December 31, 2012

అభిమానం వెంట రాగా.....




ఎన్‌టీఆర్, తెలుగుదేశం పార్టీపై ఉన్న అభిమానం అతని యాత్రకు నాంది పలికింది. అవిటితనాన్ని లెక్కచేయకుండా 90 రోజులుగా తెలుగుదేశం పార్టీపై ఉన్న అభిమానంతో స్కూటర్‌పై చంద్రబాబునాయుడితో పాటు యాత్రను కొనసాగి స్తూ తన అభిమానాన్ని చాటుతూ టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయితేనే పేదల కష్టాలు తీరుతాయని ఆయ న పేర్కొంటున్నాడు. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌లోని మలక్‌పేట ప్రాంతానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, వికలాంగుల సహకార సంస్థ మాజీ చైర్మన్ గొనుకుంట్ల కోటేశ్వర్‌రావు ఎన్‌టీఆర్‌పై ఉన్న అభిమానంతో 1982 లో టీడీపీలో సభ్యత్వం తీసుకున్నారు.

అదే ఏడాది పేద, బడు గు బలహీన వర్గాల్లో చైతన్యం తీసుకురావడానికి నందమూరి తారకరామారావు చేపట్టిన చైతన్య రథం కార్యక్రమంలో కోటేశ్వర్‌రావు కూడా పాల్గొన్నారు. 35 వేల కిలోమీటర్లు స్కూటర్‌పైన యాత్ర కొనసాగించినట్లు తెలిపారు.

చంద్రబాబునాయుడు అక్టోబర్ 2వ తేదీన అనంతపురం జిల్లా ఇందూర్ నుంచి ప్రారంభించిన పాదయాత్రతో పాటు తను స్కూటర్‌పై యాత్ర చేస్తున్నట్లు కోటేశ్వర్‌రావు పేర్కొన్నారు. 90 రోజులుగా 1400కి.మీ. ఇప్పటి వరకు పాదయాత్ర చేసి 1500కి.మీ. ప్రవేశం పొందినట్లు కోటేశ్వర్‌రావు తెలిపారు. పార్టీ చేపడుతు న్న కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1.26లక్షల కిలోమీటర్ల దూరం యాత్ర చేసినట్లు కోటేశ్వర్‌రావు తెలిపారు.