March 9, 2013

ఏలూరు:శరీరం సహకరించడం లేదు. ఇబ్బంది పడుతున్నా. మీ పెద్దకొడుకు మాదిరిగా ఈ ర్రాష్ట కుటుంబ భవిష్యత్‌ను తీర్చిదిద్దేందుకు ఎన్ని కష్టాలు వచ్చినా నడక మాత్రం ఆపను. ఆశీర్వదించండి. నాతో కలిసి రండి' అని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. 'వస్తున్నా మీకోసం' పేరిట చంద్రబాబు 159వ రోజైన శనివారం కృష్ణా జిల్లా నుంచి ఉప్పుటేరు దాటి పశ్చిమలో రాత్రి ఏడున్నర గంటలకు కాలిడారు. అక్కడ ఆయనకు వేలాది మంది ఎదురేగి స్వాగతం పలికారు. ఆయనకు అనుకూలంగా దిక్కులు పిక్కటిల్లేలా జై చంద్రబాబు అంటూ నినదించారు. తెలుగుదేశం కార్యకర్తలు, మహిళలు, మధ్య వయస్కులు వేలాది మంది ఆయనకు ఎదురేగి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

'మీలో ఉత్సాహం ఉంది. ఆ ఉత్సాహమే ఇన్ని వందల కిలోమీటర్లు నన్ను నడిపించేలా చేసింది. ఇక ముందు కూడా ఇదే ధైర్యంతో, ఇదే ప్రోత్సాహంతో ముందుకే వెళ్తాను' అని చంద్రబాబు ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ర్రాష్ట అభివృద్ధి కోసం ప్రస్తుతం ఉన్న దొంగల బారి నుంచి మిమ్మల్ని అందరినీ కాపాడతానంటూ భరోసా ఇచ్చారు. ఉప్పుటేరు వంతెన దాటిన తర్వాత అక్కడ గుమ్మిగూడిన వందలాది మందిని ఉద్దేశించి ఆయన కాస్తంత ఉద్వేగంతోనే ప్రసంగించారు. ప్రత్యేకంగా పోలవరం, కొల్లేరు అంశాలను ప్రస్తావిస్తూ వైఎస్ రాజశేఖరరెడ్డి తీరును ఎండగట్టే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే కొల్లేరు వాసులకు సంపూర్ణమైనటువంటి జీవిత భరోసా ఇస్తానని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పెండింగ్‌లో పెట్టి రైతులను దగా చేస్తున్నారని, ఇప్పటికే డెల్టా రైతులు దెబ్బతిన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉప్పుటేరు వంతెన వద్ద నుంచి ప్రధాన మార్గం మీదుగా దుంపగడప గ్రామానికి బాబు చేరుకున్నారు.

ఈ గ్రామంలో ఆయనకు అడుగడుగునా స్థానికులు ఎదురేగి స్వాగతం పలికారు. మహిళలు హారతులిచ్చారు. ఒక చిన్నారికి చంద్రబాబు స్వయంగా నామకరణం చేశారు. మార్గమధ్యలో తనకు కన్పించిన వారిని పలకరిస్తూ వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. 'మీరెంత కష్టపడుతున్నారో చూసేందుకే నేను క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నాను. అనుభవం ఉన్నవాడిని. అన్నీ తెలిసిన వాడిని. నాపాలనలో మీకీకష్టాలు ఉండేవి కావు. ఇప్పుడు మీరు పడుతున్న కష్టాలను చూస్తుంటే బాధేస్తోంది' అని బాబు తన బాధను వెళ్లగక్కారు. అలాగే అవినీతి అంశాలపైనే ఆయన విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. 'ఈ ర్రాష్టంలో దొంగలు పడ్డారు.

కాంగ్రెస్ దొంగలు పడ్డారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ తేడా లేకుండా తెగ తినేశారు. మనం అధికారంలోకి వస్తే వీళ్లని చూస్తూ వదిలిపెట్టం' అన్నారు. 'నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నా, ర్రాష్టాన్ని అధోగతి పాల్జేసేందుకే ఇలాంటి వాళ్లంతా తెగబడుతున్నారని, వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో లబ్దిపొందిన వాళ్లు తిరిగి వాళ్లకు కావల్సిన వారికే పెట్టుబడులు పెట్టి ఇప్పుడు జైళ్లలో కూర్చున్నారు' అని జగన్, ఆయన అనుకూలురును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మీకు తెలుసు.. రైతులు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో, అందుకే నేను అధికారంలోకి వస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పాను. దానికే కట్టుబడి ఉన్నా. కాంగ్రెసేళ్లు మాత్రం ఎలా చేస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు అంటూ మీకు చెప్పాల్సిన పని లేదు.

ఎలా చేయాలో, ఏం చేయాలో నాకు తెలుసని కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉప్పుటేరు దగ్గరే పశ్చిమ లో కాలుపెట్టానోలేదో సూపర్‌గా అదిరిందంటూ వచ్చిన జనాన్ని చూసి ఆ యన సంతోషపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యులు కూడా వందల సంఖ్యలోనే బాబు యాత్రలో పాలుపంచుకున్నారు. పార్టీ జిల్లా అ ధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, మా గంటిబాబు, ఎమ్మెల్యే శివరామరాజు తో సహా ముఖ్యనేతలంతా పాదయాత్రలో పాలుపంచుకున్నారు.

హామీలు వెల్లువ... బాబు తన పాదయాత్ర సందర్భంగా భారీగానే హామీలు ప్రకటిస్తూ ముందుకు సాగారు. డ్వాక్రా సంఘా లు నిర్వీర్యమయ్యాయని, వాటిని తిరి గి ఆదుకుంటామని భరోసా ప్రకటించారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు, రైతులకు రుణాలు, సాఫ్ట్‌వేర్ రంగం అభివృద్ధి, పట్టణాల అభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, కాలువల ఆధునీకరణ పనులు, చేపల పరిశోధనా కేంద్రం, పింఛన్ల పెంపు వంటి వాటిని కూడా ఆయన తన ప్రసంగంలో పదేపదే ప్రస్తావించారు.

మీ పెద్ద కొడుకులా వచ్చా!

భీమవరం / ఆకివీడు రూరల్ / ఆకివీడు:మాకు ఇళ్ళు లేవు, స్థలాలు లేవు, అద్ధెళ్ళల్లో ఉంటున్నాం అంటూ మారదాని ఎల్లమ్మ అనే పెద్దావిడ వాపోయింది. ఆకివీడు రైల్వే గేటు దాటిన తర్వాత కొంతమంది మహిళలు చంద్రబాబును ఆపి ఇళ్ల స్థలాల సమస్యను వివరించారు. ప్రతీ ఒక్కరికీ ఇల్లు నిర్మించి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

విద్యుత్ లేక ఇబ్బందంటూ పదో తరగతి విద్యార్ధిని ఆవేదన..

పదో తరగతి పరీక్షలు వస్తున్నాయి. కరెంట్ కోత వల్ల చదవలేకపోతున్నామని టి కుమారి అనే విద్యార్థిని చంద్రబాబు వద్ద వాపోయింది. ఆ బాలిక చెప్పే సమస్యను చంద్రబా బు ఆలకించి విద్యుత్ సమస్యను లే కుండా చూస్తానని, కాంగ్రెస్ ప్ర భు త్వం విద్యుత్ కోతతో అందరికీ ఇ బ్బ ంది పెడుతున్నారని విమర్శించారు.

చిన్న మసీదు వద్ద హారతులు..

రైల్వే స్టేషన్ సమీపంలోని చిన్న మసీదు ప్రాంతంలో మహిళలు హారతులు పట్టారు. చింతలపాటి సూర్యకుమారి, శృతి ఇచ్చిన హారతిని నవ్వుతూ స్వీకరిస్తూ అభివాదం చేశారు.

చంద్రబాబుతో మాట్లాడేందుకు మహిళలు ఉత్సాహం..

ఆకివీడు రైల్వే స్టేషన్ రోడ్డులో చంద్రబాబు వద్ద మహిళలు అడుగడుగునా స్పందించారు. తమ సమస్యలను ఏకరువు పెట్టారు. చిన్న మసీదు నుంచి రైల్వే స్టేషన్ సెంటర్ నుంచి సిద్ధాపురం రోడ్డు వరకు పలు చోట్ల మహిళలు ప్రస్తావించారు. రైల్వే స్టేష న్ సెంటర్‌లో నీలం లక్ష్మీ, కె పద్మ, షేక్ బీర్భమ్‌బేబీ, షేక్ షాన్‌బేబీ అనే మహిళలు ఇళ్ళ స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. విద్యుత్ కోతల వల్ల అష్టకష్టాలు పడుతున్నామన్నారు. మహిళలు గుంపులుగా వచ్చి తామంతా కష్టాలు పడుతున్నామంటూ చెప్పుకొచ్చారు.

తనకు ఇద్దరు పిల్లలని అదే ప్రాంతానికి చెందిన డోల పార్వతి అనే మహిళ చెప్పింది. ఇద్దరికీ మాటలు రావని, ఆపరేషన్ చేయించినా మెరుగు పడలేదని, తన పిల్లలకు ఏదైనా పింఛను ఇప్పిస్తే తమకు కొం త బాధలు తప్పుతాయంటూ వాపోయింది. మీకు న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

మరికొంత దూరం వచ్చే సరికి పలువురు ముస్లిం మహిళలు చంద్రబాబు వద్ధకు వచ్చారు. ఆయన మాట్లాడుతూ ముస్లింలకు తన హ యాంలో ఎన్నో సౌకర్యాలను కల్పించానని, ఇప్పుడు ప్రత్యేక రిజర్వేషన్ వల్ల మరింత న్యాయం జరుగుతుందని చెప్పారు.

సమస్యలు వింటూ ముందుకు

ఏలూరు: పశ్చిమలో బాబు తొలిరోజు పాదయాత్ర అద్భుతంగా సాగింది. ఆయన రాక కోసం మధ్యాహ్నం నుంచే ఓ పిగ్గా ఎదురుచూసిన వారంతా యాత్ర ముగిసేంత వరకు ఆయన వెంటే అడుగులో అడుగులు వేశారు. ఆయన పాదయాత్ర సాగిన వీధులన్నీ జనంతో కిక్కిరిసి కన్పించాయి. ఉప్పుటేరు వం తెన నుంచి దుంపగడప వరకు రెండు కిలోమీటర్లు నడిచేందుకు సుమారు గంటన్నరకు పైగానే పట్టింది. అలాగే అక్కడి నుంచి ఆకివీడు చేరుకోవడాని కి మరో గంటన్నర పైగానే సమయం పట్టింది. మార్గమధ్యలో ఆయనను ద గ్గరగా వెళ్లి చూసేందుకు మహిళలు, యువకులు విఫలయత్నం చేశారు. దా నిని గుర్తించిన చంద్రబాబు అనేక మ ందిని భుజం తడుతూ చేతులు జో డించి నమస్కరిస్తూ నెమ్మదిగా ముం దుకు సాగారు.

కృష్ణాజిల్లా ఆలపాడు లో మధ్యాహ్నం 12 గంటల నుంచి ఐ దు గంటల వరకు విరామం లేకుండా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న చంద్రబాబు జిల్లాలో రాత్రి ఏడున్నరకు పాదం మోపారు. ఒక్క దుంపగడప లో మాత్రమే ఆయన రెండుసార్లు స్వ ల్ప విరామం తీసుకున్నారు. రైల్వే క్రా సింగ్ వద్ద గేటు పడటంతో ఆయన పా దయాత్రను కొంతసేపు నిలిపివేసి ఆ తర్వాత తిరిగి కొనసాగించారు. పాదయాత్ర సాగుతున్నంత సేపు తెలుగుదేశం ముఖ్య కార్యకర్తలు, పోలీసులు, ప్రత్యేక కమెండోలు ఆయనకు రక్షణ బాధ్యతల్లో అప్రమత్తంగా కన్పించా రు. చంద్రబాబు అక్కడక్కడ మాట్లాడుతున్నప్పుడు 'బాబు బాగా అలసిపోయినట్లున్నారు. పాపం ఈ వయసు లో ఇంతెలా నడుస్తున్నారో' అని మ హిళలు ఆయన పట్ల సానుభూతి ప్రకటించారు.

పాదయాత్ర ఆలస్యమవుతు ందని ముందుగానే గమనించిన పార్టీ నాయకులు మాత్రం అందరినీ ఉత్సాహపరుస్తూ, వారితో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. తొలిరోజు ఆయన పాదయాత్రలో మహిళలు, యువకుల సంఖ్య అత్యధికంగా కన్పించింది. ఇ ళ్లల్లో పనులు వదిలేసిన మహిళలు కూ డా ఆయనను చూసేందుకు వీధుల్లోకొచ్చి నిలబడ్డారు. యువకులైతే కేరింతలు కొట్టడం సహజంగానే కేడర్‌లో ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేసింది.

తొలిరోజు అదుర్స్

ఏలూర్రుకైం : టీడీపీ రాష్ట్ర అధ్యక్షు డు నారా చంద్రబాబునాయుడు జిల్లా పాదయాత్ర సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం.రమేష్ ఆదేశాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం జిల్లాలోకి అడుగు పెట్టిన చంద్రబాబునాయుడుకు అడుగడుగు నా భద్రత వలయాన్ని ఏర్పాటు చేశా రు. ప్రత్యేక కాన్వాయ్‌ను ఏర్పాటు చే సి ఇన్‌ఛార్జిగా ఒక డీఎస్పీని నియమించారు.ఆ కాన్వాయ్‌లో ఇద్దరు సీఐలు, ముగ్గురు ఎస్ఐలు, మరికొంత మంది పోలీసు సిబ్బందిని నియమించారు. మరో వైపు బాంబ్ స్క్వాడ్, పోలీసు జాగిలాలు రంగంలోకి దించి ఆయన పాదయాత్రకు ముందుగానే క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానాస్పద వస్తువులను పరిశీలిస్తున్నారు. స్థానికంగా ఉండే పోలీసు సిబ్బందితో పాటు నరసాపురం సబ్ డివిజన్‌లో ఉండే పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.

గతంలో తణుకు రూ రల్ మండలం పైడిపర్రులో టెక్ మ ధు నివాసంలో మావోయిస్టుల డంప్ లభించడం వంటి సంఘటనలను దృ ష్టిలో పెట్టుకుని పోలీసు ఉన్నతాధికారులు ముందస్తుగా జాగ్రత్తలు చేపట్టారు.ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరగకుండా అనేక విభాగాల పోలీసులను మఫ్టీలో నియమించి జాగ్రత్తలు తీసుకున్నారు.ఇద్దరు డీఎస్పీలతో పా టు 300 మంది పోలీస్ సిబ్బందిని ఈ పాదయాత్ర బందోబస్తు కోసం వినియోగించినట్టు సమాచారం.

అడుగడుగునా తనిఖీలు

కొనేవారితో కలవాలా?
మన ఎమ్మెల్యేలకు గేలంవేసే వైసీపీకి మద్దతా?

  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం వ్యవహారంలో ఎటువంటి వ్యూహంతో వెళ్లాలన్న అం శంపై తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో ఒక నిర్ణయానికి రాలేకపోయింది. శనివారం కృష్ణా జిల్లాలో జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో నేతల మ« ద్య భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో తదుపరి పరిస్థితులను బట్టి పార్టీ వ్యూహాన్ని నిర్ణయించుకోవాలని నిశ్చయించారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబా బు పాదయాత్రలో ఉండటంతో ఆయన ఉన్నచోటనే పొలిట్‌బ్యూరో సమావేశం నిర్వహించారు.

అవిశ్వాసం వ్యవహారంపై ఈ సమావేశంలో రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 'అవకాశం దొరికిన ప్రతిసారీ వైసీపీ డబ్బు విరజిమ్మి మన పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తోంది. ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ మనను బలహీనపర్చడానికి ప్రయత్నం చేస్తోంది. అలాంటప్పుడు ఆ పార్టీ అడగ్గానే మనం ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టాలి? ఆ పార్టీ పెడితే మనం ఎందుకు బలపర్చాలి? శాసనసభ స్పీకర్, డిఫ్యూటీ స్పీకర్ పోస్టులకు మనం పోటీ పడగా, వైసీపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారు. మనమూ మనకు లాభం ఉందనుకొన్నప్పుడు ప్రజల కోణంలో అవిశ్వాసం గురించి ఆలోచిద్దాం'' అని కొందరు నేతలు వాదించారు.

సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి వంటి నేతలు దీనిని ప్రతిపాదించగా, మరికొందరు నేతలు భిన్నమైన వాదన వినిపించారు. "ప్రధాన ప్రతిపక్షంగా మనం ఉండగా వైసీపీ అవిశ్వాసం ప్రతిపాదించి దానిని మనం బలపర్చాల్సి వస్తే బాగుండదు. అలాగని దూరంగా ఉన్నా రాజకీయంగా నష్టపో తాం. దాని బదులు మనమే అవిశ్వాసం ప్రతిపాదిద్దాం' అని అభిప్రాయపడ్డారు. కడియం శ్రీహరి వంటివారు ఈ వాదన వినిపించారు.

ప్రభుత్వం పడిపోయి మ« ద్యంతర ఎన్నికలు వచ్చినా ఫర్వాలేదని, అటూ ఇటూ కాకుండా ఉప ఎన్నికలు వస్తేనే చికాకని పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. ఈ అభిప్రాయాలన్నీ తాను పరిగణనలోకి తీసుకొంటానని, పరిణామాలను బట్టి మరోసారి అందరితో చర్చిస్తానని చంద్రబాబు చెప్పారు. ఏడాదిలో సాధారణ ఎన్నికలు రాబోతుండగా ఇప్పు డు ఉప ఎన్నికల వ్యవహారం పెట్టుకోవడం సరికాదనిపిస్తోందని పేర్కొన్నారు.

'అవిశ్వాసం'పై టీడీపీ నేతల తర్జనభర్జన

ఆ జిల్లాలో అడుగుపెట్టగానే తొలుత నా కన్ను చెరువులపై పడింది. మూడు పంటలు పండే జిల్లా ఇది. సాగునీరు విషయంలోనే కాదు.. తాగునీటిపైనా ముందుచూపు ఎక్కువే. ఎండాకాలం వస్తున్నదంటే ముందుగా చెరువులు నింపుకుంటారు. వేసవి ఎద్దడిని ఎదుర్కొనేందుకు చేసుకునే ఏర్పాట్లలో ఇదే కీలకం. డెల్టా ప్రాంతమంతటా కనిపించేదే అయినా.. పశ్చిమ గోదావరిలో ఈ సంప్రదాయం కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. కానీ, ఉప్పుటేరు వంతెన మీదుగా పోతున్నప్పుడు ఆ వంతెన కింద వినిపించిన గలగలలే తప్ప ఆ తరువాత నీటి ఛాయలే కనిపించలేదు. చెరువులన్నీ బావురుమంటున్నాయి.

బాధనిపించింది. ఆరా తీశాను. "అదంటే ఇదంటారు.. ఇదంటే అదంటారు. చివరకు మా చెరువులను ఎండబెట్టా రు. రబీ సాగు అవసరాలు ముఖ్యమన్నారు. తాగునీటికి ఎండగట్టారు. పోనీ, సాగుకైనా న్యాయం చేశారా అంటే అదీలేదు. డెల్టాని ఉద్ధరిస్తున్నామంటూ చుక్కనీరు వదలలేదు. అటు సాగునీరూ లేదు. ఇటు తాగునీరూ లేదు.. ఏమి చేతుము సామీ'' అని ఓ రైతు వాపోయాడు. కృష్ణాని వదిలిపెట్టిన తొలి అడుగులోనే ఈ జిల్లా కష్టం తెలిసిపోయింది.

చెరువుల్లోనే కాదు.. ఈ కాలువల్లోనూ కన్నీరే పారుతోంది. ఉప్పుటేరు ప్రాంతంలోని వెంకయ్య-వయ్యేరు కాలువ.. చుట్టుపక్కల గ్రామాలకు జీవన వనరు. తలాటున గోదారి పారుతున్నా తలకి నీళ్లు లేవన్న చందంగా ఉంది ఇక్కడి ప్రజల బతుకు. కాలువను ఆధునీకరిస్తామని చెప్పడమేగానీ, ఏళ్లు గడుస్తున్నా అతీగతీ లేదట. రేపు ఫలహారం పెడతామని చెప్పి ఈరోజు గంజి కుండ పగలగొట్టినట్టు.. కాలువ ఆ«ధునికీకరణ పనులంటూ నీళ్లు వదలడం మానేశారట. ఇప్పటికి 30 కోట్ల రూపాయలు హారతి కర్పూరం అయ్యాయట. నీళ్లూ, కన్నీళ్లూ ఒకే కాలువలో!

నీళ్లూ.. కన్నీళ్లూ.. ఆ కాలువలోనే!

తిన్నదంతా కక్కిస్తా
ప్రాజెక్టుల్లో తెగ మేసేశారు..
కృష్ణాజిల్లాలో ముగిసిన బాబు యాత్ర..
ఉప్పుటేరు వద్ద పశ్చిమలోకి 'మీకోసం..'

  "కొల్లేరులో బాంబులు పెట్టి చెరువులను ధ్వంసంచేసే హక్కు మీకు ఎవరిచ్చారని అప్పట్లోనే వైఎస్‌ని అసెంబ్లీలో నిలదీశాను. ఇక్కడ కాదు..కొల్లేరు ప్రజల ముందు తేల్చుకుందాం రావాలని సవాల్ విసిరాను'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని కొందరు అడ్డగోలుగా దోచుకున్నారని, వాళ్లు తిన్నదంతా కక్కిస్తానని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పేరిట అప్పటి వైఎస్ ప్రభుత్వం వేల కోట్లు మేసేసిందని దుయ్యబట్టారు. కృష్ణాజిల్లా కైకలూరు మండలం ఆలపాడు వద్ద శనివారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. సాయంత్రానికి ఉప్పుటేరు వంతెన పైగా పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించారు.

ఈ సందర్భంగా కృష్ణాజిల్లా ఆలపాడు, ఉప్పుటూరుల్లో, పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో జరిగిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. మత్స్య పరిశ్రమపై ఆధారపడ్డ కొల్లేరు ప్రజలను రాజశేఖరరెడ్డి అన్నివిధాలా వంచించారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వస్తే కాంటూరును 'ఫ్లస్ త్రీ'కి కుదించి అక్రమంగా ధ్వంసం చేసిన 7,500 ఎకరాల చెరువులను పేదలకు పంచుతానని హామీ ఇచ్చారు. "కొల్లేరులో చెరువులను బాంబులతో ధ్వంసం చేసి..ఆ పాపాన్ని రాజశేఖరరెడ్డి మాకు అంటకట్టే ప్రయత్నం చేశారు. అప్పట్లో ప్రజలు కూడా దాన్ని నమ్మారు. కొన్నాళ్ళకు (2006) వాస్తవాలు వెల్లడయ్యాయ''ని గుర్తుచేశారు. దాళ్వాకు నీరు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం మొండి కేస్తుందని, డెల్టా ఆధునికీకరణ పేరిట రూ.4,600 కోట్ల నిధులు నీటి పాలు చేసి కమిషన్లు దండుకున్నారని విమర్శించారు.

కృష్ణాలో ముగిసిన యాత్ర: కృష్ణా జిల్లా కైకలూరు మండలం ఉప్పుటేరు వద్ద చంద్రబాబు పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. కృష్ణాజిల్లా రెండు విడతలుగా చంద్రబాబు పర్యటించారు. మొదటి విడతలో ఆరు నియోజకవర్గాలు, ఏడు మండలాలు, 83 గ్రామాలను.. రెండో విడతలో 4 నియోజకవర్గాలు, 8 మండలాలు, 60 గ్రామాల్లో యాత్ర చేశారు.

కొల్లేరుపై నాడే వైఎస్‌ని కడిగేశాను!


మహా శివరాత్రి శుభాకాంక్షలు...............


 ఆదిలాబాద్:బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో  చేపట్టిన మహాధర్నా కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ఆ పార్టీ నాయకులు, శ్రేణులు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమానికి ముందుగా స్థానిక బైల్ బజార్ నుంచి కార్యక్రమ వేధిక అయిన ఆర్ అండ్‌బీ అతిథి గృ హం వరకు పార్టీ కార్యకర్తలు, రైతులు ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ నిర్వహించా రు. స్థానిక ఆర్ అండ్‌బి అతిథి గృహం ముందు ధర్నా వేదిక ఏర్పాటు చేశా రు.

కార్యక్రమానికి పార్టీ అగ్ర నాయకు లు హాజరు కావాల్సి ఉండగా వారెవ రూ కూడా హాజరు కాలేదు. ఎంపి ర మేశ్ రాథోడ్, పార్టీ జిల్లా అ«ధ్యక్షుడు ,బోథ్ ఎమ్మెల్యే నగేశ్, నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ వి.గంగాధర్‌గౌడ్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్‌లు లోలం శ్యాంసుందర్, జుట్టు అశోక్‌లతోపాటు సీనియర్ నాయకులు భూషణ్‌రెడ్డి, రమదేవిలతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, నిర్మల్, ఖా నాపూర్, కడెం, ముథోల్ ప్రాంతాలకు చెందిన రైతులు హాజరయ్యారు. ధర్నానుద్దేశించి నేతలతో పాటు కార్యకర్తలు, రైతులు ఆవేశపూరితంగా చేసిన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి.

ముఖ్యంగా నే తలు బాబ్లీపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని, న్యాయపరమైన ఆధారాలను సమర్పించాలని డిమాండ్ చేశారు. అలాగే బా బ్లీ ప్రాజెక్టుతోపాటు మహారాష్ట్రలో గో దావరినదిపై అక్రమంగా నిర్మాణం చే పడుతున్న మరో 12 ప్రాజెక్టులను కూ డా అడ్డుకునేందుకుగాను అన్నీ పార్టీలతో అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పా టు చేసి ప్రధాని మన్మోహన్‌సింగ్ ను క లిసి విన్నవించనున్నట్లు పేర్కొన్నారు. ధర్నా అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలు, రైతులు ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు. ఆర్డీవో కార్యాలయం లో వినతి పత్రాన్ని సమర్పించారు.

జలదోపిడీని అడ్డుకుందాం

టీడీపీ ఎంపీ రాథోడ్ రమేష్


నిర్మల్: ఉత్తర తెలంగాణను ఎడారి గా మార్చే బాబ్లీ ప్రాజెక్టు సహా 14 అ క్రమ ప్రాజెక్టులను ఆపి మహారాష్ట్ర జ లదోపిడీని అడ్డుకుందామని ఎంపీ రా థోడ్ రమేష్, టీడీపీ నిజామాబాద్ జి ల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌ డ్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు నగేష్ రైతులకు పిలుపునిచ్చారు. బాబ్లీపై మ హారాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీ రు రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా శుక్రవారం నిర్మల్ పట్టణంలోని విశ్రాం తి భవనం ఎదుట జిల్లా టీడీపీ ఆధ్వర్యంలో «ధర్నా నిర్వహించారు.

అనంతరం ఆర్డీవో కార్యాలయం ముట్టడించి వినతి పత్రాన్ని అందించారు. దీనికి ముందు రైతు బజార్ నుంచి ఆర్డీవో కా ర్యాలయం వరకు ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మా ట్లాడుతూ బాబ్లీకి పునాదులు వేసినప్పుడే అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి దృష్టికి సమస్యను తీసుకవెళ్లినా పట్టించుకోలేదన్నారు. నిర్ధిష్టమైన వ్యూ హ ప్రణాళిక లేకుండా అప్పటి ప్రభు త్వం గుడ్డిగా వ్యవహరించిందని విమర్శించారు.

అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్న కేసీఆర్, రాష్ట్ర మంత్రులుగా ఉన్న టీఆర్ఎస్ నాయకులు బాబ్లీ నిర్మాణాన్ని అడ్డుకు నే కనీస ప్రయత్నం చేయలేదని విమర్శించారు. బాబ్లీ ప్రాజెక్టుపై సుప్రీంకో ర్టు ఎదుట మనరాష్ట్ర ప్రభుత్వం సరైన సాక్ష్యాలు చూపకపోవడం, వాదనలు వినిపించకపోవడం వల్లే సుప్రీంతీర్పు మహారాష్ట్రకు అనుకూలంగ వచ్చిందన్నారు. ఒక ప్రాజెక్టు గర్భంలో మరో ప్రాజెక్టును నిర్మించడం చరిత్రలో ఎక్క డా చూడలేదని విమర్శించారు.

ముంబాయి ప్రధాన కేంద్రంగా బాబ్లీపై ఏ ర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ వల్ల న్యా యం జరుగుతుందన్న విశ్వాసం తమ కు లేదన్నారు. టీడీపీ రైతుల కోసం చే స్తున్న ఒంటరి పోరును ప్రజలు గమనించాలన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రుణమాఫీ అమలుచేసి తీరుతామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నిర్మల్ నియోజ క వర్గ ఇన్‌చార్జి బాబర్, ముథోల్ ని యోజక వర్గ ఇన్‌చార్జి నారాయణరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రమాదేవి, జిల్లా ప్ర ధాన కార్యదర్శి లోలం శ్యామ్‌సుందర్, మాఐ జడ్పీ చైర్మన్ జుట్టు అశోక్, జిల్లా అధికార ప్రతినిధి ఆకోజి కిషన్, రాష్ట్ర రైతు కార్యదర్శి భూషణ్‌రెడ్డి, పట్టణ అ ధ్యక్షుడు గండ్రత్ రమేష్, ఆయా మం డల పార్టీ అధ్యక్షులు, సింగిల్ విండో చైర్మన్‌లు తదితరులు పాల్గొన్నారు.

బాబ్లీపై 'దేశం' మహాధర్నా సక్సెస్...

కుప్పం: 'ఏంటన్నా పెద్ద సార్‌వద్దకెళ్లి బాధలు చెప్పుకోవాలా.. నేనేర్పాటు చేస్తా' 'ఏందక్కా.. ఏంది మీ సమస్యలు?' 'మీకేం కావాలి? కెరీర్ కౌన్సెలింగ్ సెంటరే కదా.. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా కుప్పంతో ప్రారంభించి అంతటా విస్తరిస్తాం'..రెండో రోజు పర్యటనలో నారా లోకేష్- గ్రామీణులను, విద్యార్థులను ఉద్దేశించి జరిపిన మాటామంతీలో ఇవి కొన్ని మాత్రమే. తొలిరోజుకు భిన్నంగా ఆయన ప్రజలతో, విద్యార్థులతో మమేకమైపోయి చేసిన ప్రసంగాలు ఆకట్టుకు న్నాయి.కుప్పంలోని రహదారులు- భవనాల శాఖ అతిథి భవనంలో ప్రజలనుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించడంతో ప్రారంభమైన లోకేష్ రెండో రోజు పర్యటన తిరిగి సాయంత్రం అదే అతిథి గృహంలో నిర్వహించిన కుప్పం నియోజకవర్గ టీడీపీ ఏరియా కన్వీనర్ల సమావేశంతో ముగిసింది. ఆర్ అండ్ బి అతిథి గృహంలో కుప్పం అర్బన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు విద్యాసాగర్ ఆద్వర్యంలో పలువురు యువకులు లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. తర్వాత ఆయన గుడుపల్లె మండలం సంగనపల్లె వెళ్లారు.

సుమారు గంట సమయంపాటు ఇక్కడే గడిపారు. మహిళలు మంగళ హారతులతో ఆయనకు స్వాగతం పలికారు. ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన పార్టీ కార్యకర్త బాలప్ప ఇంటికి వెళ్లి ఆయన అమ్మానాన్నలను పరామర్శించి ఓదార్చారు. అక్కడినుంచి తిరిగి వచ్చే సమయంలో అదే వీధిలో ఉన్న చాలామంది గ్రామస్థులు, పిల్లలు ఆయనతో ఫొటోలు దిగడానికి ఉత్సాహపడ్డారు. అక్కడినుంచి గ్రామం నడిబొడ్డుకు వచ్చిన ఆయన, గ్రామీణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వారి సమస్యలన్నింటినీ ఓపిగ్గా విన్నారు. ముందు తాను మాట్లాడకుండా గ్రామీణులచేత మాట్లాడించారు. మరీ ఎక్కువ సమస్యలను ఏకరువు పెట్టిన మహిళలను 'మనం అధికారంలో లేమమ్మా.. అన్ని సమస్యలూ మనం తీర్చలేం..' అంటూ చిరునవ్వుతోనే నిలువరించారు.

ఇంజినీరింగు, ఇతర సాంకేతిక విద్యనభ్యసించిన నిరుద్యోగ యువతకు మొదట తన కంపెనీలో ఉద్యోగాలివ్వడానికి ప్రయత్నిస్తానని, తర్వాత ద్రావిడ విశ్వవిద్యాలయంతోపాటు స్థానిక కుప్పం ఇంజినీరింగు కళాశాలలో ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అక్కడినుంచి బయలుదేరి రాళ్లగంగమాంబ ఆలయంవద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి చేరుకున్నారు. ఎంపీ శివప్రసాద్ వంటి వక్తలు మాట్లాడిన తర్వాత తానేం మాట్లాడలేనంటూనే, అధికార కాంగ్రెస్, వైసీపీలపై పదునైన విమర్శలు ఎక్కుపెట్టారు. చంద్రబాబు సమర్థ నాయ కత్వంతోనే రాష్ట్రంలో అవినీతి రహిత అభివృద్ధి సాధ్యమవుతుందని ఊరించారు. ముంచుకొస్తున్న ఎన్నికలకు సిద్ధం కావాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఈ మధ్యలో చెట్టు కింద చదువులు సాగిస్తున్న గుడుపల్లె జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థుల వద్దకు వాహనం ఆపించి మరీ వెళ్లారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరించేం దుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కుప్పం లో జరిగిన తెలుగు మహిళ సమావేశానికి పెద్దఎత్తున మహిళలు హాజరైనా కేవలం రెండుమూడు నిముషాలు మాత్రమే మాట్లాడి ప్రసంగం ముగించారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆపైన టీఎన్ఎస్ఎఫ్ సమావేశంలో తన విద్యా జీవితాన్ని వివరించారు.టెన్త్ వరకు వీక్ స్టూడెంట్‌గా ఉన్న తాను తండ్రి చంద్రబాబు పట్టించుకోవడంతో ఎలా అమెరికా చదువులు చదివి పెద్దవాడైందీ గుర్తు చేసుకున్నారు.

ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో కెరీర్ కౌన్సెలింగ్ సెంటర్లు, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు ఏర్పాటు చేసి యువత నైపుణ్యాన్ని పెంచడం ద్వారా ఉద్యోగావకాశాలు పెరగడానికి దోహదం చేస్తానని హామీ ఇచ్చారు.అంతకుముందు గుడుపల్లె రాళ్ల గంగమాంబ ఆలయంలో జరిగిన సభలో మాట్లాడుతూ గుడుపల్లె సింగిల్‌విండోలో మొత్తం 13 సీట్లు గెలిపించినందుకు స్థానిక నాయకులను అభినందించారు. తన తండ్రి చంద్రబాబు ఇందుకోసమే, గుడుపల్లె తన గుండెకాయ అని తరచూ చెబుతుంటారని గుర్తు చేసుకున్నారు.తెలుగుయువత నియోజకవర్గ కన్వీనర్ సత్యేంద్రశేఖర్ ఆధ్వర్యంలో లోకేష్ రోడ్‌షో ఘనంగా జరిగింది.కుప్పం, గుడుపల్లె ర్యటన సందర్భంగా పరామర్శలు, ప్రసంగాలు, గ్రామ పర్యటనలు, విద్యార్థుల పలకరింపులు..

ఇలా అన్నింటిలో లోకేష్ వ్యవహార శైలి ఆయన తండ్రి చంద్రబాబును తలపించడం విశేషం. ఎంపీ శివప్రసాద్, జిల్లా పార్టీ అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు జంగాలపల్లె శ్రీనివాసులు, జి.శ్రీనివాసులు, జిల్లా తెలుగుయువత అధ్యక్షులు శ్రీధర్‌వర్మ, స్థానిక నాయకులు పి.ఎస్.మునిరత్నం, విద్యాసాగర్, సత్యేంద్రశేఖర్, గోపీనాథ్, నాను, బీసీ.నాగరాజ్, వెంకటేష్, సాంబశివం, నాను, భాగ్యరాజ్, రాజ్‌కుమార్, ఎమ్మార్ సురేష్ తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

చూద్దామన్నా..చేద్దామక్కా!


మీరందరు వస్తే ఇక నేనుండను. వేరే ఉద్యోగం చూసుకోవాల్సిందే..' - రాజకీయాల్లో చేరతామంటూ విద్యార్థు లు చూపిన ఉత్సాహానికి నారా లోకేష్ భయం నటిస్తూ అన్న మాటలివి. గుడుపల్లె సమీపంలోని రాళ్లగంగమాంబ ఆలయ ఆవరణలో శుక్రవారం ఆయన జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠశాలలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎవరెవరు ఏమేమి కావాలని కోరుకుంటున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించారు. 'డాక్టర్లు ఎవరవుతారు? ఇంజినీర్లు కావాలని ఎవరికి కోరిక ఉంది? పోలీసులు కాబోయేవారెవరు?' అని ప్రశ్నిస్తూ చేతులెత్తాల్సిం దిగా చిన్నారులను కోరారు. ప్రతి ప్రశ్నకు ఎంతో కొంతమంది చేతులెత్తి తమ ఆకాంక్షను వెలిబుచ్చారు. 'అయితే రాజకీయ నాయకులు ఎవరవుతారు?' అన్న ప్రశ్నకు మాత్రం 9వ తరగతి చదివే సందీప్ అనే విద్యార్థి ఒక్కరే చేతులెత్తాడు.

'నువొక్కడే రాజకీయ నాయకుడు అవుతావురా' అంటూ ఆ చిన్నారిని పలకరించిన లోకేష్ నేడు రాజకీయాల్లో అవినీతి, అసమర్థత తప్ప మరేమి లేదన్నారు. సమర్థమైన నాయకుడు వస్తే తప్ప రాష్ట్రం బాగుపడదన్నారు. పై చదువులు చదివి రాజకీయ విధానాల్లో సరికొత్త విప్లవాత్మక మార్పులు తేవాల్సిన బాధ్యత విద్యార్థుల మీదే వుందన్నారు. 'ఇప్పుడు చెప్పండి ఎవరు రాజకీయ నాయకులవుతార'ని మళ్లీ ప్రశ్నించారు. దీంతో అక్కడున్న విద్యార్థులందరూ 'మేము అవుతా మం'టూ చేతులెత్తారు. దీంతో ఖంగు తిన్నట్లు అభినయించిన లోకేష్ 'అందరు రాజకీయాల్లోకొస్తే ఇక నేనుండను. నేను మళ్లీ వేరే ఉద్యోగం వెతుకోవాల్సిందే అని హాస్యస్ఫోరకంగా వ్యాఖ్యా నించారు.

మీ రొస్తే నేను వేరే ఉద్యోగం చూసుకోవాల్సిందే

సూళ్లూరుపేట : రాష్ట్రంలో అవినీతి, దోపిడీ పెరిగిపోయాయి. వస్తువుల ధరలు చుక్కల్లోకి వెళ్లిపోయాయి. స్వీచ్ వేస్తే కరెంట్ చార్జీలు షాక్ కొడుతున్నాయి. పరిశ్రమలు మూతపడ్డాయి. లక్షల మంది కార్మికులు వీధిన పడ్డారు. ఇందుకు కారకులు ఎవరు?.. ఆరేళ్ల అవినీతి పాలన చేసిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ఏడాది పాలించిన రోశయ్య, రెండేళ్లుగా సీఎం పదవి వెలగబెడుతున్న కిరణ్‌కుమార్‌రెడ్డిలు కారా...? ఇంత దరిద్రంగా పాలనచేసి రాష్ట్రాన్ని దిగజార్చిన ఈ నేతల పేర్లు చెప్పుకుంటూ కాంగ్రెస్, వైసీపీ నేతలు ఏ ముఖాలు పెట్టుకుని ప్రజల్లోకి వెళతారయ్యా... అంటూ టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం సాయంత్రం సూళ్లూరుపేటలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

వైసీపీ నేతలూ.. మీ నేత చరిత్ర చెప్పగలరా!

ఓడరేవు, గనులు, ఒక్కటేమిటి ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రాన్ని దోచిపారేసిన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్ర ఆపార్టీ నేతలు ప్రజలకు చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. చేసిన పాపం ఊరికే పొదన్నట్లు జగన్ జైల్లో మగ్గుతుంటే వీరికి సహకరించిన పలువురు ఐఏఎస్ అధికారులు, పలు పారిశ్రామికవేత్తలు జైలుపాలు కావాల్సి వచ్చిందన్నారు. ఈ క్రమంలో ఆ పార్టీ నేతలు రాబోయే రోజుల్లో ప్రజలను ఎలా ఓట్లు అడుగుతారన్నారు.

కాంగ్రెస్ నేతలు ఓట్లు అడగగలరా..

ఆంధ్రప్రదేశ్‌ను ప్రస్తుత పరిస్థితులను బట్టి అంధరాష్ట్రమంటే సరిపోతుందన్నారు. ఈ ఘనత కాంగ్రెస్‌పార్టీ వల్లే వచ్చిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల వల్ల ఒక్క పారి శ్రామిక వేత్త కూడా రాష్ట్రం వైపు కన్నెత్తి చూడలేకున్నారని చెప్పారు. 2 లక్షల మంది కార్మికులు వీధిన పడ్డారని, 1200 పరిశ్రమలు అప్పులు కట్టలేక బ్యాంకుల చేతుల్లోకి వెళ్లిపోయాయన్నారు.

రాష్ట్రాన్ని గాడిలో పెట్టే నేత చంద్రబాబే

రాష్ట్రం దిగజారిపోయి అస్తవ్యస్తంగా మారిపోతున్న ఈ తరుణంలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టే సత్తాకలిగిన నాయకుడు రాష్ట్రంలో ఒక్క చంద్రబాబే అన్నారు. ఇది తన అభిప్రాయం కాదని.. ప్రజలు ఈ వాస్తవాన్ని గుర్తించారన్నారు. రాబోయేది ఎన్నికల కాలం ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.

కాంగ్రెస్,వైసీపీ నేతలు ముఖాలతో ప్రజల్లోకెళతారు?

తొలిరోజు పర్యటన ఇదీ,  : దుంపగడప అడ్డరోడ్డు, దుంపగడప, జూనియర్ కాలేజీ గ్రౌండ్ మీదుగా ఆకివీడు రైల్వేస్టేషన్ నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం సెంటర్‌కు చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగసభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి సిఎం మిషనరీ స్కూల్ మీదుగా అర్జమూరుగరువుకు రాత్రి చేరుకుని అక్కడే బసచేస్తారు.
ఏలూరు:తెలుగుదేశం అధినేత చంద్రబాబు 'వస్తున్నా.. మీకోసం' అంటూ పశ్చిమగోదావరి జిల్లాలో శనివారం సాయంత్రం అడుగిడబోతున్నారు. ఇప్పటికే ఆయన గడిచిన 157 రోజులుగా ర్రాష్ట వ్యాప్తంగా వివిధ జిల్లాల మీదుగా పాదయాత్ర చేస్తున్నారు. బీద, బిక్కి జనాలను అక్కున చేర్చుకుంటున్నారు. కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారు. నేనున్నానంటూ వేలాది మందికి అండగా నిలుస్తూ.. ఆరోగ్యం సహకరించకపోయినా మండుటెండల్లోనే పాదయాత్ర కొనసాగిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం నాటితో కృష్ణా జిల్లాలోపాదయాత్ర ముగించుకుని ఆ తర్వాత ఉప్పుటేరు మీదుగా పశ్చిమలో కాలిడనున్నారు.

చంద్రబాబుకు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు ఆయన వెంట దండులా తరలివెళ్లేందుకు వేలాది మంది సన్నద్ధమవుతున్నారు. బాబుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఇప్పటికే వివిధ మండలాల నుంచి వందలాది మంది కార్యకర్తలు శుక్రవారం రాత్రే ఆకివీడుకు బయలుదేరారు. తమ ప్రియతమ నేత అడుగులో అడుగేసి నడిచేందుకు పార్టీలో యువతరం ఉత్సాహం వ్యక్తం చే స్తోంది. వీరి ఉత్సాహానికి తగ్గట్టుగానే పార్టీ సీనియర్లు, నియోజకవర్గాల నేత లు కూడా వీరినే అనుసరించేందుకు సిద్ధమవుతున్నారు. శనివారం సాయం తం ఆకివీడు మండలం దుంపగడప అడ్డరోడ్డు నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి సుమారు 6.7 కిలోమీటర్ల మేర తొలిరోజు చంద్రబాబు ప్రయాణించనున్నారు. మార్గమధ్యలో దుంపగడప, ఆకివీడులలో ఆయన ప్రజలను పలకరించనున్నారు.

అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఉత్సాహంగా, ఉత్తేజంగా ఇప్పటికే సాగుతున్న 'వస్తున్నా.. మీ కోసం' యాత్రం పశ్చిమలో కూడా ఆసాంతం విజయవంతమయ్యేలా, ప్రశాంతంగా ముగిసేలా సకల ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు రాక కోసం ఉండి నియోజకవర్గంలో ఆయన ప్రయాణించే మార్గాలన్నింటిలోనూ పసుపుదనాన్ని నింపుతూ స్వాగతానికి సన్నాహాలు చేశారు. ఇప్పటికే పగటి ఎండలు పెరిగాయి. మధ్యాహ్నం నాటికి దీనికి ఉక్కపోత తోడవుతోంది. అయినా ఖా తరు చేయకుండా ఉదయం వేళల్లో పా ర్టీ సమీక్షలు నిర్వహించడం, మధ్యా హ్నం 2 గంటల తర్వాత నుంచి నిర్దేశించిన మార్గంలో పాదయాత్రకు చం ద్రబాబు సంసిద్ధమయ్యారు.

ఒకవైపు ర్రాష్టంలో కీలక రాజకీయ పరిణామాలు జరుగుతున్న నేపధ్యంలో ఆయన క్షణం తీరిక లేకుండానే పార్టీ వ్యవహారాలను సమీక్షిస్తూనే ఇంకోవైపు సాధారణ ప్రజలను, కార్యకర్తలను కలుసుకోవడానికి ఎండను, తన ఆరోగ్యాన్ని కూడా ఖాతరు చేయకుండా ముందుకు సాగుతుండటంతో ఆయనకు చేదోడుగా నిలిచేందుకు పార్టీ యంత్రాంగం యావత్తు సిద్ధమైంది.

పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే శివరామరాజు, సీనియర్ నేత మాగంటి బాబు, పార్టీ కార్యాలయ సమన్వయ కార్యదర్శి పాలి ప్రసాద్, పార్టీ ముఖ్యులు గాదిరాజు బాబు వంటి వారు కూడా ఇప్పటికే ఏర్పాట్లలో మునిగి తేలారు. చంద్రబాబు పాదయాత్ర జిల్లాలో ఏకబిగిన ఏడురోజుల పాటు తణుకు వరకు సాగనుంది. వాస్తవానికి తణుకు నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి ఏ వైపు నుంచే చేరుకోవాలనేదానిపై ర్రాష్ట పార్టీ నుంచి ఇంకా గ్రీన్‌సిగ్నల్ రాలేదు. అందుకనే ఇప్పటిదాకా ఆకివీడు నుంచి తణుకు వరకు 82.7 కిలోమీటర్ల నిడివిన ఆయన పాదయాత్రకు రంగం సిద్ధమైంది. ఆకివీడు, ఉండి, కాళ్ల, భీమవరం రూరల్, భీమవరం టౌన్, పాలకోడేరు, వీరవాసరం, పాలకొల్లు, పోడూరు, పెనుమంట్ర, పెనుగొండ, ఇరగవరం, తణుకు మండలాల పరిధిలోని నిర్దేశించిన ప్రాం తాల్లో చంద్రబాబు పాదయాత్ర సాగనుంది.

ఒక్క ఉండి నియోజకవర్గం మినహాయిస్తే ఆయన పర్యటించే ప్రాంతాలన్నీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లోనే ఎక్కువ భాగం ఉంది. దీనిని సవాల్‌గా తీసుకుని మరీ పార్టీ యంత్రాంగం అన్ని గ్రామాల్లో క్యాడర్‌ను ఇప్పటికే ఉత్తేజపరిచింది. శనివారం రాత్రి ఆయన అర్జమూరు వద్ద బసచేస్తారు. ఆదివారం శివరాత్రి కావడంతో ఉదయం పూట ఎలాంటి సమీక్షలు ఉండవు. ఆయన ర్రాష్ట పార్టీ వ్యవహారాలపైనే ఉదయం నుంచి మ ధ్యాహ్నం వరకు దృష్టి పెట్టనున్నారు.

ఆ తర్వాత యధావిధిగా శివరాత్రి అయినప్పటికీ మధ్యాహ్నం చెరుకువాడ నుంచి పాదయాత్రకు సంసిద్ధమవుతున్నారు.

ఈ నెల 13వ తేదీ నుంచి రోజుకు రెండు నియోజకవర్గాలు చొప్పున ఉదయం పూట పార్టీ సమీక్షకు చంద్రబాబు ఓకే చేశారు. నియోజకవర్గాల వారీగా ఆయన పార్టీ పనితీరును సమీక్షించనున్నారు. తొలిరోజు పశ్చిమలో కాలిడనున్న చంద్రబాబు ఆకివీడులోజరిగే బహిరంగసభలో తొలి ప్రసంగం చేయనున్నట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి.

వస్తున్నా..'మీ కోసం'

  టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 'వస్తున్నా...మీకోసం' పాదయాత్రకు మద్దతుగా శనివారం పలువురు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కారు ర్యాలీ చేపట్టారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ప.గో జిల్లా ఆకవీడు వరకు ర్యాలీ కొనసాగనుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మొత్తం 100 కార్లలో బయలుదేరి వెళ్లారు.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కారు ర్యాలీ