February 18, 2013
ఖరీఫ్లో వానలు లేవు. కాలువల కింద నీళ్లు విడుదల చేయలేదు. రబీలో ఏంతో
కష్టపడి పండిస్తే... అకాల వర్షాలతో నష్టాలు. ఎక్కడ చూసినా రైతులకు ఇలాంటి
ఇబ్బందులే. అలాంటి రైతులను రుణ మాఫీతో ఆదుకుంటే నేరమా? లేక... ఘోరమా?
రైతులంతా ఆనందంగా ఉన్నారా? వారికి రుణ మాఫీ అక్కర్లేదా? ఈ విషయాన్ని
నేరుగా రైతులనే అడగాలని అనుకున్నాను. కూచిపూడిలో నా యాత్ర
ప్రారంభమైనప్పటి నుంచి మార్గమధ్యంలో పొలాల్లో రైతులతో మాట్లాడాను. ఇదే
విషయంపై చర్చించాను. కష్టాల్లో ఉన్న తమకు నేను చేసిన రుణ మాఫీ ప్రకటన ఎంతో
ఊరట నిచ్చిందని, భవిష్యత్తు పట్ల ఆశలు ఏర్పడ్డాయని... రుణమాఫీ వద్దనడంకంటే
అన్యాయం మరొకటి ఉండదని వారు తెలిపారు.
మరి... రైతు ఘోష ముఖ్యమంత్రికి ఎందుకు వినపడటం లేదు? రుణ మాఫీ చేస్తానని మూల్పూరు, పోటుమర్రు సభల్లో నేను పునరుద్ఘాటించాను. ఆ సమయంలో గ్రామీణుల ముఖంలో చెప్పలేనంత ఆనందం కనిపించింది. వారి ముఖాల్లో కనిపించిన వెలుగుల సాక్షిగా చెబుతున్నాను... రుణ మాఫీ చేసి తీరుతాను. బెల్టు షాపుల రద్దుపై మలి సంతకం చేస్తానని మూల్పూరు సభలో చెప్పగానే అక్కడున్న ఆడపడుచుల నుంచి ఎంతో హర్షం వ్యక్తమైంది. అది వారి జీవితానికి పెద్ద ఊరటలా కనిపించింది.
ఇక... పల్లెల్లోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిని ప్రత్యక్షంగా చూస్తున్నాను. అవి పేద, దిగువ మధ్య తరగతి వర్గాల పిల్లలు చదువుకునే బడులు. కానీ, ఏ బడిలో చూసినా దుర్గంధమే. బడి ఆవరణలో పందులు కాపురం చేస్తున్నాయి. అక్కడ చదువుకునే పేద బిడ్డల ఆరోగ్యానికి ఎవరిది హామీ! ఈ పరిస్థితిని మార్చేదెప్పుడు? తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ప్రత్యక్షంగా గమనిస్తున్నాను. ప్రతి గ్రామంలో దాతలు విరాళాలు ఇస్తున్నారు. అభిమానంతో వారు పది రూపాయలు ఇచ్చినా, అది పది వేలతో సమానమే. ఇలాంటి అభిమానులే పార్టీకి కొండంత అండ!
రైతు 'రుణం' తీర్చుకుంటా!
జగన్ ఉన్మాది
న్యాయమూర్తులపైనా విషపు రాతలు
అన్ని కుంభకోణాల్లోనూ వైఎస్ కుటుంబం పేర్లు
అవినీతి డబ్బుతో చర్చిలు కడితే ప్రభువు క్షమించడు
మద్యం ధర పెంచితే సీఎంకు డబ్బులు కిక్
కాంగ్రెస్, వైసీపీ.. మదమెక్కిన పార్టీలు
గుంటూరు జిల్లా పాదయాత్రలో చంద్రబాబు నిప్పులు
జగన్ ఒక ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడని టీడీపీ
అధ్యక్షుడు చంద్రబాబు దుయ్యబట్టారు. తనకు బెయిల్ ఇవ్వడం లేదని చివరికి
న్యాయమూర్తుల పైనా విషపు రాతలు రాస్తున్నారని, తనకు వ్యతిరేకంగా ఉంటున్న
పత్రికలపైనా ఆ పరంపరను కొనసాగిస్తున్నారని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలోని కూచిపూడి గ్రామం నుంచి 'వస్తున్నా
మీకోసం' పాదయాత్రను సోమవారం కొనసాగించిన చంద్రబాబు.. వైసీపీ అధ్యక్షుడు
జగన్పైనా, వైఎస్ కుటుంబంపైనా నిప్పులు చెరిగారు. దేశంలో ఏ అవినీతి
కుంభకోణం వెలుగులోకి వచ్చినా దాని మూలాలు రాష్ట్రంలో అందునా వైఎస్
కుటుంబంతో ముడిపడి ఉంటున్నాయని మండిపడ్డారు.
