ట్రాన్ని దోచుకున్నది వైఎస్ కుటుంబసభ్యులేనని, సిగ్గులేకుండా నాయకులుగా చెలామణి అవుతున్నారని టీడీనీ విమర్శించింది. ఇలాంటి వ్యక్తులను ప్రజలు తరిమికొట్టాలని టీడీపీ నేతలు మోత్కుపల్లి నర్శింహులు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి కాకమునుపు లేని భవంతులు, ఇప్పుడు ఎలా వచ్చాయో జగన్ సోదరి షర్మిలా చెప్పాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం జగన్‌ను కాపాడే ప్రయత్నం చేస్తోందని టీడీపీ ఆరోపించింది.

బుధవారం సాయంత్రం టీడీపీ నేతలు గవర్నర్ నరసింహన్‌ను కలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి గీతారెడ్డిని బర్త్‌రఫ్ చేయాలని కోరామని అన్నారు. దీనిపై స్పందించిన గవర్నర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రుల విషయంలో గతంలో ఉన్న నిబంధనలనే పాటిస్తామని గవర్నర్ చెప్పారని వారన్నారు. షర్మిలా, ఆమె భర్త బ్రదర్ అనీల్‌కుమార్‌కు సంబంధించిన కంపెనీలపై సీబీఐ విచారణ జరపాలని టీడీపీ డిమాండ్ చేసింది.
courtesy: andhrajyothy

. షర్మిలా, ఆమె భర్త బ్రదర్ అనీల్‌కుమార్‌కు సంబంధించిన కంపెనీలపై సీబీఐ విచారణ !