February 25, 2013

సొంత లాభం కొంత మానుకొని పరుల మేల్ తలపెట్టవోయ్.. అన్నారు గురజాడ. ఆ మహాకవి స్ఫూర్తిని అందిపుచ్చుకున్నదా అన్నట్టు ఉంది ఆ గ్రామం. సంపాదనలోనే కాదు.. సంస్కారంలోనూ ముందుగా నల్లూరిపాలెం పేరు చెప్పాల్సిందే. తింటే నేల పాలు.. పంచితే పరుల పాలు అన్నట్టు..తమకు ఉన్నంతలో ఊరి బాగు కోసం గ్రామస్తులు ఆలోచిస్తున్నారు. వాళ్ల ఆలోచన వికసించడానికి దోహదపడిన అనేకానేక విషయాల్లో నాకూ భాగం ఉండటం సంతృప్తినిచ్చింది. ఇప్పుడు ఇది ఆదర్శగ్రామం.

ఆ విషయం ఊళ్లో అడుగుపెట్టగానే అర్థమయిపోతుంది. డ్రైనేజీ వ్యవస్థ నుంచి కొళాయి సదుపాయం దాకా.. ప్రతిదాన్నీ సొంత చైతన్యంతో సమకూర్చుకున్నారు. మెజారిటీ ఉన్నత విద్యావంతులే. అంతేకాదు.. జాతీయ, రాష్ట్ర స్థాయిలో పెద్ద హోదాల్లో ఉన్నారు. ఏనాడూ మాకిది కావాలని చెయ్యి చాపిన చరిత్ర కనిపించదు. కుటుంబ సమస్యల నుంచి ఊరి సమస్యల వరకు, తలా చెయ్యి వేయడమే వారికి తెలుసు. అలాంటి ఊరికి ఊతం ఇవ్వడానికి సర్కారుకు చేతులెందుకు రావో!

ఎంత విచిత్రం..! నల్లూరిపాలేన్ని చూసిన కళ్లతో అరవపల్లిని చూసినప్పుడు కలిగిన భావన ఇది. ఊరూవాడా సమస్యల్లోనే ఉంది. మాదిగవాడలో రోడ్డు కొట్టుకుపోయి రాళ్లుపైకి తేలితే.. కాపుల బజారులో డ్రైనేజీ లీకయి ఇళ్ల ముందుదాకా మురుగు కాలువ ప్రవాహాలే. చిన్నపాటి వర్షాలకు కూడా గ్రామాలు గోదారులవుతున్నాయట.. అదేసమయంలో మంచినీళ్ల కోసం బిందెల పోరూ తప్పడం లేదట. ఎంత విచిత్రమిది! ఊళ్లో పడిన చినుకుని వడిచి పట్టుకొనే సమగ్ర వ్యవస్థ, వ్యూహమేది? ఇంకుడుగుంతల వ్యవస్థ గురించి ఊరిజనం గుర్తు చేశారు. ఈ మాత్రం జ్ఞానం, జ్ఞాపకం హైదరాబాద్‌లో కూర్చున్న మహానుభావులకుంటే పల్లెలిలా వెల్లకిలా పడేవి కావు కదా!

పరుల మేలు కోసం తలో చేయి!

కేసులకు భయపడం
బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా?
నేను రెచ్చగొట్టడం లేదు..
రైతుల కడుపుమంట చెబుతున్నా
ముఖ్యమంత్రిపై కేసు పెట్టాలి
పాదయాత్రలో కాంగ్రెస్‌పై చంద్రబాబు ఫైర్

కాంగ్రెస్ నేతలపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి భగ్గుమన్నారు. రైతుల కడుపుమంటపై మాట్లాడితే కేసులు పెడతామని బెదిరిస్తారా? బ్లాక్‌మెయిల్ చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి బెదిరింపులకు భయపడేది లేదని, రైతుల ప్రయోజనాలు కాపాడటం కోసం జైలుకెళ్లేందుకూ సిద్ధమేనని స్పష్టం చేశారు. ముందు రైతులకు సాగునీరు అందించి ఆ తర్వాత మాట్లాడాలని ఎద్దేవా చేశారు. రేపల్లె నియోజకవర్గంలోని అరవపల్లి నుంచి చంద్రబాబు తన 146వ రోజు 'వస్తున్నా... మీకోసం' పాదయాత్రను సోమవారం కొనసాగించారు.

నల్లూరుపాలెంలో ఎన్టీఆర్, పరిటాల రవీంద్ర విగ్రహాలను ఆవిష్కరించిన చంద్రబాబు తనపై కేసులు పెడతామని కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలకు దీటుగా జవాబిచ్చారు. "రేపల్లె నియోజకవర్గంలోని మోర్లవారిపాలెంలో గీత కార్మికులు పడుతున్న కష్టాలు కన్నీళ్లు తెప్పించాయి. మొక్కజొన్న, మినుము, పెసర పంటలకు ఒక తడి నీళ్లు ఇవ్వకపోతే అవి ఎండిపోయే స్థితికి చేరుకున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాటవరసకు రైతులు వ్యవసాయానికి ఉపయోగించే కొడవలితో రోడ్డెక్కి నిరసన తెలియజేయమన్నాను. దానికి నేనేదో రెచ్చగొడుతున్నట్లు కాంగ్రెస్ నాయకులు గొంతు చించుకుంటున్నారు'' అని చంద్రబాబు ఆక్షేపించారు.

తొమ్మిదేళ్ల కాంగ్రెస్ రాక్షస పాలనలో కరెంటు లేక, సాగునీరు విడుదల కాక రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా పశ్చిమ డెల్టాలో ఒక్క తడి నీళ్లు ఇస్తే ఆరుతడి పంటలు చేతికొచ్చి రైతులు గట్టెక్కే పరిస్థితి ఉంటుందన్నారు. సాగునీటి కోసం ప్రజలు తిరుగుబాటు చేయాలని తాను పిలుపునిస్తే రైతులకు మేలు చేయడం చేతగాని కాంగ్రెస్ పార్టీ తాను రెచ్చగొడుతున్నట్లు పేర్కొంటోందన్నారు. ఇది రెచ్చగొట్టడం కాదని, రైతు కడుపు మంట చెబుతున్నానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టినా తాను భయపడబోనని, రైతుల కోసం తాను ఏమైపోయినా ఫర్వాలేదని తేల్చిచెప్పారు. ఉగ్ర దాడిపై హెచ్చరికలు వచ్చినా నిర్లక్ష్యం చేసిన సీఎం కిరణ్‌పై ఏ కేసు పెడతారని చంద్రబాబు ప్రశ్నించారు.

బసవతారకం స్వగ్రామంలో...
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్ సతీమణి బసవతారకం స్వగ్రామం లో చంద్రబాబు పాదయాత్ర చేయనున్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా అందులో పాల్గొంటారని సమాచారం. కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గంలోని కొమరవోలు గ్రామం చంద్రబాబు రెండో విడత యాత్రా మార్గంలో వస్తోంది. పామర్రు నుంచి గుడివాడ వెళ్లే దారిలో ఈ గ్రామం ఉంది. షెడ్యూలులో మార్పులేమీ లేకపోతే మార్చి 4న ఈ గ్రామం మీదుగా ఆయన వెళ్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.

బాబు వ్యాఖ్యలపై ఫిర్యాదు

హింసను ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పీసీసీ మీడియా అధికార ప్రతినిధి ఎండీ హిదాయత్‌తోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు సోమవారం పాత గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లాలో వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా పేటేరు సభలో చంద్రబాబు "రైతులు, కత్తులు, కొడవళ్లతో... గీత కార్మికులు మోకులతో రోడ్డెక్కి తిరగబడాలి. రైతులను ఈ పరిస్థితికి తీసుకొచ్చిన కాంగ్రెస్‌ను చంపాలి'' అంటూ హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేతలు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.


రైతు ప్రయోజనాల కోసం జైలుకైనా వెళతా

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్ర 146వ రోజు కొనసాగుతోంది. సోమవారం ఉదయం రేపల్లె మండలం అరవమల్లి నుంచి బాబు పాద యాత్రను ప్రారంభించారు. ఆయన వెంట భారీగా పార్టీ శ్రేణులు, అభిమానులు నడుస్తున్నారు.

