January 1, 2013



శాయంపేట మండలంలో మంగళవారం కొనసాగిన బాబు పాదయాత్రలో తెలుగు తమ్ముళ్లు అవస్థలు పడ్డారు. తమ ప్రియతమ నా యకుడిని దగ్గరనుంచి చూడాలనుకున్న తెలుగు తమ్ముళ్లు పోలీసుల తీరుతో నిరుత్సాహపడ్డారు. వివరాల్లోకి వెళితే.. వస్తున్న మీకోసం అంటూ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్ర మండలంలోని పెద్దకోడెపాక, జోగంపల్లి, మైలారం, శాయంపేట, ఆరెపల్లి గ్రామాల్లో కొనసాగింది. పాదయాత్ర కొనసాగిన గ్రామాల్లో రోడ్డు ఇరుకుగా ఉండటంతో బాబు యాత్ర చేస్తున్న కాన్వాయ్‌లో వెనక, ముందు ఉన్న వాహనాలు, పోలీసుల బందోబస్తుతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. దీంతో యాత్రలో నడుస్తున్న నాయకులను పోలీసులు బలవంతంగా నెట్టివేస్తుండటంతో తమ్ముళ్లు ఇరుకైన రోడ్డుపై నడవడానికి యాతన పడ్డారు. పోలీసుల ఒత్తిడితో నాయకులు రోడ్డుకు ఇరువైపుల గ ల పంట పొలాల వెంబడి నడక సాగించారు.

నిరుత్సాహం..

పాదయాత్రలో పాల్గొనేందుకు చుట్టుపక్కల గల రేగొండ, ములుగు మండలా ల నుంచి వేలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. కాగా, యాత్రలో బందోబస్తు దృష్ట్యా పోలీసులు ప్రవర్తించిన తీరుతో కా ర్యకర్తలు, తెలుగు తమ్ముళ్లు నిరుత్సాహానికి గురయ్యారు. పోలీసులు బాబును దగ్గర నుంచి చూడకుండా రోప్ పార్టీ సిబ్బంది, స్పెషల్ పార్టీ బలగాలు యాత్రలో నడుస్తున్న వారిని లాగేస్తూ హల్‌చల్ చేయడంతో నాయకులు నిరుత్సాహానికి గు రై వారి ఒత్తిడిని తట్టుకోలేక కొంతమంది యాత్ర వెనకవైపుకు వెళ్లిపోయారు. బా బును చూడాలని వ్యవసాయ పనులు వదులుకుని వచ్చినప్పటికి పోలీసుల తీరు తో దగ్గరగా చూడలేకపోయామని పలువురు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేశారు.

బాబు యాత్రలో తమ్ముళ్ళ అవస్థలు





అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై టీడీపీ స్పష్టమైన వైఖరిని ప్రకటించడంతో టీఆర్ఎస్్‌కు ఆ పార్టీ నాయకులకు కాలం చెల్లిందని గుర్తించి మా పార్టీపై, నాయకులపై బురుద చల్లుతున్నారని టీడీపీ స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని నాలుగు మండల పార్టీల అధ్యక్షులు మారబోయిన ఎల్లయ్య, హ్మనంతరావు, వంగ నాగరాజు, హుస్సెన్ నాయక్‌లు ధ్వజమెత్తారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 2008లో ప్రణబ్‌ముఖర్జీకి ఇచ్చిన లేఖకు కట్టుబడి పార్టీలో తెలంగాణ వాదాన్ని ముందస్తు ఎత్తుకున్న కడియం శ్రీహరిని అఖిలపక్ష సమావేశానికి పంపడం అంటేనే టీడీపీ తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉందన్నారు.

అఖిల పక్ష సమావేశానికి ఇద్దరు నేతలు వెళ్ళినప్పటికి ఒక్కటే అభిప్రాయాన్ని వె ళ్ళడించడంతో తెల్లమొఖం వేసిన కేసీఆర్ అసలు వారి వైఖరి ఏమిటో చెప్పని మజ్లీస్, కాంగ్రెస్‌ను నిలదీయకుండా టీడీపీని టార్గెట్ చేయడంలో కుట్ర ఉందన్నారు.

