March 3, 2013

ఆరోగ్యశ్రీ కాదు.. అవినీతి సిరి!
ఏజెన్సీ ముసుగులో నిలువు దోపిడీ
ఊరికి ఒక ఆపరేషన్ చేసి ఆర్భాటం..
పేదల ఆరోగ్యంతో చెలగాటం
ఆరోగ్య బీమా పథకం తెస్తామని హామీ



మచిలీపట్నం/పమిడిముక్కల, మార్చి 3 వైఎస్ హయాంలో రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ..'ప్రచార శ్రీ'గా మారిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. పేదలకు కార్పొరేట్ వైద్యం చేయిస్తామని చెప్పి, వారి ఆరోగ్యంతో చెలగాటమాడారని, కోట్లాది రూపాయలు దండుకున్నారని ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం వద్ద ఆయన పాదయాత్ర ప్రారంభించారు. రైతుల ముఖాముఖితలోనూ, అనంతరం జరిగిన బహిరంగ సభల్లోనూ ఆయన 'ఆరోగ్య శ్రీ' అమలు తీరును తీవ్రంగా ఆక్షేపించారు.

" ఆరోగ్యశ్రీ పేరుతో ఒక ఏజెన్సీ ప్రారంభించారు. గత ఏడేళ్లుగా దాని ద్వారా రూ.2,900 కోట్లు వ్యయం చేశారు. ఏజెన్సీతో లాలూచీ పడి కోట్లాది రూపాయల ప్రజల సొమ్మును దోచుకున్నారు. ఊరికొక ఆపరేషన్ చేసి పథకం బాగా పని చేస్తున్నదన్న అపోహ కల్పించారు. నిజమైన రోగుల్లో చాలామందిని గాలికి వదిలేశారు'' అని విమర్శించారు. అధికారంలోకి వస్తే ఆరోగ్యశ్రీ పథకానికి దీటుగా ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెడతానన్నారు. జ్వరం దగ్గర నుంచి అన్ని రోగాలను ఈ పథకం కిందకు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలో ఉండగా, ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేశామని, బడ్జెట్‌లో ఆరు శాతం నిధులు కేటాయించామని చెప్పుకొచ్చారు.

ఇప్పుడు మూడున్నర శాతానికి మించి నిధులు కేటాయించడం లేదన్నారు. రాష్ట్రంలో 2,600 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అవసరం కాగా, 1600 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మాత్రమే పనిచేస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ధర్మ పోరాటం చేస్తున్న తనను.. నాడు ఎన్టీరామారావును ఎలా ఆశీర్వదించారో అదేవిధంగానే నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. దొంగలు ముసుగేసుకుని తిరుగుతున్నారని, వారి మాటలను నమ్మవద్దన్నారు. " జైల్లో ఉన్న నాయకులను ఆదర్శంగా తీసుకుంటే మీ బిడ్డలు కూడా జైలు కు వెళతార''ని పేర్కొన్నారు. పంటలకు నీరు ఇవ్వకుండా కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం ఏమొహం పెట్టుకుని శిస్తు వసూలు చేస్తోందో అర్థం కావడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాజిక న్యాయం కొరవడిందన్నారు. ఎస్సీ నాయకుడు బాలయోగికి స్పీకర్ పదవి ఇచ్చిన చరిత్ర టీడీపీకే దక్కిందని గుర్తుచేశారు.

వైఎస్ హయాంలో కోట్లు లూటీ..

పేరుకే జమిందారీ హోదా. కోటు లోపలి చొక్కా చూస్తే అన్నీ చిరుగులే. ఆ ఊరికి వెళ్లినప్పుడు కనిపించిన దృశ్యం కూడా ఇలాంటిదే. ఊరిలో చాలా మిద్దెలు కనిపించాయి. ఈ ఊరికి ఒక మంచి గతమున్నదనేందుకు ఈ మిద్దెలే సాక్ష్యం. కనుమూరులో ఎదురైన రైతులకూ.. వారుంటున్న నివాసాలకూ పొంతన లేదు. మొదట కొంచెం ఆశ్చర్యం కలిగింది. ఆ రైతులతో మాట్లాడిన తరువాత నా సందేహాలన్నీ పటాపంచలయ్యాయి.

వారంతా ఒకప్పుడు మోతుబరి రైతులే. అప్పుడు కట్టుకున్న మిద్దెలివి. ఆ తరువాత ఓడలు బళ్లయిపోయాయి. కానీ, ఆ ఛాయలు మిద్దెల రూపంలో మిగిలి ఉన్నాయి. వాళ్లతో మాట్లాడుతూనే ఇళ్లవైపు చూశాను. గోడలు బీటలు వారి ఉన్నాయి. వాటికి మరమ్మతులు చేయించడానికి తమకు స్తోమత లేదని చెప్పుకొచ్చారు. నలుగురికి పని చూపించి, తిండి పెట్టిన చేతులివేనా!

ఆరోగ్య శ్రీ ఉందని అసలు వీళ్లకు తెలుసా? మంచం పట్టిన ఆ ఊరిని చూసినప్పుడు కలిగిన అనుమానమిది! ఊరంతా మంచం పట్టింది. మందూమాకు వేయాల్సిన ఆసుపత్రులు పడకేశాయి. కూలిలో చాలా భాగం ఒళ్లు బాగు చేయించుకోవడానికే పోతున్నదట. కాస్త స్తోమత ఉన్నవారు.. సంపాదించిన ఆ కాస్త డబ్బునూ జబ్బులకు పోయాల్సి వస్తోంది.

ఒక కుటుంబం ఒక ఏడాదిలో ఆస్పత్రులకు ఖర్చు పెట్టింది అక్షరాల రెండు లక్షల ఇరవై వేలు. ఆ ఇంటి యజమాని వైద్య బిల్లులు చూపిస్తుంటే ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు. వీరిలో ఎక్కువమంది ఆరోగ్య శ్రీకి అర్హులే. కార్పొరేట్ వైద్యం అవసరం అయినవారే. పంటపై తీసేది తక్కువ.. రోగాలకు పోయేది ఎక్కువగా ఉన్నదని కపిలేశ్వరపురంలో ఆ రైతు వాపోయాడు. ఇంకెక్కడి వ్యవ'సాయం'?

ఇంకెక్కడి వ్యవ'సాయం'?

దండం పెడతాం.. చేతులు కలపండి: టీడీపీ
సీఎం, పీసీసీ చీఫ్‌ల వైఖరిపై ధ్వజం..
టీఆర్ఎస్ తీరుపైనా మండిపాటు

బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీం తీర్పు వల్ల ఉత్తర తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వాదిస్తున్న టీడీపీ.. ఈ అంశంపై ప్రభుత్వాన్ని కదిలించేందుకు క్షేత్రస్థాయి ఉద్యమాలకు పిలుపునిచ్చింది. సోమవారం నుంచి గోదావరి బేసిన్‌లోని ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ధర్నాలు, ప్రదర్శనలు జరపాలని ఆ పార్టీ నిర్ణయించింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లో మండల స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు టీడీపీ నేతలు ప్రకటించారు.

ఆయా జిల్లాల కలెక్టరేట్లు, ఆర్డీవో కార్యాలయాల ముందు ఆందోళన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. అంతకన్నా ముందే ముఖ్యమంత్రికి తమ డిమాండ్లపై వినతిపత్రం సమర్పించాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. శనివారం ఇక్కడ ఎన్టీఆర్ భవన్‌లో తెలంగాణ ప్రాంత నేతలు తుమ్మల నాగేశ్వరరావు, ఎర్రబెల్లి దయాకరరావు, ఇ. పెద్దిరెడ్డి, వేనేపల్లి చందర్రావు విలేకరులతో మాట్లాడారు. 'సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ప్రభుత్వంలోని పెద్దలు మాట్లాడిన తీరును చూసి ప్రజలు అసహ్యించుకొంటున్నారు. బాబ్లీ వల్ల ఏ నష్టం లేదని వాదిస్తున్నారు. అదే నిజమైతే బాబ్లీకి వ్యతిరేకంగా సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లారు? ' అని తుమ్మల నాగేశ్వరరావు ప్రశ్నించారు.

