September 5, 2013

కాంగ్రెస్ హైకమాండ్ చేతుల్లో వైసీపీ పగ్గాలు : రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్ హైకమాండ్ చేతుల్లో వైఎస్సార్‌సీపీ పగ్గాలు ఉన్నాయని, కాంగ్రెస్ అధిష్టానం చెప్పినట్లు వైసీపీ ఆడుతోందని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ సీడ బ్ల్యూసీ నిర్ణయానికి ముందే వైసీపీ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ హైకమాండ్ రాజీనామా చేయించిందని ధ్వజమెత్తారు. సమైక్యాంధ్ర కోసం హోంమంత్రికి వైసీపీ లేఖ రాయాలని కాంగ్రెస్ నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారముందని, ఒకట్రెండు రోజుల్లో వైసీపీ లేఖ రాయనుందని ఆయన అన్నారు. ఇది వాస్తవమా...కాదా వైసీపీ స్పష్టం చేయాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.