May 29, 2013
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జైల్లోనే అన్ని జరిగిపోతున్నాయని ఆయన ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కాంగ్రెసు నేత విశ్వం బుధవారం చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్కు బెయిల్ రాకపోవడంతో ఆందోళనలు చేపట్టడం విడ్డూరంగా ఉందని అన్నారు. జగన్ పార్టీ నిరసనలు చేపట్టడం సిగ్గు చేటు అన్నారు. దొంగలందరు సంఘంగా ఏర్పడి ఇలాగే ధర్నాలు చేస్తే పరిస్థితి ఏమిటన్నారు. హంతకులు, అత్యాచారాలు చేసిన వారు కూడా ఇలాగే ధర్నాలు చేస్తారేమోనని అనుమానాలు వ్యక్తం చేశారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎవరికి వ్యతిరేకంగా ఆందోళన చేసిందో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. బెయిల్ ఇవ్వని కోర్టులకు వ్యతిరేకంగా ధర్నా చేశారా అన్నారు. తెలుగుదేశం పార్టీకి పత్రికలు, టీవి ఛానళ్లు లేవని, కార్యకర్తలే పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలన తెలియని వ్యక్తి అన్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని చూస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి తమ్ముళ్లు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగారని, వాళ్లు ఫైళ్లు తీసుకు వస్తే కిరణ్ సంతకాలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అవినీతిపై ప్రజలు పోరాటం చేయాలని కోరారు. వైయస్ హయాంలో వ్యవస్థలు నాశనమయ్యాయన్నారు.
జైల్లో అన్ని జరిగిపోతున్నాయి వైసీపీపై చంద్రబాబు ధ్వజం వసూళ్లకు పాల్పడుతున్న సీఎం : బాబు
'వస్తున్నా.. మీకోసం' పాదయాత్రకు కొనసాగింపుగా జూలైనుంచి
బస్సుయాత్ర చేపడతామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. పది నెలలపాటు
రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు, ప్రజలను కలవనున్నట్లు ఆయన తెలిపారు.
పాదయాత్ర చేయని చోట్ల బస్సు యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. గండిపేటలో
మహా నాడు రెండోరోజు పార్టీ సంస్థాగత వ ్యవహారాలపై చర్చలో ఆయన మాట్లాడారు.
వచ్చే పదినెలలు పార్టీకి కీలకమని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి
పార్టీ సర్వసన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
బస్సు యాత్రకు సమాంతరంగా పార్టీ యంత్రాంగమంతా ప్రజల్లో ఉండేవిధంగా జూన్
1నుంచి రాష్ట్రవ్యాప్తంగా 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమాన్ని
నిర్వహించనున్నట్లు ప్రకటించారు. "ఇంటింటి కీ వెళ్లండి. అవినీతి,
కుంభకోణాలతో అభివృద్ధి ఎలా దెబ్బతినిపోతోందో.. ప్రజలకు సంక్షేమ
కార్యక్రమాలు ఎలా నిలిచిపోతున్నాయో వివరించండి. మనం గెలిస్తే ఏంచేస్తామో
చెప్పం డి. మన డిక్లరేషన్లలోని అంశాలను వివరించండి. మంచి పాలన కోసం టీడీపీ
అధికారంలోకి రావాలని చాటండి. పార్టీ లో ప్రతి ఒక్కరం ఈ పదినెలలు
రాత్రింబవళ్లు కష్టపడదాం. పార్టీని గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి.
మిమ్మల్ని ఆదుకొనే బాధ్యత నేను తీసుకుంటాను'' అని హర్షధ్వానాల మధ్య
పేర్కొన్నారు.
'పార్టీకి మంచి నాయకులున్నారు. కానీ, విభేదాలు పక్కన పెట్టాలి. భేషజాలు,
ఇగోలు వద్దు. మన కుటుంబంలో తేడాలొస్తే బయటపడకుండా దిద్దుకుంటాం. పార్టీ
లోనూ అలాగే ఉండాలి. అందరినీ కలుపుకొని పోవాలి. అం దరినీ గౌరవించాలి. మనలో
మనం కొట్టుకుంటూ ఓటు వేయాలని కోరితే ప్రజలు హర్షించరు. ఇన్చార్జీలుగా ఉన్న
నేతలు కూడా మారాలి. బాగా పనిచేయాలి. ఇంట్లో పడుకొని గాలి వస్తే
గెలుస్తామనుకుంటే అందరం మునిగిపోతాం. పని చేయని ఇన్చార్జీలను మార్చడానికి
వెనుకాడను.
