December 31, 2012





ఎటు చూసినా దీన గాధలే.. అన్నదాతల ఆక్రందనలే.. గుండెలను పిండేసే దయనీయ దృశ్యాలే. కరెంట్‌లేక ఎండిపోతున్న పొలాలు. పనులు లేక వలస పోతున్నకూలీలు.. చంద్రబాబు పాదయాత్రలో అడుగడుగునా వినిపించిన కన్నీటి గాధలు.. సోమవారం టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 'వస్తు న్నా... మీ కోసం' పాదయాత్రలో ఎదురుపడ్డ ప్రతీ రైతు తమ గోడు వెళ్లబోసుకుంటూ కన్నీ టి పర్యంతమయ్యాడు. ప్రతీ మహిళా ఇబ్బందులను వివరిస్తూ సాయం కోసం ఆర్థించింది. యాత్రలో చంద్రబాబు రైతుల సమస్యలను మరింత లోతుగా తెలుసుకునే ప్రయత్నం చే శారు. దారి పక్కన ఉన్న మిర్చి, పత్తి చేనుల్లోకి దిగారు. పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. వారికి ఏం కావాలో తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితికి పాలకుల అలస త్వం, అసమర్ధత ఎంత మేరకు కారణమో విడమరిచి చెప్పారు. తమ ప్రభుత్వ హ యాంలో చేసింది వివరించారు. రెండింటిని బేరీజు వేసుకొనే దిశగా గ్రామీణుల ఆలోచన లు మళ్లించారు.

మిర్చి పంట పోయింది: రంగాపురంలో మోత్కూరు రాజయ్య మి ర్చి పంటను బాబు చూశారు. పంట పూర్తిగా దెబ్బతిన్నది. కరెంట్‌లే కొంత, తెగులు సోకి మరికొంత. ఎకరాకు రూ 30వేలకు పైగా పెట్టుబడిపెట్టానని, పంట చేతికి వచ్చే పరిస్థితి లేదని రాజయ్య వాపోయాడు. ఆర్థికంగా చితికిపోయిన తనను ఆదుకోవలసిందిగా అభ్యర్థించాడు. గ్రామంలో అంతటా ఇదే పరిస్థితి.

పొట్టకూటి కోసం వలస: ఇదే గ్రామంలో కొందరు వ్యవసాయ మహిళా కూలీలను చంద్రబాబు కలిశారు. పరకాలకు చెందిన వీరి బీడీలు చేసే వారు, ఆ పని దొరక్క పనుల కోసం మిర్చి ఏరేందుకు వ చ్చినట్టు వెల్లడించారు. రోజుకు వంద రూపాయలు కూలీ వస్తున్నా, స్థానిక కూలీలు త మను అడ్డుకుంటుండడంతో ఈ మాత్రం పని కూడా దొరికే పరిస్థితి కనిపించడం లేదని వ లుగూరు మంజుల, కిట్టి స్వరూప, ఆలేటి భారతి బాబుకు మొరపెట్టుకున్నారు. ఉపాధి హామీ పథం కింద కూడా పనులు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు.

ట్రిప్ అయిన డ్రిప్ సేద్యం: బిందు సేద్యంలో రంగాపురం ఒకప్పుడు ఆదర్శ గ్రామం. ఇక్కడ దాదాపు 10వేలకు ఎక రాలకు పైగా భూమి బిందు సేద్యం కిందనే సాగవుతోంది. మిర్చి, పత్తి పంటలను దీని కిం దనే పండిస్తున్నారు. ఆయా రైతులు బాబుకు తమ కష్టాలను వివరించారు. టీడీపీ హయాం లో బాబు బిందు సేద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇజ్రాయిల్‌లో ఈ సేద్యం గు రించి అధ్యయనం చేసి మరీ అమలు చేశారు. దీంతో ఆయన సేద్యం తీరును లోతుగా అడి గి తెలుసుకున్నారు. స్ప్రింక్లర్లు, పైపులు పూర్తి గా దెబ్బతిన్నాయనీ, మూడేళ్లకు ఒకసారి ప్ర భుత్వమే మార్చాలని, ఐదేళ్లయినా పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు.

వికలాంగులతో భేటీ: మార్గ మధ్యలో వికలాంగులతో బాబు కొద్దిసేపు మాట్లాడారు. వారికి వికలాంగుల పింఛన్ వస్తున్నదీ లేనిదీ అడిగి తెలుసుకున్నా రు. రోడ్డు ప్రమాదంలో గాయపడి నడవలేని స్థితికి చేరిన శ్రీరాం రవి తన బాధలను వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వ స్తే నెలకు రూ.1500లు ఇస్తానని బాబు హా మీ ఇచ్చారు. మూగవాడైన తన కొడుక్కి ఫిం చన్ ఇవ్వడం లేదని, కలెక్టర్ కార్యాలయం చు ట్టూ కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం లేకుం డా పోయిందని శ్రీరాం లక్ష్మి వాపోయింది.

లక్ష్మిపురంలో టీఆర్ఎస్ ధ్వజం: రంగాపురంలో చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. టీఆర్ఎస్‌పై విమర్శనాస్త్రాలను సంధించారు. 'తెలంగాణపై టీడీపీ సా నుకూలంగా ఉండడంతో టీఆర్ఎస్ బెంబేలెత్తిపోతోంది. పునాదులు కదిలిపోతాయని భయ పడుతోంది. అందుకే లేనిపోని విమర్శలు చే స్తోంది' అన్నారు.ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి పనితీరును విమర్శిస్తూ రైతుల కరెంట్ బాధలను తొలగించే విషయంలో పూర్తిగా చే తులెత్తేసాడన్నారు. కరెంట్ సమస్యను సమీక్షించేందుకు విద్యుత్ శాఖకు మంత్రే లేకపోవడాన్ని ఎత్తిచూపారు.

గండ్రపై పరోక్ష విమర్శలు: ప్రభుత్వ చీఫ్ విప్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డిపై పరోక్షంగా ఆరోపణాస్త్రాలను సంధించారు.'అధికారాన్ని అ డ్డంపెట్టుకొని ప్రజల సొమ్మును దోచుకు తిం టున్నారు. మాఫియాలుగా తయారయ్యారు. వారికి సంపాదనే లక్ష్యం. ఇసుక, బొగ్గు ఇలా అన్ని కాంట్రాక్టులు వారికే కావాలి. పెంట్రోల్ బంకులూ వారికే ఉండాలి. చివరికి భార్యాభర్త లు మధ్య పంచాయతీవస్తే... ఆ సెటిల్‌మెం ట్లు వారే చేస్తారు. దేన్నీ వదిలిపెట్టరు । అం టూ ధ్వజమెత్తారు. స్థానిక సమస్యలపై మా ట్లాడుతూ పరకాలలో చలివాగు ప్రాజెక్టు నిర్మాణానికి కలెక్టర్‌కు లేఖ రాస్తానని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరు నెల ల్లో పనులు ప్రారంభిస్తామని వాగ్దానం చేశా రు. రంగాపురం గ్రామ సమస్యలు పరిష్కారిస్తానని చెప్పారు. విద్యార్థులకు సైకిళ్ళతో పా టు లాప్‌టాప్‌లను కూడా ఇస్తామన్నారు.

మహిళల జై తెలంగాణ: పరకాల మండలం లక్ష్మిపురంలో కొందరు మహిళలు జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు రంగాపురంలో బహిరం గ సభలో మాట్లాడిన తర్వాత లక్ష్మిపురం చేరుకున్నారు. గ్రామంలో చేనేత కార్మికుల మొగ్గాలను పరిశీలించారు. పెరుగ సంఘం వారిని కలుసుకున్నారు. వారితో మాట్లాడుతుండగా బయట రోడ్డు ప్రక్కన కొందరు మహిళలు జై తెలంగాణ అంటూ నినాదాలు చేయడం మొ దలు పెట్టారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అడ్డుకున్నారు. అక్కడి నుంచి దూరం గా తీసుకుపోయారు. ఆ తర్వాత బాబు అక్క డి నుంచి పాదయాత్రగా నాగారం చేరుకున్నా రు. మధ్యాహ్నం భోజనం అక్కడే చేశారు.

మూడో రోజు: ఉదయం 10.52 గంటలకు బాబు పాదయాత్రను మొదలు పెట్టారు. మొగుళ్ళపల్లి మండలంలోని ఇస్సిపేట నుంచి రంగాపురం, పరకాల మండలంలోని లక్ష్మిపురం, నాగా రం, పరకాల మీదుగా కామారెడ్డి క్రాస్ రోడ్డు వరకు సాగింది.రాత్రి బాబు ఇక్కడే బస చేశారు.