"వైఎస్ అల్లుడు అనిల్ మతాన్ని అడ్డు పెట్టుకొని డబ్బు, భూములు దోచేస్తున్నారు. హైదరాబాద్ శివార్లలో ఎస్సీలకు చెందిన కోట్ల విలువైన భూమిని కబ్జా చేశారు. అగస్టా హెలికాప్ట్టర్ల కుంభకోణంలోనూ అనిల్ పాత్ర ఉంది'' అంటూ నిప్పులు చెరిగారు. మూల్పురులోని ఎస్సీ కాలనీలో చర్చి నిర్మాణానికి ఎవరు డబ్బు ఇస్తారో వారికే తాము ఓటు వేస్తామని కొంతమంది మహిళలు చంద్రబాబుకు చెప్పగా.. జగన్ ఇచ్చే అవినీతి డబ్బుతో చర్చి నిర్మిస్తే ఏసుప్రభువు కూడా క్షమించరని వారికి చెప్పారు. దళిత ్రకైస్తవులను ఎస్సీల్లోకి చేర్పిస్తానని.. మాదిగలకు వర్గీకరణ అమలు చేసి పెద్దమాదిగను అనిపించుకొంటానని వాగ్దానం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిపైనా బాబు తీవ్ర ఆరోపణలు చేశారు.
"మద్యం అమ్మకాల్లో కిరణ్కు కమీషన్లు ముడుతున్నాయి. ధర పెంచినప్పుడల్లా ఆయనకు డబ్బుల కిక్ ఎక్కుతూ స్వంత ఖజానా నిండిపోతోంది'' అని మండిపడ్డారు. నాడు వైఎస్ బరితెగించి దోపిడీకి తెర లేపితే దానిని కిరణ్ కొనసాగిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. "రాష్ట్రంలో వచ్చేది టీడీపీ ప్రభుత్వమే. కేంద్రంలో కూడా టీడీపీ బలపరిచిన ప్రభుత్వమే ఏర్పడుతుంది. అప్పుడు రైతుల రుణమాఫీ అమలు చేసి చూపిస్తాం'' అని పునరుద్ఘాటించారు. సహకార ఎన్నికల్లో ఓటుకు రూ. 20 వేలు పంచి గెలిచి గొప్పలు చెప్పుకోవడం కాదని, ఏ ఎన్నికలు వచ్చినా తల్లి, పిల్ల కాంగ్రెస్లను చిత్తుగా ఓడిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సూట్కేసుల రాజకీయం నడుస్తోందని బాబు ఆరోపించారు.
జగన్ రూ.10 కోట్ల చొప్పున ఎమ్మెల్యేలను కొనేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో దోపిడీకి కారణం సోనియాగాంధీ అని విమర్శించారు. ఆ రోజున వైఎస్ను హెచ్చరించి ఉంటే రూ.లక్ష కోట్ల దోపిడీ జరిగేది కాదని, ప్రజలకు ఇన్ని కష్టాలు వచ్చేవి కావని అన్నారు. తెలుగుదేశం పార్టీ స్వచ్ఛమైన, సమర్థవంతమైన, నీతిమంతమైన సుస్థిర పాలనను అందిస్తుందని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ హయాంలో ప్రకృతివిపత్తుల వల్ల రూ.9.5 లక్షల కోట్ల నష్టం జరిగితే కేంద్రం నుంచి కేవలం రూ.4 వేల కోట్లు మాత్రమే తీసుకురాగలిగారని విమర్శించారు. "కాంగ్రెస్, వైసీపీ మదమెక్కిన పార్టీలు. రైతుల నడ్డి విరవడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి'' అని ధ్వజమెత్తారు. కాగా, టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత అశోక్గజపతిరాజు సోమవారం చంద్రబాబును పాదయాత్రలో కలుసుకొన్నారు.