కాంగ్రెస్‌తో కలిసి అధికారం పంచుకొని ఆ మత్తులో జోగుతున్న టీఆర్ఎస్ తెలంగాణ ప్రయోజనాలను వదిలిపెట్టి బాబ్లీ నిర్మాణాన్ని సమర్థించిందని, ఈ నష్టానికి పాపం అంతా ఆ పార్టీదేనని ఆయన ధ్వజమెత్తారు. సుప్రీం కోర్టు తీర్పు వల్ల ఉత్తర తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుంటే సీఎం, పీసీసీ అధ్యక్షుడు బలుపుతో మాట్లాడుతున్నారని ఎర్రబెల్లి దయాకరరావు మండిపడ్డారు. 'బాబ్లీ సహా మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 13 అక్రమ ప్రాజెక్టుల సమాచారాన్ని మేం కేంద్ర జల సంఘానికి ఇచ్చాం. అవి చెక్‌డ్యాములని ఆ రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలు సమాధానం ఇచ్చింది. దేశంలో నదీ జలాలపై వేసిన కమిటీలేవీ పనిచేయడం లేదు. అవి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. బాబ్లీ ప్రాజెక్టును కేంద్రం స్వాధీనం చేసుకొని తన ఆధీనంలో నిర్వహించాలి. అప్పుడే మన రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది.

బాబ్లీపై రాష్ట్రం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి. అఖిలపక్షం సమావేశం నిర్వహించాలి. ఈ ప్రాజెక్టు కోసం పోరాటంలో మాకు పేరు వస్తోందన్న ఏకైక కారణంతో టీఆర్ఎస్ వంటి పార్టీలు బాబ్లీని సమర్థిస్తున్నాయి. మాకు ఏ పేరూ అక్కర్లేదు. చేతులెత్తి మొక్కుతున్నాం.. అన్ని పార్టీలూ కలిసి రావాలి. అందరం కలిసి పోరాడదాం. ప్రభుత్వం మెడలు వంచుదాం' అని ఎర్రబెల్లి పిలుపునిచ్చారు.

ఎత్తిపోతల పథకాల్లో కొత్త టెక్నాలజీ వచ్చిన తర్వాత వందల టీఎంసీల నీటిని తేలిగ్గా తోడేయగలుగుతున్నారని, పేరుకు బాబ్లీ ప్రాజెక్టు సామర్థ్యం రెండు టీఎంసీలే అన్నా దాని ఆధారంగా వందల టీఎంసీల నీటిని ఎగువన వాడుకొనే పరిస్ధితి ఉందని పెద్దిరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వల్లనే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ముంపు ప్రాం తంలో మహారాష్ట్ర బాబ్లీప్రాజెక్టు నిర్మించిందని ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేష్ అన్నారు. శనివారం ఆయన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో విలేకరులతో మాట్లాడారు. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణంపై టీడీపీ తరపున మరోసారి సుప్రీంను ఆశ్రయిస్తామన్నారు.

పోరాటానికి కలిసి రండి

ఒక్కో ముస్లింలకు రెండు వందలేనా?

బడ్జెట్‌లో ముస్లింల సంక్షేమానికి ఒక్కొక్కరికి కేవలం రూ. 200 చొప్పున కేటాయించారని, ఇంత దారుణం మరొకటి ఉండబోదని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. ప్రభుత్వ చమురు కంపెనీలు నష్టాల్లో ఉన్నాయని సాకు చెబుతూ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతోందని మండిపడింది. శనివారం ఆ పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు లాల్‌జాన్ భాషా, మీడియా విభాగం సభ్యుడు సలాం, పొలిట్ బ్యూరో సభ్యుడు దాడి వీరభద్రరావు వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు.

"ప్రభుత్వ లెక్కల ప్రకారమే దేశంలో 15 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. వారి సంక్షేమానికి కేవలం రూ. 3 వేల కోట్లు కేటాయించారు. అంటే అది ఒక్కొక్కరికి రూ.200 వస్తుంది. మైనారిటీలపై వివక్షకు ఇదే నిదర్శనం. నా కోటా కింద వచ్చే రూ.200లను ఆర్థిక మంత్రికే పంపుతాను. ఆయననే ఉంచుకోమనండి'' అని బాషా అన్నారు. ఇతర దేశాల్లో ఉంటున్న ముస్లింలు సంపాదిస్తూ పంపుతున్న సొమ్ముపై పన్ను రూపేణా ప్రభుత్వానికి చాలా ఆదాయం వస్తోందని... అయినా వారి కోసం డబ్బు వెచ్చించాలంటే ప్రభుత్వానికి మనసు రావడం లేదని విమర్శించారు.

కాగా.. ప్రభుత్వ చమురు కంపెనీలు లాభాలు ప్రకటిస్తుంటే.. ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతోందని దాడి వీరభద్రరావు పేర్కొన్నారు. "ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు 2011-12లో రూ. 3955 కోట్ల లాభం వచ్చింది. బీపీసీఎల్‌కు రూ. 6259 కోట్లు లాభం వచ్చింది. కానీ, వాటికి నష్టాలు వస్తున్నాయని కేంద్రం చెబుతోంది'' అని ఆయన ఆరోపించారు. యూపీఏ అధికారంలోకి అధికారంలోకి రాకముందు పెట్రోలు రూ. 37 ఉంటే ఇప్పుడు రూ. 77 అయిందని.. డీజిల్ రూ. 24 నుంచి రూ. 52కు పెరిగిందని చెప్పారు.

మైనారిటీలపై కేంద్రం వివక్ష: టీడీపీ


రైతు సంక్షేమానికే పూర్తి సమయం కేటాయిస్తామంటూ డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు ప్రకటించారు. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లుగా ముమ్మనేని వెంకటసుబ్బయ్య, ఇక్కుర్తి సాంబశివరావులు బాధ్యతలు స్వీకరించారు. శనివారం తెనాలిలో డీసీసీబీ, గుంటూరులో డీసీఎంఎస్ చైర్మన్ల చైర్మన్ల ఎన్నిక లాంఛనంగా ముగిసింది. ఐదేళ్ల తర్వాత జీడీసీసీబీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడంతో అభిమానులు, కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలెత్తింది.

గుంటూరు, తెనాలిలో జరిగిన ఎన్నిక కార్యక్రమంలో తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడంతో ఈ రెండు కార్యాలయాలు పసుపుమయమయ్యాయి. ముమ్మనేని మాట్లాడుతూ రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా ఏనాడూ వ్యవసాయాన్ని వీడలేదని, అదే స్ఫూర్తితో జిల్లా రైతాంగ సంక్షేమానికే పూర్తి సమయాన్ని వెచ్చిస్తానన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు అందజేస్తామని ఇక్కుర్తి సాంబశివరావు తెలిపారు.

రైతు సంక్షేమమే ధ్యేయం

రాష్ట్రంలో తెలుగుదేశం విజయానికి సహకార ఎన్నికలు నాంది పలికాయని జిల్లా టీడీపీ అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. తెనాలిలోని జిల్లా సహకార కేం ద్ర బ్యాంకులో చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక శనివారం జరిగింది. అనంతరం జరిగిన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సభలో పుల్లారావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ డీసీసీబీ, డీసీఎంఎస్‌లను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునేందుకు సొసైటీ అధ్యక్షులు నీతి, నిజాయితీలకు మారుపేరుగా ని లబడ్డారని చెప్పారు. వారిని ప్రలోభపెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించినా లొంగలేదన్నారు. జిల్లాలో చంద్రబాబు పాద యాత్ర కూడా సహకార ఎన్నికల్లో విజయం సాధించేందుకు దోహద పడిందని చెప్పారు. ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ జిల్లా నాయకులంతా ఐక్యంగా కృషి చేసి విజయం సాధించారన్నారు.

పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేం ద్రకుమార్ మాట్లాడుతూ రెండు పాలకవర్గాలు రైతులకు వి స్తృ తంగా సేవలు అందించాలని సూచించారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ సహకార ఎన్నికలలో విజయానికి మాజీమం త్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎంతగానో కృషి చేశారని అన్నారు. పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతూ సహకార ఎన్నికల స్ఫూర్తిని స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా చూపించాలని కోరారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గెలిచే సొసైటీలకు స్టే ఇచ్చినా కూడా కాం గ్రెస్ నాయకులు కుయుక్తులు ఫలించ లేదన్నారు.

వినుకొండ ఎమ్మెల్యే జివివి ఆంజనేయులు మాట్లాడుతూ రైతు కష్టాలు తెలిసిన వారే పదవులకు ఎన్నికయ్యారని రైతులకు మేలు జరుగుతుందని చెప్పారు. డీసీఎంఎస్ చైర్మన్ ఇక్కుర్తి సాంబశివరావు మాట్లాడుతూ సహకార రంగానికి పురిటిగడ్డగా పేరున్న తెనాలి ప్రాంతంలో తెలుగుదేశం విజయంతో పూర్వ వైభవం రానుందన్నారు. డీసీసీబీ చైర్మన్ ముమ్మనేని వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ రా ష్ట్రంలో మంచి పాలన అందించాలని తెలుగుదేశం అధినేత చం ద్రబాబు 63 ఏళ్ల వయస్సులో కూడా ఎంతో కష్ట పడుతున్నారని, 69 ఏళ్ల వయస్సులో తనకు వచ్చిన ఈ పదవికి తగిన న్యాయం చేకూరుస్తానని పేర్కొన్నారు. ఈ పదవిని యువకులకు ఇవ్వాలని చంద్రబాబుకు సూచించారని కానీ, ఎంతో నమ్మకంతో తనకు అప్పచెప్పిన బాధ్యతను తీరుస్తానని, ప్రతి నియోజకవర్గంలో పర్యటించి రైతులందరిని కలిసి సమస్యలు ఆలకిస్తామన్నారు.

పలుమార్లు ఎన్టీఆర్‌కు కార్యకర్తలచేత జోహార్లు చెప్పిస్తూ ఉత్సాహంగా ప్ర సంగించారు. ఈ సందర్భంగా ముమ్మనేని, ఝాన్సీరాణి దంపతులను సన్మానించారు. కార్యక్రమంలో సీఈవో బి విశ్వనా«థం, మాజీఅధ్యక్షుడు మారౌతు సీతారామయ్య, వైస్‌చైర్మన్ కె సుబ్బారెడ్డి, ప్రత్తిపాడు ఇన్‌చార్జి కందుకూరి వీరయ్య, నిమ్మకాయల రాజనారాయణ, పాటిబండ్ల నాగేశ్వరరావు, గుదేటి బ్రహ్మారెడ్డి, పలువురు డైరెక్టర్లు, బి గ్రూప్‌లో గెలిచిన డీజీఎం పిన్నక శేషభానూరావు ప్రసంగించారు. ఎన్న డూ గెలవని సొసైటీలను గెలుచుకున్న పాతమల్లాయపాలెం, నిడుబ్రోలు, వేమూరు సొసైటీ అధ్యక్షులను ప్రత్తిపాటి పుల్లారావు అభినందించారు. సభలో నూతన పాలకవర్గం చేత అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. పాలకవర్గంలోని డైరెక్టర్లందరినీ సత్కరించారు.

రాష్ట్రంలో టీడీపీ విజయానికి నాంది


వారు అభివద్ధికి దూరంగా ఉన్నారు... పేదరికం పోయేంతవరకు పేదలకు అండగా ఉంటానని వస్తున్నా మీ కోసం పాదయాత్రలో చంద్రబాబు మహిళలకు భరోసా ఇచ్చారు. జిల్లాలో మలివిడత చంద్రబాబు ప్రారంభించిన యాత్ర శనివారం కూచిపూడిలో ప్రారంభమైంది. సాయంత్రం నాలుగున్నర గంటలకు బయలుదేరిన ఆయన దారి పొడవునా ప్రజలను, మహిళా కూలీలను, చిన్నారులను పలకరిస్తూ... సమస్యలను ఆలకిస్తూ ముందుకు సాగారు...

కూచిపూడి: తెలుగుదేశం పార్టీకి పేదవారే దేవుళ్ళు... వారు అభివృద్ధికి దూరంగా ఉన్నారు... పేదరికం పోయేంతవరకు పేదలకు అండగా ఉంటానని వస్తున్నా మీ కోసం పాదయాత్రలో చంద్రబాబు మహిళలకు భరోసా ఇచ్చారు. జిల్లాలో మలివిడత చంద్రబాబు ప్రారంభించిన యాత్ర శనివారం కూచిపూడిలో ప్రారంభమైంది. సాయంత్రం నాలుగున్నర గంటలకు బయలుదేరిన ఆయన ప్రజలను, మహిళా కూలీలను, చిన్నారులను పలకరించడంతో ఆ పలకరింపులతో ప్రజలు పులకించారు.

భట్లపెనుమర్రులో భారీగా ప్రజలు తరలిరావటంతో ప్రజానికాన్ని చూసిన బాబు ఉల్లాసంగా, ఉత్తేజంగా ప్రసంగించడంతోపాటు, అవినీతి, జలయజ్ఞంపై కడిగి ఉతికి ఆరేశారు. మాదిగలను ఎత్తిభుజానవేసుకున్నారు. రుణమాఫీ చేస్తానంటూ రైతులను ఆకట్టుకున్నారు. బెల్టుషాపులు రద్దుచేసి మహిళల కష్టాలు తీరుస్తానన్నారు. దారిపొడవునా పలుచోట్ల పొలాలలో పనిచేస్తున్న రైతు కూలీలు పరుగుపరుగున రావటంచూసి వారితో మాట్లాడుతూ, వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. పలుచోట్ల మహిళలు వివిధ సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. గ్రామాలాభివృద్ధి కుంటుపడిపోయిందని, కాంగ్రెస్ నాయకులకు డబ్బుపై ఆశ పెరిగిందేకానీ, ప్రజా సమస్యలు పట్టించుకునే తీరికలేదని గ్రామీణులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెప్పుకొచ్చారు. ఇక తల్లీ, పిల్లా కాంగ్రెస్‌లు ఆడుతున్న కపట నాటకాలకు తెరదించాల్సిన సమయం ఆసన్నమైందని, మీ కష్టాలను తీర్చేందుకు నేను వచ్చాను. అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండని భరోసాయిచ్చారు. ఐనంపూడి సమీపంలోకి అడుగుపెట్టిన బాబుకు ఆదిలోనే ఓ ముదుసలి బాబు ఆసుపత్రులలో మందులులేవు, డాక్టర్లు చూడటంలేదని చెప్పడంతో అమ్మా...మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీని పటిష్టంచేస్తాను, జ్వరం నుంచి అన్ని రోగాలను ఆ పరిధిలోకి తెచ్చి మీకు యిబ్బందులు లేకుండా చేస్తాననడంతో ఆ ముదుసలి రెండు చేతులతో ప్రతి నమస్కారం చేసింది. మరో మహిళా గ్రామాలలో మధ్యాన్ని సమృద్ధిగా అందిస్తున్నారేగాని, మంచినీళ్ళను అందించటంలేదని ఫిర్యాదుయిచ్చింది.

చిన్నారులు బాబునుచూసేందుకు పరుగులేడుతుంటే ఆగిన ఆయన పరిగెడుతున్న పిల్లల రుణం తీర్చుకుంటానంటూ, ఆయన చూసేందుకు వచ్చిన మహిళలతో మాట్లాడుతూ, మీ చిన్నారులకు అన్నింటా సాయంచేయడంతోపాటు, ఉచిత విద్య, ఉద్యోగం వచ్చేంతవరకూ భృతి కల్పిస్తానని, పేదలకు నివేశనాస్థలాలు, గృహనిర్మాణాలు చేయించి మీ పిల్లలకు బంగారు భవిష్యత్‌ను అందిస్తాననటంతో మహిళలు బాబుకి జై అనటం కనిపించింది. ఆయా సభలలో పలుసార్లు చంద్రబాబు తన ప్రసంగంలో తెలుగుదేశంపార్టీకి పేదవారే దేవుళ్ళని, వారు అభివృద్ధికి దూరంగా ఉన్నారంటూ, పేదరికం పోయేంతవరకు పేదలకు అండగా ఉంటానని, అందరం కలసి అవినీతిపై పోరాడదామంటూ ప్రసంగిస్తుండగా జయ జయధ్వానాలు మారు మోగ్రాయి.

పేదరికంపై పోరాడతా............తెలుగుదేశం పార్టీకి పేద ప్రజలే దేవుళ్ళు...


రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ విధానాల వల్ల కృష్ణా జిల్లాలోని మినుము రైతు, కౌలు రైతులు దారుణంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని జిల్లా తెలుగురైతు అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు ధ్వజమెత్తారు. మినుము రైతుకు గిట్టుబాటు ధర లేనప్పుడు 2002- 03 వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం నాఫెడ్ ద్వారా కొనుగోలు చేసి ఆదుకుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇలాంటి ఆలోచన చేయకుండా చోద్యం చూడటం వల్ల జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని చెప్పారు.

శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జిల్లాలో 1 లక్షా 63 వేల హెక్టార్లలో రైతులు మినుము పంట వేశారని చెప్పారు. రూ.4,300 మద్దతు ధర పలుకుతుండగా బర్మా నుంచి మినుములు దిగుమతి అవుతున్నాయన్న పేరుతో రూ.3,600- 3,700 చొప్పున మాత్రమే కొనుగోలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 2002-03లో నాఫెడ్ మినుములను కొనగా ఇప్పుడెందుకు ప్రభుత్వం నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయించటం లేదని ప్రశ్నించారు.

