September 5, 2013

7న నగరంలో అల్లర్లకు యత్నం : నర్సిరెడ్డి


ఈనెల 7న నగరంలో అల్లర్లు సృష్టించేందుకు టీఆర్ఎస్, వైసీపీ ప్రయత్నిస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి నర్సిరెడ్డి తెలిపారు. టీజేఏసీ పేరుతో గతంలో కేసీఆర్ కత్తిసాము, కర్రసాములు శిక్షణ ఇచ్చారని, అప్పుడు శిక్షణ పొందిన వారు గొడవలకు కుట్ర పనుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్, వైసీపీలపై నిఘా పెట్టాలని నర్సిరెడ్డి డిమాండ్ చేశారు.