ప్రజా సహకారం లేకే అన్నా చతికిలబడ్డారు: అవినీతిపై పోరులో హజా రే ప్రజల సహకారం లేకే చతికిలబడ్డారని చంద్రబాబు అన్నారు. ప్రజలు తనతో కలిసిరావాలని అవినీతిని అంతమొందిద్దామని పిలుపునిచ్చారు.
అందరికీ చానెళ్లు.. వాటిలో వాళ్ల బొమ్మలే: రాజకీయ పార్టీలకు సొంత మీడియా ఉండటంపై చంద్రబాబు మండిపడ్డారు. "సీఎంకు ఒక టీవీ, పీసీసీ అధ్యక్షుడికి మరో టీవీ, వైఎస్ అల్లుడు అనిల్కు ఒక టీవీ, జగన్కు టీవీ, పత్రిక ఉన్నాయి. వాటిల్లో వాళ్ల బొమ్మలే చూపించుకొంటున్నారు'' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నేళ్లు పాలించినా టీడీపీ పత్రిక, టీవీ పెట్టలేదని.. అదే తమ పార్టీ నిజాయితీ అని ప్రజలకు వివరించారు.
"వైఎస్ అల్లుడు అనిల్ మతాన్ని అడ్డు పెట్టుకొని డబ్బు, భూములు దోచేస్తున్నారు. హైదరాబాద్ శివార్లలో ఎస్సీలకు చెందిన కోట్ల విలువైన భూమిని కబ్జా చేశారు. అగస్టా హెలికాప్ట్టర్ల కుంభకోణంలోనూ అనిల్ పాత్ర ఉంది'' అంటూ నిప్పులు చెరిగారు. మూల్పురులోని ఎస్సీ కాలనీలో చర్చి నిర్మాణానికి ఎవరు డబ్బు ఇస్తారో వారికే తాము ఓటు వేస్తామని కొంతమంది మహిళలు చంద్రబాబుకు చెప్పగా.. జగన్ ఇచ్చే అవినీతి డబ్బుతో చర్చి నిర్మిస్తే ఏసుప్రభువు కూడా క్షమించరని వారికి చెప్పారు. దళిత ్రకైస్తవులను ఎస్సీల్లోకి చేర్పిస్తానని.. మాదిగలకు వర్గీకరణ అమలు చేసి పెద్దమాదిగను అనిపించుకొంటానని వాగ్దానం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిపైనా బాబు తీవ్ర ఆరోపణలు చేశారు.
"మద్యం అమ్మకాల్లో కిరణ్కు కమీషన్లు ముడుతున్నాయి. ధర పెంచినప్పుడల్లా ఆయనకు డబ్బుల కిక్ ఎక్కుతూ స్వంత ఖజానా నిండిపోతోంది'' అని మండిపడ్డారు. నాడు వైఎస్ బరితెగించి దోపిడీకి తెర లేపితే దానిని కిరణ్ కొనసాగిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. "రాష్ట్రంలో వచ్చేది టీడీపీ ప్రభుత్వమే. కేంద్రంలో కూడా టీడీపీ బలపరిచిన ప్రభుత్వమే ఏర్పడుతుంది. అప్పుడు రైతుల రుణమాఫీ అమలు చేసి చూపిస్తాం'' అని పునరుద్ఘాటించారు. సహకార ఎన్నికల్లో ఓటుకు రూ. 20 వేలు పంచి గెలిచి గొప్పలు చెప్పుకోవడం కాదని, ఏ ఎన్నికలు వచ్చినా తల్లి, పిల్ల కాంగ్రెస్లను చిత్తుగా ఓడిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సూట్కేసుల రాజకీయం నడుస్తోందని బాబు ఆరోపించారు.
