November 2, 2012

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి కె.ఎర్రన్నాయుడు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన జన సందోహం ఎర్రన్నాయుడు శ్రీకాకుళం ముద్దుబిడ్డ అంటూ

ఎర్రన్నాయుడు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి

 తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు 'వస్తున్నా... మీకోసం' పాదయాత్రకు రెండు రోజులు వాయిదా పడ్డాయి. టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఎర్రం నాయుడు మృతి చెందడంతో మహబూబ్‌నగర్ జిల్లాలో యాత్ర చేస్తున్న చంద్రబాబు శుక్రవారం హుటాహుటిన కుటుంబ సభ్యులతో శ్రీకాకుళం జిల్లాకు వెళ్లడంతో యాత్రకు బ్రేక్ పడింది. తిరిగి ఆదివారం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు చంద్రబాబు తెలిపారు.

ఎర్రన్నాయుడి అంత్యక్రియలు మొదట ఈ రోజు అవుతాయని భావించారు. నిమ్మాడలో జరిగే ఎర్రన్నాయుడు అంత్యక్రియల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. చంద్రబాబుతోపాటు ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్ నాయుడు కూడా అంత్యక్రియలకు హాజరవుతారని సమాచారం. ఎర్రన్నాయుడు అంత్యక్రియలు ముగిసిన తర్వాత చంద్రబాబు హైదరాబాద్‌కు రానున్నారు. శనివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు అధికారక లాంఛనాలతో ఎర్రన్నాయుడికి అంత్యక్రియలు జరిపించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.

ఆదివారం నుంచి తిరిగి 'వస్తున్నా... మీకోసం' పాదయాత్ర ప్రారంభం

ఎర్రం నాయుడు ప్రజా నాయకుడు
ప్రజలలో మమేకమైన వ్యక్తి, పదవులకు వన్నె తెచ్చారు
ఆయన మృతి టీడీపీకి తీరని లోటు

 తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఎర్రం నాయుడు మరణ వార్తను జీర్ణించుకోలేక పోతున్నానని, ఆయన ప్రజా నాయకుడని, ప్రజలతో మమేకమయ్యేవారని, కుటుంబంతో కంటే ఎక్కువగా ప్రజలతోనే గడిపేవారని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఆయన ఏ పదవి చేపట్టినా ఆ పదవులకు వన్నె తెచ్చేవారని బాబు కొనియాడారు.

ఎర్రం నాయుడు మరణ వార్త తెలియగానే తన పాదయాత్రను వాయిదా వేసుకుని చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరిదేవి, కుమారుడు లోకేష్ నాయుడుతో కలిసి హుటాహుటిన శుక్రవారం మధ్యాహ్నం శ్రీకాకుళం జిల్లా, నిమ్మాడ చేరుకున్నారు. ఎర్రం నాయుడు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఒక మంచి నాయకుడిణ్ణి కోల్పాయని అన్నారు.

ఎర్రంనాయుడు మృతి పార్టీకి తీరని లోటని, ఒక మంచి నాయకుడు, ఆప్తుడు, సహచరున్ని కోల్పోయామని చంద్రబాబు ఆవేదనంతో తెలిపారు. పార్టీలో ఏదైన కీలక బాధ్యత ఎవరికి అప్పగించాలని ఆలోచన వచ్చినప్పుడు ఎర్రం నాయుడే గుర్తుకు వచ్చేవారని, ఆ పని ఆయనకు అప్పజెప్పితే చిత్తశుద్ధితో పనిచేసేవారని చంద్రబాబు అన్నారు. గంటలో తిరిగి వస్తాను అని కుటుంబ సభ్యులతో చెప్పి వెళ్లిన ఆయన అనంత లోకాలకు వెళ్లిపోయారని కన్నీరుమున్నిరయ్యారు. రేపు అంత్యక్రియలు ఉన్నందున ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్రను వాయిదా వేస్తున్నట్లు బాబు తెలిపారు. ఆదివారం నుంచి పాదయాత్ర మళ్లీ ప్రారంభిస్తానని చెప్పారు..