ఇటీవలి సహకార ఎన్నికల్లో వాటిని పట్టించుకొన్న వారంతా మంచి ఫలితాలు
సాధించారు. వదిలివేసిన వారున్న ప్రాంతాల్లోనే మనకు ఫలితాలు రాలేదు.
కార్యకర్తలకు పదవులు వచ్చే ఎన్నికలను పట్టించుకోకుండా.. మన ఎన్నికలకు
మాత్రం పనిచేయాలంటే వారికి మాత్రం ఏం అవసరం? మనం పట్టించు కోకపోతే వారు
మాత్రం ఎందుకు పట్టించుకుంటారు?' అని వ్యాఖ్యానించారు. కరెంటు చార్జీల
పెంపునకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన 1.80 కోట్ల సంతకాలను
అసెంబ్లీలో ప్రదర్శిస్తామని, తర్వాత సీఎం లేదా గవర్నర్కు సమర్పిస్తామని
చంద్రబాబు తెలిపారు. ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని
కేడర్కు సూచించారు.
'గుర్తు'తోనే స్థానిక ఎన్నికలు
దమ్ముంటే స్థానిక ఎన్నికలను పార్టీ ప్రాతిపదికన నిర్వహించాలని
ప్రభుత్వానికి చంద్రబాబు సవాల్ విసిరారు. ఆయారాం.. గయారాంల కోసం పార్టీ
గుర్తు లేకుండా ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తా రు.
పార్టీ గుర్తుపై ఎన్నికలు నిర్వహిస్తే ఎవరి సత్తా ఏమిటో తేలిపోతుందన్నారు.
స్థానిక ఎన్నికల్లో వెనుకబడినవర్గాలకు 50 శాతం స్థానాలను రిజర్వ్ చేయాలని
డిమాండ్ చేశారు. సహకార ఎన్నికల్లో టీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోయిందని,
వైసీపీ వెలవెలబోయిందని వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నిక ల్లో సైకిల్ జోరు
పెంచాలని, అసెంబ్లీ ఎన్నికల విజయానికి ఈ ఫలితాలతోనే నాంది కావాలని
పిలుపునిచ్చారు.
దోపిడీ దొంగ పక్కన ఎన్టీఆర్ ఫొటోలా?
"ఎన్టీఆర్ చారిత్రక పురుషుడు. శ్రీ వేంకటేశ్వరస్వామి అన్నా,
శ్రీకృష్ణుడన్నా ఆయనే కళ్లలో మెదులుతారు. భవిష్యత్తులోనూ ఎన్టీఆర్ను ఎవరూ
అధిగమించలేరు. అలాంటి ఎన్టీఆర్ ఫొటో పక్కన లక్షకోట్లు దోచుకున్న జగన్వంటి
వ్యక్తు ల ఫొటోలు పెట్టడమా?'' అని చంద్రబాబు ఆగ్రహించారు. ఎన్టీఆర్ ఫొటోను
ఎవరు పెట్టుకున్నా ఫర్వాలేదని, అటువం టి దొంగలు పెట్టుకోవడం దారుణమని
మండిపడ్డారు. అవినీతిని కడిగేసేందుకు, దేశాన్ని ముందుకు తీసుకెళ్ళేందుకు
యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. టీడీపీని మరింత బలోపేతం
చేయడానికి విద్యాధికులంతా ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఫేస్బుక్ వంటి
సామాజిక వెబ్సైట్లను ఉపయోగించుకుని పార్టీలో ఉత్తేజం నింపడంతోపాటు
మేధావులు, విద్యార్థులు, యువతను ఆకర్షిద్దామన్నారు.
ఇక బస్సు యాత్ర జూలైలో ముహూర్తం.. పది నెలలు జనంలోనే
హైదరాబాద్ : జగన్కు బెయిల్ రాలేదని వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టడం సిగ్గు చేటు అని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. దొంగలందరూ సంఘంగా ఏర్పడి ధర్నాలు చేస్తే దేశ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సీఎం కిరణ్కు పరిపాలన అంటే ఏమిటో తెలియదని ఎద్దెవా చేశారు. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకోవాలని సీఎం వసూళ్లు ప్రారంభించారని ఆరోపించారు. కార్యకర్తలే పేపర్లు, చానెళ్లుగా మారి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
వైసీపీ నిరసనలు చేపట్టడం సిగ్గుచేటు:బాబు
హైదరాబాద్ : కాకినాడకు చెందిన పోతుల విశ్వం బుధవారం టీడీపీలో చేరారు. ఆ
పార్టీ చీఫ్ చంద్రబాబు విశ్వంను సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
టీడీపీలో చేరిన పోతుల విశ్వం
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు
సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టై ఏడాది పూర్తయినందున దానిని
నిరసిస్తూ ఆ పార్టీ చేసిన ధర్నాపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా
చంద్రబాబు నాయుడు బుధవారం స్పందించారు. బెయిల్ రాలేదని జగన్ పార్టీ నిరసనలు
చేపట్టడం సిగ్గు చేటు అన్నారు.
