November 2, 2012

ఎర్రన్నాయుడు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి కె.ఎర్రన్నాయుడు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ముగిశాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన జన సందోహం ఎర్రన్నాయుడు శ్రీకాకుళం ముద్దుబిడ్డ అంటూ
జోహర్లు అర్పిస్తుండగా ఈ కార్యక్రమం జరిగింది.పోలీసులు తుపాకులతో గౌరవ వందనం సమర్పించారు. శ్రీకాకుళం తమ్ముడు అచ్చెన్నాయుడు, ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడు తదితరులు కన్నీరు , మున్నీరుగా విలపిస్తూ ఎర్రన్నాయుడు అంతిమ యాత్రలో పాల్గొన్నారు. టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు, పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు , యనమల రామకృష్ణుడు,హరికృష్ణ తదితర నాయకులు పెద్ద ఎత్తున నిమ్మాడ వెళ్లారు. వారు ఎర్రన్నాయుడు అంత్యక్రియలు ముగిసేవరకు అక్కడే ఉన్నారు. ఎర్రన్నాయుడు స్వగ్రామమైన నిమ్మాడలో ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించారు.
No comments :

No comments :