December 31, 2012

పాత రూట్ మ్యాప్‌కే మొగ్గు



టీడీపీ అధినేత నారా చం ద్రబాబునాయుడు ఆదివారం రాత్రి టీడీపీ ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించారు. పాదయాత్ర ముగించుకుని ప్రత్యేక వాహనంలోకి వెళ్లిన బాబుతో పాటు ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాష్‌రెడ్డి, సీతక్క, చల్లా ధర్మారెడ్డిలతోపాటు పలువురు నేతలు వాహనంలోకి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రతిరోజు ఒక నియోజకవర్గ సమీక్ష సమావేశాలు నిర్వహించాలని బాబు సూచించారు. ఇంకా సమయం చాలా రోజులు ఉన్నందున మరో రెండు రోజుల తరువాత నుంచి రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పు న సమీక్షచేయాలని నేతలు సూచించిన ట్లు తెలిసింది.

అలాగే గతంలో త యారు చేసిన రూట్‌మ్యాప్‌ను మళ్లీ మార్చినట్లు సమాచారం. పరకాల వ రకు ఉన్న రూట్‌మ్యాప్‌ను సోమవా రం వరకు ముగిసిపోనుంది. మంగళవారం నుంచి కొత్తగా రూట్‌మ్యాప్ త యారు చేసి బాబు వద్ద ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇందులో గతంలో ఉన్న రూట్ మ్యాప్ ఆధారంగానే షె డ్యూల్ ఖరారు చేయాలని ప్రకాష్‌రెడ్డిని బాబు ఆదేశించినట్లు తెలిసింది.

దిష్టి తీసిన కార్యకర్త..

యాత్ర ముగించుకుని ప్రత్యేక వా హనంలోకి వెళ్లేందుకు వచ్చిన చంద్రబాబుకు ఓ కార్యకర్త దిష్టి తీశారు. ప్ర త్యేక పాత్రలో మంట పెట్టి మూడు చు ట్లు తిప్పి బాబును లోనికి పంపారు.