జిల్లా మంత్రి పార్థసారథి, వ్యవసాయ శాఖమంత్రి రఘువీరారెడ్డి, రైతు బాంధవుడిగా చెప్పుకునే పిన్నమనేని వెంకటేశ్వరరావు దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఖరీఫ్‌లో నీళ్ళు రాకపోవటం వల్ల రైతాంగం నష్టపోయిందని చెప్పారు. కౌలు రైతులు ఎకరాకు రూ.10 - 15 వేల మేర పెట్టుబడి పెట్టారని, మద్దతు ధర లేక, నీళ్ళు లేక మొదటి పంటను నష్టపోవాల్సి వచ్చిందని చెప్పారు. మరోసారి మినుము రైతులు నష్టపోయే పరిస్థితి తలెత్తిందన్నారు. తక్షణం జిల్లా కలెక్టర్ స్పందించి నాఫెడ్ ద్వారా రైతుల నుంచి మినుమును కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ విధానంతో రైతులకు కష్టాలు


జలయజ్ఞంకోసం రూ.80 వేల కోట్టు ఖర్చుపెట్టినాఎనిమిది వేల ఎకరాలకు సాగునీరు యివ్వక రాష్ట్రంలోని రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వ పలు యిబ్బందులకు గురిచేసిందని చంద్రబాబునాయుడు దుయ్యబట్టారు. పామర్రు నియోజకవర్గం భట్లపెనుమర్రు, పెడసనగల్లులో జరిగిన పాదయాత్రలో ఆయన మాట్లాడారు. కాగ్ నివేదికలో జలయజ్ఞంలో రూ.30వేల కోట్లు అవినీతి జరిగిందని బయటపడిందన్నారు. మూడు సీజన్‌ల నుంచి ఆధునికీకరణ పేరుతో నీరు ఇవ్వకపోవడంతో ఒక్కొక్క రైతు ఏడాదికి రూ.10వేలు నష్టపోతున్నాడన్నారు. ఆరువందల కోట్ల రూపాయలతో పులిచింతల పూర్తయ్యేదని, దానిని పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి తొమ్మిదేళ్ళకాలంలో ముఖ్యమంత్రిగా చేసిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి, రోశయ్య, ప్రస్తుత కిరణ్‌కుమార్‌రెడ్డికి లేదన్నారు. రిజర్వాయార్లలో 510 అడుగులు నీరువున్నా సాగునీరు యివ్వలేని కిరణ్‌కుమార్‌రెడ్డి, రైతుల రుణమాఫీపై తెలుగుదేశం వైఖరిని ప్రశ్నించడం ఆయన చేతకానితనానికి నిదర్శనమన్నారు.

వర్గీకరణపై కాంగ్రెస్‌కు సవాల్

వర్గీకరణపై కాంగ్రెస్ వైఖరి స్పష్టంచేయాలని చంద్రబాబు సవాల్ విసిరారు. వర్గీకరణకు టీడీపీ కట్టుబడి ఉందన్నారు. మాదిగలకు రిజర్వేషన్‌లు అమలు సక్రమంగా జరగడంలేదంటూ, 40ఏళ్ళలో 16 వేల ఉద్యోగాలు మాదిగలకు దక్కగా, టీడీపీ చేసిన వర్గీకరణ అమలుతో నాలుగేళ్ళలో 24 వేల 500 ఉద్యోగాలు లభించాయన్నారు. వర్గీకరణపై 2004లో కొందరు కోర్టుకు వెళ్ళడంతో ఆటంకం ఏర్పడిందని, వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి సక్రమంగా స్పందించి ఉంటే న్యాయం జరిగేదన్నారు.

ముందుచూపులేని కాంగ్రెస్ ముఖ్యమంత్రులు

పమిడిముక్కల మండలం హనుమంతాపురంలో చంద్రబాబు మాట్లాడుతూ విద్యుత్ అవసరాలపై ముఖ్యమంత్రులుగా పనిచేసిన వైఎస్, కిరణ్‌కుమార్‌రెడ్డిలకు ముందు చూపులేకపోవడం వల్లేనే ప్రస్తుత సంక్షోభానికి కారణమన్నారు. అధికారంలోకి రాగానే మహిళల రక్షణకోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తానని బాబు అన్నారు.

సాగునీరివ్వలేక చేతులేత్తేశారు