March 3, 2013
రైతు సంక్షేమమే ధ్యేయం
రైతు సంక్షేమానికే
పూర్తి సమయం కేటాయిస్తామంటూ డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు ప్రకటించారు.
డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లుగా ముమ్మనేని వెంకటసుబ్బయ్య, ఇక్కుర్తి
సాంబశివరావులు బాధ్యతలు స్వీకరించారు. శనివారం తెనాలిలో డీసీసీబీ,
గుంటూరులో డీసీఎంఎస్ చైర్మన్ల చైర్మన్ల ఎన్నిక లాంఛనంగా ముగిసింది.
ఐదేళ్ల తర్వాత జీడీసీసీబీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడంతో
అభిమానులు, కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలెత్తింది.
గుంటూరు, తెనాలిలో జరిగిన ఎన్నిక కార్యక్రమంలో తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడంతో ఈ రెండు కార్యాలయాలు పసుపుమయమయ్యాయి. ముమ్మనేని మాట్లాడుతూ రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా ఏనాడూ వ్యవసాయాన్ని వీడలేదని, అదే స్ఫూర్తితో జిల్లా రైతాంగ సంక్షేమానికే పూర్తి సమయాన్ని వెచ్చిస్తానన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు అందజేస్తామని ఇక్కుర్తి సాంబశివరావు తెలిపారు.
Posted by
arjun
at
3:59 AM