September 5, 2013
ప్రధాని కీలుబొమ్మ : చంద్రబాబు
సోనియా చేతిలో ప్రధాని మన్మోహన్సింగ్ తోలుబొమ్మగా మారారని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. మన్మోహన్ ఒట్టి అసమర్ధుడని విమర్శించారు. బాబు చేపట్టిన తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర జిల్లాలో నాల్గో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన అబ్బరాజు పాలెంలో మాట్లాడారు. సోనియా దేశాన్ని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన అంశంలో రాజకీయ దురుద్దేశంతోనే నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. దేశంలో ఆర్థిక వ్యవస్థ నాశనమైపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు.ఇటీల యూరప్లోనే పెద్ద మాఫియా అని, సోనియా అక్కడి నుంచే వచ్చారని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో రూపాయి విలువ పతనమయిందని, అవినీతి పెరిగిపోయిందని ఆయనపేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలోగోనె సంచిలో డబ్బులు తీసుకెళ్లి కూరగాయలు కొనే దుస్థితినెలకొందన్నారు. కృష్ణా జిలాల వివాదంలో ప్రభుత్వం సరైన వాదనలు వినిపించలేకపోయిందని, దీంతో మిగులు జలాలను కూడా ఎగువ రాష్ట్రాలు వాడుకునేందుకు సిద్ధమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
Posted by
arjun
at
12:15 AM