జగన్ రూ.10 కోట్ల చొప్పున ఎమ్మెల్యేలను కొనేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో దోపిడీకి కారణం సోనియాగాంధీ అని విమర్శించారు. ఆ రోజున వైఎస్ను హెచ్చరించి ఉంటే రూ.లక్ష కోట్ల దోపిడీ జరిగేది కాదని, ప్రజలకు ఇన్ని కష్టాలు వచ్చేవి కావని అన్నారు. తెలుగుదేశం పార్టీ స్వచ్ఛమైన, సమర్థవంతమైన, నీతిమంతమైన సుస్థిర పాలనను అందిస్తుందని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ హయాంలో ప్రకృతివిపత్తుల వల్ల రూ.9.5 లక్షల కోట్ల నష్టం జరిగితే కేంద్రం నుంచి కేవలం రూ.4 వేల కోట్లు మాత్రమే తీసుకురాగలిగారని విమర్శించారు. "కాంగ్రెస్, వైసీపీ మదమెక్కిన పార్టీలు. రైతుల నడ్డి విరవడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి'' అని ధ్వజమెత్తారు. కాగా, టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత అశోక్గజపతిరాజు సోమవారం చంద్రబాబును పాదయాత్రలో కలుసుకొన్నారు.
ప్రజా సహకారం లేకే అన్నా చతికిలబడ్డారు: అవినీతిపై పోరులో హజా రే ప్రజల సహకారం లేకే చతికిలబడ్డారని చంద్రబాబు అన్నారు. ప్రజలు తనతో కలిసిరావాలని అవినీతిని అంతమొందిద్దామని పిలుపునిచ్చారు.
అందరికీ చానెళ్లు.. వాటిలో వాళ్ల బొమ్మలే: రాజకీయ పార్టీలకు సొంత మీడియా ఉండటంపై చంద్రబాబు మండిపడ్డారు. "సీఎంకు ఒక టీవీ, పీసీసీ అధ్యక్షుడికి మరో టీవీ, వైఎస్ అల్లుడు అనిల్కు ఒక టీవీ, జగన్కు టీవీ, పత్రిక ఉన్నాయి. వాటిల్లో వాళ్ల బొమ్మలే చూపించుకొంటున్నారు'' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నేళ్లు పాలించినా టీడీపీ పత్రిక, టీవీ పెట్టలేదని.. అదే తమ పార్టీ నిజాయితీ అని ప్రజలకు వివరించారు.
వైఎస్ దోపిడీని కిరణ్ కొనసాగిస్తున్నాడు
అకాల వర్షాలతో రైతులు నష్టపోతున్నారు
ప్రపంచంలో ఎక్కడ అవినీతి జరిగినా,
దివంగత వైఎస్ కుటుంబానికి లంకె
రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల వల్ల రైతులు
తీవ్రంగా నష్టపోతున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు
ఆవేదన వ్యక్తం చేశారు. సిఎం కిరణ్కుమార్రెడ్డికి ప్రజా సమస్యలు
పట్టడంలేదని, ఢిల్లీలో పైరవీలు చేయడంపైనే దృష్టి పెట్టారని ఆయన
ధ్వజమెత్తారు. పంట నష్ట పరిహారం విడుదలలో సీఎం నిర్లక్ష్యం వహిస్తున్నారని
ఆయన ఆరోపించారు.
'వస్తున్నా...మీకోసం' పాదయాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబునాయుడు సోమవారం కూచిపూడి నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీలం తుపాన్ నష్టం నివేదికను కిరణ్కుమార్రెడ్డి ఇప్పటివరకు కేంద్రానికి పంపలేదని ఆయన దుయ్యబట్టారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.
ప్రపంచంలో ఎక్కడ అవినీతి జరిగినా దివంగత వైఎస్ కుటుంబానికి లంకె ఉంటుందని, ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని చంద్రబాబునాయుడు ఆరోపించారు. వైఎస్ అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ షెడ్యూల్ కులాల భూములను లాక్కున్నారని ఆరోపించారు. తాను ముప్పయ్యేళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఎంతో మందిని ముఖ్యమంత్రులను చూశానని కానీ, వైయస్లా దోచుకున్న వారిని చూడలేదన్నారు. జైల్లో ఉన్న వారిని నమ్మొద్దని జగన్ను ఉద్దేశించి అన్నారు.