తొమ్మిదేళ్ళు అధికారంలో ఉండి జిల్లాతో పాటు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన కడియం శ్రీహరిని విమర్శించే నైతిక హక్కు టీఆర్ఎస్ శ్రేణులకు లేదన్నారు. 2008 పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్న మాఅధినేత చంద్రబాబును టీడీపీని విమర్శించే స్థాయి మీకు అంతకన్నా లేదన్నారు. ఇప్పటికైనా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై ఏ పార్టీకి చిత్తశుద్ధ్ది ఉందనే వాస్తవాలను గుర్తించి విమర్శిలు మానుకోవాలని లేదంటే పార్టీ, ప్రజలు టీఆర్ఎస్‌కు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి బూర్ల శంకర్, కొంతం శ్రీను, నీల గట్టయ్య, చింత భరత్‌కుమార్, ఉమ్మగోని నర్సయ్యగౌడ్, కునూరు రాజు, సముద్రాల అశోక్, సింగపురం రవి, మాజీ ఎంపీటీసీ యాకూబ్‌పాషా, బాలస్వామి, మల్లారెడ్డిపాల్గొన్నారు.

టీఆర్ఎస్ నాయకులకు కాలం చెల్లింది



టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన పాదయాత్ర దృష్టి కోణాన్ని కాస్త పక్కకు మ ళ్ళించారు. ఎప్పుడూ రైతులు, వ్యవసాయ కూ లీలు, మహిళలు, వృద్ధులు, వికలాంగులను స్ప ర్శిస్తూ యాత్ర సాగించే ఆయన మంగళవారం పాఠశాల పిల్లలపై దృష్టి సారించారు. నూతన సంవత్సరం రోజు కావడంతో ఆటవిడుపుగా వా రితో కొద్దిసేపు ఇష్టాగోష్టి జరిపారు. ఢిల్లీ సంఘటనకు సంతాప సూచనగా కొత్త సంవత్సరం వే డుకలకు బాబు దూరంగా ఉన్నారు. ఈ సంఘటన ప్రభావం ఆడపిల్లలపై ఎలా ఉంది? వారి స్పందన ఏమిటీ?దోషులను శిక్షించే విషయంలో వారు ఏం కోరుకుంటున్నారు? తెలుసుకోగోరారు.

విద్యార్ధినులతో...

పాదయాత్రలో భాగంగా పెద్దకోడెపాక గ్రా మానికి చేరుకున్న చంద్రబాబు గ్రామంలోని జడ్‌పీపీఎస్ఎస్ పాఠశాలను సందర్శించారు. అ ప్పటికే అక్కడ సమావేశ పరిచిన విద్యార్ధినుల తో చంద్రబాబు దాదాపు 30 నిముషాల పాటు ఇష్టాగోష్ఠి జరిపారు. ఢిల్లీ సంఘటనపై విద్యార్ధినులకు ఉన్న అవగాహన, ఆ సంఘటన విషయంలో వారు స్పందిస్తున్న తీరు, వారిలో, వా రి తల్లిదండ్రుల్లో కలిగిన అభధ్రతా భావన గు రించి తెలుసుకునేందుకు గుచ్చి గుచ్చి అడిగా రు. పంటల నష్టం పిల్లల చదువుపై ఎలాంటి ప్ర భావం చూపుతుందో కూడా తెలుసుకునే ప్రయ త్నం చేశారు. ఈ కాలపు ఆడపిల్లలు ఆసలు ఏం చదువు కోవాలనుకుంటున్నారు? ఎం కావాలనుకుంటున్నారు? ప్రస్తుత ప్రభుత్వం తీరుపై వారి అభిప్రాయలు ఎలా ఉన్నాయి? కూడా వా కబు చేశారు. పెద్దలతో పాటు పిల్లలు మనోభావాలను తెలుసుకోవడం ద్వారా మొత్తంగా ప్ర స్తుత కాంగ్రెస్ పాలనలో ఆర్ధిక, సామాజిక స్థితిగతుల ప్రభావం వారిపై ఎలా ఉందో స్థూలం గా బేరీజు వేసుకునే ప్రయత్నం చేశారు.

వేడుకలకు దూరం

కొత్త ఏడాది సందర్భంగా బాబు ఎవరి నుం చి పుష్పగుచ్చాలు తీసుకోలేదు. శుభాకాంక్షలను సైతం స్వీకరించలేదు. తనను కలవడానికి రావద్దని కూడా ఆయన కోరారు. కొత్త సంవత్సరం ఆరంభం రోజును ఆయన సాదాసీదాగా ప్రారంభించారు. ఉదయం 11 గంటలకు బస్సు నుం చి బయటకు వచ్చారు. కార్యకర్తలు తెచ్చిన కేక్ ను కూడా సున్నితంగా తిరస్కరించారు. సర్వమత ప్రార్ధనల్లో మాత్రం పాల్గొన్నారు. గ్లోబల్ అలియాన్స్ ఆఫ్ క్రిష్టియన్ లీడర్ ఆధ్వర్యంలో జి డేవిడ్ శాంతారాజ్ బృందం బాబు క్షేమాన్ని కోరుతూ ప్రార్ధనలు చేశారు.

బస ప్రాంతంలో మరో చోట చంద్రబాబు రాష్ట్ర యువసేన అధ్వర్యంలో కాటూరి శ్రీనివాసాచార్యులు పర్యవేక్షణలో నిర్వహించిన సకల అభ్యుదయ హోమం, మృత్యుంజయ హోమం, నవగ్రహ పూజలో పాల్గొన్నారు. అనంతరం పాదయాత్రను ప్రారంభించారు.

16 కి.మీ. నడక


పరకాల క్రాస్ రోడ్ నుంచి యాత్ర మొదలైం ది. శాయంపేట మండలం పెద్దకోడేపాక, జో గంపల్లి, మైలారం, శాయంపేట, ఆరెపల్లి, ఆత్మకూరు మండలం తిరుమలగిరి, ఆత్మకూరు గ్రా మాల మీదుగా 16కిమీ దూరం చంద్రబాబు పా దయాత్ర సాగించారు. కామారంలో బస చేశా రు. పెద్దకోడెపాక, జోగంపల్లి, మైలారం సభల్లో ప్రజల నుద్దేశించి ప్రసంగించారు. ఆత్మకూరు బహిరంగ సభలో మాట్లాడారు. నాలుగో రోజు కూడా యాత్ర ప్రశాంతంగా ఒడిదుడుకులు లే కుండా సాగింది. బాబు పలుచోట్ల ఆగి పత్తి, వరి చేనుల్లో పని చేస్తున్న రైతులు, వ్యవసాయ కూలీలను పలకరించారు. వారి ఇబ్బందులను ఆడిగి తెలుసుకున్నారు. షరామామూలేగా కరెంట్ సరఫరా ఉండడం లేదని, గిట్టుబాటుధర లభించడం లేదని, ఉపాధి పనులు లభించడం లేదని, గ్రామాల్లో రోడ్లు, కాలువలు, విద్యుద్దీపాల సౌక ర్యం లేదని వివరించారు. తాను మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ పరిష్కారం అవుతాయని చంద్రబాబు హామీ ఇచ్చారు.

విమర్శనాస్త్రాలు

చంద్రబాబు నాలుగవ రోజు పాదయాత్రలో కాంగ్రెస్, టీఆర్ఎస్, వైఎస్ఆర్‌సీ పార్టీల పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.ప్రతీ బహిరంగ స భలో ఈ మూడు పార్టీలనే ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు.పెదకోడెపాక, జోగంపల్లి గ్రామాల్లో బహిరంగ సభల్లో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభు త్వం ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ' ఈ ప్రభుత్వానికి బుద్ది లేదు. ఇది చేతకాని, అసమర్ధ ప్రభుత్వం. చార్జీలు, సర్‌చార్జీలు విధిస్తూ పేద ప్రజల నడ్డి విరుస్తోంది' అన్నారు.

కాంగ్రెస్ పాలనలో అప్పులపాలై న అన్నదాతలు వారు చావడం కాదు. కాంగ్రెస్ ను చంపేయాలి. ఆ పార్టీని కూకటి వేళ్ళతో పెకిలించి బం గాళ ఖాతంలో కలపాలి' అని పిలు పు నిచ్చారు. రాష్ట్రంలో అవినీతి పెచ్చు పెరిగి పోయిందన్నా రు. వైఎస్ఆర్‌సీపీపై ధ్వజమెత్తుతూ ' ఆ పార్టీ జైల్లో ఉండి రాజకీయాలు చేస్తోంది' అని ఎద్దేవ చేశారు. టీఆర్ఎస్‌పైనా విరుచుకుపడ్డారు. ' అ ఖిల పక్ష సమావేశంలో తెలంగాణపై టీడీపీ తన వైఖరిని స్పష్టంగా ప్రకటించింది. టీడీపీ విధానాన్ని అందరూ అభినందిస్తుంటే టీఆర్ఎస్ గుండెళ్ళలో పరుగెత్తుతున్నాయి. దిక్కుతోచని స్థితిలో ఆ పార్టీ తప్పుడు ఆరోపణలు చేస్తోంది. ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు సీట్లు రావాలి. దానిని అ డ్డంపెట్టుకొని నాలుగు డబ్బులు సంపాదించుకోవాలి. ఇదీ పార్టీ సిద్ధాంతం అంటూ విమర్శలు కురిపించారు. నగదు బదిలీ పథకం పేరుతో ప్ర భుత్వం పేదల పొట్టకొడితే సహించేది లేదన్నారు.

ప్రత్యర్థిపై నిప్పులు కురిపిస్తూ..



టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతోనే సామాజికతెలంగాణ సాధ్యమని టీ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో ఆయన విలేఖరు ల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్న 'వస్తు నా మీ కోసం' యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. తెలంగాణపై టీడీపీ స్పష్టమైన వైఖరి వెల్లడించడంతో కేయూ, ఓయూ జాక్ నేతలు, ప్రజా సంఘాల జేఏసీ నాయకులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సం ఘాల నాయకులు సాదర స్వాగతం పలుకుతున్నారన్నారు. అయితే టీఆర్ఎస్‌లోగుబులు ప్రారంభమైందన్నారు.

ఇన్నిరోజులు సెంటిమెంట్‌ను అడ్డంపెట్టుకొని కేసీఆర్ కుటుంబీకులు కోట్లా ది రూపాయలు కూడపెట్టుకున్నారని ఆరోపించారు. టీడీపీ మాత్రమే అఖిల పక్ష సమావేశానికి బీసీ, ఎస్సీ కులానికి చెందిన వారిని ప్రతినిధులుగా పంపి సామాజిక న్యాయం పాటించిందన్నా రు. కాంగ్రెస్, వైసీపీ, సీపీఎం, బీజేపీ పార్టీలు అగ్రవర్ణాలను ప్రతినిధులుగా పంపాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించిన కేసీఆర్ ప్రతినిధి బృందంలో ఆ వర్గాలకు ఎందుకు చోటు కల్పించలేదని ప్రశ్నించారు. ఇతర పార్టీలన్నీ టీడీపీ నిర్ణయాన్ని స్వాగతిస్తుంటే.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన అహంకారంతో వ్యవహరిస్తున్నారన్నారు. జేఏసీలో మెజార్టీ వర్గం టీడీపీ నిర్ణయంతో హర్షం వ్యక్తం చేస్తోందన్నారు.

2008లో టీడీపీ తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకోలేదని స్పష్టంగా వెల్లడించినట్లు వివరించారు. తమ పార్టీ నిర్ణయంపై సం దేహం ఉంటే పాదయాత్రలో ఎవ్వరూ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. దమ్ముంటే తెలంగాణపై బహిరంగ చర్చకు సిద్ధమేనా? అని సవాల్ విసిరారు. తెలంగాణ ప్రాంతం లో టీఆర్ఎస్‌కు గుణపాఠం తప్పదని ఎర్రబెల్లి హెచ్చరించారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జాటోతు నెహ్రూ నాయక్, రాష్ట్ర రైతు విభాగం ఉపాధ్యక్షుడు ఇమ్మడి లక్ష్మయ్య, టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు లింగాల వెం కటనారాయణగౌడ్, నాయకులు అనుమాండ్ల నరేందర్‌రెడ్డి, మంగళపెల్లి రామచంద్రయ్య, ఇ.శ్రీనివాసరావు, ఎస్.అంకూస్, బీకూ నాయక్, కాలు నాయక్, ఉపేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

చంద్రబాబుతోనే సామాజికతెలంగాణ సాధ్యం



కేసీఆర్.. ఖబడ్దార్
అడ్డంకులు సృష్టిస్తే మీకు, మీ పార్టీకి క్షేమం కాదు
సొంత ప్రయోజనాలకే పార్టీ పెట్టావు
అఖిలపక్షంతోనే మా చిత్తశుద్ధి తేలింది
దాని వల్లే మీ గుండెల్లో రైళ్లు

గులాబీ అధిపతి కేసీఆర్‌పై చంద్రబాబు నేరుగా చెలరేగిపోయారు. అఖిలపక్ష భేటీ అనంతర పరిణామాల్లో తనను, తన పార్టీని దుయ్యబడుతున్న గులాబీ దండుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వరంగల్ జిల్లాలో మూడో రోజు పాదయాత్రలో భాగంగా పరకాలలో జరిగిన సభలో రాజకీయ ప్రత్యర్థులపై నిప్పులు చెరిగారు. "అడ్డంకులు సృష్టిస్తే ఊరుకునేది లేదు. అది మీకు, మీ పార్టీకి క్షేమం కాద''ని హెచ్చరిస్తున్నాం.