146వ రోజు చంద్రబాబు పాదయాత్ర ప్రారంభం

రైతులు, గీత కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలపై చంద్రబాబు కన్నెర్ర చేశారు. డెల్టా రైతాంగానికి సాగునీరు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోన్న ప్రభుత్వాన్ని కబడ్దార్... అంటూ హెచ్చరించారు. రైతు, చేనేత, గీత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని..ఈ పరిస్థితికి కారణమైన కాంగ్రెస్‌పై తిరగబడాలని పిలుపునిచ్చారు. రేపల్లె నియోజకవర్గంలోని పేటేరు, మోర్లవారిపాలెం, బేతపూడిలో చేనేత, గీత కార్మికుల కష్టాలను చూసి చలించిన చంద్రబాబు కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆపార్టీని భూస్థాపితం చేయాలంటూ పిలుపిచ్చారు.

రేపల్లె నియోజకవర్గంలోని పేటేరు నుంచి చంద్రబాబు ఆదివారం పాదయాత్రను కొనసాగించారు. పేటేరు, మోర్లవారిపాలెంలో నేత, కల్లుగీత కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను విని చలించిపోయారు. కాంగ్రెస్ నాయకులు దుర్మార్గులని, ఎవడబ్బ సొమ్మని వైఎస్ తన కుమారుడు జగన్‌కు రూ. లక్ష కోట్లు దోచి పెట్టాడని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వాన్‌పిక్ పేరుతో పేదల భూములను కారుచౌకగా ఎకరం రూ. లక్షకు బలవంతంగా లాక్కొని అవే భూములను నేడు రూ. 30 లక్షలకు విక్రయించే పరిస్థితికి వచ్చారన్నారు. రేపటి రోజున వాటి ధర రూ. కోటికి చేరుతుందన్నారు.

కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ దొంగలు బాధితులకు వచ్చిన సాయాన్ని దోచేశారని ఆరోపించారు. ప్రజలు చైతన్యవంతులు కాకపోతే ఆడబిడ్డల నెత్తిన ఉన్న శిరోజాలు కూడా లేకుండా చేస్తారని హెచ్చరించారు. మీరు మోపిదేవి వెంకటరమణను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన మంత్రి అయి వాన్‌పిక్‌లో అక్రమాలకు పాల్పడి చంచల్‌గూడ జైలుకు వెళ్ళాడని, అదే తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ అనగాని సత్యప్రసాద్ ప్రజల మధ్యన ఉన్నాడు. రెండు పార్టీల మధ్యన తేడాని గమనించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు

పేదలకు కిలో రూపాయి బియ్యం అమలు చేయాలని, అలా కాకుండా నగదు బదిలీ పథకం కింద రూ. 13 ఇస్తామంటే కుదరదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రేషన్‌కార్డుదారులందరికీ బియ్యమే ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ 'కసాయి' నమ్మారు 'గొర్రె ఎప్పుడూ కసాయి వాడినే నమ్ముతుంది. వాడే తన ప్రాణాలను బలిగొంటాడని దానికి ఏమాత్రం తెలియదు. అలానే మీరు తొమ్మిదేళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్మి బలైపోతున్నారని' చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మీరు దొంగల చేతికి తాళాలిచ్చారు. నా చేతిలో ఏమి లేదు. ఎన్నికల ఒక్క రోజున నన్ను గుర్తు పెట్టుకొంటే ఐదేళ్లు మీ బాగోగులు చూసుకొంటానని హామీ ఇచ్చారు.

ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ స్తంభింప చేస్తాం రబీలో ఆరుతడి పంటలు వేసిన రైతాంగానికి భగవంతుడు దయతలచి అకాలవర్షం రూపంలో ఒక తడి ఇచ్చాడు. ఇప్పుడు మరో తడి కావాలి. అది కనక ప్రభుత్వం ఇవ్వకపోతే కబడ్దార్..అంటూ హెచ్చరించారు. లేకుంటే ఎక్కడికక్కడ పరిపాలనను స్తంభింప చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

బాబుతో స్వరం కలిపిన ప్రజలు ప్రభుత్వం పెడుతోన్న కష్టాలతో విసిగి వేసారిపోయామని పేటేరు, మోర్లవారిపాలెంలో పలువురు చంద్రబాబు స్వరానికి జత కలిపారు. 'పావలావడ్డీ, వడ్డీలేని రుణాలు అంటూ ప్రభుత్వం మమ్మల్ని నిలువునా మోసం చేసింది. రూ. లక్ష అప్పు తీసుకొంటే రూ. మూడు లక్షలు కట్టాల్సి వస్తోంది. ఇదేనా వడ్డీ లేని రుణాలంటూ' ఆగ్రహం వ్యక్తం చేశారు.

