September 5, 2013

శ్రీకృష్ణ కమిటీ ని ఎందుకు తొక్కిపెట్టారు : పయ్యావుల

కాంగ్రెస్ పార్టీ శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఎందుకు తొక్కిపెట్టిందని టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రశ్నిస్తున్నారు. రూ. 30 కోట్లు ఖర్చుపెట్టి జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తయారు చేసిన నివేదికను పార్లమెంట్ లో పట్టుమని గంట సేపు కూడా చర్చించలేదని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పరిస్థితి ముందుకు, వెనక్కి వెళ్లలేకుండా ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు. విబజన వ్యవహారం అత్యంత క్లిష్టమైనదని ఆయన అబిప్రాయపడ్డారు.