ప్రజలలో మమేకమైన వ్యక్తి, పదవులకు వన్నె తెచ్చారు,ఒక మంచి నాయకుడు, సహచరున్ని కోల్పోయా చంద్రబాబు ఆవేదన

తెలుగుదేశం పార్టీ నేత, ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఎర్రన్నాయుడు మృతి పట్ల ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ శుక్రవారం సంతాపం తెలియజేశారు. ఎర్రన్నాయుడు మృతి దేశానికి ఎంతో లోటు అని మన్మోహన్ సింగ్ అన్నారు. కేంద్రమంత్రిగా ఆయన చేసిన సేవలు ఎంతో గుర్తింపు పొందాయని సోనియా గాంధీ ఈ సందర్భంగా చెప్పారు.

ఎర్రన్నాయుడు మృతికి కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, దగ్గుపాటి పురంధేశ్వరి, సిపిఎం జాతీయ కార్యదర్శి ప్రకాశ్ కారత్, సీతారం ఏచూరి, తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. బిసిలకు ఎర్ర్నాయుడి మృతి తీరని లోటు అని సీతారాం ఏచూరి అన్నారు.

ఎర్రన్నాయుడి మృతి బిసిలకు తీరని లోటు అని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు అన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంటూనే బిసిల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేశారన్నారు. ఎర్రన్నాయుడి మృతి పట్ల రాష్ట్ర మంత్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

తెలుగుదేశం పార్టీ నేత ఎర్రన్నాయుడు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిపించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి శుక్రవారం ఆదేశించారు. రేపు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.

ఎర్రన్నాయుడు మృతికి కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి, దగ్గుపాటి పురంధేశ్వరి, సిపిఎం జాతీయ కార్యదర్శి ప్రకాశ్ కారత్, సీతారం ఏచూరి, తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. బిసిలకు ఎర్ర్నాయుడి మృతి తీరని లోటు అని సీతారాం ఏచూరి అన్నారు.

ఎర్రన్నాయుడి మృతి బిసిలకు తీరని లోటు అని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు అన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంటూనే బిసిల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేశారన్నారు. ఎర్రన్నాయుడి మృతి పట్ల రాష్ట్ర మంత్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

తెలుగుదేశం పార్టీ నేత ఎర్రన్నాయుడు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిపించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి శుక్రవారం ఆదేశించారు. రేపు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.

 

రాష్ట్రం మంచి నేతను కోల్పోయింది : గవర్నర్ నరసింహన్

ఎర్రన్నాయుడు మృతిపై గవర్నర్ స్పందిస్తూ రాష్ట్రం ఓ మంచి నేతను కోల్పోయిందన్నారు. అలాగే, ఎర్రన్నాయుడు ఓ మంచి పార్లమెంటేరియన్ అని కూడా కొనియాడారు. కేంద్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యునిగా, ఎమ్మెల్యేగా ఎర్రన్నాయుడు చేసిన సేవలను గవర్నర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎర్రన్న మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు గవర్నర్ తీవ్ర ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.


 కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సంతాపం : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

ఎర్రన్నాయుడు దుర్మరణం పట్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రాష్ట్రం ఓ మంచి రాజకీయ నేతను కోల్పోయిందన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు

  శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఒక మంచి అండను కోల్పోయారు:
 తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు


 తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎర్రన్నాయుడు మృతితో శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఒక మంచి అండను కోల్పోయారని ఆయన అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు.  

 ఎర్రన్నాయుడు సుదీర్ఘ కాలం రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో తనదైన పాత్ర:విజయమ్మ

ఎర్రన్నాయుడు మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఎర్రన్నాయుడు సుదీర్ఘ కాలం రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో తనదైన పాత్ర నిర్వహించారని ఆమె అన్నారు. ఎర్రన్నాయుడు కుటుంబ సభ్యులకు వైఎస్ విజయమ్మ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.




ఎర్రన్నాయుడు మృతికి ప్రముఖుల సంతాపాలు...