October 30, 2012


30వ రోజు పాదయాత్ర రూట్ మ్యాప్ పత్రికా ప్రకటన

కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోని ప్రభుత్వం
అధికారంలోకి వస్తే రైతు రుణాలు మాఫీ
9 గంటలు కరెంట్ ఇచ్చిన ఘనత టీడీపీదే
తొలి సంతకం రుణమాఫీపైనే

కష్టాల్లో ఉన్న రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవడంలేదని, రైతులపట్ల నిర్లక్ష్యం వహిస్తుదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వ్యాఖ్యానిస్తూ, పనికిమాలని ప్రభుత్వమని మండిపడ్డారు. రైతులు తీసుకున్న బ్యాంక్ రుణాలను కట్టవద్దని, టీడీపీ అధికారంలోకి వస్తే రుణాలను మాఫీ చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

'వస్తున్నా..మీకోసం' యాత్రలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబునాయుడు మక్తాల్ నియోజకవర్గం, ఆత్మకూరులో మంగళవారం ఆయన మాట్లాడుతూ రైతులకు టీడీపీ అధికారంలోకి రాగానే తొలి సంతకం రుణ మాఫీపైనే అని అన్నారు. వర్షాకాలంలోనే రోజుకు మూడు గంటలు విద్యుత్ ఇస్తే ఇక వచ్చేది వేసవి కాలం ఇక కరెంట్ పరిస్థితి ఎలా ఉంటుందో ప్రజలే ఊహించాలని ఆయన అన్నారు.
టీడీపీ హాయాంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తొమ్మిది గంటలపాటు విద్యుత్ ఇచ్చామని ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు గుర్తుచేశారు. రాష్ట్రంలో నాలుగేళ్లలో కరువు వచ్చినా రైతులకు విద్యుత్ సరఫరా చేశామని ఆయన చెప్పారు. రైతుల కష్టాలు చూస్తేంటే గుండె తరుక్కుపోతుందని, మీకు అండగా టీడీపీ ఉంటుందని, అధికారంలోకి రాగానే రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని చంద్రబాబు మరోసారి ప్రకటించారు.

కాగా టీ డీపీ అధినేత చంద్రబాబు నాయుడు 29వ రోజు పాదయాత్ర మంగళవారం ఉదయం జిల్లాలోని మక్తల్ నియోజకవర్గం ఆత్మకూరు మండలం మల్లాపూర్ నుంచి ప్రారంభమైంది. అక్కడి ఆంజనేయ స్వామి దేవాలయంలో బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు దేవస్థానానికి గోదానం చేశారు. అక్కడి నుంచి ఆత్మకూర్, కానాపూర్, సింగంపేట క్రాస్, మస్తీపూర్ గేట్, అమరచింత, వీప్లనాయక్ తండా, చంద్రానాయక్ తండా ద్వారా మద్దూర్ చేసుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ఈ రోజు మొత్తం 17 కి.మీ మేర చంద్రబాబు పాదయాత్ర చేయనున్నారు.

రైతులు తీసుకున్న బ్యాంక్ రుణాలను కట్టవద్దు, టీడీపీ అధికారంలోకి వస్తే రుణాలను మాఫీ..30.10.2012


28వ రోజు పాదయాత్ర పోటోలు -- (Part-3) 29.10.2012

టీ డీపీ అధినేత చంద్రబాబు నాయుడు 28వ రోజు పాదయాత్ర మంగళవారం ఉదయం జిల్లాలోని మక్తల్ నియోజకవర్గం ఆత్మకూరు మండలం మల్లాపూర్ నుంచి ప్రారంభమైంది. అక్కడి ఆంజనేయ స్వామి దేవాలయంలో బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు దేవస్థానానికి గోదానం చేశారు. అక్కడి నుంచి ఆత్మకూర్, కానాపూర్, సింగంపేట క్రాస్, మస్తీపూర్ గేట్, అమరచింత, వీప్లనాయక్ తండా, చంద్రానాయక్ తండా ద్వారా మద్దూర్ చేసుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. ఈ రోజు మొత్తం 17 కి.మీ మేర చంద్రబాబు పాదయాత్ర చేయనున్నారు.

 29వ రోజు చంద్రబాబు పాదయాత్ర ప్రారంభం