రైతుల బతుకు ఆగం



 మాజీ ముఖ్యమంత్రి, టీడీ పీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేను రైతు బిడ్డనే అంటూ రైతులను, కూలీలను ఆత్మీయంగా ప లకరించారు.వారి సమస్యలు తెలుసుకుంటూ ముం దుకు సాగారు. సోమవారం మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేట గ్రామ శివారులోని బస ప్రాంగణం నుం చి పాదయాత్ర ప్రారంభించిన ఆయన రంగాపురం గ్రామ సమీపంలో పత్తి, మిరప చేన్లలోకి వెళ్లా రు. రైతులను కలిశారు. పంటల దిగుబడిపై అడిగి తెలుసుకున్నారు.

రంగాపురం గ్రామానికి చెందిన రైతు వర్దెల్లి దే వేందర్‌రావు, బలుగూరి రాజేశ్వర్ రావు, సంపత్‌రావు, కిషన్‌రావులు బాబుతో మాట్లాడారు. గిట్టుబా టు ధర లేకపోవ డంతో పెట్టుబడులు పెరిగి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని వివరించారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని, కాంగ్రెస్‌ను భూస్థాపి తం చేయాలని బాబు పేర్కొన్నారు.

బలుగూరి రాజేశ్వర్‌రావు సాగు చేసిన మిర్చి పం ట తెగుళ్ల బారిన పడగా బాబు పరిశీలించారు. దేవేందర్‌రావు చేనులో ఏర్పాటు చేసిన డ్రిప్‌ను చూసి , ఇది అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. నాబార్డు నిధులతో రూ.2500 కోట్లతో రా ష్ట్ర వ్యాప్తంగా డ్రిప్‌లు అందించామని గుర్తు చేశా రు. ఆధునిక పద్ధతిలో వ్యవసాయం చేస్తున్న రైతుల ను అభినందించారు. డీబీఎం-31 ఎస్సారెస్పీ కాలు వ ద్వారా పంటలకు చుక్క నీరు రావడం లేదని రై తులు బాబు దృష్టికి తీసుకెళ్లారు. అధికారులతో మా ట్లాడి నీళ్లు అందేలా చూస్తానని బాబు హామీ ఇచ్చారు.

కూలీల మొర..: రంగాపురం గ్రామ శివారులో పంట చేలల్లో పని చేస్తున్న కూలీలు రోడ్డుపైకి వచ్చి బాబుతో సమస్యలపై మొరపెట్టుకున్నారు. పూట గడవటం లేదని, ఉపాధి పథకంలో పని చేసిన డబ్బులు సమయానికి రావడం లేదని వాపోయారు. పింఛన్‌లు, ఇందిరమ్మ గృహాలు, మరుగుదొడ్లు అందించడం లేదని ఏకరువు పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెరిగిన కూలీ రేట్లు పెరగడం లేదని, ప్రభుత్వం నిత్యావసరాల ధరలను నియంత్రించడంలో విఫలమైందని బాబు పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరిస్తామని, ధరలు తగ్గిస్తామని బాబు వారికి హామీ ఇచ్చి పాదయాత్రలో ముందుకు సాగారు.

నేనూ రైతు బిడ్డనే..: బాబు



 
వైఎస్ఆర్ హయాంలో రౌడీ సంస్కృతి పెరిగిపోయిందని, కడ ప, పులివెందులలో ఎలా హత్యలు చే స్తారో.. వరంగల్ జిల్లాలోనూ అలా త యారు చేశారని ఆరోపించారు. అలాం టి వారితోనే పరకాలలో అభివృద్ధి జరగడం లేదని విమర్శించారు. జిల్లాలో రౌడీలు లేరని, అయితే వైఎస్సార్ పరిపాలన చేపట్టగానే రౌడీలు పెరిగిపోయారని, మాఫియాలు పెరిగాయని, భూ కబ్జాలు, దోపిడీలు పెరిగాయని ఆ రోపించారు. లా అండ్ ఆర్డర్ అదుపు లో లేకుండా పోయిందన్నారు. సోమవారం మొగుళ్లపల్లి మండలం రంగాపు రం, పరకాల మండలం నాగారం, పరకాల పట్టణాల్లో జరిగిన బహిరంగ సభ ల్లో చంద్రబాబు ప్రసంగించారు.

రాష్ట్ర్టాన్ని దోపిడి చేసిన వైఎస్: వైఎస్సార్ పాలనలో రాష్ట్రం దోపిడీ కి గురైంది.. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములను నేను కాపలా ఉం టే.. వైఎస్సార్ అమ్ముకున్నాడని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆరోపించారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నెలకొల్పి సైబరాబాద్ నిర్మాణం చేపట్టానని, నిజాం భూములను కాపాడానని, ఆ భూములకు అప్పట్లో ఎకరా కు ఒకటి రెండు లక్షల రూపాయలు ఉంటే 2004లో ఎకరాకు రూ.30 కోట్లు పెంచి కంపెనీలకు దారాదత్తం చేశారన్నారు. 130 లక్షల ఎకరాల భూముల ను దారాదత్తం చేశారని ఆరోపించారు. వైఎస్సార్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయన కుమారుడు లక్షల కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. 1.56 లక్షల ఎకరాల బయ్యారం భూములను అల్లుడికి వైఎస్సార్ ధారాదత్తం చేశారని, ఖమ్మం గనులను అప్పగించారని ఆరోపించారు. రాజశేఖర్‌రెడ్డి హయాంలో రౌడీలు, మాఫియాలు రాజ్యమేలారని విమర్శించారు.

రైతులు కుదేలు: కరెంట్ కష్టాలతో రైతులు కుదేలవుతున్నారని, పంట దిగుబడి లేక, పెట్టుబడి రాక, గిట్టుబాటు ధర లేక అవస్థ లు పడుతున్నారని పేర్కొన్నారు. రైతు ల కష్టాలను తీర్చేందుకు రుణమాఫీ చే స్తానని హామీ ఇచ్చారు. వ్యవసాయ రంగానికి ఉపాధి హామీని అనుసంధా నం చేసేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఇజ్రాయెల్ దేశం నుంచి డ్రిప్ ఇరిగేషన్‌ను రాష్ట్రానికి తెచ్చింది తమ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. అయితే రైతులకు డ్రిప్ ఇరిగేషన్‌కు సంబంధించిన పైపులను ఐదేళ్లకొకసారి సబ్సిడీతో అందిస్తామని హామీ ఇచ్చారు.

నిరుద్యోగులకు ఉపాధి: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు నెలకొల్పుతానని, నిరుద్యోగ భృ తి అందిస్తానని పేర్కొన్నారు. బీఈడీ చేసిన విద్యా ర్థులకు ఎస్‌జీటీలో అవకా శం కల్పిస్తానని పేర్కొన్నారు. ఈ ఏడా ది కరెంట్ బిల్లులు రెండు బల్బులు ఉం టే రూ.5వేల నుంచి రూ.10వేలు వ సూలు చేస్తున్నారని, ఈ ఏడాది సర్ చార్జీ పేరిట మరో రూ.10వేల కోట్లు విధించడానికి ప్రభుత్వం సిద్ధం అవుతుందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు 29సార్లు పెంచి పేదల నడ్డి విరిచారన్నారు. మహిళల్లో పొదుపు ఉద్యమం చేపట్టేందుకు డ్వాక్రా సంఘాలను ప్రోత్సహించానని, అయితే పావులావడ్డీ అని చెప్పి వడ్డీకివడ్డీలు కట్టించుకుంటు అసలు మాత్రం తీరడం లేదని పేర్కొన్నారు.

మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి పాల్పడిన కామాంధులకు ఉరి శిక్ష వేస్తే సమాజం హర్షించేదన్నారు.

ఉనికి ఉండదనే...L తెలంగాణను అభివృద్ధి చేసింది టీడీపీయేనని, తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడంతో తమ ఉనికి గల్లంతు అవుతుందని టీఆర్ఎస్ అర్థం లేని ఆరోపణలు చేస్తుందని విమర్శించారు. తెలంగాణకు టీడీపీ అడ్డు కాద ని చెప్పిన సిగ్గులేకుండా పాదయాత్ర ను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నార ని మండిపడ్డారు. 2009 ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని టీఆర్ఎస్‌కు 50 సీట్లు కేటాయిస్తే 10 సీట్లే గెలిచిందని, మళ్లీ అదే పరిస్థితి పునరావృతం అవుతుందనే భయంతో ఈ ఆరోపణలకు ది గుతుందని విమర్శించారు. అసమర్థ ముఖ్యమంత్రి వల్లనే నిత్యావసరాల ధరలు పెరిగిపోతు న్నాయని, ఉప్పు, పప్పు, వంట నూనె ధరలు ఆకాశాన్నంటుతున్నాయని వాపో యారు. వేటిపై న అవగాహన లేని ముఖ్యమంత్రి అన్నీ తెలిసినట్లు వ్యవహరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.

ఆ ఒక్క రోజు..: ఎన్నికల ఒక్కరోజును నాకివ్వండి.. ఐదేళ్లు మీ సేవకుడిగా సేవ చేస్తా.. నా కు ఏ కోరిక లేదు.. మీరు క్షేమంగా ఉం డాలని పాదయాత్ర చేస్తున్నా. మీ సమస్యలను స్వయంగా తెలుసుకుని పరిష్కరించేందుకే వస్తున్న మీకోసం కార్యక్రమం చేపట్టా. మీ సమస్యలను పరిష్కరిస్తా. మీకు అండగా ఉంటా.. మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉంటా అంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.

ప్రజలు తీవ్ర కష్టాల్లో ఉన్నప్పుడు నే ను హైదరాబాద్‌లో ఉంటే సబబు కాద నే మీ వద్దకు వస్తున్నా నని పేర్కొన్నా రు. ఈ కార్యక్రమంలో టీటీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు, పరకాల నియోజకవర్గ ఇన్‌చార్జి చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, ఎంపీ గుం డు సుధారాణి, ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

వైఎస్ఆర్ పాలనలో రౌడీ సంస్కృతి




వైసీపీ అధ్యక్షుడు జగనే 420 అనీ, అందుకే ఆయన జైలులో ఉన్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు 420 అనీ విజయమ్మ నిందించడాన్ని ఆయన ఖండించారు. కడపజిల్లా ప్రొద్దుటూరు పెన్నాతీరం వద్ద ఆదివారం టీడీపీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సోమిరెడ్డి ప్రసంగిస్తూ, చంద్రబాబును ఒకనాడు ప్రపంచ నాయకులు, రాహుల్‌గాంధీ సైతం పొగిడారనీ, అటువంటి నేతను మోసగాడని విజయమ్మ నిందించడం సరికాదని అన్నారు. జగన్‌పైనే 420 కేసు ఉన్నదనీ, అందుకే ఆయన జైలులో ఉ న్నారన్న సంగతి మరవొద్దన్నారు. హిందూ మతాన్ని అణగదొక్కేందుకు కుట్ర జరుగుతోందనీ, వైసీపీ చర్చిలకు వెళ్లి ఓట్లు వేయాలని కోరడమే ఇందుకు నిదర్శనమన్నారు. వైయస్ఆర్ వల్ల క్విడ్‌ప్రోకో, సీఎం కిరణ్ వల్ల క్రాప్ హాలిడే, పవర్ హాలిడే అనే కొత్త పదాలు ప్రాచుర్యంలోకి వచ్చాయన్నారు.

హైదరాబాద్, బెంగుళూరు, పులివెందులలో లక్షల చదరపు అడుగుల భవంతులు జగన్‌కు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుపాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. టీడీపీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని తమ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో టీడీఎల్‌పీ ఉప నాయకుడు గా లి ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ భార త దేశసంపదను ఇటలీకి తరలిస్తున్నారని ఆరోపించారు. తాను జగన్ వదిలిన బాణాన్ని అని చెప్పుకుంటున్న షర్మిల, ఆమె తల్లి విజయమ్మ బాణాలు మనుషులను చంపుతాయన్న సంగతిని తెలుసుకోవాలన్నారు. చంద్రబాబు తన హయాంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చెప్పారు. ఇకపై టీడీపీలోకి భారీగా వలసలు వస్తాయని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ జోస్యం చెప్పారు. వంద రూపాయల నోట్ల కట్టలను, వెయ్యి వాహనాల్లో తీసుకెళ్లే స్థాయిలో జగన్ సంపాదించారని ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి ఆరోపించారు.

శనగ రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ నాయకులు సీఎం రమేశ్, బొజ్జలగోపాల కృష్ణారెడ్డి విమర్శించారు. టీడీపీ విస్తృత సమావేశానికి ముందు ఎర్రగుంట్ల మండలంలోని పోట్లదుర్తి గ్రామంలో వర్షాభావం వల్ల తీవ్రంగా దెబ్బతిన్న బుడశనగ చేలను వారు పరిశీలించారు. కడప జిల్లాలో సుమారు లక్ష హెక్టార్లలో శనగ పంటను సాగు చేశారని, వానలు సరిగా పడకపోవడం వల్ల ఆ పంటంతా దెబ్బతిన్నదనీ తెలిపారు. ఎకరాకు 10 నుంచి 12 బస్తాల వరకు దిగుబడి వచ్చేఈ పంటకు నేడు కొన్ని ప్రాంతాల్లో ఒక్క మూటకూడా రావడంలేదన్నారు. దీంతో రైతులు పరిస్థితి అగ మ్యగోచరంగా తయారైందనీ, వారికి కనీసం బీమాగానీ, నష్ట పరిహారం కానీ ఇచ్చే ఆలోచనలో కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదని విమర్శించారు. గత సంవత్సరం బీమా కట్టిన రైతులకు చేదు అనుభవం ఎదురైందన్నారు.

రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీతోపాటు పంటల బీమాను కూడా వర్తింపజేయాలని రాజ్యసభలోనూ, శాసనసభలోనూ ప్రస్తావిస్తామని వారు చెప్పారు. జిల్లాలో ముగ్గురుమంత్రులు ఉండి కూడా రైతుల కష్టాలను తెలుసుకోవడం లేదనీ, కేంద్రపరిశీలన బృందాలు పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించడంలేద నీ వారు ధ్వజమెత్తారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నివేదికలు రాలేదని సమాధానం చెబుతున్నారన్నారు. శనగ పంటకు బీమా గడువును మరో మూడు రోజులు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి సీఎం సురేశ్‌నాయుడు, రైతులు పాల్గొన్నారు.

చంద్రబాబు కాదు.. జగనే 420



టీడీపీ అధినేత నారా చం ద్రబాబునాయుడు ఆదివారం రాత్రి టీడీపీ ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించారు. పాదయాత్ర ముగించుకుని ప్రత్యేక వాహనంలోకి వెళ్లిన బాబుతో పాటు ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్‌రెడ్డి, సీతక్క, చల్లా ధర్మారెడ్డిలతోపాటు పలువురు నేతలు వాహనంలోకి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రతిరోజు ఒక నియోజకవర్గ సమీక్ష సమావేశాలు నిర్వహించాలని బాబు సూచించారు. ఇంకా సమయం చాలా రోజులు ఉన్నందున మరో రెండు రోజుల తరువాత నుంచి రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పు న సమీక్షచేయాలని నేతలు సూచించిన ట్లు తెలిసింది.

అలాగే గతంలో త యారు చేసిన రూట్‌మ్యాప్‌ను మళ్లీ మార్చినట్లు సమాచారం. పరకాల వ రకు ఉన్న రూట్‌మ్యాప్‌ను సోమవా రం వరకు ముగిసిపోనుంది. మంగళవారం నుంచి కొత్తగా రూట్‌మ్యాప్ త యారు చేసి బాబు వద్ద ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇందులో గతంలో ఉన్న రూట్ మ్యాప్ ఆధారంగానే షె డ్యూల్ ఖరారు చేయాలని ప్రకాష్‌రెడ్డిని బాబు ఆదేశించినట్లు తెలిసింది.

దిష్టి తీసిన కార్యకర్త..

యాత్ర ముగించుకుని ప్రత్యేక వా హనంలోకి వెళ్లేందుకు వచ్చిన చంద్రబాబుకు ఓ కార్యకర్త దిష్టి తీశారు. ప్ర త్యేక పాత్రలో మంట పెట్టి మూడు చు ట్లు తిప్పి బాబును లోనికి పంపారు.

పాత రూట్ మ్యాప్‌కే మొగ్గు