September 5, 2013

ఆందోళనలను కేంద్రం పట్టించు కోవడం లేదు : సీఎం రమేష్

గత 35 రోజులుగా సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ రాజ్యసభ సభ్యుడు  ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ ఇక్కడ కూర్చుని చాలా మంది నేతలు మాట్లాడుతున్నారని, అది బాధాకరమైన విషయమని, ఒక్కసారి సీమాంధ్రలో పర్యటిస్తే పరిస్థితి అర్థమవుతుందని రమేష్ పేర్కొన్నారు.
దేశంలో ఇంత వరకు ఎప్పుడు జరగని రీతిలో ఉద్యమం జరుగుతుందని సీఎం రమేష్ అన్నారు. ఒకవైపు విభజన ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని అంటున్నారు. మరోవైపు ప్రభుత్వ కమిటీ వేస్తామని చెబుతూ రాష్ట్ర ప్రజలను గందరగోళంలో పడేస్తున్నారని ఆయన ఆరోపించారు.