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతిచ్చే పార్టీయే కేంద్రంలో అధికారంలో ఉంటుందని చంద్రబాబు నాయుడు చెప్పారు. సహకార ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ నేతలు ఇంట్లో కూర్చుని సభ్యులను చేర్చుకున్నారని అందుకే, ఆ పార్టీ గెలిచిందన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెసు చిత్తు కావడం ఖాయమన్నారు. టిడిపి హయాంలో వంట గ్యాస్, స్టవ్ ఉచితంగా ఇస్తే, కాంగ్రెసు తన హయాంలో ఇచ్చిన గ్యాస్ కనెక్షన్లను రద్దు చేసిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెసు హయాంలో చనిపోయిన వారికి కూడా పింఛన్లు ఇస్తున్నారని, పింఛన్లలో పూర్తిగా అవకతవకలు జరుగుతున్నాయన్నారు.
వర్షం కారణంగా మహాధర్నా వాయిదా
గుంటూరు జిల్లాలో చంద్రబాబు సోమవారం తలపెట్టిన మహా ధర్నా వర్షం కారణంగా వాయిదా వేయడం జరిగిందని టిడిపి గుంటూరు జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. నిన్నటి వరకు సాగునీరు లేక రైతులు తీవ్రమైన ఆందోళనకు గురయ్యారన్నారు. వస్తున్నా...మీకోసం పాదయాత్రలో గుంటూరు జిల్లాలోకి చంద్రబాబు అడుగుపెట్టగానే రైతులు ప్రభుత్వం పట్ల ఆక్రోషాన్ని, ఆవేదనను చంద్రబాబు ముందు ఉంచారన్నారు. దీనికి స్పందించిన చంద్రబాబు ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడానికి కూచిపూడిలో ధర్నా కార్యక్రమానికి టీడిపీ శ్రేణులు సమాయత్తమయ్యామని తెలిపారు. అకాల వర్షం కారణంగా కల్లాల్లో ఉన్న మిర్చి, అరటి, మొక్కజొన్న తోటలు, పండ్లతోటలు బాగా దెబ్బతిన్నాయన్నారు. పంట నష్టానికి సంబందించిన అంచనాలు తయారు చేసి తక్షణమే ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే తిరిగి చంద్రబాబు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తామన్నారు. తక్షణమే నష్టపరిహారం అంచనా వేసి ఎకరాకు రూ.25వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
'వస్తున్నా...మీకోసం' పాదయాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబునాయుడు సోమవారం కూచిపూడి నుండి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీలం తుపాన్ నష్టం నివేదికను కిరణ్కుమార్రెడ్డి ఇప్పటివరకు కేంద్రానికి పంపలేదని ఆయన దుయ్యబట్టారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.
ప్రపంచంలో ఎక్కడ అవినీతి జరిగినా దివంగత వైఎస్ కుటుంబానికి లంకె ఉంటుందని, ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని చంద్రబాబునాయుడు ఆరోపించారు. వైఎస్ అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ షెడ్యూల్ కులాల భూములను లాక్కున్నారని ఆరోపించారు. తాను ముప్పయ్యేళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ఎంతో మందిని ముఖ్యమంత్రులను చూశానని కానీ, వైయస్లా దోచుకున్న వారిని చూడలేదన్నారు. జైల్లో ఉన్న వారిని నమ్మొద్దని జగన్ను ఉద్దేశించి అన్నారు.
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మద్దతిచ్చే పార్టీయే కేంద్రంలో అధికారంలో ఉంటుందని చంద్రబాబు నాయుడు చెప్పారు. సహకార ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ నేతలు ఇంట్లో కూర్చుని సభ్యులను చేర్చుకున్నారని అందుకే, ఆ పార్టీ గెలిచిందన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెసు చిత్తు కావడం ఖాయమన్నారు. టిడిపి హయాంలో వంట గ్యాస్, స్టవ్ ఉచితంగా ఇస్తే, కాంగ్రెసు తన హయాంలో ఇచ్చిన గ్యాస్ కనెక్షన్లను రద్దు చేసిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెసు హయాంలో చనిపోయిన వారికి కూడా పింఛన్లు ఇస్తున్నారని, పింఛన్లలో పూర్తిగా అవకతవకలు జరుగుతున్నాయన్నారు.
వర్షం కారణంగా మహాధర్నా వాయిదా
గుంటూరు జిల్లాలో చంద్రబాబు సోమవారం తలపెట్టిన మహా ధర్నా వర్షం కారణంగా వాయిదా వేయడం జరిగిందని టిడిపి గుంటూరు జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. నిన్నటి వరకు సాగునీరు లేక రైతులు తీవ్రమైన ఆందోళనకు గురయ్యారన్నారు. వస్తున్నా...మీకోసం పాదయాత్రలో గుంటూరు జిల్లాలోకి చంద్రబాబు అడుగుపెట్టగానే రైతులు ప్రభుత్వం పట్ల ఆక్రోషాన్ని, ఆవేదనను చంద్రబాబు ముందు ఉంచారన్నారు. దీనికి స్పందించిన చంద్రబాబు ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడానికి కూచిపూడిలో ధర్నా కార్యక్రమానికి టీడిపీ శ్రేణులు సమాయత్తమయ్యామని తెలిపారు. అకాల వర్షం కారణంగా కల్లాల్లో ఉన్న మిర్చి, అరటి, మొక్కజొన్న తోటలు, పండ్లతోటలు బాగా దెబ్బతిన్నాయన్నారు. పంట నష్టానికి సంబందించిన అంచనాలు తయారు చేసి తక్షణమే ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే తిరిగి చంద్రబాబు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తామన్నారు. తక్షణమే నష్టపరిహారం అంచనా వేసి ఎకరాకు రూ.25వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జైల్లో ఉన్న వారిని నమ్మవద్దు : చంద్రబాబు
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు
సోమవారం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును తెలుగు దేశం పార్టీ స్వాగతించింది.
ఈ సందర్భంగా ఆ పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి మీడియాతో
మాట్లాడుతూ 2001 జనాభా లెక్కల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే బీసీలు
నష్టపోతారన్నారు.
ప్రభుత్వ అసమర్థత వల్లే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఆలస్యం సోమిరెడ్డి పేర్కొన్నారు. ఈసీ పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే సహకార సంఘాల ఎన్నికలు లాగానే ఈ ఎన్నికలు ఉంటాయని ఆయన అన్నారు.
ప్రభుత్వ అసమర్థత వల్లే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఆలస్యం సోమిరెడ్డి పేర్కొన్నారు. ఈసీ పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే సహకార సంఘాల ఎన్నికలు లాగానే ఈ ఎన్నికలు ఉంటాయని ఆయన అన్నారు.
సుప్రీం కోర్టు తీర్పును స్వాగతించిన టీడీపీ
జిల్లాలో సహకార ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ
ఆధిక్యంలో నిలిచింది. డీసీసీబీ, డీసీఎమ్ఎస్ ఛైర్మన్ స్థానాలను టీడీపీ
కైవసం చేసుకుంది. 19 డీసీసీబీ డైరెక్టర్ స్థానాలకు 13 టీడీపీ స్థానాల్లో, 6
కాంగ్రెస్ స్థానాల్లో విజయం సాధించింది. 9 డీసీఎమ్ఎస్ డైరెక్టర్
స్థానాలకు టీడీపీ 6, కాంగ్రెస్ మూడింటిలో గెలిచింది.
ఖమ్మంలో సహకార ఎన్నికల్లో టీడీపీ హవా
సంక్రాంతి పండగను తలపించే రీతిలో పల్లెలు కళకళలాడుతోన్నాయి. పచ్చటి
తోరణాలు, అరటి చెట్లతో స్వాగత ద్వారాలతో వీధులన్నీ కొత్త శోభను
సంతరించుకొంటున్నాయి. కనక తప్పెట్లు, బ్యాండుబాజాలు, సంప్రదాయ నృత్యాలతో
సందడిసందడిగా మారుతోన్నాయి. చంద్రబాబు 'వస్తున్నా... మీకోసం' పాదయాత్ర
సాగుతోన్న ప్రతి పల్లెలో ఉత్సవ శోభ ప్రతిబింబిస్తోంది. ఇంటిల్లిపాది రోడ్డు
మీదకు వచ్చి అలుపెరగని బాటసారికి స్వాగతం పలుకుతున్నారు.
చంద్రబాబు పాదయాత్ర జిల్లాలో 11వ రోజు పచ్చగా కళకళలాడే డెల్టా ప్రాంతంలోని పల్లెల నుంచి కొనసాగింది. చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన నేతలు, తెనాలిలోని వస్త్ర వ్యాపారులు, ముస్లిం మైనార్టీలు, లాయర్లతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకొన్న చంద్రబాబు ఆదివారం మధ్యాహ్నం 1.10 గంటలకు పాదయాత్రను ప్రారంభించారు. ఆయనకు చినరావూరులో ఘనస్వాగతం లభించింది.
పాటిబండ్ల నరేంద్రనాథ్ ఆధ్వర్యంలో ఆయన మిత్రబృందం చంద్రబాబును సంప్రదాయ నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో స్వాగతించింది. అక్కడ పది నిమిషాల సేపు ఓపెన్టాప్ వాహనంపై చంద్రబాబు ప్రసంగించారు. పక్కనే ఉన్న వీజీటీఎం ఉడా పార్కును చూసి దానిని తామే అభివృద్ధి చేశామని, కాంగ్రెస్ వాళ్లు వచ్చి ్రపైవేటీకరణ చేసి కంపు కొట్టే స్థితికి తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ కష్టాలు చూడటానికే నేను వచ్చాను. ఇక్కడ తాగేందుకు నీళ్లు లేవు. ముస్లింల స్మశానవాటికకు రోడ్డు లేదు. ఇంటి అద్దెలు కట్టలేకపోతున్నారు. మీరు ప్రజల్లో చైతన్యం నింపే బాధ్యత తీసుకోండి.. తాను మీ జీవితాలు బాగు చేసే బాధ్యత చూసుకొంటానని హామీ ఇచ్చి ముందుకు కదిలారు.
రేపల్లె రైల్వేగేటు మీదుగా జంగడిగుంటపాలెం, ప్రగతీ నగర్, బీసీ కాలనీ, పెదరావూరు మీదుగా కూచిపూడి వరకు యాత్ర కొనసాగింది. మధ్యాహ్న భోజన సమయంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలతో చంద్రబాబు సమావేశమై త్వరలో జరగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అవలంభించాల్సిన వైఖరిపై చర్చించారు. అగస్టా హెలికాఫ్టర్ల కుంభకోణం, నింగినంటిన నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, వంట గ్యాస్ సిలిండర్ కష్టాలు, అకాలవర్షంతో రైతులకు కలిగిన నష్టం, కరెంటు కష్టాలపై గళం విప్పాలని సూచించారు. రైల్వేబడ్జెట్లో ర్రాష్టానికి జరుగుతోన్న అన్యాయాన్ని నిలదీయాలని సూచించారు.
చంద్రబాబు రూట్మ్యాప్లో కొన్ని కాలనీలు లేకపోయినా ఆయా ప్రాంతాల ప్రజలు వచ్చి రోడ్డుకు అడ్డంగా నిలబడి తమ వీధులకు తీసుకెళుతున్నారు. తాము పడుతున్న కష్టాలను ఏకరువు పెడుతూ వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇంటింటి నుంచి మహిళలు రోడ్డు మీదకు వచ్చి చంద్రబాబుకు హారతి ఇస్తూ నుదుటిన కుంకుమ దిద్దుతూ దీవిస్తున్నారు. కలెక్టర్కు నాలుగు లేఖలు
* తెనాలి మండలం గుడివాడ గ్రామంలోని అంతర్గత రోడ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, తక్షణం ఆ గ్రామంలో రోడ్లు, మురుగుకాలువలు నిర్మించాలని చంద్రబాబు కోరారు.
* అంగలకుదురు గ్రామంలో రోడ్ల మధ్యన నీటిగుంటల్లో దోమలు చేరి ప్రజలు అంటువ్యాధుల భారిన పడుతున్నారని చెబుతూ ఆ గ్రామంలో రోడ్లు, ్రడైనేజీ వ్యవస్థను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. * కొలకలూరు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా ఇప్పటివరకు బిల్లుల చెల్లింపు జరగలేదు. లబ్ధిదారులు అప్పులు తెచ్చి పనులు మొదలుపెట్టి వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు. తక్షణం ఇళ్లకు బిల్లులు మంజూరు చేయాలన్నారు.* అంగలకుదురు గ్రామంలో అర్హులైన వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు రావడం లేదు. తక్షణం అక్కడ సర్వే చేపట్టి పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు.
ప్రకాశం జిల్లా ఉద్యోగి స్ఫూర్తి చంద్రబాబు చేస్తోన్న పాదయాత్రకు ప్రకాశం జిల్లాకు చెందిన ఉద్యోగి త్రివిక్రమరావు స్ఫూర్తి పొందారు. ఆయన తన నెల జీతం రూ. 78,837ను పెదరావూరు వద్ద చంద్రబాబుకు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలు ఇచ్చే విరాళాలతోనే తెలుగుదేశం పార్టీ నడుస్తోందని, ఏ సందర్భంలోనూ ప్రభుత్వంపై ఆధారపడలేదని స్పష్టం చేశారు.
చంద్రబాబు వెంట టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఆలపాటి రాజేంద్రప్రసాదు, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, కొమ్మాలపాటి శ్రీధర్, నక్కా ఆనందబాబు, టీడీపీ జిల్లా నాయకులు మన్నవ సుబ్బారావు, నిమ్మకాయల రాజనారాయణ, వేములపల్లి శ్రీరామ్ప్రసాద్, తెలుగు యువత మల్లి, మానుకొండ శివప్రసాద్, కొర్రపాటి నాగేశ్వరరావు, చిట్టాబత్తిన చిట్టిబాబు, ములకా సత్యవాణి, పానకాల వెంకటమహాలక్ష్మి తదితరులు నడిచారు.
పల్లెలెట్ల కదులుతున్నయంటే
గుంటూరు : తెలుగుదేశం అధినేత చంద్రబాబు
నాయుడుకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గుంటూరు జిల్లాకు చెందిన
వారు జిల్లాలో ఉండవద్దంటూ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీస్పై జిల్లా
టిడిపి అధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు వివరణ ఇచ్చారు. ఆదివారం
మధ్యాహ్నం ఒంటి గంటకు కలెక్టర్ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి
మన్నవ సుబ్బారావు నేతృత్వంలో ప్రతినిధి బృందం డి ఆర్వోను కలిసి ఎన్నికల
కమిషన్ ఇచ్చిన నోటీసుపై వివరణ ఇచ్చారు. చంద్రబాబు ఎన్నికల షెడ్యూల్ విడుదల
కాకముందే పాదయాత్ర ప్రారంభించారని వివరించారు. అక్టోబర్ 2వ తేదీన అనంతపురం
జిల్లా నుంచి పాదయాత్ర ప్రారంభమైందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు స్వేచ్ఛగా
జరిగేందుకు టీడీపీ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పోలింగ్
జరిగే సమయంలో చంద్రబాబు గ్రామాలకు దూరంగా పోలింగ్ స్టేషన్కు కొన్ని కిలో
మీటర్ల దూరంగా బస చేస్తున్నారన్నారు.
కావున ఈ సమయంలో ఎవరిని కలిసే అవకాశం లేకపోవడం వలన ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు ఉండవన్నారు. ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నందున 19వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 21వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు పాదయాత్ర నిలుపుదల చేస్తున్నామన్నారు. ఎన్నికలు జరిగే సమయానికి ముందే పాదయాత్ర నిలుపుదల చేస్తున్నామని హామీ ఇచ్చారు. ప్రత్తిపాటి పుల్లారావు పంపిన లేఖను నిమ్మకాయల రాజనారాయణ, మానుకొండ శివ ప్రసాద్, చిట్టాబత్తిన చిట్టిబాబు, కలెక్టర్ కార్యాలయంలో డి ఆర్వో నాగబాబును కలిసి అందజేశారు.
బాబుకు ఇచ్చిన ఎన్నికల కమిషన్ నోటీస్పై వివరణ
Subscribe to:
Posts
(
Atom
)