బంగారం తిరిగి ఇప్పిస్తామన్న హామీకి విశేష స్పందన వ్యవసాయం కోసం బ్యాంకుల్లో ఆడబిడ్డల బంగారాన్ని తాకట్టు పెట్టిన వాళ్ల రుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు ఇస్తోన్న హామీకి జిల్లా ప్రజానీకం నుంచి విశేష స్పందన కనిపిస్తోంది. చాలామంది మహిళలు బంగారు నానుతాడు, గొలుసు వంటి ఆభరణాలను తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకొన్నారు. దాంతో వారు మెడలో పసుపుతాడు, కొమ్ము ధరిస్తున్నారు. పాదయాత్రలో ఈ విషయాన్ని గ్రహించిన చంద్రబాబు ఒక అన్నగా, తమ్ముడిగా ఆడవాళ్ల మెడలను తిరిగి బంగారు నగలతో నింపుతానని ఇస్తోన్న హామీకి మహిళలు నీరాజనాలు పడుతున్నారు.

చంద్రబాబు వెంట టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, కొమ్మాలపాటి శ్రీధర్, నక్కా ఆనందబాబు, యరపతినేని శ్రీనివాసరావు, మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, జేఆర్ పుష్పరాజ్, రేపల్లె ఇన్‌చార్జ్ అనగాని సత్యప్రసాద్, పార్టీ జిల్లా నాయకులు మన్నవ సుబ్బారావు, తెనాలి శ్రావణ్‌కుమార్, నిమ్మకాయల రాజనారాయణ, కందుకూరి వీరయ్య, వేములపల్లి శ్రీరామ్‌ప్రసాద్, ముత్తినేని రాజేష్, ములకా సత్యవాణి తదితరులు నడిచారు.

ఖబడ్దార్..


రాష్ట్రంలోని అత్యంత సంపన్నుల్లో ఆ యన ఒకరు... అనేక పరిశ్రమలకు అధిప తి... ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న ఆ యన ఒకరి మాటకు కట్టుబడి ఉంటారు. ఆయనే గరికపాటి మోహనరావు... తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి... చంద్రబాబే శ్వాసగా.. ధ్యాసగా ఆయన వెన్నంటే ఉంటూ వస్తున్నా మీకోసం పాదయాత్రకు సారధ్యం వహిస్తున్నారు. బాబు పాదయాత్ర 145 రోజులుగా ప్రశాంతం గా, ఇబ్బందులు లేకుండా ఓ ప్రణాళిక ప్రకారం సాగిపోవటానికి కారణమైన వ్యక్తుల్లో గరికపాటి ఒకరు.

చంద్రబాబు పాదయాత్ర జరిగే ప్రాంతాల్లో ఎక్కడికక్క డ టీమ్ మొత్తం బస చేస్తుంది. ఆ శిబిరం నిర్వహణను గరికపాటి మోహనరావు చూసుకుంటారు. అక్కడే చంద్రబాబు ఒక బస్సులో నిద్రిస్తే, ఆ పక్కనే మరో బస్సులో గరికపాటి నివాసం ఉంటుంది. బాబు ఉదయం రెడీ అయ్యేలోగా గరికపాటి సిద్ధంగా ఉంటారు. ఈలోగా చంద్రబాబు రాష్ట్ర పార్టీ నేతలతో మాట్లాడాల్సిన పనులు కూడా మోహనరావుకు చెబుతుంటారు. వారితో మాట్లాడి ఆ సమాచారాన్ని తిరిగి చంద్రబాబుకు చెబుతారు.

