April 6, 2013


అప్పులేని వాడు అదృష్టవంతుడు! పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా అప్పులు ఇవ్వకూడదని తల్లిదండ్రులు తాపత్రాయపడతారు. అప్పు లేకపోతే ఏ కప్పు కింద పడుకున్నా తెల్లారిపోతుందని కూలివాడు ఆశపడతాడు. అప్పుల వాళ్లు ఇంటి ముందుకు వచ్చేపరిస్థితి కల్పించకు దేవుడా..! అని సామాన్యుడు వేడుకుంటాడు. కానీ, మన రాష్ట్రంలో అప్పు లేనిదెవరికి? మన తల్లిదండ్రులకున్న మనసు ఈ పాలకులకు ఉంటుందా! "మా రుణం మాఫీ చేయకపోతే పోనీ.. కొత్త పన్నులు మోదకుండా ఉంటే అదే పది వేలు'' అంటూ ఎ.కొత్తపల్లిలో ఎస్సీ కాలనీలోని ఆ మహిళ అసలు విషయం కుండబద్దలు కొట్టింది.

అంత ధైర్యంగా మాట్లాడుతున్న ఆమె ఎవరా అని చూశాను. "సార్! నాకు 20 వేలు దాకా అప్పులున్నాయి. వడ్డీకింద నెలకు వెయ్యి రూపాయలు కడుతున్నాను. కట్టే స్థోమత లేదు.. అలాగని అప్పుల వాళ్లు ఇంటిమీద పడితే పరువు పోతుందని భయం. ఈ వడ్డీలు కట్టేసరికే తాడు తెగుతోంది. అసలు తీరేప్పటికి ఆయువే ఊడేలా ఉంది'' అని ఆమె చెప్పుకుపోయింది. కడుపు కట్టుకొని అప్పులు కడుతున్నామని అక్కడున్న మరికొందరు కూడా వాపోయారు. అప్పులూ తీరవు.. మాకీ అవస్థలూ పోవు అంటూ నిష్ఠూరమాడుతుంటే దిగులేసింది.

రైతులను కదిలించినా పేదలను పలకరించినా చిరువ్యాపారితో మాట కలిపినా ఒకటే గోడు. లక్షలాధికారులను చేస్తామంటూ చేసిన వాగ్దానాలు గాలిలో కలిసిపోయాయని ఆడపడుచుల ఆవేదన. పేదల సొమ్ము కాంగ్రెస్ నేతల బొక్కసం నింపుతుంటే.. అవినీతి కారణంగా పేదవాడి జేబుకు మాత్రం చిల్లు పడుతోంది. యాత్ర ప్రారంభం అవుతూనే విద్యార్థులు వచ్చి కలిశారు. 'మా భవిష్యత్తుకు మీరు భరోసా ఇవ్వా''లని వాళ్లు అడుగుతుంటే, 'పెద్దన్న'లా ధైర్యం చెప్పాను. వాళ్ల కుటుంబాలకు 'పెద్దకొడుకు'లా భరోసా ఇచ్చాను. " మీ కోసమే వచ్చాను. మీ కష్టాల్లో చివరి దాకా ఉంటాను. మీ కన్నీళ్లు తుడిచిగానీ నడక ఆపను''అని భుజం తట్టి ముందుకు కదిలాను.

పల్లెలన్నింటా అప్పుల తిప్పలే!


తుని: చంద్రబాబు పాదయాత్ర షెడ్యూల్ మారింది. ఆరోగ్య సమస్యలు వేధిస్తుండడంతో రోజువారీ నడకను కుదించారు. ప్రస్తుతం రోజుకు 10-12 కిలోమీటర్ల మేర చంద్రబాబు నడుస్తున్నారు. కాళ్ల నొప్పులు, చీలమండ గాయం వేధించడంతో ఆయన నడకను రోజుకు 8-9 కిలోమీటర్లకు కుదించారు. ఈసారి ఉగాదిని ఆయన తూర్పుగోదావరి జిల్లాలోనే జరుపుకోనున్నారు. మర్నాడు (12వ తేదీ) సాయంత్రానికి విశాఖ చేరుకుంటారు. తుని పట్టణానికి ఈ నెల 8వతేదీకి ఆయన చేరుకోవాలి. మారిన షెడ్యూల్ మేరకు ఆ రోజుకు ఆయన వి.కొత్తూరుకు చేరుకుంటారు. ఆయన బస కోసం డిగ్రీ కళాశాల వద్ద గల ఖాళీస్థలాన్ని యనమల పరిశీలించారు.

మారిన పాదయాత్ర షెడ్యూల్

సెజ్‌లు రద్దు చేస్తా!
పేదలను ముంచి 'రియల్'కు ప్రగతి
కాకినాడలోనే 15 వేల ఎకరాలు
అధికారంలోకి రాగానే ఆ భూమంతా పేదల వరం
50 యూనిట్ల 'ఉచితం' ఏ మూలకు?
ఎస్సీలను మోసగిస్తున్న కిరణ్
'తూర్పు' పాదయాత్రలో చంద్రబాబు ధ్వజం


రాజమండ్రి, తుని : రామరాజ్యం తెస్తా.. సెజ్‌లను రద్దు చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. "మీ కష్టాలూ కన్నీళ్లూ తుడవడానికి వేల కిలోమీటర్లు నడిచివచ్చాను. ఓటేసే ముందు ఆలోచించి ఓటేయండి. ఐదేళ్లూ మీ పెద్ద కొడుకుగా సేవచేస్తా''నని ప్రజలను కోరారు. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం గోపాలపట్నం వద్ద శనివారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. ఎ.కొత్తపల్లి, శృంగవృక్షం, వలసపాకల, టి.తిమ్మాపురం మీదుగా నడిచారు.

దారిలో రైతులు, ఇటుకబట్టీల కూలీలు, మహిళలు, ప్రయాణికులను సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. సెజ్‌ల పేరిట కాకినాడకు వైఎస్ తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. "దేశంలో ఎక్కడాలేని విధంగా వైఎస్ రాష్ట్రవ్యాప్తంగా 113 సెజ్‌ల కోసం 2 లక్షల ఎకరాలు ఇవ్వగా, కాకినాడలోనే 15 వేల ఎకరాలను కేటాయించారు. ఇక్కడ ఏవిధమైన ప్రగతీ లేదు గానీ, పేదల భూములను లక్షల రూపాయలకు కొనుగోలు చేసి కోట్ల రూపాయలకు రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. మేము అధికారంలోకి రాగానే సెజ్‌లను రద్దు చేస్తాం. పేదల భూములను తిరిగి వారికే ఇచ్చేస్తాం'' అని హామీ ఇచ్చారు. ఎస్సీలకు 50 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తామన్న సీఎం ప్రకటన మోసపూరితమని విమర్శించారు.

ఎవరైనా 100 యూనిట్ల పైగానే వాడతారని, అలాంటప్పుడు సీఎం చెప్పే ఊరట ఎవరి కోసమని ప్రశ్నించారు. బ్రాహ్మణవర్గాల్లో పేదలు పెరుగుతున్న తీరుపై ఆవేదన వ్యక్తంచేశారు. వారి కోసం తిరుపతిలో కాలనీలు నిర్మించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తానని, రూ. 500 కోట్లతో సంక్షేమ నిధి పెడతామని, వారి పిల్లలను చదివిస్తానని హామీ ఇచ్చారు. సామాజికన్యాయం కోసం వర్గీకరణకు మొగ్గినా.. మాలలకు అన్యాయం జరగనివ్వనని చెప్పుకొచ్చారు. అనంతరం ఎ. కొత్తపల్లి కాలనీలో ఎస్సీ విద్యార్థులను కలుసుకున్నారు. 62 ఏళ్ల వయసులో ఇంతశక్తి మీకెలా వచ్చిందని ఒక విద్యార్థి ప్రశ్నించగా, ప్రతి మనిషికీ శక్తి ఉంటుందని, దాన్ని సద్వినియోగం చేసుకుంటే మన ఆత్మశక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని ఆయన చెప్పారు.

వైఎస్ హయాంలో లక్షల ఎకరాలు ధారాదత్తం

విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు
అధికారంలో కాంగ్రెస్ - అంధకారంలో ఆంధ్రప్రదేశ్


విజయవాడ ఎన్టీఆర్ ఫోటోలతో ఓట్లు వస్తాయని, వైఎస్ ఫోటోతో ఓట్లు రావని గుర్తించినందుకే అందుకే ఎన్టీఆర్ ఫోటో వాడుకుంటున్నారని వైసీపీ నేతలను బాలకృష్ణ పరోక్షంగా విమర్శించారు. వచ్చే ఎన్నికలలో ఎక్కడి నుంచి పోటీ చేయాలో ఇంకా నిర్ణయించ లేదని, చంద్రబాబుతోను, పార్టీలోనూ చర్చించాకే అంతిమ నిర్ణయం ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధంగా ఉన్నట్లు బాలకృష్ణ తెలిపారు.

కృష్ణా జిల్లా ఫ్లెక్సీల వివాదంపై బాలయ్య మాట్లాడుతూ ఫ్లెక్సీల్లోని ఫోటోలపై జూనియర్ ఎన్టీఆరే ఖండించాలని, దీనిపై త్వరలో జూ.ఎన్టీఆర్‌తో మాట్లాడుతానని ఆయన చెప్పారు. ఖండించని పక్షంలో ఎలంటి పరిణామాలనైనా ఎదుర్కోవాలన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ షూటింగ్‌లతో బిజీగా ఉన్నారన్నారు.

జయప్రద రోజుకో పార్టీ పేరు చెబుతున్నారని, ఏమైనా సమస్యలుంటే తనను సంప్రదిస్తే పార్టీ దృష్టికి తీసుకెళ్లే వాణ్ణికదా అని బాలకృష్ణ పేర్కొన్నారు. కొడాలి నాని పార్టీ నుంచి వెళ్లిపోయినా నష్టంలేదన్నారు. టీడీపీ గుర్తుతోనే నాని గెలిచినట్లు ఆయన గుర్తుచేశారు. టికెట్ల విషయంలో జోక్యం చేసుకోనని, పార్టీ కోసం కష్టపడే వారికి తెలుగు దేశం పార్టీలో సముచిత స్థానం ఉంటుందని బాలకృష్ణ తెలిపారు.
: విద్యుత్ కోతలు, అధిక చార్జీలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ప్రముఖ నటుడు బాలకృష్ణ ఆందోళన వ్యక్తపరిచారు.. శనివారం ఉదయం కృష్ణా జిల్లా కొమరవోలులో పర్యటించిన బాలయ్య టీడీపీ చేపట్టిన సంతకాల సేకరణ ఉద్యమంలో భాగంగా మొదటి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పాలనకు, కాంగ్రెస్ పాలనకు పోలీకేలేదని వ్యాఖ్యానించారు. టీడీపీ పాలనలో కరువు ఉన్నా రైతులు, గృహాలకు నాణ్యమైన విద్యుత్ అందించామని గుర్తుచేశారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అథోగతి పాలైందని ఆయన ఆవేదనగా అన్నారు. అధికారంలో కాంగ్రెస్ - అంధకారంలో ఆంధ్రపదేశ్ అని బాలయ్య రాష్ట్ర ప్రభుత్వానికి చురక అంటించారు.

ఫ్లెక్సీల్లో ఫోటోలపై జూ.ఎన్టీఆరే ఖండించాలి : బాలకృష్ణ

పేదవాడి పొట్ట నింపలేని మాటలు ఎందుకు? కష్టంలో ఉన్నవారికి చెయ్యి అందించలేని చేతలు ఎందుకు? రాష్ట్రం చీకట్లో ఉన్నప్పుడూ రణం చేయలేని రాజకీయ పార్టీ ఎందుకు? ఈ ప్రశ్నలకు సమాధానంగానే తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చింది. నాడు రాష్ట్రం ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినప్పుడు గానీ, ఇప్పుడు రాష్ట్రాన్ని అంధకారంలో నింపినప్పుడు గానీ మేము చేసిన, చేస్తోన్న పోరాటం సిద్ధాంతంలో భాగమే. ఎన్టీఆర్ అయి నా, ఆ తరువాత నేనయినా..రాష్ట్రంలోని చివరి పౌరుడిని కూడా చేరే విధంగా ప్రభుత్వ విధా నాలు అమలుచేశాం.

రాజకీయం కోసం కాదు.. రవ్వంత భరోసాను పేదసాదలకు ఇచ్చేందుకు మేం కష్టించాం. కానీ, ఇప్పుడేంటి? కమీషన్లు తప్ప మరో సిద్ధాంతం కనిపించడం లేదు. 'నాకేంటి?' అన్న తత్వమే ఈ ప్రభుత్వ విధానంగా మారిపోయింది. నెల్లిపూడిలోని 'పోలవరం' కాలువలను చూసినప్పుడు.. ఇదే అనిపించింది. జలయజ్ఞాన్ని ధన యజ్ఞంగా మార్చిన తీరుకు ఈ కాలువలే నిదర్శనం. అధికారులు, కాంట్రాక్టర్లు, అధికార నేతల దాహార్తికి వట్టిపోయిన ఆ కాలువలను చూసినప్పుడు కడుపు తరుక్కుపోయింది.

ఈ పాలకులు గొప్పగా చెప్పుకొంటున్న ఇలాంటి కాలువలు మన రాష్ట్రంలో ఎన్ని లేవూ? అసలు రేపయినా ఈ కాలువల్లో నీళ్లు పారతాయా? దారిలో పామాయిల్, జీడిమామిడి రైతులు కలిశారు. వాళ్ల వాలకం చూస్తే చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నట్టు అనిపించింది. వెలుగు నిండిన కళ్లతో నా చుట్టూ మూగారు. నేను పలకరించే లోపలే.. నా యోగక్షేమాలు కనుక్కున్నారు. 'ఎంత కష్టపడుతున్నారు సార్!' అంటూ కళ్లు వత్తుకున్నారు. అక్కడ అనంతపురం నుంచి ఇక్కడి అన్నవరం రైతు దాకా.. ప్రాంతం మారుతుందే గానీ, పంట కష్టం మారదు. అదే బీడు.. అదే గోడు..!

అదే బీడు.. అదే గోడు

తగ్గింపు కంటితుడుపు!
పెంచిన చార్జీలు రద్దు చేయాల్సిందే!
ఉప ప్రణాళికపై చర్చకు సిద్ధమా?: చంద్రబాబు సవాల్

కాకినాడ, తుని: విద్యుత్ చార్జీలను రూ.6,500 కోట్ల మేర పెంచారు. కంటితుడుపుగా రూ.830 కోట్లు తగ్గించి సీఎం కిరణ్ కపట నాటకాలాడుతున్నారు. ఓడిపోతామన్న భయంతో నెలకు రూ.75 చొప్పున బిల్లు తగ్గించారు. ఆ తగ్గించిన కరెంటు బిల్లు, మందుబాబులు ఒక రోజు తాగే చీప్ లిక్కర్ ఖర్చంత లేదు'' అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పెంచిన చార్జీలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై నాటకాలాడుతున్న ప్రభుత్వం, వైసీపీలు..చర్చకు సిద్ధమా అని ఘాటుగా ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం నెల్లిపూడి వద్ద చంద్రబాబు శుక్రవారం పాదయాత్ర ప్రారంభించారు.

బెండపూడి, అన్నవరం, గోపాలపట్నం మీదుగా నడక సాగించారు. నెల్లిపూడిలో గీత కార్మికులు, కౌలు రైతులు, చిరువ్యాపారులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బెల్టు షాపులు, అక్రమ సారా వల్ల తమ ఉపాధి దెబ్బతింటున్నదని ఓ గీత కార్మికుడు అనగా.."తమ్ముడూ! మన గవర్నమెం టు వచ్చాకా.. బెల్టుషాపులు రద్దు చేసి గీత కార్మికులను ఆదుకుంటా''మని భరోసా ఇచ్చారు. తనను కలిసిన కౌలు రైతులకు ధైర్యం చెప్పారు. వడ్డీలేని రుణాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.

"మా హయాంలో వైర్లు పట్టుకుంటే షాక్ కొట్టేవి. ఇపుడు బిల్లులు చూస్తేనే షాక్ కొడుతోంది'' అని ఎద్దేవా చేశారు. గొర్రెల కాపరుల సంఘాలకు ఐదు ఎకరాల చొప్పున భూమి ఇచ్చి ఆదుకుంటామని చెప్పారు. చెంచల్‌గూడ జైలునే పార్టీ కార్యాలయంగా పెట్టుకుంటే బాగుంటుందని నెల్లిపూడి సభలో వైసీపీకి సలహా ఇచ్చారు. పార్టీ అధికారంలోకి రాగానే..జగన్ అక్రమాస్తులను స్వాధీనం చేసుకుని పేదల సంక్షేమానికి వినియోగిస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తున్నదని బెండపూడి సభలో ధ్వజమెత్తారు. "ఉప ప్రణాళిక తెచ్చామని గొప్పగా ప్రకటించుకొని.. ఆ మరునాడే ఆ నిధులను బ్యాలెట్ బాక్సుల గోదాములకు తరలించారు. నాడేమో ఆ నిధులతో వైఎస్ ఇడుపులపాయకు రోడ్డేయించుకున్నారు.. కాదేమో ప్రభుత్వాన్ని, వైసీపీ నేతలను చెప్పమనండి? ఈ విషయంలో వారితో చర్చకు నేను సిద్ధమే'' అని సవాల్ విసిరారు.

పాదయాత్రకు ముందుగా..నెల్లిపూడిలో రంపచోడవరం, ప్రత్తిపాడు నియోజకవర్గాల పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. "పంచాయతీ మొదలు పార్లమెంటు వరకు అన్ని ఎన్నికల్లోనూ మనమే గెలవాలి తమ్ముళ్లూ!''అంటూ వారిని ఉత్సాహపరిచారు. ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను ఈసారి తప్పకుండా ఆదుకుంటామని చెప్పారు. ఇప్పటినుంచే జనంలోకి వెళ్లి టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిపై; వైఎస్, కాంగ్రెస్‌ల అక్రమాలపై ఎక్కడికక్కడ వివరించాలని పిలుపునిచ్చారు."ఇన్నాళ్లూ జెండా మోశాం. ఇక అధికారంలోకి రావాలి. వచ్చే పంచాయతీ, నీటి సంఘాలు, అసెంబ్లీ, పార్లమెంటు.. అన్నింటిలోనూ గెలవాలి'' అని పేర్కొన్నారు. బాబూ జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాల వేశారు.

టీడీపీలోకి 'పీఆర్పీ' పెదబాబు
నరసాపురం ఎంపీ స్థానం నుంచి పీఆర్పీ తరఫున గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన చింతం పెదబాబు తెలుగుదేశం పార్టీలో చేరారు. కత్తిపూడిలోని పాదయాత్ర స్థలి వద్దకు భారీ వాహన కాన్వాయ్‌తో సుమారు 400 మందికి పైగా అనుచరులతో పెదబాబు వచ్చారు. పార్టీ కండువా వేసి ఆయనను చంద్రబాబు సాదరంగా ఆహ్వానించారు.

నెలకు రూ.75 ఊరటా?.. చీప్ లిక్కర్ ఖర్చంత లేదు