అఖిలపక్షంలో తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చినా, సిగ్గులేకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. వైఖరిని చెప్పుకోవడం తప్పేమీ కాదని,దాని కోసం తన పాదయాత్రను దెబ్బతీయాలని చూస్తే మాత్రం సహించేది లేదని తీవ్ర స్వరంతో అన్నారు. " తెలంగాణకు అనుకూలంగా మేం లేఖ ఇవ్వడంతో టీఆర్ఎస్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తెలంగాణలో ఉనికిని కోల్పోతామని భయపడుతోంది. అందుకే పాదయాత్రలో అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నిస్తోంది'' అని విమర్శించారు. పెత్తందార్లు, భూస్వాముల పార్టీగా టీఆర్ఎస్‌ను దుయ్యబట్టారు. సిద్ధాం తాలను వదిలేసి చిల్లర పార్టీగా కొనసాగుతుందని మండిపడ్డారు.

మరోవైపు కిరణ్ సర్కారు విద్యుత్ విధానాన్నీ పాదయాత్రల్లో చంద్రబాబు ఎండగట్టారు. విద్యుత్ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన పాపం కాంగ్రెస్ పార్టీదేనని విమర్శించారు. అంతకుముందు.. వరంగల్ జిల్లా ఇస్సిపేట వద్ద ఆయన సోమవారం పాదయాత్ర ప్రారంభించారు. రంగాపురం, నాగారం గ్రామాల్లో ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

" రైతాంగానికి విద్యుత్ సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది. మా హయాంలో రైతులకు 20 వేల కోట్ల రూపాయల రాయితీ ప్రకటించాం. నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి చేశాం. దీనికి భిన్నంగా కిరణ్ ప్రభుత్వం..రైతాంగంపై రూ.6,500 కోట్ల సర్‌చార్జీలను మోపింది. ముఖ్యమంత్రి అసమర్థ విధానాలతో విద్యుత్ సరఫరా విధానం లోపభూయిష్టంగా మారింది. కరెంట్ బిల్లులు బలవంతంగా ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఇంటి బిల్లు చెల్లించలేకపోతే వ్యవసాయానికి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు'' అని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలుగుదేశం హయాంలో రాష్ట్రం మొత్తం వెలుగులు నిండితే.. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్నంతా అంధకారం చేసిందని విమర్శించారు. 18 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను తాము ఇస్తే.. కిరణ్ అసమర్థ ప్రభుత్వం 18గంటల నిరంతర సరఫరాను నిలిపివేసిందన్నారు. "ఈ ముఖ్యమంత్రి కరెంట్ పరిస్థితిపై సమీక్ష చేయడు. పోనీ సమీక్షించేందుకు విద్యుత్ శాఖకు మంత్రే లేడు. ఇక కరెంట్ సమస్యలు ఎట్లా తీరుతాయి?'' అని ప్రశ్నించారు. కొండా మురళి దంపతులపై వరసగా మూడో రోజు కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "గ్రామానికొక కీచకుడు..నియోజక వర్గానికొక మాఫియా లీడరును వైఎస్ తన పాలనలో తయారుచేశారు.

పెంట్రోల్ బంకులూ వారికే..భార్యాభర్తలు మధ్య పంచాయితీ వస్తే, ఆ సెటిల్‌మెంట్లు వారే చేస్తారు. దేన్నీ వదిలిపెట్టరు' అంటూ నిప్పులుచెరిగారు. కాగా, పరకాల మండలం లక్ష్మీపురంలో కొందరు మహిళలు.. చంద్రబాబు సమక్షంలో జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. చం ద్రబాబు రంగాపురంలో సభలో మాట్లాడిన తర్వాత లక్ష్మీపురం చేరుకున్నారు. గ్రామంలో చేనేత కార్మికుల మగ్గాలను పరిశీలించారు. పెరుక సంఘం వారిని కలుసుకున్నారు. వారితో మాట్లాడుతుండగా, రోడ్డు పక్కన కొందరు మహిళలు జై తెలంగాణ అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేసి వారిని అడ్డుకున్నారు.

బాబు కాలికి గాయం
పరకాల మండలం నాగారంవద్ద చంద్రబాబు కాలువేలికి స్వల్ప గాయమైంది. నడుస్తుం డగా కాలుకు రాయి తగిలింది. నడక సౌకర్యం కోసం కాస్త కత్తించిన బూటుభాగాన్నే రాయి తాకడంతో అక్క డే కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఫిజియో థెరపిస్టుల చికిత్స అనంతరం యాత్ర సాగించారు.

గులాబీ అధినేతపై చంద్రబాబు ఫైర్