30 ఏళ్లుగా బాబు వెంటే... ముప్పై ఏళ్లుగా పార్టీలో ఉండి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నా గరికపాటి మాత్రం సింపుల్‌గా ఉంటారు. పార్టీలో ఎన్ని పనులు చేస్తున్నా తెరపై కనిపించే వ్యక్తి కాదు. టీడీపీ నిర్వహించిన యువగర్జన, మహానాడు, బాబ్లీ ఉద్యమంలోనూ గరికపాటి కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉండే ఆయన ఏనాడూ పదవుల కోసం ఆశించలేదు. అసంతృప్తి వ్యక్తం చేయలేదు. పార్టీలో ఏ పని అప్పగిస్తే ఆ పనికి నూరుశాతం న్యాయం చేసేందుకు ఆరాటపడతారు. గతంలో బాబు గొంతు సమస్యతో బాధ పడుతున్న సమయంలోనూ గరికపాటి మోహనరావే బాబు తరపున టెలికాన్ఫరెన్స్ నిర్వహించా రు. 2004లో చంద్రబాబు ఓటమి పాలై గవర్నర్‌కు రా జీనామా పత్రం అందజేసిన సమయంలో అరగంట క్రితం ఎ లా ఉన్నారో(సీఎం) అలా చూసే వరకు మీ వెంటే ఉంటాన ని చంద్రబాబుతో చేసిన వాగ్ధానాన్ని మరచిపోలేదు.

ఆ లక్ష్యం కోసమే చంద్రబాబు చేపట్టిన ఏ కార్యక్రమంలోనైనా ముందంజన నిలుస్తారు. వస్తున్నా మీకోసం పాదయాత్ర ఆరంభం నుంచి బాబుతోనే కొనసాగుతున్నారు. వ్యాపారా లు కుటుంబీకులకు అప్పగించి తాను పాదయాత్రలో పా ల్గొంటున్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన గరికపాటి, వ్యవహార శైలి సాధారణంగానే ఉంటుంది. చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా అందరితో ఇట్టే కలిసిపోతారు. పార్టీలో జూనియర్ల నుంచి సీనియర్ల వరకు గరికపాటి అంటే తెలియనివారు ఉండరు. పబ్లిసిటీకి ఆయన ఆమడ దూరంలో ఉంటారు. పార్టీ జెండా అంటే ఆయనకు ప్రాణం. నాయకుడి మాట శిరోధార్యం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భా వం నుంచి ఆయన పార్టీలో కొనసాగుతున్నారు.

వేధింపులు ఎదురైనా... చంద్రబాబుకు గరికపాటి అత్యంత సన్నిహితుడని గ్రహించిన వైఎస్ అతనిని బాబు నుంచి తప్పించేందుకు సామ,దాన, బేధ దండోపాయాలు ఎన్నో ప్రయోగించారు. బాబు సన్నిహితుల్లో ఎంతోమందికి ఏదొక లబ్ధి చూపించి తమవైపు మార్చుకోగలిగారు. అందుకు గరికపాటి వ్యతిరేకత వ్యక్తంచేయటంతో వేధింపులు ఎదుర్కొన్నారు. ఒక దశలో ఆయనను అరెస్టు చేయించేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఆ సమయంలో గరికపాటి అజ్ఞాతంలో ఉండాల్సి వచ్చింది. తప్పు డు కేసుల్లో అరెస్టు చేయించే ప్రయత్నాలు జరిగినా, మోహనరావు తన పంథా మార్చుకోలేదు. తాను నమ్మిన పార్టీని, తనను నమ్మే నేతను వీడలేదు. .

జిల్లాల్లో ఎక్కడైనా వివాదా లు తలెత్తితో చంద్రబాబు మొదట గుర్తొచ్చే వ్యక్తుల్లో గరికపాటి ఒకరు. అందుకే వివాదరహితుడైన గరికపాటికి ఆయా కీలక బాధ్యతలు అప్పగిస్తుంటారు. రాజ్యసభకు వెళ్లేందుకు మూడు సార్లు అవకాశం వచ్చినా, సామాజిక కారణాల రీత్యా చంద్రబాబు వేరొకరికి కేటాయించినా గరికపాటి బాబు మాటే శిరోధార్యమన్నారు. పదవుల కోసం వెంపర్లాడే ప్రస్తుత తరుణంలో చంద్రబాబు ఆదేశాన్ని తూచా తప్పక పాటిస్తూ రాజ్యసభకు వెళ్లే అవకాశాన్ని వదులుకున్నారు. తనకు ఇది కావాలని ఏనాడు అడగని గరికపాటి, పార్టీలో ఏదీ ఆశించకుండా, ఎటువంటి స్వార్థం లేకుండా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పాదయాత్రకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తూ బాబుతో పాటే ముందుకు సాగుతున్నారు. ఇంచుమించు చంద్రబాబు వయసే ఉన్నా ఎటువంటి అనారోగ్యం లేకుం డా ఉత్సాహంగా ముందుకు నడుస్తున్నారు.. పాదయాత్ర బృందాన్ని నడిపిస్తున్నారు.

పార్టీలోకి ఇలా వచ్చి అన్ని పదవులు, హోదాలు అనుభవించి తమను పైకి తెచ్చిన అధినేతనే తిట్టిపోసే నాయకులకు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పదవులు శాశ్వతం కాదు, వ్యక్తిత్వం ముఖ్యమని నమ్మే గరికపాటి మోహనరావు లాంటి నేత స్ఫూర్తిదాత అనడంలో ఆశ్చర్యం లేదు.

బాబే శ్వాసగా.. ధ్యాసగా..

వస్తున్నా మీ కోసం యాత్రలో భాగంగా రేపల్లె వచ్చిన చంద్రబాబుకు ప్రజలు నీరాజనాలు పట్టారు. ఇసుకపల్లి నుండి రేపల్లెలో ఏర్పాటు చేసిన సభకు వరకు బారులు తీరి స్వాగతించారు. పోటెత్తిన జనానికి అభివాదం చేస్తూ రెండు కిలోమీటర్ల మేర ముందుకు సాగడానికి బాబుకు రెండు గంటల సమయం పట్టింది. పెద్ద సంఖ్యలో మహిళలు తమ అభిమాన నేతను తిలకించేందుకు, వారి కష్టాలు చెప్పుకునేందుకు, మనస్సును తేలిక పరుచుకునేందుకు, సాయం పొందేందుకు రహదారి వెంట వేచిచూశారు.

ఆయన రాక వారి కళ్లలో కొత్త వెలుగులు తెచ్చింది. వారిని పలకరిస్తూ వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ బాబు ముందుకు సాగారు. ఈ సమయంలో కొందరు కన్నీళ్లు పెట్టుకున్నారు. మరి కొందరు అమాంతం బాబు పాదాలపై పడి తమను గట్టెక్కించాలని వేడుకున్నారు. తమ కుటుంబంలో ఒక్కడు అనుకుంటూ వారి బాధలు వెళ్లబోసుకున్నారు. అలాంటి అభాగ్యులందరికీ అండగా తానున్నానని, భరోసా ఇస్తూ బాబు సభా స్థలికి చేరుకున్నారు.

నగరంలోని ప్రకాశం రోడ్డులో ఉన్న నెహ్రూ విగ్రహం వద్ద ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. వారి కష్టసుఖాలు గుర్తు చేస్తూ ఉపన్యసించారు. అసమర్థ కాంగ్రెస్ వల్ల, ఆ పార్టీ నాయకుల అవినీతి వల్ల ప్రజల జీవితాలు కష్టాల్లోకి నెట్టబడ్డాయని పేర్కొన్నారు. ప్రజలకు అండగా ఉండే నాయకులు, ప్రజల మనుషులు ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటారని అందుకు రేపల్లె టిడిపి ఇన్‌ఛార్జి అనగాని సత్యప్రసాదే నిదర్శనమన్నారు. ఆయన మీకు అండగా ఇప్పుడు ఇక్కడే ఉన్నాడన్నారు. మీకు అండగా ఉంటానని మాట ఇచ్చి, ఎన్నికల్లో గెలిచి, మంత్రి పదవి పొంది, వాన్‌పిక్ భూముల కేటాయింపు ద్వారా ప్రజల సొమ్మును దిగమింగిన వ్యక్తి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మీ అందరికీ తెలుసునని అన్నారు.

ప్రజలకు అండగా ఉంటూ సేవ చేసే మనిషిని గుర్తించి అలాంటి వారికి అధికారం కల్పించాలని కోరారు. తెలుగు దేశం హయాంలోనే పులిగడ్డపెనుమూడి వారథి నిర్మాణం జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. దీని వల్ల కలిగే ప్రయోజనాన్ని వివరించారు. ఇప్పుడు తాను ఆ వంతెన మీద గుండా కృష్ణాజిల్లాలోకి ప్రవేశించడం సంతోషంగా ఉందన్నారు. ఇదో చారిత్రాత్మక సంఘటనగా అభివర్ణించారు. అదే విధంగా రేపల్లె సైకిల్‌ను అసెంబ్లీకి పంపితే ఇప్పుడున్న సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ప్రజలు విన్నవించిన తెనాలిరేపల్లె రోడ్ డబుల్ లైన్‌గా విస్తరణ, రైల్వే స్టేషన్ విద్యుతీకరణ, అర్హులైన వారికి ఇళ్ల స్థలాల కేటాయింపు, ఇళ్ల నిర్మాణం, 24 గంటల పాటు విద్యుత్, తాగు నీటి సౌకర్యాలు కల్పిస్తానన్నారు. అదే మాదిరి మత్స్యకార కుటుంబాలకు అండగా నిలిచి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు దాసరి నాగరాజు, పంతాని మురళీధర్, జీవి నాగేశ్వరరావు, కె.రమాశాంతాదేవి, దున్నా జయప్రద, మేకా పూర్ణచంద్రరావు, కేసన వాసు, మాగంటి సాంబశివరావు, జీపి రామారావు, మద్రాసు సాంబశివరావు, అనగాని శ్రీనివాసమూర్తి, వేములపల్లి సుబ్బారావు, డాక్టర్ పూర్ణానంద్, డాక్టర్ ప్రభాకర్‌రావు, ఆలూరి డానియేల్, గుర్రం మురహరిరావు, బెల్లంకొండ చిట్టిబాబు, మండవ తాతాజీ, వెంకటేశ్వరరావు, షేక్ ఖాదర్ బాషా, పరుచూరి రవిబాబు, తాతా ఏడుకొండలు, మాన్యం శివమ్మ, దాసరి కృష్ణకుమారి, గోగినేని శ్రీనివాసరావుపాల్గొన్నారు.

రేపల్లెలో బాబుకు నీరాజనం

రోజురోజుకు ఇనుమడించిన ఉ త్సాహంతో కొనసాగుతు న్న 'వస్తున్నా...మీకోసం' పాదయాత్రపై ప్రజలు పూల వర్షం కురిపిస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారంతో పాదయాత్ర 13 జిల్లాలు, 58 నియోజక వర్గాలు, 961 గ్రామాలలో 146 రోజులు పూర్తయింది. పేరుపేరున పేదల కష్టాలు తెలుసుకుంటూ, ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తూ, జిల్లాలో యాత్ర శరవేగంగా కొనసాగుతుందన్నారు. జనాభిమానాన్ని చూసి చంద్రబాబు మరింత ఉత్సాహంగా మాట్లాడుతున్నారన్నారు.

. అశేష జనవాహిని నడుమ సాగుతున్న ఈ యాత్రలో అధినేత తీరు అందరినీ ఆకర్షిస్తుందన్నారు. చంద్రబాబు అభాగ్యుల కన్నీరు తుడుస్తూ భవితపై భరోసా కల్పిస్తున్నారన్నారు. రాత్రి సమయాలలో గ్రామాలలో ప్రజలు తండోపతండాలుగా జననేతకు అభివాదాలు పలుకుతున్నారన్నారు. ప్రజలకు సుపరిపాలన అందించి వారి యోగక్షేమాల గురించి ఆలోచించే ఏకైక పార్టీ టీడీపీయే అన్నారు. మొక్కవోని ఆత్మ విశ్వాసంతో తెలుగుదేశం పార్టీ లక్ష్యసాధన కోసం కదంతొక్కుతున్న కార్యకర్తలకు అభివాదాలు తెలుపుతున్నట్లు ప్రకటనలో తెలియజేశారు.

పాదయాత్రలో పూలవర్షం

  ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని ప్రజలకు పిలుపు ఇస్తే తమపై కాంగ్రెస్ నేతలు కేసులు పెడతామని బెదిరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అయితే రైతులకు నీళ్లు ఇచ్చి, తమపై కేసులు పెట్టాలని చంద్రబాబు అన్నారు. కత్తులు, కొడవళ్లు రైతుల జీవితంలో భాగమని ఆయన పేర్కొన్నారు.

కేసులు పెట్టండి పర్వాలేదు : చంద్రబాబు నాయుడు