September 5, 2013

విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు నేర్చుకోవాలి : చంద్రబాబునాయుడు

విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని టీడీపీ చీఫ్‌ చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.మోతడకలో ఇంజినీరింగ్‌ విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. చరిత్ర తెలుసుకుంటే భవితకు ప్రణాళిక వేసుకోగలమన్నారు. ప్రపంచంలోని ఐటీ కంపెనీలను హైదరాబాద్‌కు తీసుకొచ్చామని ఆయన చెప్పారు. తొమ్మిదేళ్ల పాలనలో దేశంలో, రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలకు మార్గదర్శనం చేశామని బాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ను గౌరవించే పరిస్థితి నుంచి ఇప్పుడు నీచంగా చూసే పరిస్థితికి కాంగ్రెస్‌ చలవతో చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు.