December 6, 2013

అడ్డగోలుగా రాష్ట్ర విభజనకు పాల్పడుతున్న కేంద్రం గద్దెదిగి రావాలంటే ఆందోళనలు తప్పవని సీమాంధ్ర టీడీపీ ఎంపీలు పేర్కొన్నారు. పార్లమెంట్‌ ఆవరణలో శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. తాము ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకుంటే కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా అని వారు ప్రశ్నించారు. అన్ని ప్రాంతాల జేఏసీలను సంప్రదించాలన్న తమ డిమాండ్‌ను నెరవేర్చలేదన్నారు. సమస్యలుపరిష్కరించకుండా విభజన నిర్ణయాన్ని ఎలా అమలు చేస్తారని వారు ప్రశ్నించారు. కేంద్ర ఏకపక్షనిర్ణయాన్ని, జాతీయ పార్టీలు వ్యతిరేకించాలని వారు డిమాండ్‌ చేశారు. మీడియా సమావేశంలో ఎంపీలు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, కొనకళ్లనారాయణ, నిమ్మల కిష్టప్ప, శివప్రసాద్‌లు పాల్గొన్నారు.

కేంద్రం దిగిరావాలంటే ఆందోళనలు తప్పవు

December 5, 2013


 రాయల తెలంగాణ ప్రతిపాదనపై కేబినెట్ నోట్ చూశాకే తాము స్పందిస్తామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనను కేంద్ర ప్రభుత్వం రాజకీయ కోణంలోనే చూస్తోందని, తెలంగాణ తో లాభమా ? రాయల తెలంగాణతో లాభమా అని కాంగ్రెస్ బేరీజు వేసుకుంటోందని ఆరోపించారు.

తెలంగాణ తో లాభమా ? రాయల తెలంగాణతో లాభమా

కృష్ణ జిలాలపై బ్రెజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై ప్రభుత్వానికి అవగాహన లేదని, అందుకే రాష్టానికి నష్టం జరుగుతున్న ఇంతవరకు కాంగ్రెస్ నేతలు కూడా స్పందించలేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు విమర్శించారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి మీడియాతో మాట్లాడుతూ ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి కోలుకోలేనటువంటి నష్టం వస్తుందని అన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి, సుప్రీం కోర్టులో పిటిషన్ వేయాలని, తీర్పును రద్దు చేసే విధంగా పోరాడాలని మండవ కోరారు. అలాగే దీనిపై అఖిల పక్షం కూడా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా మైనపు బొమ్మలా ఉండకుండా స్పందించి, రాష్ట్రానికి న్యాయం చేయాలని మండవ పేర్కొన్నారు. తీవ్ర నష్టానికి కారకుడు దివంగత మాజీ సీఎం వైఎస్ అయితే, జగన్ తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును తప్పు పట్టడం సరికాదని ఆయన హితవుపలికారు.

తీవ్ర నష్టానికి కారకుడు దివంగత మాజీ సీఎం వైఎస్

 రాయల తెలంగాణ ఎవరు అడిగారని, రాయలసీమను విభజిస్తే అనేక సమస్యలు వస్తాయని తెలుగుదేశం పార్టీ ఎంపీలు శివప్రసాద్,
మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ రాయల తెలంగాణ ప్రతిపాదన కాంగ్రెస్ నిర్ణయమని, ఎవరూ కోరలేదని అన్నారు. తెలంగాణ ప్రజలను మభ్య పెట్టడానికే ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ తెరపైకి తీసుకు వచ్చిందని ఆయన అన్నారు.

మరో ఎంపీ మోదుగుల మాట్లాడుతూ తెలుగు ప్రజల సమస్యలపై పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తుతామని అన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చలనం లేకుండా వ్యవహరిస్తున్నారని, ఆయన ఓ మైనపు బొమ్మని, ఆయనను కలిసినా ఒకటే, కలవకపోయినా ఒకటే అని ఆయన పేర్కొన్నారు.

మైనపు బొమ్మని, ఆయనను కలిసినా ఒకటే, కలవకపోయినా ఒకటే

December 4, 2013

జూరాల వద్ద తెలుగుదేశం పార్టీ రేపు తలపెట్టిన మహాధర్నా కార్యక్రమం వాయిదా పడినట్టు సమాచారం.

జూరాల వద్ద టీడీపీ మహాధర్నా వాయిదా

కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు దొంగనాటకాలు ఆడుతున్నాయని, ఈ రెండు పార్టీలు రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నాయని టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బేరం కుదరక పోవడంవల్లే విభజన నాటకాలు ఆడుతున్నాయని ఆయన ఆరోపించారు.

తెలంగాణ జిల్లాల్లో గురువారం కేసీఆర్ పిలుపిచ్చిన బంద్‌కు సహకరించవద్దని మోత్కుపల్లి కోరారు. కేసీఆర్ టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయనని చెప్పడం వల్లే రాయల తెలంగాణ ప్రతిపాదన తెరమీదకు వచ్చిందని, తెలంగాణ బిల్లు రాకుండా కేసీఆరే అడ్డుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాయల తెలంగాణ ప్రతిపాదన ఎందుకు తెచ్చించో ప్రజలు గమనిస్తున్నారని మోత్కుపల్లి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయితే తన దుకాణం బంద్ చేసుకోవాల్సి వస్తుందని కెసిఆర్ విభజనను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రకటిస్తామని చెప్పిన కేంద్రం ఇప్పుడు రాయల తెలంగాణ ప్రతిపాదన ఎందుకు తీసుకొచ్చిందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీలో విలీనమవుతామని చెప్పిన కెసిఆర్, ఇప్పుడు మాటమార్చి నాటకాలాడుతున్నారని అన్నారు.

డబ్బు సంచులు, ప్యాకేజీలు ఇక రావనే ఉద్దేశంతోనే విభజనను అడ్డుకునేందుకు కెసిఆర్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని మోత్కుపల్లి ఆరోపించారు. ఓట్ల కోసమే కాంగ్రెస్ పార్టీతో కెసిఆర్ రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని విమర్శించారు. తెలంగాణ కోసం వెయ్యి మంది ఆత్మ బలిదానం చేసుకుంటే.. కెసిఆర్ కోట్ల కోసం ఆశపడుతున్నారని మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు.

బేరం కుదరక పోవడంవల్లే విభజన నాటకాలు ఆడుతున్నారు.

గతంలో ఆల్మట్టి ఎత్తు పెంచడానికి ప్రయత్నిస్తే అప్పటి ప్రధాని దేవెగౌడతో పోరాడా. ఆల్మట్టి ఎత్తు పెంచడానికి వీల్లేదని 4 రాష్ట్రాల సభ్యుల కమిటీ నివేదిక ఇచ్చింది. టీడీపీ హయాంలో రూ. 11 వేల కోట్లు ఖర్చు పెట్టి 30 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు తీసుకొచ్చాం. నాణ్యమైన ప్రాజెక్టులను నిర్మించి నీళ్లిచ్చిన ఘనత టీడీపీదే’ అని బాబు అన్నారు.

ఆల్మట్టి ఎత్తు పై ప్రధాని దేవెగౌడతో పోరాడా!

 కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ తీర్పు వల్ల 14 జిల్లాల్లో తాగు,సాగు నీటి సమస్యలు తలెత్తుతాయని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం ఉదయం ప్రకాశం బ్యారేజ్ వద్ద చేపట్టిన మహాధర్నాలో బాబు మాట్లాడుతూ తీర్పును రద్దు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే మహాధర్నా చేపట్టినట్లు ఆయన చెప్పారు. ఈ తీర్పు వల్ల మన హక్కులను కాపాడుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

కరువులు, వరదల సమయంలో ఇబ్బందులు పడుతున్నది మనమే అని, కృష్ణానదికి తెలుగు ప్రజలకు విడదీయరాని సంబంధం ఉందన్నారు. కృష్ణా నదిపై ఇప్పటి వరకు రెండు ట్రిబ్యునళ్లు వేశారని తెలిపారు. దిగువ రాష్ట్రాలకు అన్యాయం జరుగకుండా బ్రిజేష్‌కుమార్ జాగ్రత్తలు తీసుకోలేదని విమర్శించారు. 78 సంవత్సరాల డేటా 75 శాతం నీటి లభ్యతతో బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు చేస్తే....బ్రిజేష్ ట్రిబ్యునల్ 47 ఏళ్ల డేటా 65 శాతం నీటి లభ్యతను పరిశీలించి కేటాయింపులు చేయడం సరికాదన్నారు.

ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే మహాధర్నా

కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పుకు వ్యతిరేకంగా విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద చేపట్టిన మహాధర్నాలో టీడీపీ చీఫ్‌ చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన టీడీపీ నేతలు, రైతులు అధిక సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు.

టీడీపీ మహాధర్నా

November 27, 2013


 టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులపంట రుణాలను మాఫీ చేస్తామని తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. మంగళవారం ఆయన పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలంతో పాటు వివిధ చోట్ల హెలెన్‌ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తుపాన్‌ వస్తే ప్రభుత్వం కనీసం సహాయ చర్యలు కూడా చేపట్ట లేదని ఆవేదన వ్యక్తం చేవారు. డెల్టా ఆధునీకరణ పనుల్లో రూ. కోట్ల దోపడీ జరిగిందని, అందుకే రైతులు పంటలను నష్టపోతున్నారని చంద్రబాబు అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బాధితుల గోడు పట్టదని విమర్శించారు. ఏ పనిచేసినా రాజకీయ కోణంలో చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం తుపాన్‌ను కూడా పట్టించుకోవడం లేదని, ఆ పార్టీ నేతలు అంతఃకలహాలతోనే మునిగి తేలు తున్నారని ఆరోపించారు.

రానున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన నియోజకవర్గ ఇంచార్జిలు ప్రజలతో మమేకం కావాలని ఆయన పిలుపు నిచ్చారు. పార్టీ విధానాలను ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపు నిచ్చారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను అం దించాలని కోరారు. చేనేత కార్మికులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చె ందిందని ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే చేనేత కార్మికుల కడగండ్లు తీరుస్తానని నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన అంతర్వేదిలో లక్ష్మిననసింహ స్వామి వారిని దర్శించు కుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నేతలు చిక్కాల రామచంద్రరావు, యనమల రామకృష్ణుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, గొల్లపల్లి సూర్యారావు, నిమ్మకాయల చినరాజప్ప, యర్రా నారాయణ స్వామితో పాటు వివిధ నియోజకవర్గాలకు చెందిన పార్టీల ఇం చార్జిలు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అధికారంలోి రాగానే పంట రుణాలు మాఫీ చేస్తాం

తెలుగుదేశం ప్రభంజనాన్ని ఆపలేమని భావించి, ఆ భయంతోనే విభజన పేరుతో ఎఐసిసి అద్యక్షురాలు సోనియాగాంధీ కొత్త వాదం ప్రవేశపెట్టారని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆయన పర్యటించారు.ఆమె అతి తెలివి ఫలించదని అన్నారు. అంతేకాక రాష్ట్రంలో సోనియాకు ముఖం చెల్లడంలేదు. అందుకే ఇక్కడకు రావడంలేదు. జగన్ ముసుగులో వస్తున్నది. ఈ ముసుగు తీసి చూడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు ఓటేస్తే సోనియాగాందీకి ఓటు వేసినట్లేనని ఆయన హెచ్చరించారు.

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు ఓటేస్తే సోనియాగాందీకి ఓటు వేసినట్లే...........

November 18, 2013

ఎన్టీఆర్ పరిచయం అవసరం లేని పేరు. రాముడు,కృష్ణుడు లాంటి దేవుళ్ళు ఎలా ఉంటారో తెలియదు. కానీ ఇలాగే ఉంటారేమో నని ఆయన రూపం తెలిపింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అతను ఓ సంచలనం. భారత చలన చిత్ర చరిత్రలో సంచలనం. ఆ నటుడు వేయని పాత్ర లేదు. అజరామరమైన చిత్ర రాజాలను ఎన్నింటినో అందించారు. స్టూడియో అధినేతగా, నిర్మాతగా ,దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరొందారు. సినిమాల్లోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా సంచలనాలను సృష్టించాడు ఎన్టీఆర్. రాష్ట్రంలో వేళ్ళూనుకు పోయిన కాంగ్రెస్ ని కోలుకోలేని దెబ్బ తీసాడు. తెలుగుదేశం పార్టీ ని స్థాపించి 9 నెలల్లోనే అధికారం చేపట్టి వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డు ల్లోకి ఎక్కాడు. దట్ ఈస్ ఎన్టీఆర్. అంతేకాదు లోక్ సభ లో కూడా ప్రధాన ప్రతిపక్షంగా టి డి పి ని నిలబెట్టారు ఎన్టీఆర్. భారత దేశ చరిత్రలో ఒక ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించింది ఒక్క ఎన్టీఆర్ వల్లే సాధ్య మైంది. రాష్ట్రంలో పెను మార్పులు రాజకీయ రంగంలో వచ్చాయంటే అది కేవలం ఎన్టీఆర్ వల్లే. పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి ప్రజలకు దగ్గరయ్యారు. జాతీయ స్థాయిలో పలు పార్టీ లను ఒకే వేదిక పైకి తీసుకు వచ్చి నేషనల్ ఫ్రంట్ ని ఏర్పాటు చేసారు. తెలుగు వాడి సత్తా ఏంటో ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన యుగపురుషుడు ఎన్టీఆర్. అనితర సాధ్యమైన విజయాలెన్నింటినో అలవోకగా అందుకున్న కారణజన్ముడు ఎన్టీఆర్. సినిమా రంగంలో, రాజకీయ రంగం లో సంచలనాలను సృష్టించిన ఎన్టీఆర్ కు భారత రత్న అవార్డ్ ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. కానీ ఇప్పటివరకు ఆ విషయంలో అన్యాయం జరుగుతూనే ఉంది. రాజకీయ కారణాల వల్లే ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వలేదు. భారత రత్నకు నూటికి నూరు పాల్లు అర్హుడు ఎన్టీఆర్. ఇకనైనా ఆ మహనీయుడిని గౌరవించుకుందాం.

ఎన్టీఆర్ కు భారత రత్న ఎప్పుడు..?

November 17, 2013

తెలుగుదేశం పార్టీ కూడా హైదరాబాద్ లో బహిరంగ సభ జరుపుతోంది. ఆత్మగౌరవ యాత్ర ను ప్రారంబిద్దామని ఆలోచించిన టిడిపి ఆ తర్వాత తన వ్యూహాన్ని మార్చుకుని బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఈ నెల ఇరవైఆరున హైదరాబాద్ లో కూడా సభ ఏర్పాటు చేస్తుండడం విశేషం. ఈనెల 21న తిరుపతి, 22న నెల్లూరు, 23న ఒంగోలు, 24న గుంటూరు, 25న కృష్ణా జిల్లా, 26న హైదరాబాద్‌లో చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నేత, ఎమ్మెల్యే గాలిముద్దుకృష్ణమనాయుడు తెలియచేశారు.

హైదరాబాద్ లో టిడిపి బహిరంగ సభ!

విభజనకు కారకులైన కాంగ్రెస్ పార్టీ, దాంతో ఒప్పందం చేసుకున్న వైసిపిలను సీమాంధ్ర నుంచి తరిమికొట్టాలని టిడిపి ఎమ్మెల్యే, గుంటూరు జిల్లా అధ్యక్షుడు పత్తిపాటి పుల్లారావు పిలుపునిచ్చారు. వైసిపి అండతోనే రాష్ట్రవిభజన చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుందని ఆరోపించారు. వైసిపికి ఓటు వేసినా కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లేనని ఆయనవ్యాక్యానించారు.

వైసిపికి ఓటు వేసినా కాంగ్రెస్‌కు ఓటు వేసినట్లే

October 9, 2013


Sri N Chandrababu Naidu Nirahara Deeksha Live from Delhi

రాష్ట్ర విభజనకు సంబంధించి జాతీయస్థాయిలో అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం రాష్ట్ర విభజన చేయాలని అన్నా. ఇరు ప్రాంతాల జేఏసీ నేతలతో ప్రభుత్వం చర్చించాలని ఆయన సూచించారు. టీడీపీని కించపరిచే విధంగా దిగ్విజయ్ మాట్లాడుతున్నాడని ఆయన ఆరోపించారు. టీడీపీని దెబ్బతీయడమే ఆయన లక్ష్యంగా కనిపిస్తుందని తెలిపారు. తన సొంత రాష్ట్రంలో గెలవలేని దిగ్విజయ్ ఏపీ భవిష్యత్‌ను ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు.

సొంత రాష్ట్రంలో గెలవలేని దిగ్విజయ్ ఏపీ భవిష్యత్‌ను ఎలా నిర్ణయిస్తారు.........


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చర్చిం చేందుకు తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర బాబునాయుడు డిమాండ్‌ చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర విభజన నేపథ్యంలో సమన్యాయం పేరుతో ఢిల్లీలో నిరాహారదీక్ష చేపట్టిన చంద్రబాబు నాయుడు మంగళవారంనాడు తన మద్దతుదారులతో మాట్లా డుతూ, అత్యంత క్లిష్టమైన ఈ సమస్య పరిష్కారానికి తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన సంయుక్త కార్యాచరణ కమిటీలు (జెఎసిలు)తో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలని కోరారు. ''కేవలం ఆరు మాసాల్లో యుపిఎ ప్రభుత్వం వెళ్లిపోతుంది. ఆ తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఈ సమస్య పరిష్కారానికి ఈ పార్టీలు ఏం చేస్తాయి. ఆ పార్టీల నిబద్ధత ఏమిటి? జాతీయస్థాయిలో అఖిల పక్ష సమావేశాన్ని ఎందుకు పిలవలేక పోతున్నారు. ప్రతి ఒక్కరితో ఎందుకు చర్చించలేక పోతున్నారు? మా డిమాండ్‌ అదే. తక్షణం అఖిల పక్షం ఏర్పాటు చేయాలి'' అని చంద్రబాబు అన్నారు. రాజకీయ లబ్దికోసం కాంగ్రెస్‌ పార్టీ ఏక పక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నదని ఆరోపించారు. ''కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్‌ పార్టీకి నేను విజ్ఞప్తి చేస్తున్నదేమిటంటే, ఇరు ప్రాంతాల జెఎసిలను కూడా పిలిచి మాట్లాడాలి. సరైన పరిష్కారంతో వస్తే మేం కూడా హర్షిస్తాం'' అని బాబు అన్నారు. ప్రభుత్వం ఎలాంటి తప్పుడు వాగ్దానాలు ఇవ్వకుండా ఏం చేయబోతున్నదో స్పష్టం గా చెప్పాలని కోరారు. ఎలాంటి విధివిధానాలను పాటించకుండానే తెలంగాణపై ఒక నిర్ణయం తీసుకు న్నారని, ఇది కేవలం ఓట్లు,

సీట్ల కోసమేనని దుయ్యబట్టారు. పాలక కాంగ్రెస్‌ పార్టీకి, జగన్మోహన్‌రెడ్డికి మధ్య 'మ్యాచ్‌ఫిక్సింగ్‌' జరిగిందని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా జైల్లో దీక్ష చేపట్టిన జగన్‌పై అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిపోయి, ఉదయం, సాయంత్రం హెల్త్‌బులిటెన్లు ఇచ్చారని విమర్శించారు. 'ఇది దేనిని సూచిస్తుంది? ఇది కచ్చితంగా మ్యాచ్‌ ఫిక్సింగ్‌. ఒకప్రక్క టిఆర్‌ఎస్‌, మరోప్రక్క వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌. తన కుమారుడిని ప్రధానమంత్రి చేయాలని సోనియాగాంధీ కోరుకుంటున్నారు. ఇది సహేతుకమేనా? సమంజమేనా? దీనినే నేను ప్రశ్నిస్తున్నాను' అని చంద్రబాబు అన్నారు. అనైతిక రాజకీయాలను ప్రజలు ఆమోదించరని అన్నారు. దిగ్విజరుసింగ్‌ చేసిన విమర్శలపై స్పందిస్తూ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తన సొంత పార్టీ నాయకులే విమర్శిస్తున్నందున ఆయన టిడిపి లక్ష్యంగా మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. 'వాళ్ళ సొంత ముఖ్యమంత్రే వ్యతిరేకిస్తున్నారు. సిఎం, కేబినెట్‌, కేంద్రమంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంపీలు, ప్రతిఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. మీ సొంత పార్టీ వారిని నువ్వు బుజ్జగించలేవా అని నేను దిగ్విజరును అడుగుతున్నాను. అలాంటప్పుడు మమ్ములను విమర్శించే హక్కు మీకెక్కడిది?' అని సూటిగా ప్రశ్నించారు. దేశ రాజధానిని దీక్షకు వేదికగా తాను ఎందుకు ఎంచుకున్నారో వివరణ ఇస్తూ తెలంగాణపై నిర్ణయం ఇక్కడే జరిగింది...పరిష్కారం కూడా ఇక్కడే లభించాలని అన్నారు.

''కేవలం ఆరు మాసాల్లో యుపిఎ ప్రభుత్వం వెళ్లిపోతుంది. ఆ తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదు.

October 7, 2013

సీమాంద్ర ప్రజల సమస్యలు, విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ మాత్రమే తాను నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం డిల్లీ లో ఆయన చేపట్టనున్న దీక్ష సందర్భంగా మొదట హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ … కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న విధానం వల్ల ఒక బాధ్యత కలిగిన పార్టీ నాయకుడిగా కలత చెందానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఇష్టానుసారం కాక స్వంత నిర్ణయాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. స్వాతంత్ర్య విలువలు కాపాడటంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. సీమాంద్ర లో ప్రజలు స్వచ్చందంగా ఆందోళన చేస్తున్నారని, అక్కడి ప్రజల ఆవేదన యావత్ దేశానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. సమస్య కు పరిష్కారం దొరికే వరకు శక్తి వంచన లేకుండా పోరాడతానని తెలిపారు. మీ దీక్ష వల్ల కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందని భావిస్తున్నారా ? అన్న ప్రశ్నకు, బ్రిటీషు వారు దిగిరారు అనుకుంటే బాపూజీ దీక్షలు చేసేవారు కాదని, మానవత్వం, ప్రజాస్వామ్య విలువలు ఉన్న ఏ ప్రభుతవమైనా దిగి వస్తుందని అన్నారు.

మీ దీక్ష వల్ల కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందని భావిస్తున్నారా ?

సీమాంధ్ర ప్రయోజనాలు, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడం లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీని కేంద్రంగా చేసుకుని దీక్ష చేపడుతున్నారు. ప్రజా ప్రయోజనాలకంటే కాంగ్రెస్ రానున్న ఎన్నికల్లో గెలిచి రాహుల్ ను ప్రధాని చేయాలనే లక్ష్యంతో పని చేస్తోందంటూ ఘాటు విమర్శలు చేస్తున్నారు బాబు. అంతేకాదు స్వయంగా నిరాహార దీక్ష చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను జాతీయ స్థాయిలో నేతల దృష్టికి తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను బహిర్గతం చేయడానికి చంద్రబాబు పూనుకున్నట్లు కనిపిస్తోంది. దేశ ప్రయోజనాలు, ఇటు తెలంగాణ అటు సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితులను అవగాహన చేసుకోకుండా, అంచనాకు రాకుండా కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై బాబు మండిపడుతున్నారు.అవసరమైతే ఎజెండాలను, జెండాలను పక్కనబెట్టి తిరిగి ఢిల్లీ వీధుల్లో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి అన్నివర్గాలను కలుపుకుపోతూ కాంగ్రెస్ ఒంటెద్దు పోకడకు తగిన గుణపాఠం చెప్పడానికి సమీకరణాలు చేస్తున్నారు.
వాస్తవానికి ఈ నెల 7 నుంచి ప్రకాశం జిల్లాలో ఆత్మగౌరవ యాత్ర బాబు చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలమధ్యకు వెళ్లడంకంటే ఢిల్లీ పీఠంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని బాబు భావిస్తున్నారు. సీమాంధ్రలో ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి ప్రత్యక్ష ఆందోళనలు చేపడుతున్నారు. సీమాంధ్రలో ఇప్పుడు సమైక్య సెగలు భగ్గుమంటున్నాయి. ఇలాంటి సమయంలో ప్రజల్లోకి వెళ్లడంకంటే తన లాంటి నేత ఢిల్లీలో దీక్ష చేస్తే ఈ సమస్య జాతీయ స్థాయి నేతల్లో కదలిక తీసుకువస్తుందని బాబు భావిస్తున్నారు.అంతే కాదు జగన్ హైదరాబాద్ లో తన నివాసం లోటస్ పాండ్ వద్దే దీక్ష చేస్తుండగా బాబు మాత్రం నేరుగా సోనియా గాంధీతోనే ఈ అంశంపై పోరాటం చేయడానికి ఢిల్లీని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.

ఇక జాతీయ స్థాయిలో బాబు పోరు!


పిసిసి అధ్యక్షుడు బొత్స సత ్యనారాయణ ఆస్తులపై మీకున్న ప్రేమ... ఇక్కడి ప్రజలపై లేదా? అని దిగ్విజయ్‌ను... తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమో హన్‌రెడ్డి ప్రశ్నించారు. దిగ్విజయ్ వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. తొమ్మిదిన్నర సంవత్సరాలుగా బెల్టుషాపులు, మద్యం షాపులు, కబ్జాలు, మాఫియాలు నడుపుతున్న బొత్స, ఆయన కుటుంబీకుల ఆగడాలకు, ఆరాచకాలకు విసిగిన ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారన్నారు. అయితే ఈ దాడులను తాము సమర్థించడం లేదని, కానీ దిగ్విజయ్‌సింగ్‌కు మాత్రం బొత్స ఆస్తులపై ఉన్న ప్రేమ... ఇక్కడి ప్రజలపై లేనట్లుగా ఉందన్నారు. 65 రోజులుగా సీమాంధ్రలో ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్నా.. ఒక్క కాంగ్రెస్ నేత కూడా సానుకూలంగా వ్యవహరించలేదన్నారు. దిగ్విజయ్‌కి కూడా ఇక్కడి ప్రజలు గుర్తుకు ఉరాలేదా? అని ప్రశ్నించారు. ఇంతటి తాగ్యాల ఉద్యమం చరిత్రలో మరొకటి లేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు దీక్షపై దిగ్విజయ్ ప్రశ్నించడంపైనా ఆయన స్పందించారు. విభజన ప్రక్రియ అసంబద్ధంగా ఉందనే చంద్రబాబు దీక్ష చేస్తున్నారన్నారు. అయినా చంద్రబాబు ఎందుకు దీక్ష చేస్తున్నారో మీ ముఖ్యమంత్రి(కిరణ్), మీ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలను అడుగు అంటూ.. దిగ్విజయ్‌కు... సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సూచించారు.

ఆస్తులపై మీకున్న ప్రేమ... ఇక్కడి ప్రజలపై లేదా?

October 5, 2013


రాష్ట్ర విభజన అంశాన్ని జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేసేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నడుంబిగించారు. కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ లబ్దికోసం ఏకపక్ష నిర్ణయం తీసుకున్న వైనాన్ని దేశ ప్రజలకు వివరించేందుకు సిద్ధమయ్యారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమ తీవ్రతను జాతీయ పార్టీల దృష్టికి తీసుకురావాలని ఆయన సంకల్పించారు. రాష్ట్రాన్ని విభజించి తద్వారా తెలుగు ప్రజల మధ్య చిచ్చు రగిల్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ యత్నించిందని, అందులో భాగంగానే విభజన నిర్ణయాన్ని ప్రకటించిందన్న అంశాన్ని జాతీయ స్థాయి నేతలకు వివరించి తద్వారా వారి మద్దతును కూడా కూడగట్టాలని చంద్రబాబు ప్రణాళిక రూపొందించారు. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు విభజన ప్రతిపాదనను కాంగ్రెస్‌ అధినాయకత్వం తెరపైకి తెచ్చిన కుట్రను దేశ ప్రజలకు వివరించాలని ఆయన ప్రతిపాదించారు.

రాజకీయ ప్రయోజనాల కోసం విభజన నిర్ణయం తీసుకున్న విధానాన్ని ఎండగట్టేందుకే దేశ రాజధాని ఢిల్లీలో దీక్ష చేపట్టాలని చంద్రబాబు నిర్ణయించిన విషయం తెలిసిందే. సీమాంధ్ర ప్రజల సమస్యలు, డిమాండ్లను దేశ ప్రజలకు వివరించేందుకే దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు. సమైక్యాంధ్రకు తాను అనుకూలమనే రీతిలో సీమాంధ్ర ప్రజలకు సంకేతాలిచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. సీమాంధ్ర ప్రజలకు తాను అండగా ఉంటానన్న రీతిలో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టి, ఉద్యమంలో తమ పార్టీ కార్యకర్తలు భాగస్వాములు అయ్యేందుకు అవకాశం దక్కించుకునేందుకు ఈ దీక్ష దోహదపడుతోందని భావిస్తున్నారు. రాష్ట్ర విభజనకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిన నేపథ్యంలో శుక్రవారం ఇరు ప్రాంతాల పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు.

తమ పార్టీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఎత్తుగడలను ఎలా ఎదుర్కోవలన్న అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. అలాగే తెరాస, వైకాపాలతో కాంగ్రెస్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ వ్యవహారాన్ని కూడా జాతీయ పార్టీలకు వివరించాలని నిర్ణయించారు. ఈ దీక్షలో జాతీయ పార్టీలతోపాటు ప్రాంతీయ పార్టీల నేతల సంఘీభావాన్ని కూడగట్టాలని భావిస్తున్నారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్‌ నిర్లక్ష్య వైఖరి, ప్రజల మధ్య ఏర్పడిన విభేదాలను జాతీయ స్థాయిలో వెలుగెత్తేందుకు ఈ దీక్షా వేదికను వాడుకోవాలని ఆశిస్తున్నారు. రాష్ట్ర విభజనలో ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేసే అంశంపై కాంగ్రెస్‌ అధిష్టానం దృష్టిసారించకపోవడం, రాజకీయ లబ్ధికోసం తీసుకున్న విభజన నిర్ణయాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకురావాలని చంద్రబాబు ఈ దీక్షకు పూనుకుంటున్నారు. విభజనపై సీమాంధ్రలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తెలుసుకున్న భాజపా అగ్రనేత అద్వానీ కూడా కాంగ్రెస్‌ నిర్ణయంపై ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రజల మధ్య ఉద్రిక్తతలు ఏర్పడిన పరిస్థితుల్లో రాష్ట్ర విభజన చేసిన దాఖలాలు గతంలో లేవంటూ ఆయన చేసిన వ్యాఖ్యకు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రజల డిమాండ్ల పరిష్కారానికి అన్ని పార్టీల మద్దతు కూడగట్టాలన్న విషయంలో చంద్రబాబు దీక్ష చేపడుతున్నారు. విభజన ప్రక్రియలో సీమాంధ్ర ప్రజలను పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని ఎత్తిచూపుతూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలన్న యోచనలో తెదేపా ఈ దీక్షకు పథకం వేసింది. అయితే తెలంగాణకు ఏమాత్రం వ్యతిరేకం కాదని, కేవలం సీమాంధ్ర ప్రజల సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యతనిచ్చి ఆ కోణంలోనే దీక్షకు వ్యూహరచన చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

తెలుగు ప్రజల మధ్య చిచ్చు రగిల్చేందుకు కాంగ్రెస్‌ పార్టీ యత్నించింది


కాంగ్రెస్, వైసిపి ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినందువల్లే జగన్ కు బెయిల్ వచ్చిందని చర్చలో పాల్గొన్న టిడిపి ఎంపి శివ ప్రసాద్ విమర్శించారు. విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ పక్కా ప్రణాళిక రూపొందించుకుందని చెప్పారు. దాని ప్రకారమే అటు తెలంగాణలో టిఆర్ఎస్ ను, ఇటు సీమాంధ్రలో వైసిపి ని కలుపుకునే పనిలో పడిందిని చెప్పారు. గాదె వెంకటరెడ్డి, జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి కాంగ్రెస్ సీమాంధ్రలో తన అస్తిత్వం కోల్పోయిందని తెలుస్తుందని అన్నారు. ఢిల్లీలో తమ పార్టీ అధినేత చంద్రబాబు బిజెపి అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ను కలవడం వెనుక రాజకీయకారణాలేమీ లేవని చెప్పారు. వక్రమార్గాల ద్వారా జగన్ బెయిల్ పై బయటికి వచ్చారని విమర్శించారు. ఇప్పుడు సోనియా గాంధీకి వ్యతిరేకంగా వైసిపి స్టాండ్ తీసుకోగలదా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్, వైసిపి ల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగినందువల్లే జగన్ కు బెయిల్ వచ్చింది

October 3, 2013


అన్నీ వై.కాంగ్రెస్ కు ముందే తెలుసు-కేశవ్

సీమాంద్ర కేంద్ర మంత్రులు తక్షణమే రాజీనామా చేసి బయటకు రావాలని, క్యాబినెట్ లో నోట్ చించివేసి బయటకు రావాలని టిడిపి సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు.లగడపాటి రాజగోపాల్ కొద్ది రోజుల క్రితం కూడా ఇప్పట్లో విభజన జరగదని అన్నారని, ఆయన ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారని అన్నారు.సీమాంధ్ర మంత్రులు వైదొలగకపోతే ద్రోహం చేసినట్లేనని ఆయన అన్నారు.

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్,టిఆర్ఎస్ లతో ఒప్పందం కుదుర్చుకుని విబజన చేస్తున్నదని ఆయన ఆరోపించారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కి ముందుగానే తెలిసి ఈ రోజు దీక్షలకు దిగారని కేశవ్ ఆరోపించారు.ప్రతి అడుగు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు ముందుగానే తెలుస్తున్నాయని, టెన్ జనపధ్ నుంచే ఈ పార్టీ ప్రధాన కార్యాలయం ఉందని ఆయన అన్నారు.సిబిఐ డైరెక్టర్ ఎందుకు దిగ్విజయ్ సింగ్ ను కలిశారో వివరణ ఇవ్వాలని ఆయన అన్నారు.

సిబిఐ డైరెక్టర్ ఎందుకు దిగ్విజయ్ సింగ్ ను కలిశారు.

సిబిఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా పార్టీ వ్యవహారాల ఇన్చార్జీ దిగ్విజయ్ సింగ్ ను ఎందుకు కలిశారని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. దిగ్విజయ్ సింగ్ ఏ హోదాలో కలిశారని ఆయన అన్నారు. సిబిఐ ద్వారా ఎవరిపై కేసులు పెట్టదలిచారు?లేదా ఎవరిని వదలిపెట్టదలిచారు? అని ఆయన ప్రశ్నించారు. ప్రత్యర్ధులను వేధించడానికి,సిబిఐని, ఆదాయపన్ను శాఖ అదికారులను ఉపయోగిస్తున్నారని ఆయన ఆరోపించారు.ఆంద్రప్రదేశ్ లో జగన్ కేసులో పది ఛార్జీషీట్ లు వేయాలని చెప్పిన సిబిఐ,బెయిల్ ఇవ్వాలనుకున్న వెంటనే ఒక మెమో ఫైల్ చేయడం,కొన్ని కంపెనీలకు సంబందించి మొదట తప్పు ఉందని చెప్పినా, ఆ తర్వాత లేవని అనడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. చార్జీషీట్ లలో రాసిన విషయాలకు విరుద్దంగా ఇలా చెబుతారా అని అన్నారు. ఏ కోర్టులో కూడా దర్యాప్తు పూర్తి అయిందని ఎక్కడా చెప్పరని, అలాంటిది కేసును నిర్వీర్యం చేసే విదంగా దర్యాప్తు పూర్తి చేశారని చంద్రబాబు అన్నారు.అందువల్లనే జగన్ డి.ఎన్..ఎ ,మాది ఒకటేనని దిగ్విజయ్ సింగ్ అన్నారని,వీరప్ప మొయిలీ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందని అన్నారని ఆయన వ్యాఖ్యానించారు.

సిబిఐ ద్వారా ఎవరిపై కేసులు పెట్టదలిచారు?

October 2, 2013

చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ దేశానికి రోల్ మోడల్సని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. అభివృద్దికి వారిద్దరూ ప్రతీకలని, తమ హయాంలో తమ రాష్ట్రాలను వారు అభివృద్దిలో అగ్రగామిగా నిలిపారని ఆయన అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ వివిధ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రాజకీయం జడ పదార్ధం కాదని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీలు మారాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

గతంలో బిజెపిపైనా...మోడీపైనా టిడిపి చేసిన విమర్శలను ప్రస్తావించినప్పుడు ఆయన ఈ వ్యాఖ్య చేశారు. కాంగ్రెస్ పార్టీ పాలన దేశాన్ని నాశనం చేసిందని, ఆ పార్టీని దించడం కోసం ప్రత్యర్ధులైనా చేతులు కలపక తప్పదని ఆయన అన్నారు. అమెరికాను షట్ డౌన్ చేసినట్లు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, కేంద్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని షట్ డౌన్ చేస్తేనే విభజన నిర్ణయం ఆగుతుందని, లేకపోతే వారి భవిష్యత్తు షట్ డౌన్ అవుతుందని కేశవ్ వ్యాఖ్యానించారు.

బాబు, మోడీ దేశానికి రోల్ మోడల్స్......................

ఎన్డీయే కన్వీనర్ గా చంద్రబాబు ?

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మరోసారి జాతీయ రాజకీయాలలో ప్రధాన భూమిక ను పోషించే రోజులు సమీపిస్తున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్డీయేలో చక్రం తిప్పబోయేది ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి. కీలకమైన ఆంధ్రప్రదేశ్ వేదికగా ఒక ప్రాంతంలో తెరాస, మరో ప్రాంతంలో వైసీపీలతో అవగాహన కుదుర్చుకుని కాంగ్రెస్ తన మ్యాజిక్ ఫిగర్‌ను కాపాడుకునేందుకు వ్యూహాలు అమలుచేస్తుండగా... దాన్ని తిప్పికొట్టేందుకు తెలుగుదేశం పార్టీ పాత మిత్రులతో కొత్త స్నేహానికి నాందీ పలుకుతోంది. గత నెలలో న్యూఢిల్లీ పర్యటనలోనే ఎన్డీయేలో చేరికపై బాబు సూత్రప్రాయంగా నిర్ణయానికొచ్చారని తెలుస్తున్నది.

మంగళవారం హైదరాబాద్‌లో ముస్లింనేతలతో చంద్రబాబు నాయుడు సమావేశమై భాజపా నేతృత్వంలోని ఎన్డీయేలో చేరిక అంశంపై అభిప్రాయాలు తెలుసుకున్న పరిణామం కీలకమైన ముందడుగుగా పేర్కొన వచ్చు. చంద్రబాబు బుధవారం న్యూఢిల్లీ వెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీలో చాలాకాలంగా భాజపాతో ముందుకెళ్ళే అంశంపై చర్చ నడుస్తోంది. గతంలో ఎన్డీయేతో కలిసి ఎన్నికలను ఎదుర్కొన్నప్పుడు కలిసొచ్చిన సెంటిమెంట్, మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా యువతరం, విద్యావంతుల్లో పెరిగిన ఆదరణ, యూపీయేకి పరిస్థితులు రోజురోజకు దిగజారిపోతుండటం ఇవన్నీ గమనిస్తున్న పార్టీ నేతలు కొందరు చంద్రబాబుపై ఎన్డీయేలో చేరడం ఒక్కటే రాజకీయంగా ఉత్తమమైన మార్గమని, అది రాష్ర్టంలో పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని విశ్లేషకులు అంటున్నారు. 

తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో చేరిది ఖాయమని దాదాపు తేలిపోయింది. అందులో చంద్రబాబు నిర్వహించాల్సిన పాత్ర ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కన్వీనర్ బాధ్యతలను అప్పగించే విషయంలో భాజపా అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ సుముఖంగానే వున్నారు. ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ కూడా ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు చెప్పడం లేదు. అయితే ఏపీలో పార్టీ బలాబలాలు, సమీకరణలు ఎప్పుడు ఎలా మారిపోతాయో, టిడిపి, వైసీపీలలో ఏ పార్టీ ముందుంటుందో, ఎక్కువ స్థానాలను ఏ పార్టీ కైవసం చేసుకుంటుందో అనే అంశాలను లోతుగా పరిశీలిస్తున్న మోడీ ఒకవైపు బాబు పాత్రకు ఒకే చెబుతూనే మరోవైపు వైసీపీ అంశానికి కూడా తలుపులు మూసివేయడం లేదని తెలుస్తోంది. గతంలో యుఎఫ్ కన్వీనర్‌గా దేవేగౌడ, ఐ.కె. గుజ్రాల్ సర్కార్ల హయాంలో కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన బాబు అనుభవాల దృష్ట్యా ఎన్డీయే కన్వీనర్ పదవిని అప్పగించేందుకు ముందుకొస్తోంది. 

తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం టిడిపి అధినేత గతంలోలాగ కేంద్ర రాజకీయాలలో చక్రం తిప్పబోతున్నారని, కాంగ్రెసేతర పార్టీలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చి, గతంలో ఎన్టీఆర్ తరహాలో యూపీయేను గద్దెదించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ మరోసారి జాతీయ రాజకీయాలలో ప్రధాన భూమిక ను పోషించే రోజులు సమీపిస్తున్నాయి. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్డీయేలో చక్రం తిప్పబోయేది ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి. కీలకమైన ఆంధ్రప్రదేశ్ వేదికగా ఒక ప్రాంతంలో తెరాస, మరో ప్రాంతంలో వైసీపీలతో అవగాహన కుదుర్చుకుని కాంగ్రెస్ తన మ్యాజిక్ ఫిగర్‌ను కాపాడుకునేందుకు వ్యూహాలు అమలుచేస్తుండగా... దాన్ని తిప్పికొట్టేందుకు తెలుగుదేశం పార్టీ పాత మిత్రులతో కొత్త స్నేహానికి నాందీ పలుకుతోంది. గత నెలలో న్యూఢిల్లీ పర్యటనలోనే ఎన్డీయేలో చేరికపై బాబు సూత్రప్రాయంగా నిర్ణయానికొచ్చారని తెలుస్తున్నది.

మంగళవారం హైదరాబాద్‌లో ముస్లింనేతలతో చంద్రబాబు నాయుడు సమావేశమై భాజపా నేతృత్వంలోని ఎన్డీయేలో చేరిక అంశంపై అభిప్రాయాలు తెలుసుకున్న పరిణామం కీలకమైన ముందడుగుగా పేర్కొన వచ్చు. చంద్రబాబు బుధవారం న్యూఢిల్లీ వెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీలో చాలాకాలంగా భాజపాతో ముందుకెళ్ళే అంశంపై చర్చ నడుస్తోంది. గతంలో ఎన్డీయేతో కలిసి ఎన్నికలను ఎదుర్కొన్నప్పుడు కలిసొచ్చిన సెంటిమెంట్, మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా యువతరం, విద్యావంతుల్లో పెరిగిన ఆదరణ, యూపీయేకి పరిస్థితులు రోజురోజకు దిగజారిపోతుండటం ఇవన్నీ గమనిస్తున్న పార్టీ నేతలు కొందరు చంద్రబాబుపై ఎన్డీయేలో చేరడం ఒక్కటే రాజకీయంగా ఉత్తమమైన మార్గమని, అది రాష్ర్టంలో పార్టీ బలోపేతానికి దోహదపడుతుందని విశ్లేషకులు అంటున్నారు.

తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో చేరిది ఖాయమని దాదాపు తేలిపోయింది. అందులో చంద్రబాబు నిర్వహించాల్సిన పాత్ర ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కన్వీనర్ బాధ్యతలను అప్పగించే విషయంలో భాజపా అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ సుముఖంగానే వున్నారు. ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ కూడా ఈ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు చెప్పడం లేదు. అయితే ఏపీలో పార్టీ బలాబలాలు, సమీకరణలు ఎప్పుడు ఎలా మారిపోతాయో, టిడిపి, వైసీపీలలో ఏ పార్టీ ముందుంటుందో, ఎక్కువ స్థానాలను ఏ పార్టీ కైవసం చేసుకుంటుందో అనే అంశాలను లోతుగా పరిశీలిస్తున్న మోడీ ఒకవైపు బాబు పాత్రకు ఒకే చెబుతూనే మరోవైపు వైసీపీ అంశానికి కూడా తలుపులు మూసివేయడం లేదని తెలుస్తోంది. గతంలో యుఎఫ్ కన్వీనర్‌గా దేవేగౌడ, ఐ.కె. గుజ్రాల్ సర్కార్ల హయాంలో కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన బాబు అనుభవాల దృష్ట్యా ఎన్డీయే కన్వీనర్ పదవిని అప్పగించేందుకు ముందుకొస్తోంది.

తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం టిడిపి అధినేత గతంలోలాగ కేంద్ర రాజకీయాలలో చక్రం తిప్పబోతున్నారని, కాంగ్రెసేతర పార్టీలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చి, గతంలో ఎన్టీఆర్ తరహాలో యూపీయేను గద్దెదించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

ఎన్డీయే కన్వీనర్ గా చంద్రబాబు ?

ఢిల్లీలోని త్యాగరాజు ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ‘సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్’ సదస్సులో తెదేపా అధినేత చంద్రబాబు పాల్గొని ప్రారంభోపన్యాసం చేశారు. గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి వంటి మహనీయులు పుట్టిన రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. భారతదేశం సూపర్ పవర్ గా అవతరించే రోజు దగ్గర్లోనే ఉందని బాబు అన్నారు. అయితే, ఈ సదస్సులో చంద్రబాబు, బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీతో వేదిక పంచుకోవడం విశేషం.

గుజరాత్ ను అభివృద్ధి పథంలో ముందుంచి, ఇటీవలే భాజపా ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగిన నరేంద్ర మోడీపై ప్రసంశల వర్షం కురిపించారు. మోడీ విజన్ ఉన్న నాయకుడని ప్రశంసించారు. గాంధీ, మోడీ ఇద్దరూ గుజరాత్ కు చెందినవారు కావడం కాకతాళీయం అని ఆయన అన్నారు. ఎన్డీఏ హయాంలోనే సంస్కరణలు ఊపందుకున్నాయని… దేశం అభివృద్ధి దిశగా పయనించిందని గుర్తు చేశారు. పీవీ నరసింహారావు సంస్కరణలను యూపీఏ పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.

గతంలో అందరూ హైదరాబాద్ గురించి మాట్లాడేవారన్న బాబు… ఇప్పుడు అందరూ గుజరాత్ గురించి మాట్లాడుతున్నారని మోడీకి కితాబిచ్చారు. తెలుగుదేశం హయాంలో విద్యుత్ ఉత్పాదనలో రాష్ట్రం అగ్రశ్రేణిలో నిలిచేందుకు ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టామని వెల్లడించారు. దేశంలోనే అగ్రశ్రేణి విమానాశ్రయం, కన్వెన్షన్ సెంటర్ ను తాము నిర్మించామని చంద్రబాబు తెలిపారు. దీంతో పాటు… ఇంజినీరింగ్, వైద్య కళాశాలలు, న్యాయ విశ్వవిద్యాలయం, బిజినెస్ స్కూలు ఏర్పాటుచేశామని అన్నారు. రాజకీయాల్లోకి యువత రావాలని బాబు పిలుపునిచ్చారు. నేడు రాజకీయాల పట్ల 71 శాతం యువత ఆకర్షితులవుతున్నారని… ఇది 100 శాతానికి పెరగాలని అభిప్రాయపడ్డారు.

మోడీ విజన్ ఉన్న నాయకుడు


ఇండియా సూపర్ పవర్‌గా అవతరిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బుధ వారం ఉదయం ఢిల్లీలో జరిగిన సిటిజన్ అకౌంటబుల్ గవర్నెన్స్ సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు ప్రారంభోపన్యాసం చేశారు. దేశ ఆర్థిక సంక్షోభానికి కేంద్రమే కారణమని విమర్శించారు.

ఉత్తరాఖండ్ బాధితులకు సాయం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కంటే తానే ముందున్నానన్నారు. గాంధీ, మోదీ ఇద్దరూ గుజరాత్‌లో పుట్టడం కాకతాళీయమే అని ఆయన అన్నారు. ప్రధానిగా పీవీ ఎన్నో సంస్కరణలు తెచ్చారని కొనియాడారు. ఈ సదస్సులో పాల్గొన్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, చంద్రబాబు పరస్పరం పలకరించుకున్నారు.

ఇండియా సూపర్ పవర్‌గా అవతరిస్తోంది : చంద్రబాబు


జగన్ వ్యవహరణ తీరు, జరుగుతున్న పరిణామాలు, వస్తున్న పుకార్లు దీనికి ఆధారాలు అని విశ్లేషకులు అంటున్నారు. నిప్పులేనిదే పొగ రాదు..అన్నట్టుగా భూమా ఫ్యామిలీలో అసంతృప్తి లేనిదే ఈ పుకార్లు మొదలవ్వవు.
ఇక నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరడంతో.. ఇక్కడ నుంచి ఎంపీగా పోటీ చేయాలన్న భూమానాగిరెడ్డి ఆశలకు అడ్డుకట్ట పడింది. గతంలో ఇక్కడ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన నేపథ్యమున్న నాగిరెడ్డి ఇప్పుడు కూడా ఇక్కడ నుంచే అయితే సులభంగా గెలవొచ్చని ఆశించాడు. అయితే ఇప్పుడు ఆయనను నంద్యాల అసెంబ్లీకి ఇన్ చార్జ్ గా ప్రకటించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ! మరి ఎంపీగా పోటీ చేయాలనుకున్న వ్యక్తిని ఎమ్మెల్యే స్థాయికి పరిమితం చేయడం కచ్చితంగా ఆయనలో అసంతృప్తిని రగిల్చే విషయమే!
అదిగాక.. వైకాపాలో ఉన్నందున మొత్తం కర్నూలు జిల్లాపైనే ఆధిపత్యాన్ని కోరుకొంది భూమా ఫ్యామిలీ. దీనికి జగన్ సమ్మతించడు. ఎవరికీ సోలోగా ఒక జిల్లా బాధ్యతలను అప్పజెప్పడానికి జగన్ సిద్ధంగా లేడు. దీంతో భూమా ఫ్యామిలీకి అన్ని విధాలుగానే నిరాశే కలుగుతోంది. ఇటువంటి నేపథ్యంలో.. ఆయన తెలుగుదేశంలో చేరబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. జరిగిన పరిణామాలు.. ఈ వార్తలకు బలాన్ని ఇస్తున్నాయి. దీంతో భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డిలు వైకాపాకు విడ్కోలు చెప్పినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదనే అభిప్రాయం కలుగుతోంది.

TDP గూటికి భూమా దంపతులు ?

October 1, 2013


మిత్రులందరికి గాంధీ జయంతి శుభాకాంక్షలు...............................

అనంతపురం జిల్లా గుత్తి మాజీ ఎమ్మెల్యే సాయినాథ్ గౌడ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయినాథ్ గౌడ్ హైదరాబాదులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తుదిశ్వాస విడిచారు. సాయినాథ్ మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. గుత్తి నియోజక వర్గ అభివృద్ధికి, పార్టీ పటిష్టతకు సాయినాథ్ చేసిన సేవలను బాబు కొనియాడారు.

తెదేపా గుత్తి మాజీ ఎమ్మెల్యే సాయినాథ్ గౌడ్ మృతి


తెలంగాణ రాష్ట్రా ఏర్పాటు కెసిఆర్ కు పిడుగులాంటి వార్త!: రేవంత్

  తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెసు పార్టీ చెప్పడం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు పిడుగులాంటి వార్త అని తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు, అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి సోమవారం ఎద్దేవా చేశారు.

2014 వరకు తెలంగాణ రాకుంటే వచ్చే ఎన్నికలలో ఎక్కువ సీట్లు గెలుచుకుందామని ఆయన కలలు కన్నారని అవి కల్లలు కావడంతో ఆయన రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణపై తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కేంద్రానికి చెప్పాల్సింది చెప్పారన్నారు. తెలంగాణకు తమ పార్టీ అనుకూలంగా ఉండటం, తెలంగాణ రావడం కెసిఆర్ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఆదివారం జరిగిన సకల జన భేరీ సభను కెసిఆర్ కబ్జా చేశారని ఎద్దేవా చేశారు. సీమాంధ్రులను రెచ్చగొట్టేలా మాట్లాడావద్దన్నారు. విజయం సాధించిన వారు ఒదిగి ఉండాలని, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడవద్దన్నారు.

కెసిఆర్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ ఇద్దరు దురాశపరులన్నారు. వారిద్దరు ఏైసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నాయకత్వంలో పని చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రకటనతో ఆయన కలలు పేకమేడల్లా కుప్పకూలాయన్నారు. తెలంగాణకు కెసిఆర్, సీమాంధ్రకు వైయస్ జగన్, దేశానికి ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీలు నాయకత్వం వహించలేరన్నారు. తెలంగాణపై సిడబ్ల్యూసి ప్రకటన వచ్చి అరవై రోజులైనా బిల్లు ఎందుకు పెట్టలేదని ఆయన కాంగ్రెసును ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. సీమాంధ్ర ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఉందన్నారు. వారు ఆందోళనలను నివృత్తి చేయాల్సి ఉందని చెప్పారు. తెలంగాణపై పార్లమెంటులో నిలదీయాల్సిన కెసిఆర్ తన ఫాంహౌస్‌లో పడుకున్నారని నిప్పులు చెరిగారు. కెసిఆర్ తెలంగాణ ఉద్యమ ద్రోహి అని, ఆయనకు తెలంగాణ రావడం ఇష్టం లేదని మరో నేత దేవినేని ఉమామహేశ్వర రావు విజయవాడలో అన్నారు.

తెలంగాణకు కెసిఆర్, సీమాంధ్రకు వైయస్ జగన్, దేశానికి ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీలు నాయకత్వం వహించరు.

 కాంగ్రెస్‌కు జగన్ తోక ...జగన్‌కు కాంగ్రెస్ తోక అని టీడీపీ నేత కేఈ కృష్ణమూర్తి ఆరోపించారు. మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన సోనియా వల్లే జరుగతోందని సామాన్యులు సైతం భావిస్తున్నారన్నారు. సోనియాపై జగన్ ఒక్క మాట మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తొమ్మిదిన్నరేళ్ల కాంగ్రెస్ పాలన తర్వాత చంద్రబాబే ఈ రాష్ట్రాన్ని కాపాడగలరని ప్రజలు భావిస్తున్నారని ఆయన తెలిపారు. బీజేపీతో పొత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేఈ కృష్ణమూర్తి వెల్లడించారు.

కాంగ్రెస్‌కు జగన్ తోక ...జగన్‌కు కాంగ్రెస్ తోక

September 29, 2013

తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కావడమే తుది లక్ష్యమంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి. లోక్‌సభలో జైపాల్ రెడ్డి సమక్షాన ప్రజా సమస్యలపై మాట్లాడి దేశ ప్రజలను మెప్పించడమే తన పంతమన్నారు. పలు అంశాలపై 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే'లో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో తన మనోభావాలను పంచుకున్నారిలా...



తమనుతాము సమర్థించుకోవడానికే. విప్రోలో ఉంటే విప్రో.. ఇన్ఫోసిస్‌లో ఉంటే ఇన్ఫోసిస్ గొప్పదన్నట్లు ఉంది పరిస్థితి. సిద్ధాంతపరమైన రాజకీయాలు తగ్గి, వ్యక్తిగత, ఆర్థిక ప్రయోజనాలు ముందుకొచ్చాయి. పార్టీలు కూడా ఆర్థికంగా బలంగా ఉన్న వారినే ప్రోత్సహించడమూ ఓ కారణం. కాబట్టే ఎదుటి పార్టీల్లో తమను తిట్టేవారిని దగ్గరకు తీస్తే సరిపోతుందని ఆయా పార్టీలు భావిస్తున్నాయి.


బాగానే ఉంది. అయితే, నేనొచ్చిన ఆర్గనైజేషన్, పెరిగిన వాతావరణం ప్రభావం ఉంటుంది కదా. టీఆర్ఎస్‌లో చాలా తక్కువ కాలం కాబట్టి పట్టించుకోనక్కర్లేదు.


నేనెప్పటికీ నో అనలేను. నొప్పించకుండా కాదనేలా తీర్చలేని ప్రతిపాదన చేస్తాను. డబ్బుతో కొనగలుగుతాం అనుకుని వచ్చినవాళ్లకు 'మీరిచ్చే పది, పదిహేను కోట్లు జీవితంలో ఏ మార్పు తీసుకులేవు. ఓ నాలుగైదు వందల కోట్లిస్తే ఆలోచిస్తా అని చెప్పాను. అలాగే వాళ్లు ఊహించనివిధంగా సీఎం పదవి అడిగాను. ఇక వాళ్లేం చెప్పగలరు?


ఇంత డబ్బుపెడితే చాలామందిని తెచ్చుకోవచ్చని వాళ్లనుకుంటారు కదా. అలాగే మనల్ని భరించడం కష్టం. నేను ఇమడటమూ కష్టమే. మేమిద్దరం ఒకరకం వ్యక్తులమే.
ఎమ్మెల్యేలకు ఎంతవరకూ ఆఫర్లుంటాయి?
పది, ఇరవై కోట్లు ఉండవచ్చు. ప్రజలలో నాయకులంటే గౌరవం లేదు. నాయకులకూ ప్రజలపై సరైన అభిప్రాయం లేదు.
తొలిసారి ఎమ్మెల్యేగా ఉన్నారు కదా... ఎలా ఉంది?
రాకముందు రాజకీయాలంటే బాగా మోజు ఉండేది. అసెంబ్లీలో లేచి మాట్లాడితే మన జిల్లా.. మన ప్రాంతం ప్రజలకు ఏదైనా చేయొచ్చు అనుకున్నా. అయితే, ఇప్పుడు ప్రజలు గందరగోళంలో ఉన్నారో.. నేను గందరగోళంలో ఉన్నానో అర్థం కావట్లేదు. ఒక ప్రాంత దుర్మార్గుడైన ఒక అధికారిని చూశాను. అతడు 500కోట్ల నుంచి వెయ్యి కోట్లకు పడగలెత్తి ఉంటాడు. అతడిపై మూడేళ్లు పోరాడాను. రోజూ 30, 40మంది వరకూ మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకూ ఆయన ఇంటి ముందు బారులు తీరేవారు.


ఇపుడు లేదులే.. నిన్నోమొన్నో కొట్టేసినం. నానా తిప్పలు పడి అతడి అవినీతిని బయటపెట్టగలిగాం. నన్ను దారిలోకి తెచ్చుకోవడానికి 20మంది మంత్రులు, 50మంది ఎమ్మెలేల వరకూ ఒత్తిడి తెచ్చారు. అతడిపై సభలో లేవనెత్తడానికి ప్రయత్నిస్తే ఒక ప్రాంత పార్టీ సభను రోజు మొత్తం అడ్డుకుంది. మర్నాటికి పోస్టు చేయించుకున్నా అడ్డుకుంది.
అది టీఆర్ఎస్ పార్టీయే కదా?
నేను దానిగురించి చెప్పను. ప్రతిపక్ష పార్టీ అధికార ప్రతినిధిగా ఉండి నాలుగేళ్లుగా పోరాడితే చివరకు కోర్టు జోక్యంతోగానీ అతడి అవినీతిని నిలువరించలేకపోయాం.



రాత్రి 2 గంటలకు చేతిలో బీఫారంతో అడ్రసు తెలుసుకుని నియోజకవర్గానికి వెళితే 14 రోజులలో అక్కడి ప్రజలు నన్ను గెలిపించారు. మరి వారికి ఏదో ఒకటి చేయాలన్నది నా ఉద్దేశం. అందుకే అనేక అభివృద్ధి పనులు తెచ్చుకున్నాను. వాటిని రద్దుచేసి వేరే కాంట్ట్రాక్టర్‌కు ఇప్పించాడు. అందుకే ఆ కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టించాను.
ఆ అధికారి శివారెడ్డి అయ్యుంటారు?
నేను పేర్లు చెప్పను.
ఈ ఐదేళ్లలో ఏదైనా సంతృప్తి ఉందా?
నియోజకవర్గం వరకూ చాలా పనులు చేయగలిగాను. వెయ్యి కోట్లు సంపాదించినా రానంత గుర్తింపు సాధించాను. అయితే, రాజకీయాలపై ప్రజలలో ఈసడింపు ధోరణి ఎవరికీ మంచిది కాదన్న బాధ ఉంది. దేశంలో సమూల ఎన్నికల సంస్కరణలు తేవడం తక్షణావసరం. ఒకనాడు హత్యనే పెద్ద నేరంగా భావించి సీఆర్‌పీసీలో ఎక్కువగా దానిపైనే దృష్టి పెట్టారు. ఇప్పుడు వెయ్యి హత్యలకన్నా ఒక అవినీతి పెద్ద ప్రమాదకరమైంది.


చాలా సాదాసీదాగా ఉండేవారికైనా రోజుకు పది వేలు ఉండాల్సిందే. సాధారణంగా అయితే.. నెలకు 10 నుంచి 15 లక్షలు కావాల్సిందే. అంటే ఎన్నికైన తర్వాత నియోజకవర్గంలో సరాసరి రూ.5 కోట్లు ఖర్చు పెట్టాల్సివస్తుంది.
ఇదంతా భరించాలంటే ఎవరైనా దందా చేయాల్సిందేనా?
కచ్చితంగా అలాగే ఉంది. సిద్ధాంతపునాదిగల వాళ్లకైనా విధిలేని పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో నేను కొంచెం సంపాదించుకున్నాను. ప్రస్తుతం అడుక్కునే పరిస్థితో.. బెదిరించుకునే పరిస్థితో రాలేదు. తొందర్లోనే నాకు అలాంటి పరిస్థితి తప్పదనిపిస్తోంది.
ఈ క్రమంలోనే రేవంత్‌పైనా ఆరోపణలు వచ్చాయి కదా?
నా దగ్గరికి చాలా మంది వస్తుంటారు. వారి పనులు చేసిపెట్టే క్రమంలో ఆరోపణలు తప్పట్లేదు. అమెరికాలో ఉండే ఎవరిదో భూమిని కబ్జాపెడితే సాయం చేయాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు కోరారు. బాధితుల పక్షాన వెళ్లి ప్రయత్నిస్తే ఇలా ఆరోపించారు.


ఇప్పుడు చెప్పిన స్థల వివాదంలోనే వారి విషయం ముందుకొచ్చింది. ఆ స్థలం కోసం భానుకిరణ్ తదితరులతో పోరాడాను. ఆ క్రమంలోనే భాను, మంగలి కృష్ణలతో మాట్లాడింది నిజమే. ఇదంతా జరిగింది 2005-06లో. అప్పట్లో వాళ్లెవరో కూడా లోకానికి తెలియదు. ఇప్పుడు నేను ఏ పార్టీనైతే నేను తిడుతున్నానో వాళ్లే నాపై తప్పుడు ముద్ర వేయడానికి వాళ్ల పత్రికలోనే రాసుకుని ఆరోపణలు చేశారు. అమెరికాలోనివారిని నాపై ఫిర్యాదుకు ఒత్తిడి తెచ్చారు. అయితే, సాయం చేసింది నేనేనని వాళ్లకి తెలియదు. ఆ విషయమే వాళ్లు చెప్పారు. దీనిపై రెండు పార్టీల మీడియాలో రాద్ధాంతం చేశారు.

రాజకీయ ప్రవేశం ఎలా...
మొదట ఏబీవీపీ.. తర్వాత ఆర్ఎస్ఎస్‌లో ఫుల్‌టైం పనిచేశాను. ఆ తర్వాత కొన్నాళ్లు వ్యాపారం. అప్పట్లో కిషన్‌రెడ్డికున్న సన్నిహితులలో నేనూ ఒకడినని అనుకునే వాడిని.
బీజేపీకి ఎందుకు దూరమయ్యారు?
అప్పట్లో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుందనే ఆర్ఎస్ఎస్‌ని వదిలేశాను. పార్టీ సొంతంగా నిలదొక్కుక్కోవాలి.. రాష్ట్రాన్ని బీజేపీ పాలించాలి అన్న ఆలోచనతో ఉన్న నాకు అనవసరంగా పార్టీని టీడీపీకి అప్పజెప్పారన్న కోపం వచ్చింది. అయితే, ఆ తర్వా త అటూఇటూ తిరిగి చివరకు వద్దనుకున్న టీడీపీలోనే కీలకం కావాల్సి వచ్చింది.


తెలంగాణపై హరీశ్, నేనూ బాగా దగ్గరగా ఉండేవాళ్లం. 2003లో కల్వకుర్తిలో పార్టీకి ఎవరూ లేరని ప్రత్యక్షంగా టీఆర్ఎస్‌లోకి రావాలని కోరారు. అప్పట్లో పాలమూరు గర్జన అని పెట్టాం. అదే నా రాజకీయ ప్రవేశం అనుకోండి. అప్పట్లో టికెట్ వచ్చేస్తుందనుకోగా కాంగ్రెస్‌కు చెందిన ఢిల్లీలోని కీలక నాయకుడు టీడీపీలోని తన సన్నిహితుడిని గెలిపించుకోవడానికి ఆ సీటును కాంగ్రెస్‌కు తీసుకుని టీఆర్ఎస్‌కి వేరే సీటు ఇచ్చేలా ఒత్తిడి చేసి విజయం సాధించారు. ఇక్కడ ఒక విషయం నిజం. కేసీఆర్ మీద భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. నా విషయంలో మాత్రం ఆయన నాకు ఆ సీటు ఇవ్వడానికే పట్టుబట్టారు. కానీ, జరగలేదు. 2006 జడ్పీ ఎన్నికలలో చైర్మన్‌గా నా పేరును ప్రకటించారు. కానీ ఏం జరిగిందో కానీ, అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలలో సగం స్థానాలు పొత్తులో తీసుకుని 64 జెడ్‌పీటీసీలలో రెండు స్థానాలు మాత్రమే టీఆర్ఎస్‌కు తీసుకున్నారు. ఆ రెండింటిలో కూడా నాకు ఇవ్వాల్సిన స్థానం లేదు. దాంతో నాకు కోపం వచ్చింది.


జడ్పీటీసీ ఎన్నికలప్పుడు కూడా నన్ను అవమానించారు. దాంతో పార్టీలను పక్కనబెట్టి స్వతంత్రంగా ముందుకు రావాలనుకున్నా. ప్రజలలో నేనేంటో తెలుసుకోవాలనుకుని నామినేషన్ వేసి కాంగ్రెస్ మినహా అన్ని పార్టీల అభ్యర్థులను ఉపసంహరింపజేశాను. ఎన్నికలలో నేను, కాంగ్రెస్ అభ్యర్థి మాత్రమే బరిలో ఉండేలా చూసుకున్నా. ఆ ఎన్నికలలో అన్ని పార్టీల జెండాలు కప్పుకొని ప్రచారం చేసింది నేనొక్కడినే. అప్పుడు జడ్పీటీసీగా గెలిచాను. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా స్వతంత్రంగా పోటీ చేయాలనుకున్నా. అప్పుడు కూడా అలాగే, చంద్రబాబుతో మాట్లాడి కాంగ్రెస్‌కు ఏకగ్రీవంగా అవుతుందనుకున్న స్థానంలో పోటీకి దిగాను. ఆ ఎన్నికలలో గెలిస్తే పార్టీలోకి వస్తానని చంద్రబాబుకు చెప్పాను. అప్పుడు 18 ఓట్లతో గెలిచాను. ఆ వెంటనే తమ పార్టీలోకి రావాలంటూ నాకు చాలా పెద్దపెద్ద వాళ్లు ఫోన్ చేశారు. అయితే, నేరుగా చంద్రబాబు దగ్గరకు వెళ్లి పార్టీలో చేరాను. 2007లో వైఎస్ హవా చాలా ఎక్కువగా ఉండేది. అప్పట్లో టీడీపీలో ముఖ్యులు కూడా ఎందుకు ఈ పార్టీలోకి రావడం అని అడిగారు.


వాజ్‌పేయి తదితర నేతలను చూశాక.. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నతమైన పార్లమెంట్‌లో దేశ సమస్యలపై మాట్లాడి జనంతో వీడురా నాయకుడు అని అనిపించుకోవాలని కోరిక. అలాగే, 'మీకెందుకురా రాజకీయాలు' అని అన్న ఓ నాయకుడు ఉన్న సభలో నేను మాట్లాడాలని నా పంతం. ఈ సారి మాత్రం పార్లమెంట్‌కు వెళ్లాలి అన్నది నా కోరిక. తర్వాత అయితే, ఆ నాయకుడు పోటీ చేస్తారో చేయరో తెలియదు కదా. గతంలోనే చేద్దామనుకున్నా అయితే కుదరలేదు.
జైపాల్ రెడ్డితో మీ తగదా ఏమిటీ? ప్రేమ పెళ్లి విషయంలోనా?
అదేం కాదు. ఆ విషయంలో ఆయనకు ఏ ప్రమేయం లేదు. ఆర్థికంగా బాగా ఉన్నతమైన కుటుంబం కాబట్టి పెళ్లి విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి.


జానారెడ్డిని ఎవరితోనూ పోల్చలేను. నాయకుడిగా ఆయన ఎవరికి ఎలా కనిపించినా వ్యక్తిగా మంచివాడు. ఎవరైనా ఏదైనా సమస్యతో వెళితే ముందు కూర్చోబెట్టి సావధానంగా వింటారు. అలాగే, ఆయనతో దగ్గరి బంధుత్వం ఉంది. జానారెడ్డి, సబిత అక్క పిల్లలతో నాకు బాగా సాన్నిహిత్యం ఉంది. అందుకే వారి విషయంలో చర్చ జరిగే సందర్భాలలో నేను అక్కడ ఉండను అన్న విషయాన్ని మా నాయకుడికి కూడా చెప్పాను.


యూపీలో అయోధ్య అంశం ఉన్నంత కాలం బీజేపీని ఎవరూ టచ్ కూడా చేసేవాళ్లు కాదు. అక్కడున్న మసీదును కూల్చివేసిన తర్వాత ఆ పరిస్థితి లేదు. అక్కడ బీజేపీ కోలుకోలేనంత దెబ్బతింది. అలాగే, రాష్ట్రంలో తెలంగాణ సమస్య పరిష్కారం అయిపోతే ఆ తర్వాత ఏమీ ఉండదు. దానికోసం పోరాడే వారికి ఏమీ ఉండదు. టీడీపీ అనేది ఒక కాలేజీ. ఫైనలియర్ వాళ్లు వెళితే కొత్తగా వచ్చే వాళ్లు వస్తుంటారు. ప్రస్తుత భావోద్వేగాల పరిస్థితి తొలగిపోతే టీడీపీ మళ్లీ కచ్చితంగా పుంజుకుంటుంది.

చంద్రబాబు వద్దనుకున్నా కూడా ఈ పార్టీ బలపడుతుంది. అదైతే నిజం. అన్ని వర్గాల ప్రజలకు ఈ పార్టీ ఒక వేదికగా ఉండడమే కారణం. ఆ వేదిక అవసరం చాలా ఉంది. ఎంతోమంది మహామహులతో పోరాడిన చంద్రబాబు ఒకవేళ అలసిపోయినా ఆ పార్టీ మాత్రం కొనసాగాల్సిన ఆవశ్యకత ఉంది. అన్ని వర్గాల నుంచి నేతలను తీసుకొచ్చిన ఘనత టీడీపీదే.


దేశంలోని పరిస్థితుల రీత్యా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు, బీజేపీ సహా అందరూ ఒక్కటి కావాల్సిన అవసరం ఉంది. కమ్యూనల్ ఎజెండా ఉందనుకుంటే దాన్ని పక్కనపెట్టి కామన్ మినిమమ్ కార్యక్రమం రాసుకుని దగ్గర కావాల్సిన ఆవశ్యకత నెలకొంది. పాకిస్థాన్ ఉగ్రవాదం.. చైనా రెచ్చగొట్టే చర్యలను చూస్తూ ఊరుకున్న బలహీనమైన నాయకత్వం దేశంలో ఉన్న నేపథ్యంలో ఇంకా సిద్ధాంతాలు పట్టుకుని వేళ్లాడితే జాతికి నష్టం చేసినట్లే. కాబట్టి లెఫ్ట్, రైట్ ఒక్కటి కావాల్సిందే. దీనిపై ఒక చర్చకు తెర లేవాలన్న ఉద్దేశంతో నేను ఈ విషయాన్ని ముందుకు తెస్తున్నా. రేపు మా పిల్లలు గౌరవించేది మేం చేసిన పనులన బట్టే. అందుకే ఈ దేశానికి ఏదైనా చేయాలన్న తపనతోనే మాట్లాడుతున్నా. ఒక పౌరుడిగా ఈ దేశానికి ఒక బలమైన నాయకత్వం.. సామాన్య ప్రజలకు విశ్వాసం కల్పించేలా చూడాలని కోరుతున్నా.



కచ్చితంగా. ఆ కోరిక లేదని నేను చెప్పను. తెలంగాణ వచ్చాక ఆ పదవిని చేపట్టాలని ఎందుకుండదు. ఏ రాజకీయ నాయకుడైనా అనుకుంటారు. అలాగే నేనూ.
 

