November 2, 2012

ఆదివారం నుంచి తిరిగి 'వస్తున్నా... మీకోసం' పాదయాత్ర ప్రారంభం

 తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు 'వస్తున్నా... మీకోసం' పాదయాత్రకు రెండు రోజులు వాయిదా పడ్డాయి. టీడీపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఎర్రం నాయుడు మృతి చెందడంతో మహబూబ్‌నగర్ జిల్లాలో యాత్ర చేస్తున్న చంద్రబాబు శుక్రవారం హుటాహుటిన కుటుంబ సభ్యులతో శ్రీకాకుళం జిల్లాకు వెళ్లడంతో యాత్రకు బ్రేక్ పడింది. తిరిగి ఆదివారం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు చంద్రబాబు తెలిపారు.

ఎర్రన్నాయుడి అంత్యక్రియలు మొదట ఈ రోజు అవుతాయని భావించారు. నిమ్మాడలో జరిగే ఎర్రన్నాయుడు అంత్యక్రియల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. చంద్రబాబుతోపాటు ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్ నాయుడు కూడా అంత్యక్రియలకు హాజరవుతారని సమాచారం. ఎర్రన్నాయుడు అంత్యక్రియలు ముగిసిన తర్వాత చంద్రబాబు హైదరాబాద్‌కు రానున్నారు. శనివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు అధికారక లాంఛనాలతో ఎర్రన్నాయుడికి అంత్యక్రియలు జరిపించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
No comments :

No comments :