దొంగలందరు సంఘంగా ఏర్పడి ఇలాగే ధర్నాలు చేస్తే పరిస్థితి ఏమిటన్నారు. హంతకులు, అత్యాచారాలు చేసిన వారు కూడా ఇలాగే ధర్నాలు చేస్తారేమోనని అనుమానాలు వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎవరికి వ్యతిరేకంగా ఆందోళన చేసిందో చెప్పాలన్నారు. బెయిల్ ఇవ్వని కోర్టులకు వ్యతిరేకంగా ధర్నా చేశారా అన్నారు.
బెయిల్ ఇవ్వకపోతే పిల్ల కాంగ్రెస్ ఆందోళనలు విడ్డూరమన్నారు. తెలుగుదేశం పార్టీకి పత్రికలు, టీవి ఛానళ్లు లేవని, కార్యకర్తలే పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలన తెలియని వ్యక్తి అన్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని చూస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు.
ముఖ్యమంత్రి తమ్ముళ్లు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగారన్నారు. వాళ్లు ఫైళ్లు తీసుకు వస్తే కిరణ్ సంతకాలు చేస్తున్నారని ఆరోపించారు. అవినీతిపై ప్రజలు పోరాటం చేయాలని కోరారు. ముందుంది మంచి కాలం అని ప్రభుత్వం అంటోందని, అలా అంటే ఇప్పుడు ఉన్నది చెడ్డకాలం అనేగా అన్నారు. వైయస్ హయాంలో వ్యవస్థలు నాశనమయ్యాయన్నారు. జైల్లో తాగుడు, బ్లూ ఫిలిమ్స్ చూసే పరిస్థితి ఏర్పడిందన్నారు. కాగా బాబు సమక్షంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కాంగ్రెసు నేత విశ్వం టిడిపిలో చేరారు.
దొంగలందరు సంఘంగా ఏర్పడి ఇలాగే ధర్నాలు చేస్తే పరిస్థితి ఏమిటన్నారు. హంతకులు, అత్యాచారాలు చేసిన వారు కూడా ఇలాగే ధర్నాలు చేస్తారేమోనని అనుమానాలు వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎవరికి వ్యతిరేకంగా ఆందోళన చేసిందో చెప్పాలన్నారు. బెయిల్ ఇవ్వని కోర్టులకు వ్యతిరేకంగా ధర్నా చేశారా అన్నారు.
బెయిల్ ఇవ్వకపోతే పిల్ల కాంగ్రెస్ ఆందోళనలు విడ్డూరమన్నారు. తెలుగుదేశం పార్టీకి పత్రికలు, టీవి ఛానళ్లు లేవని, కార్యకర్తలే పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పరిపాలన తెలియని వ్యక్తి అన్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని చూస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు.
ముఖ్యమంత్రి తమ్ముళ్లు రాజ్యాంగేతర శక్తిగా ఎదిగారన్నారు. వాళ్లు ఫైళ్లు తీసుకు వస్తే కిరణ్ సంతకాలు చేస్తున్నారని ఆరోపించారు. అవినీతిపై ప్రజలు పోరాటం చేయాలని కోరారు. ముందుంది మంచి కాలం అని ప్రభుత్వం అంటోందని, అలా అంటే ఇప్పుడు ఉన్నది చెడ్డకాలం అనేగా అన్నారు. వైయస్ హయాంలో వ్యవస్థలు నాశనమయ్యాయన్నారు. జైల్లో తాగుడు, బ్లూ ఫిలిమ్స్ చూసే పరిస్థితి ఏర్పడిందన్నారు. కాగా బాబు సమక్షంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కాంగ్రెసు నేత విశ్వం టిడిపిలో చేరారు.
దొంగలందరు సంఘంగా ఏర్పడి ఇలాగే ధర్నాలు చేస్తే....
Subscribe to:
Posts
(
Atom
)