'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే'లో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి

September 28, 2013




  కేసీఆర్, జగన్ కాం గ్రెస్ అధినేత్రి సోనియా విసిరిన బాణాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆమె నివాసంలో తయారుచేసి పంపిన స్క్రిప్టును వారిక్కడ చదువుతున్నారని దుయ్యబట్టారు. శనివారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ... ఇక ముఖ్యమంత్రి కిరణ్ ఎవరు విసిరిన బాణమో చూడాల్సి ఉందన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్‌తో, సీమాంధ్రలో వైసీపీతో లాలూచీపడి నాలుగు సీట్లు గెలుచుకోవాలని, టీడీపీని దెబ్బ తీయాలని కాంగ్రెస్ కక్కుర్తి పడుతోందన్నారు. ఇటీవలి రాష్ట్ర పరిణామాలన్నీ అడుగడుగునా కుట్రలు, మ్యాచ్ ఫిక్సింగులేనని, వీటన్నింటికీ కేంద్ర బిందువు సోనియాగాంధీ యేనని విమర్శించారు. చీకటి ఒప్పందాలు, తెరచాటు కుట్రలతో తమను బలిపశువులు చేశారని ఆ పార్టీ నేతలే వాపోతున్నారని చెప్పారు. 'సొంత పార్టీ పోయినా నాలుగు సీట్లు వచ్చి మళ్లీ అధికారం దక్కితే చాలని భావించే మహా నాయకురాలిని ఇప్పుడే చూస్తున్నాం' అని ధ్వజమెత్తారు.

తమ పార్టీ ఇటువంటి కుట్రలను చేధించేందుకు ఎన్టీఆర్ విసిరిన రామబాణమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజనపై తమ వైఖరి స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. 'రెండు ప్రాంతాల నాయకులతో ఢిల్లీవెళ్లి మూడు రోజులు అందరితో మాట్లాడాను. వారిని మేనేజ్ చేయడం కాకుండా ఇరుపక్కలా ఉన్న జేఏసీలు, విద్యార్థులు, ప్రభావిత వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడి, సమస్యలేమిటో తెలుసుకొని పరిష్కరించమని చెప్పా. ఇదే మా వైఖరి. ఇది సున్నితమైన సమస్య అనే సంగతి మరచి, రాజకీయ లబ్ధికోసం జటిలం చేయడం వల్లే రాష్ట్రం తగలబడుతోంది' అని వ్యాఖ్యానించా రు. సమస్యల గురించి ఇప్పుడు మాట్లాడుతు న్న సీఎం, ముందుగా తమ అధిష్ఠానంవద్ద ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. '60 రోజుల తర్వాత లేచి వచ్చి మాట్లాడుతున్నారు.

ఇన్ని రోజులూ ఏం చేశారు? ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడేందుకు కనీసం పార్టీ నాయకత్వాన్ని ఒప్పించలేకపోయారే? పార్టీలో మీ పలుకుబడి ఇదేనా? సీఎంగా చేయాల్సిన సమయంలో చేయకుండా ఇప్పుడు మాట్లాడితే ఉపయోగం ఏమిటి? సీడబ్ల్యూసీ తీర్మానానికి ముందు సీఎం, డిప్యూటీ సీఎం, పిీసీసీ అధ్యక్షులను నాలుగైదుసార్లు పిలిపించి మాట్లాడారు. అప్పుడే ఇవన్నీ ఎందుకు చెప్పలేదు? చెప్పినా వినకపోతే అప్పుడే బయటకొచ్చి చెప్పాల్సింది. ఆ రోజు సహకరిస్తామని చెప్పి, ఇప్పుడు ఇక్కడ సమైక్యాంధ్ర అంటూ మాట్లాడుతున్నారు. ఇతర పార్టీలతో మ్యాచ్ ఫిక్సింగులు చేసుకొని పార్టీ అధిష్ఠానమే కుట్రలకు పాల్పడుతోందని స్వయంగా కాంగ్రెస్ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ఆ కుట్రలు మీకు తెలియదా? తెలిసీ చెప్పడం లేదా? ఢిల్లీలో జరిగిన జాతీయ సమగ్రత మండలి సమావేశంలో నేను రాష్ట్రంలో పరిస్థితులు వివరిస్తుంటే మైక్ కట్ చేశారు.

నిరసనగా వాకౌట్ చేశాను. అదే వేదికపై ఉన్న ముఖ్యమంత్రి కనీసం నోరు తెరిచారా? రాష్ట్రంలో అంతా బాగుందని చెప్పి వచ్చారు. ఢిల్లీలో సోనియా ముందు మాట్లాడటానికి భయం. ఇక్కడికి వచ్చి లీకులు. నేను సీనియర్ రాజకీయవేత్తగా చేయాల్సింది చిత్తశుద్ధితో చేస్తున్నాను. జాక్‌పాట్‌తో సీఎం పోస్టులోకి వచ్చిన వారు కూడా నా గురించి మాట్లాడితే ఎలా? మేం ఏనాడూ అధికారం కోసం లేం. మేం ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం సిన్సియర్‌గా చేశాం. ప్రజల్లో మా పట్ల ఉన్న మంచిని పోగొట్టడానికే కాంగ్రెస్, టీఆర్ఎస్, వైసీపీ కలిసి నాటకాలు ఆడుతున్నాయి' అని విమర్శించారు. కిరణ్ తానే మాట్లాడుతున్నారా లేక ఢిల్లీ పెద్దలు మాట్లాడిస్తున్నారా అన్నది తనకు తెలియదని ఈ సమయంలో ఏదైనా జరగవచ్చని ఒక ప్రశ్నకు జవాబిచ్చారు.

అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎంత చిచ్చుకైనా, ఎవరితో చేతులు కలపడానికైనా వెనకాడటం లేదని, ఆ పార్టీని ఇంటికి పంపితేనే దేశం బాగుపడుతుందన్నారు. ఇందుకోసం తాను జాతీయ స్థాయిలో ఎవరెవరిని కలుపుకుంటానో ఇప్పుడే చెప్పలేన న్నారు. బీజేపీతో పొత్తుపై సమాధానం దాటవేశారు. దేశం ఇప్పుడు సంక్షోభంలో చిక్కుకొందని, దానికి కారణమైన కాంగ్రెస్ ఓటమికోసం అన్ని పార్టీలతో మాట్లాడతానని చెప్పారు. అక్టోబర్ 4 నుంచి మళ్లీ జిల్లాల పర్యటనకు వెళ్తున్నానని బాబు తెలిపారు.

'సీమాంధ్రలో కాంగ్రెస్ ప్రజాగ్రహంలో కొట్టుకుపోయింది. ఆ పార్టీతో మ్యాచ్ ఫిక్సింగ్‌ద్వారా బెయిలుపై వచ్చిన జగన్ కూడా విలువ కోల్పోయాడు. ప్రజల విశ్వాసం మనవైపే ఉంది. మీరు ప్రజల్లో ఉండి, బాగా పనిచేయండి. వారి నమ్మకాన్ని నిల బెట్టుకుందాం' అని చంద్రబాబు పార్టీ శ్రేణులకు సూచించారు. శనివారం ఆయన తన నివాసంలో ఉభయ గోదావరి జిల్లాల పార్టీ నేతలతో మాట్లాడారు.

ఆ కుట్రలు మీకు తెలియదా? తెలిసీ చెప్పడం లేదా?


విభజనపై సీడబ్ల్యూసీ తీర్మానాన్ని బహిరంగంగా ధిక్కరిస్తున్నా కాంగ్రెస్ అధిష్ఠానం సీఎం కిరణ్‌పై ఎందుకు మౌనం వహిస్తోందని టీడీపీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు ప్రశ్నించారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. 'కాంగ్రెస్ గేమ్ ప్లాన్‌లో భాగంగానే తెలంగాణ తామే ఇస్తున్నట్లు ఇక్కడ ప్రచారం చేస్తూ తామే అడ్డుకుంటున్నట్లు సీమాంధ్రలో ప్రజలను నమ్మించేందుకు యత్నిస్తున్నారు' అని విమర్శించారు. 'సీఎం ప్రజలను రెచ్చగొడుతున్నారు. తప్పుడు లెక్కలు చెబుతున్న ఆయనపై చీటింగ్ కేసుపెట్టి అరెస్టు చేయాలి. ఆయన చెప్పే అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఒక చేతిలో జగన్‌ను... మరో చేతిలో కిరణ్‌ను పెట్టుకొని ఆటాడిస్తోందని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ ఒక చేతిలో జగన్‌ను... మరో చేతిలో కిరణ్‌ను పెట్టుకొని ఆటాడిస్తోంది........

చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ దిశగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పయనిస్తోందని మైలవరం ఎమ్మెల్యే, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఎంపీ కొనకళ్ళ నారాయణరావు కార్యాలయంలో శనివారం టీడీపీ జిల్లా సమావేశం జరిగింది.


ఈ సమావేశంలో దేవినేని ఉమా మాట్లాడుతూ, చిరంజీవి మాదిరిగానే వైసీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి దాసోహం అయ్యారన్నారు. ఫలితంగానే ఆయనకు బెయిలొచ్చిందని లోకం కోడై కూస్తోందన్నారు. సామాజిక న్యాయం అంటూ రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసినట్టే సమైక్య సంగతులు చెబుతున్న జగన్ పార్టీ కాంగ్రెస్ లో కలసి పోవడం ఖాయమన్నారు.

చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ దిశగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పయనిస్తోంది............

దేశంలో జరుగుతున్న ప్రతి దుష్పరిణామానికీ ప్రధాని మన్‌మోహన్, యూపీఏ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధిలే బాధ్యులు అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు, ప్రధానమంత్రి డాక్టర్ మన్‌మోహన్ సింగ్‌కు ఇక ఎంత మాత్రం పదవిలో కొనసాగరాదనితీవ్రంగా విమర్శించారు. ఆయన ఇక పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతే మంచిది అని ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆర్థిక నేరస్తులను కట్టడి చేయకపోతే దేశం ఎంతో నష్టపోతుందని ఆయన హెచ్చరించారు.
లక్ష కోట్లు తిన్న వ్యక్తికి జైలులో సకల మర్యాదలు చేశారని చంద్రబాబు ఆక్షేపించారు. జగన్‌ను విడిపించడంలో కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ లేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రత్యర్థులపై సీబీఐని ప్రయోగించి బెదిరిస్తారని, తర్వాత వారి పబ్బం గడుపుకుంటారని ఆయన నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుంటే అసలు పట్టించుకోవడం లేదని ఆయన ఆక్షేపించారు. ఆఖరికి కాంగ్రెస్ నాయకులే తమ అగ్ర నాయకత్వం జగన్‌తో ఒప్పందం కుదుర్చుకుందని వారే చెబుతున్నారని ఆయన అన్నారు.
నేషనల్ ఇంటెగ్రేషన్ సమావేశంలో నేను రాష్ట్ర సమస్యను ప్రస్తావిస్తే కాంగ్రెస్ గాని, ముఖ్యమంత్రి గాని ఆ రోజున తమను మాట్లాడనివ్వలేదని, ఆరోజున మాట్లాడింది సొంత సమస్య కాదని ఆయన చెప్పారు. ఆ రోజున తాను మాట్లాడింది ముఖ్యమైన విషయం కాదా అని ఆయన ప్రశ్నించారు. అప్పుడు తాను మాట్లాడితే మాట్లాడనివ్వలేదు, ఇప్పుడు ముఖ్యమంత్రి తానే గుర్తించినట్టు మాట్లాడుతూన్నారని ఆయన దుయ్యబట్టారు.
దేశంలో అన్ని రాజ్యాంగ వ్యవస్థలనూ అన్ని విధాలా నిర్వీర్యం చేస్తున్నారు అని ఆయన విరుచుకుపడ్డారు. దేశంలో పెరిగిపోతున్న అవినీతిపై గొంతెత్తిన ప్రజలను సర్వ శక్తులు ఒడ్డి ఆ ఉద్యమాన్ని నీరుగార్చారంటూ అన్నా హజారే విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నేర చరితుల విషయంలో సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా, దానికి తూట్లు పొడిచేందుకు యత్నిస్తున్నారు. అవినీతిపరులను, నేరచరితులను కాపాడడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా మునిగిపోయింది. గనులు, మద్యం అన్నీ మాఫియాగా తయారైపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఉంటే ఈరోజున సీబీఐని కూడా పాడుచేశారు. సీబీఐని కూడా ప్రక్షాళన చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. ఆకస్మికంగా నిద్ర లేచి, అటువంటిది రాహుల్ ఇప్పుడే జ్ఞానోదయం అయినట్టు మాట్లాడడం విచిత్రంగా ఉందని ఆయన అన్నారు. రూపాయి విలువ పడిపోయింది, ధరలు పడిపోయాయి, ఉపాధి అవకాశాలు పడిపోయాయి. ఈ మొత్తానికి ప్రధాని మన్‌మోహన్ సింగ్, యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధిదే బాధ్యత అని ఆయన మండిపడ్డారు. ఆ రోజున సోనియా చెబితే చేశారు, ఇప్పుడు రాహుల్ ఒక మాట మాట్లాడితే ఇండియాకు వచ్చాక మాట్లాడతాను అంటున్నారు. అసలు ఏం ప్రధాని మీరు ? మీకు ఆ పదవిలో ఉండడానికి అర్హత ఉందా అని ఆయన చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
నేర చరిత్ర గలవారిని కాపాడడంకోసం చేసిన ఆర్డినెన్స్‌ను ఇప్పుడు రాహుల్ ఆక్షేపించడాన్ని ఆయన ఆక్షేపించారు. నేర చరితులు ఎవరైనా సరే పోటీ చేయడానికి వీలులేదని మేము స్పష్టం చేశాం. నేను చాలా రోజుల నుంచి ఈ విషయమే చెబుతున్నాను, అయినా
పార్లమెంటులో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అందరూ వ్యతిరేకించిన తర్వాత ఆర్డినెన్స్ తీసుకువచ్చారు. ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చారని అడుగుతున్నా. రాహుల్ గాంధి ఇన్నాళ్లు ఎందుకు పట్టించుకోలేదు? ఎక్కడ నిద్ర పోతున్నారు? ఈ బిల్లుపై ఇంత చర్చ జరుగుతున్నప్పుడు రాహుల్ ఏం చేస్తున్నారు? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు వచ్చి బిల్లును చింపేయాలని ఆయన అంటున్నాడేమిటని ఆయన ఆక్షేపించారు. మీ వల్ల దేశం మొత్తం భ్రష్టు పట్టించారు, సర్వనాశనం అయిపోయింది. నేరస్థులు జైలులో ఉంటే వారు కూడా పోటీ చేసి చట్ట సభలలోకి వచ్చేటట్టు మీరు చేస్తున్నారు. ఒకటి రెండు కాదు, 15 లక్షల కోట్ల కుంభకోణం దేశంలో జరిగింది. కోల్ గేట్, 2 జి స్పెక్ట్రమ్, రాష్ట్రంలో వైఎస్సార్ చేసిన కుంభకోణం. వీటన్నిటిపైనా రాహుల్ ఎప్పుడైనా మాట్లాడారాఇన్నాళ్లుగా మాఫియాలు దోచుకుంటుంటే ఈయన ఏం చేస్తున్నాడు? ఇలాగే రాబర్ట్ వాధ్రా చేసిన కుంభకోణాలు... దాదాపు 11 వేల కోట్ల రూపాయల విలువైన కుంభకోణాలు జరిగినట్టు ఆయనమీద ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వాన్ని ఉపయోగించుకుని ఇన్ని రకాల కుంభకోణాలు చేస్తుంటే రాహుల్ ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు.
నెగటివ్ వోటు పెట్టమని సుప్రీం కోర్టు చెప్పింది. ఇష్టం లేని అభ్యర్థులను ప్రజలు త్రోసిపుచ్చే అవకాశం ఇప్పుడు వచ్చింది. సమాజంలో మాఫియాలు తయారయ్యాయి. ఆర్థిక సంస్కరణలు వచ్చాక పెద్ద ఎత్తున డబ్బు వస్తోంది. దీన్ని అరికట్టాలి. మీరు సుప్రీం కోర్టు తీర్పును గౌరవించి చట్టసభలను బలోపేతం చేయవలసింది పోయి దానికి తూట్ల పొడుస్తున్నారని ఆయన విమర్శించారు.

అసలు ఏం ప్రధాని మీరు ? మీకు ఆ పదవిలో ఉండడానికి అర్హత ఉందా?

సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నడిపించే కాంగ్రెస్సే అని, సీఎం కిరణ్‌ను హైకమాండ్ నడిపిస్తోందని తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ ఇరుప్రాంతాలను రెచ్చగొట్టే విధంగా కిరణ్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎం కిరణ్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని, ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి సీఎంపై కేసు పెట్టి అరెస్ట్ చేయాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.


తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేశారని ఆరోపించారు. అబద్దాలు మాట్లాడి సీమాంధ్రుల మెప్పుపొంది సమైక్యాంధ్ర హీరో కావాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఆనాడు రోశయ్యతో ఈనాడు కిరణ్‌తో కాంగ్రెస్ డ్రామాలాడిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌కు చిత్తశుద్ది ఉంటే సీఎం కిరణ్, బొత్సలను బహిష్కరించాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు.

అబద్దాలు మాట్లాడి సీమాంధ్రుల మెప్పుపొంది సమైక్యాంధ్ర హీరో కావాలనుకుంటున్నారా ..........

September 27, 2013

జగన్ పర్యటనల గురించి వైసీపీ ముందే ప్రకటనలు చేస్తోందని, దీన్ని బట్టి చూస్తే హైదరాబాద్ వదిలి వెళ్లరాదన్న నిబంధనలను కోర్టు సడలిస్తుందని వైసీపీకి ముందే తెలుసా అని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. విభజన తీర్మానం ఆమోదం పొందడం కోసమే వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని ఆయన ఆరోపించారు. విభజనకు సహకరిస్తున్న జగన్ పార్టీలో కాంగ్రెస్ నేతలు ఎలా చేరతారని యనమల ప్రశ్నించారు.


జగన్ విభజనకు ఒప్పుకున్నందునే హైకమాండ్ కేబినేట్‌నోట్‌ను వేగవంతం చేసిందన్నారు. పొత్తుల గురించి ప్రస్తుతం టీడీపీ ఆలోచించడంలేదని, తెలుగు జాతి మధ్య ఏర్పడ్డ సమస్యను ఎలా పరిష్కరించాలన్నదే తమ ఎజెండా అని ఆయన తెలిపారు. వ్యతిరేక ఓటు విధానం ఉండాలన్న సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నామని, ఈ మేరకు చట్టాలలో సవరణ చేయాలని యనమల కోరారు.

హైదరాబాద్ వదిలి వెళ్లరాదన్న నిబంధనలను కోర్టు సడలిస్తుందని వైసీపీకి ముందే తెలుసా......?

వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు ఆమోదించుకునేవాళ్లని అయితే రాజీనామాలపై ఏబీఎన్‌లో వచ్చిన కథనంతో వైసీపీ తోకముడించదని టీడీపీ నేత దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏబీఎన్ -ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ తెలుగు జాతిని చీల్చడానికి కాంగ్రెస్ పెద్దలు ఎవరు అని ఆయన ప్రశ్నించారు.


దొంగలంతా కలిసి రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నారని, కాంగ్రెస్ ఎంపీలు చవట దద్దమ్మలని దేవినేని మండిపడ్డారు. కాంట్రాక్టులకు ఆశపడి సోనియాకు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు. సీమాంధ్ర నేతలు చేతులు కాలాక ఇవాళ ఏడిస్తే ఏం లాభమని దేవినేని ఎద్దేవా చేశారు.

కాంట్రాక్టులకు ఆశపడి సోనియాకు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు.

September 26, 2013

అతిభయంకర ఆర్థిక చోర బిరుదాంకిత యైన వైఎస్‌ జగన్‌ నటించిన జగన్‌ (అత్తారింటికి) జైలుకు దారేది సినిమా, విభజించి పాలిం చుటలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన సోనియా గాంధీ దర్శకత్వంలో, ఈ సినిమా నిర్మాణం చేసుకొని, నేడే విడుదల అయ్యిందని, ప్రతిఒక్కరూ ఈ సిమాను చూడాలని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి

గురువారం ఎన్టీర్‌ భవన్‌లో పత్రికా ప్రతినిధులతో రామయ్య మాట్లాడుతూ అత్తారింటికి (జైల్‌కు)దారేది సినిమా బాగా ఆడుతుందని భావించినా పైరసీ దెబ్బతో ప్లాఫ్‌ అయి, డీలా పడ్డాడని తెలిపారు. ఇక నుంచి సోనియా డైరెక్షన్‌ లేకుండా జగన్‌ యాక్షన్‌ చేయగలనని ధైర్యంగా చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. కడప, ఢిల్లీకి మధ్య, ఇడుపులపాయకు, 10జన్‌పథ్‌కు మధ్య, సోనియాకు, జగన్‌కు మధ్య పోటీ అని వైకాపా నేతలు, విజయమ్మ చెప్పగలరా అని ప్రశ్నించారు.
బుధవారం రాత్రి వరకు తమ రాజీనామాను గురువారం ఆమోదించుకుంటామని చెప్పిన వైకాపా, తెల్లవారే సరికి ప్లేట్‌ ఫిరాయించారని, సోనియా సూచనల మేరకు శాసన సభను సమావేశ పరచమని వైకాపా నేతలు కోరుతున్నారని తెలిపారు.సోనియా ఆడుతున్న నాటకంలో జగన్‌, వైకాపాలు పాత్రదారులని తెలిపారు. సోనియా చేతిలో జగన్‌ భవిష్యత్‌ ఉందన్నారు.అందుకే సోనియా చెప్పినట్లు జగన్‌ నడవాల్సిందేనన్నారు.

ఈ విషయాన్ని రాష్ర్ట ప్రజలు అర్ధం చేసుకున్నారని రామయ్య తెలిపారు. రాష్ట్రంలో 13 జిల్లాలకే పరిమితమైన జగన్‌ సమైక్య వాదినని ఎలా చెప్పగలడన్నారు. విభజనకు బాటలు వేసిందే వైకాపా వారని, ఇప్పుడు సమైఖ్యమని డ్రామాలు ఆడుతున్నారన్నారు. సీమాంధ్ర ఉద్యోగుల నేత అశోక్‌ బాబుకు కోపం వస్తుందన్న భయంతో జగన్‌ సమైక్య బాట పట్టారని విమర్శించారు. రాజినామాలు ఇచ్చిన మీరు, అసెంబ్లీని సమావేశ పరచమని ఏ ముఖ్యం పెట్టుకొని అడుగుతారని ఆయన ప్రశ్నించారు. సోనియా డైరెక్షన్‌ ప్రకారమే అసెంబ్లీలో తీర్మానం పెట్టమని అడుగుతున్నారని తెలిపారు.అసెంబ్లీలో ఏ తీర్మానం జరిగినా రాష్ట్ర విభజన ఖాయమని కాంగ్రెస్‌ పెద్దలు చెపుతున్నారని రామయ్య తెలిపారు.ఇలాంటి సమయంలో అసెంబ్లీని సమావేశ పరచాలని జగన్‌ సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నాడని తెలిపారు.సోనియాకు పెద్దకొడుకు కెసిఆర్‌, చిన్నకొడుకు జగన్‌ అని, కాంగ్రెస్‌ రాష్ట్రంలో బ్రతికి బట్టకట్టదని తెలసుకున్న సోనియా కెసిఆర్‌, జగన్‌లతో క్విడ్‌ప్రోకోకు పాల్పడుతుందన్నారు.

తెలుగు దేశం బలపడితే తన ఆటలు సాగవని సోనియా ఈ కుట్రలకు పాల్పడుతుందని తెలిపారు.తనను ఆదు కుంటాడనే సోనియా జగన్‌ను బైటకు తీసుకు వచ్చిం దన్నారు.జగన్‌ బైటకు రావటంలో కోర్టులది తప్పులేదని, సీబీఐ వ్యవహారంపై అనుమానాలు ఉన్నాయన్నారు. జగన్‌ బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ ఏమాత్రం కోర్టును అడగలేదన్నారు.సీబీఐ తన స్థాయిన దిగజార్చుకుందని రామయ్య తెలిపారు.గతంలో జగన్‌ అ్ర మాస్తులు కేసులో సూట్‌కేసు కంపెనీలు ఉన్నాయని చెప్పిన మీరు, ఆ కంపెనీ సూట్‌కేసులను 10జన్‌పథ్‌కు, లోటాస్‌ పాండ్‌కు పింపించారా అని రామయ్య ప్రశ్నించారు.

రాజ్యాంగం, చట్టం,న్యాయం ప్రకారం సీబీఐ దర్యాప్తు చేయలేదన్నారు.వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, జగన్‌లు లగ్జంబర్గ్‌లో నెలకొల్పిన ఏషియా ఇన్‌ఫ్రాస్ట్రక్షన్‌,సికార్‌ సంస్థ కోటి రూపాయలతో ప్రారంభించి, 5 సంవత్స రాలలో వెయ్యి కోట్లు రూపాయలు ఎలా సంపాదించారో తెలపాలన్నారు.సీబీఐ దర్యాప్తు కోరిన వెంటనే ఆ కంపెనీని మూసివేశారని తెలిపారు. మారిషన్‌లోని 2కంపెనీ క్యాపిటల్‌ ప్లూరీ ఎమర్జింగ్‌ కంపెనీల నుండి నేరుగా 1246 కోట్లు జగన్‌ కంపెనీలోకి వచ్చాయన్నారు.ఇలాంటి కంపెనీల మీద సీబీఐ దర్యాప్తు చేయాల్సిన బాధ్యత లేదా అని రామయ్య ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో కిరణ్‌ అసమర్ధ పాలన మూలంగా ప్రజలు అనేక ఇబ్బందుల పడుతున్నారని తెలిపారు.
వర్ల రామయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇది మామూలు సినిమా కాదని, సోనియా గాంధీ దర్శకత్వంలో.. అదిభయంకర చోర సామ్రాట్‌ వైఎస్‌ జగన్‌ హీరోగా నటించగా, విలన్‌గా నటబీభత్స అంబటి రాంబాబు, కథ దిగ్విజయ్‌ సింగ్‌, స్క్రీన్‌స్లే అహ్మద్‌ పటేల్‌, ఎగస్ట్రా ఆర్టిస్టులుగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, ఎం.పి.లు నటించగా, ప్రత్యేక క్యారక్టర్‌ ఆరిస్టు, ఏ పార్టీలోనైనా ఇమిడి పోగల శోభానాగిరెడ్డితో చంచల్‌గూడ జైల్‌, లోటాస్‌పాండ్‌, టెన్‌జన్‌పథ్‌, ఇడుపుల పాయ, నాంపల్లి తదితర ప్రాంతాలలో లక్ష కోట్ల రూపాయల బడ్జెట్‌తో, 16 నెలలుగా నిరంతరం షూటింగ్‌ నిర్వహించిన అద్బుతమైన సినిమా పైరసీ బారిన పడిందని, సోనియా, జగన్‌ డీల్‌ను తెలుగు దేశం పార్టీ బైట పెట్టింద వర్ల తెలిపారు.

సోనియా దర్శకత్వంలో ...‘జగన్‌ జైలుకు దారేది’పూర్తి !!!

 యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ కనుసన్నల్లో దిగ్విజయ్, మొయిలీ నడుస్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమా విమర్శించారు. బొత్స, జగన్ కుట్ర చేస్తున్నార ని మండిపడ్డారు. జగన్ కుట్రలు, కుతంత్రాలను బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. సమైక్య రాష్ట్రం కోసం ఏ త్యాగాలకైనా సిద్ధమని వెల్లడించారు. ఉద్యమం చేస్తున్న ఉద్యోగులకు అండగా ఉంటామని దేవినేని ప్రకటించారు.

జగన్ కుట్రలు, కుతంత్రాలను బట్టబయలు చేస్తా.......

తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ ఎప్పుడూ దెబ్బతీస్తోందని టీడీపీ నేత కావూరి సాంబశివరావు ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ 20 రాష్ట్రాల్లో విభజనవాదం ఉన్నా పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్‌నే విచ్చిన్నం చేయాలనుకోవడం కుట్రే అని మండిపడ్డారు. రాహుల్‌ను ప్రధాని చేయడానికే విభజన ప్రకటన చేశారని, రాష్ట్రంలో కాంగ్రెస్‌కు నూకలు చెల్లాయని విమర్శించారు.

కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభం నెలకొందన్నారు. రాష్ట్రాన్ని విభజించాల్సిన అవసరం కాంగ్రెస్‌కు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. వైసీపీ సమైక్యాంధ్ర ముసుగురు ప్రజలు గమనించాలని సూచించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో ఉద్యమం ఉధృతమవుతోందని, నిర్ణయం వెనక్కి వెళ్లే వరకు ఉద్యమం కొనసాగుతుందని కోడెల తెలిపారు.
 courtessy: andhrajyothy

20 రాష్ట్రాల్లో విభజనవాదం ఉన్నా పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్‌నే విచ్చిన్నం చేయాలనుకోవడం కుట్రే

September 25, 2013

మోదీ.. బాబు.. కలుసుకుంటారా?



గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఒకే వేదికపై కలుసుకొంటారా? ఒకరినొకరు పలకరించుకుంటారా? ఢిల్లీలో జరిగే ఒక రాజకీయేతర సమావేశంలో ఈ సన్నివేశం చోటు చేసుకోనుందా? అనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. 'సిటిజన్స్ ఫర్ అకౌంటింగ్ గవర్నెన్స్' అనే స్వచ్ఛంద సంస్థ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2నఢిల్లీలోని త్యాగరాజ స్టేడియంలో విద్యార్థులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ భేటీ ప్రారంభోపన్యాసానికి చంద్రబాబును.. ముగింపు ఉపన్యాసానికి మోదీని ఆహ్వానించింది. బాబు ప్రసంగం ఉదయం ఉంటే.. మోదీ ప్రసంగం సాయంత్రం ఉంది.

