May 29, 2013

వైసీపీ నిరసనలు చేపట్టడం సిగ్గుచేటు:బాబు


హైదరాబాద్ : జగన్‌కు బెయిల్ రాలేదని వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టడం సిగ్గు చేటు అని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. దొంగలందరూ సంఘంగా ఏర్పడి ధర్నాలు చేస్తే దేశ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. సీఎం కిరణ్‌కు పరిపాలన అంటే ఏమిటో తెలియదని ఎద్దెవా చేశారు. దీపం ఉన్నప్పుడే ఇళ్లు చక్కబెట్టుకోవాలని సీఎం వసూళ్లు ప్రారంభించారని ఆరోపించారు. కార్యకర్తలే పేపర్లు, చానెళ్లుగా మారి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.