ఈ సమావేశంలో వీరిద్దరూ కలిసి పక్కపక్కన కూర్చుంటారా లేక కనీసం మాట్లాడుకొంటారా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. సమయాలను బట్టి చూస్తే ఈ ఇద్దరూ కలిసి పాల్గొనే అవకాశం లేదని చెబుతున్నారు. కానీ కలవాలని అనుకొంటే మాత్రం ఈ ఇద్దరూ ఈ భేటీని ఒక అవకాశంగా వినియోగించుకొనే చాన్స్ లేకపోలేదనీ అంటున్నారు. విద్యార్థులతో నిర్వహిస్తున్న ఈ సమావేశానికి తాను వెళ్తున్నట్లు చంద్రబాబు తమ పార్టీ నేతలకు తెలిపారు. మోదీ-బాబు సుమారు ఒక దశాబ్ద కాలంగా కలుసుకోలేదు. గుజరాత్ మత కల్లోలాలకు బాధ్యునిగా మోదీని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని అప్పట్లో చంద్రబాబు పట్టుబట్టడం వీరి మధ్య సంబంధాలను తెంచివేసింది. 2004 ఎన్నికలకు ముందు హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగినప్పుడు ఆ పార్టీ ముఖ్యమంత్రులు, ఇతర ముఖ్య నేతలకు చంద్రబాబు ఇక్కడి జూబిలీ హాల్‌లో విందు ఇచ్చారు.

ఆ సమయంలో మోదీ నగరంలోనే ఉన్నా ఆ విందుకు హాజరు కాలేదు. ఇవన్నీ జరిగి పదేళ్లు కావడంతో ఆ సంఘటలన్నీ పాతబడ్డాయి. కొత్త సంబంధాలపై ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. 'పదేళ్ల కిందట ఎలా ఉన్నామో అలాగే ఉండాలా? మార్పులు రావా' అని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ప్రశ్నించారు . కాగా, అక్టోబర్ ఐదో తేదీ నుంచి చంద్రబాబు మలి విడత యాత్ర మొదలు కానుంది. ఈసారి ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్నారు.

ఒకే వేదికపై కలుసుకొంటారా? ఒకరినొకరు పలకరించుకుంటారా?

జాతీయ రాజకీయాల్లో నా పాత్ర పెంచుతా: చంద్రబాబు


వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని భూస్ధాపితం చేసే నిమిత్తం జాతీయ రాజకీయాల్లో తన పాత్ర పెంచాలని అనుకొంటున్నట్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బుధవారం రాత్రి ఆయన ఇక్కడ తన నివాసంలో వరంగల్ జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ తొమ్మిదేళ్ళ పాలనలో అవినీతి కనీవినీ ఎరుగని స్ధాయికి పెరిగిపోయి దేశం భ్రష్టు పట్టి పోయిందని, ఆ పార్టీని దించకపోతే దేశం సర్వ నాశనమయ్యే పరిస్ధితి వచ్చిందని ఆయన అన్నారు.
'బొగ్గు గనుల కుంభకోణంలో ఫైళ్ళు మాయం కావడంతో ఏకంగా ప్రధాని కూడా సిబిఐ విచారణను ఎదుర్కోవాల్సిన దుస్ధితి వచ్చింది. లక్షల కోట్ల కుంభకోణాలు జరిగినా కాంగ్రెస్ పార్టీ దులుపుకొని తిరుగుతోంది. ఇదే పరిస్ధితి ఉంటే దేశం కుప్పకూలడం ఖాయం. అవినీతి కేసుల్లో నిందితులందరికీ కఠిన శిక్షలు పడేలా చేసి మళ్ళీ ఇటువంటివి పునరావృతం కాకుండా చేస్తేనే మన దేశాన్ని, సమాజాన్ని కాపాడుకొన్నవారం అవుతాం. అది జరగాలంటే కాంగ్రెస్ పార్టీ దిగిపోవాలి. అందుకే జాతీయ రాజకీయాల్లో నా పాత్ర పెంచాలని అనుకొంటున్నాను. మనతో భావసారూప్యం ఉన్న పార్టీలు కొన్ని ఉన్నాయి. వాటిని కూడగట్టి కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను బలోపేతం చేస్తాను. గతంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రతి కాంగ్రెస్ వ్యతిరేక కూటమిలో టిడిపి ప్రధాన పాత్ర పోషించింది. ఈసారి కూడా అటువంటి పాత్రను తీసుకొందాం. అది జరగాలంటే ఇక్కడ రెండు ప్రాంతాల్లో మనం బలంగా ఉండాలి. రెండు వైపులా మెజారిటీ సీట్లు సాధించాలి. ఇదే మన లక్ష్యం' అని ఆయన వారితో అన్నారు.
courtessy: andhrajyothy

లక్షల కోట్ల కుంభకోణాలు జరిగినా కాంగ్రెస్ పార్టీ దులుపుకొని తిరుగుతోంది

బెయిల్‌పై విడుదలైన వైఎస్ జగన్‌ను పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేయడంపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్థిక నేరస్థుడు జగన్‌కు రెడ్‌కార్పెట్‌తో స్వాగతం పలుకుతారా అని ప్రశ్నించారు. జగన్‌కు గవర్నర్ ప్రోటోకాల్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని విమర్శించారు.

పోలీసులు దగ్గరుండి సెక్యూరిటీ కల్పించారని, ఇలా చేస్తే సాక్షుల భయపడరా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. సీబీఐ ఎందుకు బలహీనమతోందన్నారు. కాంగ్రెస్, జగన్, కేసీఆర్ ఒక టీం అని, అందుకే జగన్‌ను కేసీఆర్ పొగుడుతున్నారని వ్యాఖ్యానించారు. టీడీపీ మంచి పార్టీలతో పొత్తు పెట్టుకుంటుందని సోమిరెడ్డి తెలిపారు. సమైక్య ఉద్యమానికి జగన్ నాయకత్వం వహిస్తే ఉద్యమానికి చెడ్డపేరు వస్తుందన్నారు.
జగన్‌కు బెయిల్ వచ్చిన రాత్రి విజయలక్ష్మి సోనియాకు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారన్నారు. రాహుల్ కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చాక రాహుల్ ప్రధాని పదవి చేపట్టేందుకు భయపడ్డారని సోమిరెడ్ది ఎద్దేవా చేశారు.

జగన్‌కు బెయిల్ వచ్చిన రాత్రి విజయలక్ష్మి సోనియాకు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు.......................

సోనియా, జగన్ మధ్య క్విడ్‌ప్రోకో జరిగిందని, రాహుల్‌ను ప్రధాని చేయడానికే కుమ్మక్కయ్యారని టీడీపీ నేతఆరోపించారు. ఢిల్లీలో కాంగ్రెస్, వైసీపీ నేతల భార్యలు కలుసుకున్నట్లు త్వరలో వాళ్ల భర్తలు కలుస్తారని ఆయన వ్యాఖ్యానించా

రాహుల్‌ను ప్రధాని చేయడానికే కుమ్మక్కయ్యారు...........

September 24, 2013

బీజేపీతో పొత్తు పర్యవసానాలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమ పార్టీలో అంతర్గతంగా చర్చకు తెరదీశారు. మంగళవారం రాత్రి ఇక్కడ ఖమ్మం జిల్లా పార్టీ నేతలతో సమావేశమైనప్పుడు ఆయన ఈ అంశంపై వారి అభిప్రాయం కోరినట్లు సమాచారం. 'బీజేపీ మనతో కలిసి వస్తానని అడుగుతోంది. మీ అభిప్రాయం ఏంటి?' అని చంద్రబాబు వారిని అడిగారు. కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉన్న జిల్లా కావడంతో ఖమ్మం జిల్లా నేతలు ఆచితూచి మాట్లాడారు. 'ఖమ్మం సహా రెండు మూడు జిల్లాల్లో కమ్యూనిస్టులకు పట్టు ఉంది. మిగిలిన చోట్ల లేదు. బీజేపీకి గట్టిగా ఏ జిల్లాలోనూ పట్టు లేదు. కానీ, రాష్ట్రం అంతటా అన్నిచోట్లా ఎంతో కొంత ఓట్లు ఉన్నాయి. మీరు రాష్ట్రం మొత్తం మీద పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోండి. మీరు ఏ నిర్ణయం తీసుకొన్నా మేం నిలబడి పనిచేస్తాం' అని వారు చెప్పారు.


మైనారిటీ కోణం గురించి కూడా చర్చ జరిగింది. బీజేపీతో పొత్తు ఉన్నా లేకపోయినా మైనారిటీల ఓట్లు టీడీపీకి పెద్దగా వచ్చే అవకాశం లేదని, మొదటి నుంచి పార్టీతో ఉన్నవారు ఎలాగూ వేస్తారని, మిగిలిన వారివి కాంగ్రెస్‌కు వెళ్ళే అవకాశం ఉందని కొందరు నాయకులు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు మాత్రం తన అభిప్రాయం ఏదీ చెప్పకుండా వ్యూహాత్మకంగా మాట్లాడారు. 'ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉంది. పొత్తులపై మనం అప్పుడే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. మున్ముందు పరిస్ధితులు ఎలా రూపుదిద్దుకొంటాయో చూసి దానిని బట్టి నిర్ణయం తీసుకొందాం. పొత్తు ఉన్నా లేకపోయినా... మనతో ఎవరు కలిసి వచ్చినా... ఎవరూ రాకపోయినా మనం సొంతంగా గెలవటానికి తగిన వ్యూహంతో వెళ్ళాలి. ఆ దిశగా పనిచేయాలి.

రాష్ట్రం ఒకటిగా ఉన్నా, రెండుగా విడిపోయినా రెండు ప్రాంతాల్లో మనం బలంగా ఉండాలి. రెండువైపులా గెలవాలి. కాంగ్రెస్ ఒకవైపు టీఆర్ఎస్‌ని, రెండోవైపు వైసీపీని కలుపుకొని బలపడాలని చూస్తోంది. టీఆర్ఎస్‌ను విలీనం చేసుకొంటుంది. వైసీపీని తాను ఎలా ఆడిస్తే అలా ఆడే పరిస్థితిలోకి తెచ్చుకొంది. ఇప్పుడు బెయిల్ వచ్చినా రేపు తేడా వస్తే ఈడీని రంగంలోకి దించి మరోసారి జైలుకు పంపిస్తామని అంతర్గతంగా హెచ్చరికలు జారీ చేసింది. ఆ పార్టీ గేమ్ ప్లాన్‌ను అమలు చేయడం తప్ప జగన్‌కు ఇప్పుడు మరో ప్రత్యమ్నాయం లేదు' అని ఆయన పేర్కొన్నారు. రెండు ప్రాంతాల్లో రెండు పార్టీలను ముందు పెట్టుకొని కాంగ్రెస్ ఆటాడుతోందన్న అంశం ప్రజల్లోకి బలంగా వెళ్తే ఆ మూడు పార్టీలు మట్టి కరవడం ఖాయమని, మంచి పాలన కావాలంటే టీడీపీయే శరణ్యమన్న అభిప్రాయాన్ని ప్రజల్లో బలంగా కలిగించాలని ఆయన వారికి సూచించారు.
 

'బీజేపీ మనతో కలిసి వస్తానని అడుగుతోంది. మీ అభిప్రాయం ఏంటి?

 
అక్రమాస్తుల కేసులో వైఎస్ జగన్‌కు సీబీఐ కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై టీడీపీ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈకేసులో 10 చార్జిషీట్లలో 1200 కోట్ల అక్రమాలు జరిగాయని సీబీఐ చెప్పింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ సుప్రీం కోర్టు వరకు వెళ్లినా బెయిల్ రాలేదని, ఇంత భారీగా అక్రమాలకు పాల్పడిన జగన్‌కు బెయిల్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు.
ఈ కేసు మధ్యలో విచారణ అధికారిని ఎలా బదిలీ చేశారని విమర్శించారు. జగన్ బెయిల్‌ను సీబీఐ ఎందుకు అడ్డుకోలేదన్నారు. బెయిల్‌పై వాదనలు జరుగుతున్న సమయంలో హడావుడిగా అఫిడవిట్ దాఖలు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. నాలుగు కేసుల్లో ముద్దాయిగా ఉన్న కార్మెల్ ఏషియాలో క్విడ్‌ప్రోకో లేదని ఎలా చెబుతారన్నారు. జగన్ కేసులో దొంగ, పొలీస్ ఒకటయ్యారని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

నిమ్మగడ్డ ప్రసాద్ సుప్రీం కోర్టు వరకు వెళ్లినా బెయిల్ రాలేదని, ఇంత భారీగా అక్రమాలకు పాల్పడిన జగన్‌కు బెయిల్ ఎలా వచ్చింది

  కాంగ్రెస్‌తో వైసీపీ కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగానే జగన్‌కు బెయిల్ మంజూరైందని తెలంగాణ తెలుగుదేశం ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. మంగళవారం వరంగల్ జిల్లా కేంద్రం హన్మకొండలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడారు. తెలంగాణపై 2008లో తీసుకున్న నిర్ణయానికి టీడీపీ కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్, వైసీపీ, టీఆర్ఎస్ కుమ్ముక్కై టీడీపీనీ టార్గెట్ చేస్తున్నాయన్నారు.


ఈ ప్రాంతానికి చెందిన వేల కోట్లు దాచుకున్న జగన్‌కు బెయిల్ రావడంపై కేసీఆర్ స్పందించకపోవడం . వైసీపీ ఓ గజదొంగ పార్టీ అని, అలాంటి పార్టీతో కేసీఆర్ కుమ్ముక్కవడం ఎంత వరకు సమంజసమన్నారు. పార్టీని విలీనం చేసేందుకు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుంటున్న కేసీఆర్‌కు టీడీపీని విమర్శించే అర్హత లేదని విమర్శించారు. సీమాం«ద్రుల కృషితోటే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, తమకే హైదరాబాద్‌పై హక్కు ఉందని మాట్లాడుతున్న ఏపీఎన్జీవో నేత నోరు దగ్గరపెట్టుకోవాలని హెచ్చరించారు. బతుకుదెరువు కోసం వచ్చారు కదాని కనుకరిస్తే ఇష్టం ఉన్నట్లు మాట్లాడడం సరికాదన్నారు.

నర్సంపేట ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ సీబీఐపై కాంగ్రెస్ ఒత్తిడి మేరకు జగన్‌కు బెయిల్ వచ్చిందని ఆరోపించారు. రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే ధ్యేయంతో కాంగ్రెస్ ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని దుయ్యబట్టారు.

వేల కోట్లు దాచుకున్న జగన్‌కు బెయిల్ రావడంపై కేసీఆర్ స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు