March 29, 2013

ఉండి : సమయం వచ్చినపుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షరాలు తోట సీతారామలక్ష్మి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో టీడీపీ ఎమ్మెల్యేలు చేపట్టిన దీక్షకు మద్దతుగా ఉండిలో గురువారం దీక్షలను కొనసాగించారు. ఈ దీక్షలను టీడీపీ జిల్లా అధ్యక్షరాలు తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజల సమస్యల ను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైయిందని విమర్శించారు. మండ ల టీడీపీ అధ్యక్ష, కార్యదర్శులు జుత్తుగ శ్రీను, మోపిదేవి శ్రీను మా ట్లాడుతూ పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దవిళి శ్రీను, పోలుబోతు రాము, వనిమ శ్రీనివాస్, యిర్రింకి సత్యనారాయణ, కాగిత సత్యనారాయణ, కొల్లి మహంకాళి, దండు సు బ్బరాజు,బి.రమేష్, పాలకోడేరు మం డల టీడీపీ అధ్యక్షుడు కొత్తపల్లి గోపా ల కృష్ణంరాజు,చలమలశెట్టి సత్యనారాయణ,కాగిత మహంకాళి, కట్టా గంగాధరరావు, కైలా రాజు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెబుతారు..

హన్మకొండ:కరెంట్ కోతలు, చార్జీల పెంపునకు నిరసనగా గురువారం జిల్లా వ్యాప్తం గా తెలుగు దేశం పార్టీ శ్రేణులు నిరాహార దీక్షలు చేపట్టారు. కరెంట్ బిల్లుల ను దహనం చేశారు. 9 నియోజకవర్గా ల్లో ఆందోళన కార్యక్రమాలుజరిగాయి. మిగతా మూడింట్లో శుక్రవారం నిర్వహిస్తారు. జనగామ నియోజవకర్గం పరిధిలో జనగామ, బచ్చన్నపేట మం డలాల్లో టీడీపీ కార్యకర్తలు నిరాహార దీక్షలు చేశారు.

పాలకుర్తి నియోజకవర్గంలో తొర్రూరు, రాయపర్తి, దేవరుప్పుల మండలాల్లో, మహబూబాబా ద్‌నియోజకవర్గంలోని గూడూరు మం డలంలో, నర్సంపేట నియోజవకర్గంలోని చెన్నారావుపేట, నల్లబెల్లి మండలాల్లో, వర్దన్నపేట నియోజకవర్గంలో వర్ధన్నపేటలో, భూపాలపల్లి నియోజకవర్గంలో భూపాలపల్లి మండల కేంద్రంలో, ములుగు నియోజకవర్గం లో ములుగు, ఏటూరునాగారం, కొత్తగూడ మండలాల్లో నిరాహార దీక్షలు జరిగాయి. కరెంట్ కోతలను ఎత్తివేయాలని, చార్జీల పెంపును ఉపసంహరించాలని కోరుతూ నినాదాలు చేశా రు.

దీక్షా శిబిరాల వద్ద ప్లకార్డులను ప్రదర్శించారు. వరంగల్ తూర్పు నియోజకర్గంలో హెడ్‌పోస్టాఫీసు వద్ద టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి గుండు ప్రభాకర్ నేతృత్వంలో కార్యకర్తలు రాస్తారోకో జరిపారు. విద్యుత్ బిల్లులను దహనం చేశారు. కరెంట్‌ను సక్రమంగా సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ఎం డగడుతూ నినాదాలు చేశారు. హన్మకొండ చౌరస్తా వద్ద టీడీపీ అర్బన్ అధ్యక్షుడు అనిశెట్టి మురళీ నాయకత్వంలో కార్యకర్తలు రాస్తారోకో చేశా రు. కరెంట్ బిల్లులను దహనం చేశా రు.

కొందరు నియోజకవర్గ ఇన్‌చార్జీ లు, ముఖ్య నేతలు హైదరాబాద్‌లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్ వద్ద సాగుతున్న నిరవధిక నిరాహార దీక్షా శిబిరంలో పా ల్గొంటున్నందున తమజిల్లాలోని వారి నియోజకవర్గంలో నిరాహారదీక్ష శిబిరంలో దీక్షలను వాయిదా వేసుకున్నా రు. స్టేషన్‌ఘనపూర్, డోర్నకల్ నియోజకవర్గంలో శుక్రవారం జరుగుతాయి. పరకాల నియోజకవర్గంలో ప్రస్తుతం గ్రామ కమిటీల సమావేశాలు జరుగుతున్నందు వల్ల అవి పూర్తయిన తర్వా త దీక్షలను చేపడతారు.

సంతకాల సేకరణ

కరెంట్ కోతలకు, చార్జీల హెచ్చింపుపై ప్రజలను చైతన్యవంతులను చేయడానికి, తద్వారా రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావడానికి ఏప్రిల్ 2 నుంచి 7 వరకు సంతకాల సేకరణను చేపట్టాలని పారీ అధిష్ఠానం పిలుపునిచ్చింది. గ్రామ స్థాయిలో కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి సంతకాలు సేకరిస్తా రు. వీటిని ఏప్రిల్ 9న మండల కేంద్రాలకు ఊరేగింపుగా తీసుకువస్తారు. 11 న నియోజకవర్గాల ఇన్‌చార్జీలకు అప్పగిస్తారు. 18న జిల్లా పార్టీకి అందచేస్తారు. 19న రాష్ట్ర పార్టీకి పంపిస్తారు. 21న హైదరాబాద్‌లో టీడీఎల్‌పీ సమావేశంలో సంతకాల సేకరణపై చర్చిస్తారు. 22న ర్యాలీగా వెళ్ళి గవర్నర్‌కు అందచేస్తారు.

కొత్త భవనంలోకి పార్టీ కార్యాలయం

ప్రస్తుతం హన్మకొండలో ఎన్‌జీవోస్ కాలనీ రోడ్డులో ఉన్న ఈ కార్యాలయా న్ని శుక్రవారం హన్మకొండ హంటర్‌రోడ్‌లో వనవిజ్ఞాన్‌ను ఆనుకొని ఉన్న కొత్త భవనంలోకి మార్చుతున్నారు. ఉదయం 9గంటలకు కార్యాలయ ప్రారంభోత్సవం ఉంటుంది. అనంత రం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ను నిర్వహిస్తారు. ఆ తర్వాత పార్టీ ముఖ్యనేతల ఇష్టాగోష్ఠి కార్యక్రమం ఉంటుంది. అవిర్భాదినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలు, మండల కేం ద్రాల్లో, గ్రామాల్లోని పార్టీ కార్యాలయాల్లో ఆవిర్భావ వేడుకలను ఘనం గా నిర్వహించాలని పార్టీ పిలుపునిచ్చింది.

'విద్యుత్' మంటలు

గజపతినగరం: విద్యుత్ సంక్షోభానికి కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వం వెం టనే గద్దె దిగాలని మాజీమంత్రి పడా ల అరుణ డిమాండ్ చేశారు. విద్యుత్ కోతలు, చార్జీల పెంపునకు నిరసనగా గురువారం టీడీపీ ఆధ్వర్యంలో స్థానిక నాలుగు రోడ్ల జంక్షన్‌లో రహదారి పక్కన రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యు త్ సర్‌చార్జీల పేరుతో చార్జీలు పెంచు తూ వినియోగదారులపై తీవ్ర భారా న్ని మోపడంతోపాటు నాణ్యమైన వి ద్యుత్‌ను అందించడం లేదని అన్నారు. కరెంటు ఎప్పుడు ఉంటుందో , ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు.

గంట్యాడ మాజీ ఎంపీపీ కె. కొండలరావు, ఎస్.పైడిరాజు, గండ్రే డి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ సర్‌చార్జీలు వెంటనే తొ లగించాలని టీడీపీ నియోజకవర్గ నా యకులు కరణం శివరామకృష్ణ డిమాం డ్ చేశారు. పార్టీ కార్యాలయం ఎదుట కార్యకర్తలు, నాయకులతో రిలే నిరాహా ర దీక్ష చేపట్టారు. మాజీ ఎంపీపీ కం ది తిరుపతినాయుడు, త్రినాధరావు,గద్దె రవి. మండల లక్ష్ముంనాయుడు, తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు చెప్పిందే జరిగింది

సాలూరు : కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం వలన ఏర్పడిన విద్యుత్ సం క్షోభంపై చంద్రబాబు చెప్పిందే జరిగిందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ సం ధ్యారాణి అన్నారు. గురువారం స్థానిక జాతీయ రహదారి పక్కన దేశం నాయకులు నిరాహార దీక్షలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్, ఇన్‌చార్జ్ సంధ్యారాణి మాట్లాడారు. విద్యుత్ సమస్యపై చర్చించాలని ప్రతిపక్షనాయకులు, ఇతర పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం చర్చ జరగనివ్వలేదని అన్నారు. ప్రభు త్వ చర్యలకు నిరసిస్తూ ఎమ్మెల్యేలు, నాయకులు నిరాహార దీక్షలు చేపట్టారన్నారు. వారికి సంఘీభావంగా తాము దీక్షలు చేపట్టామని చెప్పారు. శిబిరంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు నిమ్మాది చిట్టి, గిరిచిన్నిదొర, బి విశ్వేశ్వరరావు, బలగ పైడిరాజు, డబ్బి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలి

అనకాపల్లి: విద్యుత్ కోతలు, ఇంధన సర్దుబాటు చార్జీలపేరుతో అదనపు బాదుడు, వచ్చే నెల నుంచి పెంచనున్న విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గురువారం రాత్రి అనకాపల్లిలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడి రత్నాకర్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కాగడాలతో నెహ్రూచౌక్‌లో మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పూర్వకాలంలో ప్రజలు కాగడాలతో కాలం వెళ్లదీసేవారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నాటి రోజులను పునరావత్తం చేస్తున్నదని ఎద్దేవా చేశారు. విద్యుత్ సమస్యలపై తాము చేపట్టిన ఆందోళన ఆరంభం మాత్రమేనని, ముందు ముందు రిలే నిరాహార దీక్షలు, ఆందోళనలు, బంద్‌లు చేస్తామని హెచ్చరించారు.

వచ్చే నెల నుంచి పెరగనున్న విద్యుత్ చార్జీల వల్ల ప్రస్తుతం ఐదు వందల రూపాయల బిల్లు వచ్చేవారికి ఎనిమిది వందల రూపాయలు, వెయ్యి రూపాయలు వచ్చే వారికి 1600 రూపాయల బిల్లు వస్తుందన్నారు. విద్యుత్ బిల్లులు కట్టలేక పేదలు చీకట్లో మగ్గాల్సిన దుస్థితి రాబోతున్నదన్నారు. గ్యాస్ ధర పెంచడం, సబ్సిడీ సిలిండర్లపై కోత విధించడం వల్ల ప్రజలు మళ్లీ కట్టెలపొయ్యిలను ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. విద్యుత్‌చార్జీల పెంపు ప్రతిపాదన విరమించుకునేంత వరకు ఉద్యమం ఆగదని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బుద్ద నాగజగదీశ్వరరావు, మద్దాల రమణబాబు, బొడ్డపాటి చినరాజారావు, బొలిశెట్టి శ్రీనివాసరావు, పొలమరశెట్టి గిరినాయుడు, అక్కిరెడ్డి రమణబాబు, దొడ్డి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.

అచ్యుతాపురం: రాష్ట్రంలో కోతల ప్రభుత్వం నడుస్తోందని టీడీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు దాడి రత్నాకర్ అన్నారు. కోతలకు నిరసనగా గురువారం స్థానిక విద్యుత్ ఉపకేంద్రాన్ని ముట్టడించారు.

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు తొమ్మిది గంటల పాటు నిరంతరాయంగా ఉచిత కరెంటు అందిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రస్తుతం ర్రాష్టాన్ని అంధకారంలోకి నెట్టేసిందన్నారు. సక్రమంగా విద్యుత్ సరఫరా చేయకపోగా ఏప్రిల్ ఒకటి నుంచి గృహవసరాలకు వినియోగించే విద్యుత్ బిల్లులను 60 శాతం పెంచుతుండడం దారుణమన్నారు.

రాజీవ్ యువకిరణాలంటూ లక్షమందికి ఉద్యోగాలిచ్చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఆర్భాటంగా ప్రకటించారని, ప్రస్తుతం విద్యుత్ కొరతకారణంగా ఉన్న ఉద్యోగాలు వూడిపోతున్నాయని ఎద్దేవా చేశారు. కొన్ని కర్మాగారాలు వారానికి మూడు రోజులు పవర్ హాలిడే పేరిట మూసివేస్తున్నాయన్నారు. దీంతో సిబ్బందిని తగ్గించేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

అంతకు ముందు పార్టీకార్యాలయంనుంచి ర్యాలీగా విద్యుత్ ఉపకేంద్రం వరకు వచ్చి ముట్టడించారు. విద్యుత్ బిల్లులను తగులబెట్టారు. కార్యక్రమంలో ఎలమంచిలి నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ లాలంభాస్కరరావు, అచ్యుతాపురం, మునగపాక మండల టీడీపీ అధ్యక్షుడు రాజాన రమేష్‌కుమార్, దాడి ముసిలినాయుడు, కాండ్రేగుల జోగినాయుడు, కె.వెంకటరావు, పి.చిన్నయ్యనాయుడు, మేరుగు అప్పలనాయుడు, ఉమ్మిడి అప్పారావు, గూడేల కనక, రొంగలి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

'విద్యుత్'పై తెలుగుదేశం నిరసన

శంకర్‌పల్లి: విద్యుత్ సమస్య పరిష్కరించటంతో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్‌రాంరెడ్డి అన్నారు. గురువారం రాత్రి శంకర్‌పల్లిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏడు గంటల నాణ్యమైన విద్యుత్‌ను ఇస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రైతులను మోసం చేసిందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకట్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, నర్సింహులుగౌడ్, శ్రీధర్, శ్రీశైలం, పాండు, గోవిందరెడ్డి, శ్రీశైలం, ఆనందం, మహమూద్ తదితరులు పాల్గొన్నారు.

మొయినాబాద్‌లో... మొయినాబాద్: కాంగ్రెస్ పాలనలో గ్రామాలు అంధకారమయ్యాయని టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి అన్నారు. విద్యుత్ సమస్యను పరిష్కరించాలని టీడీపీ ఎమ్మెల్యేలు చేపడుతున్న దీక్షకు సంఘీభావంగా గురువారం రాత్రి మొయినాబాద్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. విద్యుత్ కోత కారణంగా గ్రామాలు అంధకారమయ్యాయని రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. విద్యుత్ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి హన్మంత్‌యాదవ్, నాయకులు గడ్డం వెంకట్‌రెడ్డి, నీలకంఠం, రమేష్, రవియాదవ్, కిషన్, జైపాల్‌రెడ్డి, రంగారెడ్డి, జనార్ధన్‌రెడ్డి, కృపాకర్, మధుయాదవ్, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో... శంషాబాద్: విద్యుత్ సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిరసిస్తూ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు గురువారం మండల కేంద్రం శంషాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అజయ్, సిద్దేశ్వర్ మాట్లాడుతూ విద్యుత్ సరఫరా సరిగాలేక పంటలు ఎండిపోయి రాష్ట్ర రైతాంగం పూర్తిగా నష్టాలకు గురవుతున్నారన్నారు. రైతులను పూర్తిస్థాయిలో ఆదుకుంటామని ఉచితకరెంటు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఉన్న కరెంటు తీసివేస్తుందని ధ్వజమెత్తారు. .

విద్యుత్ సరఫరాను ప్రభుత్వం మెరుగుపర్చేవరకు తాము ఆందోళన చేస్తుంటామని హెచ్చరించారు. వెంటనే సరఫరాను మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముందు ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, సాయి, ప్రేం, శ్రీను, కృష్ణ, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్ సమస్యలపై టీడీపీ ఆందోళన

ఆర్మూర్ అర్బన్: విద్యుత్ కోతలకు నిరసనగా టీడీపీ ఎమ్మెల్యేలు చేపట్టిన దీక్షకు మద్దతుగా ఆర్మూ ర్ తెలుగుదేశం ఆధ్వర్యంలో గురువారం డీఈ కార్యాలయం ఎదుట కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ కోతలతో పంట పొలాలు బీడు భూములుగా మారిపోతున్నాయని విమర్శించారు. ఎన్నికలకు ముందు నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తామన్న ప్రభుత్వం హామీలను విస్మరించిందని విమర్శించారు.

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరంతరాయంగా కరెంటు సరఫరా చేయకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు జీవీ.నర్సింహరెడ్డి, తెలుగు యువత పట్ట ణ అధ్యక్షులు జక్కుల రాజేశ్వర్, గాండ్లసాగర్, చేత న్, పోహర్‌కిరణ్, నూకల ప్రభాకర్‌లు పాల్గొన్నారు.

'కాంగ్రెస్‌కు రైతులే గుణపాఠం చెబుతారు'

భీమ్‌గల్: రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ రైతు సమస్యల్ని విస్మరించి రైతులకు ఇవ్వాల్సిన ఉచిత విద్యుత్ 9 గంటలు నాలుగు గంటలకు కుదించిందని, అయిన విద్యుత్ సరఫరా చేయడం లేదన్నారు. భీమ్‌గల్ మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో మండల కన్వీనర్ గంగాధర్‌గౌడ్ వి లేకరులతో మాట్లాడారు.

నాలుగు రోజులుగా విద్యుత్ సమస్యపై హైదరాబాద్‌లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్‌లో టీడీపీ ఎమ్మెల్యేలు విద్యుత్ సమస్యలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభు త్వం ఏ మాత్రం స్పందించకపోవడం ఎంత వరకు సబబని అన్నారు. కరెంటు సమస్యపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని అన్నారు. ఏడు గంటల విద్యుత్‌ను అందజేస్తామని ప్రకటనలు చేస్తూ నే కనీసం నాలుగు గంటలు కూడా ఇవ్వకపోవడం ఎంత వరకు సమంజస మన్నారు. విద్యుత్ సమస్యపై ప్రభుత్వం దిగిరాకపోతే 1నుంచి ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని అన్నారు వీరితో పాటు మండల టీడీపీ నాయకులు పతాని లింబాద్రి, నాగుల భూమన్న, వీరాచారి, హకీం, ఖలీం ఉన్నారు.

ఎమ్మెల్యేల దీక్ష కు మద్దతుగా కొవ్వొత్తులతో ప్రదర్శన

(నెల్లూరుతెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆవిర్భవించి నేటికి 30 సంవత్సరాలు పూర్త యి 31వ వసంతంలోకి అడుగిడుతోంది. ఈ ప్రస్థానంలో ఆ పార్టీ ఎన్నో ఒడిదుడుకులు చవి చూసింది. చేదు, తీపి జ్ఞాపకాలను పంచింది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌తో జిల్లాకు విడదీయరాని అనుబంధం ఉంది. గ తంలో సినిమా చిత్రీకరణతోపాటు ఎన్నికల ప్రచారం కోసం రథ యా త్రలు నిర్వహించారు. నేటి రాజకీయ ప్రముఖులు అనేక మంది టీడీపీ నుంచే ఓనమాలు దిద్దారు. ముఖ్యంగా ఎన్టీఆర్ మానస పుత్రిక తెలుగుగంగ ప్రాజెక్టు, సోమశిల విస్తరణ పనులు ఎన్టీఆర్ హయాంలోనే మొదలయ్యాయి. బీసీ, బలహీన వర్గాలను ఆకట్టుకుని ప్రతిసారి ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చారు.

కానీ, రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి బోణి కాలే దు. ఈ నేపథ్యంలో శుక్రవారం టీడీపీ ఆవిర్భావ దినోత్సవం జరిపేందుకు పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నారు. ఎందరికో రాజకీయ ఓనమాలు 1982 మార్చి 29న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పేరును ప్రకటించి ప్రచారం సాగించారు. రథయాత్ర చేపట్టి జిల్లా నలుమూలలు సుడిగాలి పర్యటన జరిపారు. 1983 ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ ప్రభంజనం సృష్టించింది. బడుగు, బలహీన వర్గాలు, సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన వారికి పార్టీ టికెట్లు ఇచ్చి రాజకీయ నేతలుగా తీర్చిదిద్దారు.తొలి నుంచి రాజకీయ కుటుంబంగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి, టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా అయి మంత్రిగా పని చేశారు. ఇక నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి పార్టీలో ప్రముఖ వ్యక్తిగా వ్యవహరించేవారు.

ఆ తరువాత ఆయన తనయుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి గత ఉప ఎన్నికల వరకు పార్టీలోనే కొనసాగారు. సర్వేపల్లి ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొమ్మి లక్ష్మయ్యనాయుడు, ఎల్లసిరి శ్రీనివాసులురెడ్డి, వంటేరు వేణుగోపాల్‌రెడ్డి తదితరులు కూడా టీడీపీ నుంచి వచ్చిన వారే. జిల్లా పార్టీ అధ్యక్షులుగా డేగా నరసింహారెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కంభం విజయరామిరెడ్డి పని చేశారు. సుదీర్ఘకాలం జిల్లా అధ్యక్షుడిగా పని చేసి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఓ రికార్డు సాధించారు.

జిల్లాతో విడదీయరాని అనుబంధం సినీ నటుడిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఎన్నో చిత్రాలను నెల్లూరు జిల్లాలో చిత్రీకరించారు. జిల్లాకు చెందిన పలువురు సినీ ప్రముఖులుగా వ్యవహరించడంతో ఎన్టీఆర్‌తో వ్యక్తిగత పరిచయాలు ఉండేవి. ముఖ్యంగా అభిమానులంటేనే ప్రాణపథంగా చూసే ఆయన పార్టీ పెట్టిన తరువాత ఎన్టీఆర్ అభిమానిగా ఉన్న సన్నారెడ్డి పెంచలరెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించారు. అలాగే నెల్లూరుకి చెందిన తాళ్లూరి రమేష్‌రెడ్డి ఎన్టీఆర్ అభిమానిగా వ్యవహరిస్తుండడంతో ఏకంగా మంత్రిని చేశారు.

తెలుగుగంగ ప్రాజెక్టు రూపకల్పనలో జిల్లాకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. సోమశిల విస్తరణ పనులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. జిల్లాలో మొదలైన సారా ఉద్యమానికి సంఘీభావం తెలిపారు.1983లో జరిగిన మహిళా సదస్సుకు స్వయంగా ఎన్టీఆర్ హాజరయ్యారు. నెల్లూరులోనే మద్యపాన నిషేధంపై ఎన్టీఆర్ ప్రకటన చేశారు. ఆయన తరువాత పార్టీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు రైతు పోరు బాటను జిల్లాలోనే ముగించారు. పలు సార్లు కార్యకర్తలతో సమావేశాలు, ఉప ఎన్నికల ప్రచారాలకు చంద్రబాబు విచ్చేసి రోడ్‌షోలు జరిపారు. ఈ 31 ఏళ్ల కాలంలో టీడీపీ ఎన్నో తీపి, చేదు జ్ఞాపకాలను పంచింది.

నేడు కష్టాల్లో పార్టీ ప్రస్తుతం జిల్లాలో టీడీపీకి కష్టాలు మొదలయ్యాయి. 2004 ఎన్నికల్లో బోణి కాకపోయినా 2009లో జరిగిన ఎన్నికల్లో సగానికి సగం ఐదు స్థానాలను జిల్లా ప్రజలు టీడీపీకి కట్టబెట్టారు. వీరిలో కోవూరు ఎమ్మెల్యే పార్టీని వీడి వైసీపీలో కొనసాగుతున్నారు. మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీలో ఉన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడుగా ఉన్న సోమిరెడ్డి తప్పుకుని బీద రవిచంద్రకు ఆ బాధ్యతలు అప్పగించారు. పార్టీ కేడర్‌ను గ్రామ స్థాయిలోకి తీసుకుపోవడంలో పార్టీ శ్రేణులు విఫలమయ్యారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరును పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.

సహకార ఎన్నికల్లో కొందరు పరోక్షంగా అధికార పార్టీకి సహకరించారన్న అపవాదు పార్టీపై పడింది. ఇక రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు సా ధించే దిశగా చేస్తున్న ప్రయత్నాలు కొన్ని నియోజకవర్గాల్లో కొందరు నేతలు వ్యవహరిస్తున్న తీరుతో ఇబ్బందులు తప్పడం లేదు. తెలుగుయువత కార్యవర్గాన్ని ఇంకా నియమించలేదు. కొన్ని అనుబంధ సంఘాల నియామకంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. మ రో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్టీకి దూరమైన వారికి దగ్గరకు చేర్చుకుని గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులు, నేతలు కోరుతున్నారు.

31 వసంతాల టీడీపీ ఎన్నో చేదు..తీపి జ్ఞాపకాలు

విద్యుత్ సమస్యలపై హైదరాబాద్‌లోని పాతఎమ్మెల్యే క్వార్టర్లలో టీడీపీ ఎమ్మెల్యేలు చేపట్టిన దీక్షకు పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు గురువారం సంఘీభావం ప్రకటించారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగాల స్వామిగౌడ్, నాయకులు కంచర్ల భూపాల్‌రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, చిలువేరు కాశీనాథ్, పాల్వాయి రజనీకుమారి మాదగోని శ్రీనివాస్‌గౌడ్, వేనేపల్లి వెంకటేశ్వర్లు, తుమ్మల మధుసూదన్‌రెడ్డి, రియాజ్అలీ, కసిరెడ్డి శేఖర్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యుత్ చార్జీలను తగ్గించకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. దీక్షకు మద్దతుగా జిల్లాలో కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు.

టీడీపీ ఎమ్మెల్యేల దీక్షకు నల్లగొండ జిల్లా నేతల సంఘీభావం

విస్సన్నపేట: నీతివంతమైన రాజకీయాలకు రోల్‌మోడల్‌గా దేశంలో ఒక్క చంద్రబాబు నాయుడే ఉన్నారని జిల్లా తెలుగుదేశం ప్రధానకార్యదర్శి బచ్చులఅర్జునుడు అన్నారు. బుధవారం విస్సన్నపేటలో జరిగిన తెలుగుదేశం పార్టీ సర్వసభ్యసమావేశంలో బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ నేడు కాంగ్రెస్, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ అవినీతిలో పూర్తిగా మునిగిపోయి ప్రజలను కూడా అవినీతి పరులుగా మార్చేప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని కోరారు. నేటి రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిగా నీతివంతమైన రాజకీయాలకు రోల్‌మోడల్‌గా చంద్రబాబు నాయుడే ఉన్నారని అన్నారు. 63ఏళ్ల వయస్సులో పాదయాత్ర చేస్తూ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు చంద్రబాబు చేస్తున్న కృషిని, అలాగే కాంగ్రెస్, వై.ఎస్్.ఆర్ కాంగ్రెస్‌పార్టీల అవినీతిని, నేడు రాష్ట్రంలో ఉన్న దుర్భర పాలనను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి టీడీపీ నాయకులు, కార్యకర్తల పై ఉందని అర్జునుడు అన్నారు. చిన్నచిన్న విభేదాలు పక్కన పెట్టి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందడుగు వేయాల్సిన కీలక తరుణం ఇదేనని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో నియోజక వర్గ ఇన్‌ఛార్జి నల్లగట్లస్వామిదాసు, జిల్లా తెలుగురైతు అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు,రాష్ట్ర తెలుగురైతు కార్యనిర్వాహక కార్యదర్శి నెక్కళపు వెంకటేశ్వరరావు, నూజివీడు పట్టణ పార్టీ అధ్యక్షుడు నూతక్కివేణుగోపాల రావు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మట్టావేణుగోపాల రావు, మాజీ ఎంపీపీ ముత్తంశెట్టి వెంకటేశ్వరరావు,జిల్లా తెలుగుమహిళా నాయకురాలు నాదెండ్ల నాగమ ణి, వీరమాచనేని అమరేంద్ర ప్రసాద్, ఎన్టీ వెంకటేశ్వరరావు,డాబా శ్రీను, నెక్కళపు శంకర్‌రావు పాల్గొన్నారు.

నీతివంతమైన రాజకీయాలకు చంద్రబాబు రోల్ మోడల్

కోహెడ: హైదరాబాద్‌లో టీడీపీ ప్ర జా ప్రతినిధుల నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా కోహెడ టీడీపీ ఆధ్వర్యంలో సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా గురువారం నిర్వహించారు. విద్యుత్ కోత లు, సర్‌చార్జీల పెంపు సబ్‌స్టేషన్ ఎదు ట టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. హుస్నాబాద్ కోహెడ ప్ర ధాన రహదారిపై రాస్తారోకో చేశారు. సుమారు రెండు గంటలకుపైగా రోడ్డు పై బైఠాయించయడంతో వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు. కరెంట్ కో తల ప్రభుత్వ మాకోద్దంటూ నినాదా లు చేశారు.

సక్రమంగా విద్యుత్ సరఫ రా చేసి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఖమ్మం వెంకటే శం, మండల పార్టీ అధ్యక్షుడు సంధి శ్రీనివాస్‌రెడ్డి, తిప్పారపు నాగరాజు, అన్నబోయిన సంపత్, బిట్ల రాజమ ల్లు, అంతటి రాజు, గూళ్ల సతీష్, ఎం కి రణ్, నవీన్‌కుమార్, విక్రమ్, ఆర్ రవీందర్, ఏ రమేష్, కొంరెల్లి, మల్లేశ్‌యాదవ్, సంతోష్‌రెడ్డి, శ్రీధర్‌లున్నారు.

భీమదేవరపల్లిలో...

విద్యుత్ కోతలు, సర్‌ఛార్జిలు పెం పుకు నిరసనగా మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. అధికార దుర్వినియో గం ప్రజలను, రైతులను మోసపుచ్చుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వంగ సత్తయ్యగౌడ్, జిల్లా కార్యదర్శు లు గూడ రాజయ్య, బోనగిరి రాం బా బు, రేణ బాపన్న, కొదురుపాక సార య్య, రామ్‌సింగ్, రాంగోపాల్‌రావు, నాగరాజు, దేవరాజు శంకర్, ఆశీర్వాదం, సంగ అయిలయ్యలున్నారు.

విద్యుత్ కోతలను నిరసిస్తూ టీడీపీ ధర్నా


బద్వేలు : కిరణ్ సర్కార్ అసమర్థ పాలన వలనే ప్రజలు అనేక సమస్యలతో సతమతమవు తున్నారని జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షుడు కె.రాంబాబు, తెదేపా పట్టణ అధ్యక్షుడు నరసింహనాయుడు పేర్కొన్నారు. విద్యుత్ ఛార్జీలను విపరీతంగా పెంచి ప్రజల పై మోయలేని భారం మోపడం దారుణమన్నారు. విద్యుత్ ఛార్జీలను అదుపు చేయాలని, విద్యుత్ సర్ ఛార్జీలను తక్షణం ఉప సంహరించుకోవాలంటూ టిడిపి ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గతంలో వైఎస్ఆర్ చేసిన తప్పిదాల వలనే విద్యుత్ కష్టాలకు దారి తీస్తున్నాయని వారు పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలతో సతమత మవుతున్నా వాటిని పరిష్కరించేందుకు చొరవ చూపకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు వర్గ రాజకీయాలతో కుర్చీలను కాపాడుకొనేందుకు సమయం సరిపోతుందే తప్ప ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అన్న సందేహం తలెత్తుతుందని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో తీవ్ర కరువు పరిస్థితులు వున్నప్పటికీ ప్రజలకు ఎలాంటి సమస్య లేకుండా విద్యుత్‌ను అందించిన ఘనత తెదేపాకే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు చంద్రబాబు నాయుడు నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా టిడిపినే అధికారం చేజిక్కించుకుంటుందని ఆయన పేర్కొన్నారు. టిడిపి పరిపాలనలోనే అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం తెదేపా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా స్థానికి టిడిపి కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి తెదేపా నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు అందరూ పాల్గొనాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు యల్లారెడ్డి, మునిరెడ్డి, జయరామిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అసమర్థ ప్రభుత్వంతో ఇక్కట్లు


గుంటూరు: విద్యుత్ సంక్షోభాన్ని ప్రభు త్వం పరిష్కరించేంత వరకు తమ నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతుందని జిల్లా టీడీపీ అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సంక్షోభం పరిష్కారం కోసం హైదరాబాద్ న్యూఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు చేపట్టిన నిరవధిక దీక్ష గురువారం మూడో రోజుకు చేరుకొన్నది. దీక్షలో పుల్లారావుతో పాటు పాల్గొన్న ఎమ్మెల్యేలు నరేంద్రకుమార్, కొమ్మాలపాటి శ్రీధర్, జీవీవీఎస్ ఆంజనేయులు నీరసించిపోయారు. వారి శరీర చక్కెర స్థాయి గణనీయంగా పడిపోయింది. ఎమ్మెల్యే శ్రీధర్ ఇటీవలే పచ్చకామెర్లకు గురయ్యారు. ఇంకా పూర్తిగా కోలుకోకముందే దీక్షలో పాల్గొనడం వల్ల ఆయన ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్న ట్లు సహచర ఎమ్మెల్యేలు తెలిపారు.

విద్యుత్ సంక్షోభాన్ని పరిష్కరించాలని శాసనసభ లోపల, వెలుపల టీడీపీ ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వం స్పందించనందుకే తాము దీక్షకు దిగామని పుల్లారావు స్పష్టం చేశారు. గతంలో తమ పార్టీ అధినేత చంద్రబాబు ర్రాష్టానికి ఎంతో పేరు తీసుకొచ్చారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే నరేంద్రకుమార్ మాట్లాడుతూ వ్యవసాయం, పరిశ్రమలు, రవాణ, ఆరోగ్యం, విద్య తదితర రంగాలన్నింటిని విద్యుత్ ప్రభావితం చేస్తోందన్నారు. ఈ సంక్షోభానికి వైఎస్ నాంది పలికితే రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కొనసాగించారని చెప్పారు.

వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ టీడీపీ దూరదృష్టితో రాష్ట్రంలో 2770 మెగావాట్ల సామర్థ్యంతో గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లను నిర్మించామన్నారు. ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతూ టీడీపీ హయాంలో చివరి నాలుగు సంవత్సరాల్లో కరువు వచ్చినప్పటికీ విద్యుత్ రంగాన్ని సమర్థవంతంగా నిర్వహించి రైతులకు 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయడం జరిగిందన్నారు.

ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు నిరవధిక దీక్ష

 ఏ పార్టీకైనా పునాదే కీలకం. రాష్ట్ర స్థాయిలో పార్టీ పటిష్టత కోసం ముందు నుంచీ పని చేసిన వారెందరో ఈ జిల్లాకు చెందిన వారున్నారు. పార్టీ ఆవిర్భావంలో ఎన్టీ రామారావు విలువైన సూచనలు, సలహాలు ఇచ్చి దశదిశలా వ్యాపించడంలోనూ ఈ జిల్లా ప్రధాన భూమిక పోషించింది. టీడీపీ ఏర్పాటుచేశాక పార్టీలో చేరి పని చేయడమే కాదు... పార్టీ ఆవిర్భావం కంటే ముందు నుంచీ ఈ జిల్లాలో ఎన్టీఆర్‌కి సలహాలు ఇచ్చిన రాజకీయ దురంధరులు ఉన్నారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపిస్తారని తెలుసుకుని ఆయన అభిమాన సంఘం నాయకుడు గోరంట్ల రాజేంద్రప్రసాద్ రాజమండ్రిలో పెద్ద సభ నిర్వహించారు. అశోక థియేటర్‌లో జరిగిన ఈ సభకు రిక్షా, జట్టు కార్మికులు వేలాదిమందిగా హాజరయ్యారు.

అన్నగారు పెట్టే పార్టీకి మనం అండగా ఉండాలంటూ పాతికేళ్ల యువకుడిగా ఉన్న రాజేంద్రప్రసాద్ ఇచ్చిన

మూడు దశాబ్దాలుగా అదే పార్టీలో... ప్రస్తుత పరిస్థితుల్లో ఏడాదికి మూడు, నాలుగు పార్టీలు మారే నేతలు ఉన్నారు. కానీ టీడీపీ ఆవిర్భావం నుంచీ ఆ పార్టీలోనే కొనసాగుతున్న నేతలు అనేక మంది ఇక్కడ ఉన్నారు. యనమల, చిక్కాల, గోరంట్ల, గన్ని తదితర నేతలు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. నాయకులకంటే పార్టీ ఆవిర్భావం నుంచీ వేలాది మంది కార్యకర్తలు టీడీపీకి అండగా ఉన్నారు.
పిలుపునకు వేలాదిమంది స్పందించారు. రంగంపేట సమితి మాజీ అధ్యక్షుడు ఉండవల్లి లక్ష్మీపతి, ఆయన సోదరుడు ఉండవల్లి శ్రీహరిరావు లాంటి రాజకీయ వేత్తలను ఆహ్వానించి వారి రాజకీయ అనుభవాలు, సూచనలు తీసుకుని అమలు చేసినట్టు చెప్తారు. ఇంకా జిల్లా నుంచి బాలయోగి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, యనమల రామకృష్ణుడు, మెట్ల సత్యనారాయణరావు, చిక్కాల రామచంద్రరావు, నల్లమిల్లి మూలారెడ్డి, గన్ని కృష్ణ, ఎంవీఎస్ తాతాజీరావు, తాళ్లూరి లీలా భాస్కర నారాయణ, కుదప సురేంద్ర, నెక్కంటి బాలకృష్ణ తదితరులు టీడీపీ తొలి రోజుల్లో క్రియాశీలక పాత్ర పోషించారు.

తూర్పు'నుంచి పునాది రాళ్లు

కాకినాడ: ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకునేందుకు చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర జిల్లాలో పదో రోజుకి చేరుకుంది. ఈ నెల 20న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రాజమండ్రి చేరుకున్న చంద్రబాబు యాత్ర జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. జిల్లాకు వచ్చిన తొలి ఐదారు రోజులూ రోజూ 14 నుంచి 16 కిలోమీటర్ల మేర నడిచిన చంద్రబాబు మూడు రోజుల నుంచి దూరం తగ్గించారు. ఈ తొమ్మిది రోజుల్లోనూ చంద్రబాబు 107.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించారు. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, మండపేట, అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలలో యాత్ర చేశారు. 29వ తేదీ నాటికి అనపర్తి నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తవుతుంది.అక్కడి నుంచి కాకినాడ రూరల్, పిఠాపురం, ప్రత్తిపాడు, తుని నియోజవవర్గాలలో బాబు పాదయాత్ర చేపడతారు.

కాపు సామాజికవర్గంపైనే ప్రధాన గురి... జిల్లాలో బీసీ, మాదిగ ఉప కులాలు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి. ఇక జిల్లా రాజకీయాల్లో కీ లక సామాజికవర్గమైన కాపులను తమవైపు తిప్పుకోవడంపై చంద్రబాబు సీరియస్‌గా దృష్టి సారించారు. ఇందులో భాగంగానే జిల్లాలో అడుగుపెట్టింది మొదలు... ప్రతి సభలోనూ అగ్రవర్ణాల్లో కాపులలో పేదలు ఎక్కువగా ఉన్నారని ప్రస్తావిస్తున్నారు. కాపుల్లో పేదలకు రిజర్వేషన్లు, కాపులకు రాజకీ
యంగా ప్రాధాన్యత ఇస్తానని పదేపదే ప్రస్తావిస్తున్నారు. మండపేటలో రాష్ట్ర కాపునేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన చంద్రబాబు వారి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు.

పెదపూడిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం..అనపర్తి నియోజకవర్గం పెదపూడిలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొని అక్కడి నుంచి చంద్రబాబు కాకినాడ రూరల్ నియోజకవర్గానికి చేరుకోనున్నారు.

పెదపూడిలో నేడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం

బిక్కవోలు: తెలుగుదేశంపార్టీలో కొంతమంది లీడర్లు మోసం చేస్తున్నా రు, కానీ కార్యకర్తలు మోసం చేయకుం డా ఏళ్ల తరబడి తమవెంటే ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మీకోసం వస్తున్నా పాదయాత్రలో గురువారం ఆయన బిక్కవోలు మండలంలో రామచంద్రపురం, జగ్గంపేట నియోజకవర్గాలలోని దేశం కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక లీడరు పోతే 50 మంది లీడర్లను తయారుచేసే శక్తి టీడీపీకి ఉందన్నారు. తమ కార్యకర్తలు చూసి రమ్మం టే కాల్చి వస్తారని కితాబునిచ్చారు. తాను కార్యకర్తలను కుటుంబసభ్యులు గా బావిస్తున్నానన్నారు.

గతంలో తా ను ప్రజల వద్దకు పాలన, జన్మభూమి వంటి కార్యక్రమాలు చేపట్టినా 294 నియోజకవర్గాలలోని కార్యకర్తల మనోభావాలు తెలుసుకోవడానికి వీలులేకుండా పోయిందని అందువల్లే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నాకు ఎంతో సంతృప్తినిస్తుందన్నారు. ఇప్పటివరకు కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పులో 10 నియోజకవర్గాలలోని కార్యకర్తలతో సమీక్షలు జరిపానన్నారు. వైఎస్ 200 మంది కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నా కార్యకర్తలు దేశం వెంటే ఉన్నారన్నారు. నిరాశ పడకుండా తమ పార్టీచేసిన పనులను ప్రజలకు వివరించి ఎదుటి పార్టీ వాళ్లను ఢీకొట్టినపుడే తిరిగి అధికారం లోకి వస్తామన్నారు. కార్యకర్తలకు మరింత చేరువ కావడానికి నియోజకవర్గ ఇన్‌చార్జిలు, బూత్ స్థాయి అధికారులను నియమించామన్నారు. మీ సమస్యలను తెలపాలని నియోజకవర్గాలవారీగా కార్యకర్తల నుంచి తెలుసుకుని నోట్ చేసుకున్నారు.

రామచంద్రపురం నుంచి యనమదల రవి, జగ్గంపేట నుంచి అల్లు విజయకుమార్ ఆధ్వర్యంలో 50 మంది బాబు సమక్షంలో పార్టీలో చేరారు. సమావేశంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్సీ నిమ్మకాయల చినరాజప్ప, జగ్గంపేట టీడీపీ ఇన్‌చార్జి జ్యోతుల చంటిబాబు, కొండయ్యదొర, అప్పలరాజు, జగ్గంపేట, రామచంద్రపురం కార్యకర్తలు పాల్గొన్నారు.

జగ్గంపేట: కృషి, పట్టుదల ఉంటే మనిషి సాధించలేదని ఏదీలేదని తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. వస్తున్నా మీకోస పాదయాత్ర లో భాగంగా ఆయన బిక్కవోలులో జగ్గంపేట నియోజకవర్గ కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. జగ్గంపేటలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావడానికి నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే కృషి చేయాలని యువకుడు, ఉత్సాహవంతుడు అయిన చంటిబాబును ముం దుకు తీసుకువెళ్లాలని సూచించారు. రెండుగంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. చంద్రబాబు పార్టీ స్థితిగతులపై పార్టీకార్యకర్తలు తమ అభిప్రాయాలు తెలియజేయాలని సూచించగా పలువు రు కార్యకర్తలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

గోకవరం మండలానికి పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ పార్టీ వెనుకబడి ఉందని సహాకార సంఘ ఎన్నికల్లో తామంతా కష్టించి పనిచేసి పిల్ల కాంగ్రెస్‌కు గట్టిపోటీనిచ్చామని ఒ క్కఓటు మెజార్టీతో సొసైటీని కోల్పోయామని వాపోయారు. పార్టీతో సం బంధం లేకుండా 14లక్షలు రూపాయ లు ఖర్చుపెట్టి ఓడిపోయిన తమను పా ర్టీపరంగా నాయకులు ఎవరూ కనీసం పరామర్శకు రాలేదని ఆవేశంగా ప్రసంగించారు. చంద్రబాబు సైతం అదే స్థాయిలో ప్రతిస్పందించి నాయకులను సరిదిద్దే బాద్యతలను తాను చేపడతానని నిరుత్సాహపడవద్దని భరోసా ఇ చ్చారు.

చంద్రబాబు నేరుగా కార్యకర్తలతో సంప్రదింపులు జరిపి వారి అభిప్రాయాలను సేకరించడంతోపాటు
రా నున్న ఎన్నికల్లో ప్రణాళికాపరంగా పార్టీకి ఏవిధంగా పనిచేస్తే విజయం సాధించగలమనే అంశాన్ని సూటిగా కార్యకర్తలకు అర్ధమయ్యే రీతిలో విశదపరిచారు. మరో వైపు పార్టీశ్రేణులను ఇంకో వైపు పార్టీ నాయకులను సైతం ఆయన సుతిమెత్తగా తనదైన శైలిలో చురకలు వేస్తూ సమీక్షను కొనసాగించారు. గతంలో మాదిరి హెచ్చరికలు, హూంకరింపులు లేకుండా ముఖంపై చిరునవ్వు చెరగనీయకుండా ఆద్యం తం చంద్రబాబు సమీక్షను కొనసాగించడంతో కార్యకర్తలు, నాయకుల్లో ఆనందాలు వ్యక్తమవుతున్నాయి.

నాయకులు మోసం చేస్తున్నారు.. కార్యకర్తలు మా వెంటే ఉన్నారు..


కాకినాడ సిటీ: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనయు డు లోకేష్ ఈ నెల 31న కాకినాడ రా నున్నారు. ఆనందభారతి గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేయబోయే బహిరంగ సభ లో ఆయన ముఖ్యవక్తగా పాల్గొని మా ట్లాడనున్నారు. సభలో జిల్లా తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్(టీఎన్ఎస్ఎఫ్), తెలుగునాడు సాంకేతిక విభాగం(టీఎన్ఎస్‌వీ), జిల్లా సాంస్కృతిక విభాగం, జిల్లా యువత ఆధ్వర్యంలో జరగనుంది.

సమన్వయకర్తలుగా కాకినాడ సిటీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చా ర్జ్ వనమాడి కొండబాబు, రూరల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పిల్లి సత్తిబాబు, టీడీపీ యువనేత ముత్తా శశిధర్, రా జానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారని పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు యనమ ల రామకృష్ణుడు తెలిపారు. చంద్రబా బు పాదయాత్రలో భాగంగా శనివా రం రాత్రి చంద్రబాబు కాకినాడ చేరుకుంటారు. కాకినాడలోనే బస చేస్తారు.

లోకేష్ పర్యటన మూడురోజులు లోకేష్ పర్యటన మూడురోజులపాటు ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్

రా ష్ట్రంలో లోకే ష్ వివిధ జిల్లాలో పర్యటించగా జనాల్లో భారీస్పందన వచ్చిం ది. ముఖ్యంగా కుప్పంలో మాట్లాడిన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. దాంతో రాష్ట్రవ్యాప్తంగా లోకేష్ పర్యటనలు ప్రా ధాన్యత సంతరించుకున్నాయి. కాకినాడలో తొలిసారిగా భారీ బహిరంగసభ లో ఆయన పాల్గొనడం ఇక్కడ యువనాయకత్వానికి అదనపు ఉత్సాహం ఉరకలేస్తుందని చెప్పవచ్చు.
నాయి. 31న జరిగే బహిరంగ సభతోపాటు ఏప్రిల్ 1,2 తేదీల్లో జిల్లాలోనే ఉంటారని చెబుతున్నారు. ఆనందభారతిలో జరిగే బహిరంగసభకు జిల్లాపార్టీ శ్రేణులు, అనుబంధ సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీఎన్ఎస్ఎప్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంజీవ్, కార్తీక్‌తోపాటు టీఎన్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు కోర్పు సాయితేజ, యువత నాయకులు, సాంస్కృతి క విభాగం నాయకులు సభ విజయవంతానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

31న కాకినాడకు లోకేష్ రాక

కాకినాడ: అవినీతి, అ సమర్ధ కాంగ్రెస్ దొంగల్ని తరిమికొట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు నా యుడు పిలుపునిచ్చారు. గురువారం వస్తున్నా మీ కోసం పాదయాత్ర 178వ రోజు బిక్కవోలు, జి.మామిడాడ, పె ద్దాడ, పెదపూడిల్లో సాగింది. చంద్రబా బు మాట్లాడుతూ ఇందిరమ్మ పేరుతో పేదలకు ఇవ్వాల్సిన ఇళ్లలోనూ కాంగ్రె స్ దొంగలు దోచుకుతింటున్నారని చం ద్రబాబు ఆక్షేపించారు. గ్రామాలకు తా గునీరు, కరెంటు ఇవ్వలేని అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనం పి టీడీపీకి అధికారం కట్టబెట్టాలని చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ హయాంలో ట్యాంకర్లతో తాగునీరు సరఫరాచేశామని గుర్తుచేశారు.

అన్నదాతను ఆదుకుంటాం! టీడీపీ అధికారంలోకి వస్తే వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వ్యవసాయ పెట్టుబడులు 300 శాతం పెరిగితే ధాన్యం, ఇతర పంటలు కేవలం 30 శాతం మాత్రమే పెరిగాయన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

జలయజ్ఞంలోనూ దోపిడీ ఈ తొమ్మిదేళ్లలో కాంగ్రెస్ రూ.80 వేల కోట్లు జలయజ్ఞంలో ఖర్చుచేస్తే అందులో రూ.20 వేల కోట్లు నిరర్ధకం గా పోయాయని, రూ.30 వేల కోట్లు దోచుకున్నారని సాక్షాత్తూ కాగ్ నివేదిక తేటతెల్లం చేసిందని గుర్తుచేశారు.

అది వైఎస్సార్ చార్జి కరెంటు సర్‌ఛార్జీల భారంపై ఎక్కడికక్కడ చంద్రబాబు దృష్టికి తీసుకువ
స్తున్నారు. బిక్కవోలులో ఒక మహిళ మా ట్లాడుతూ.. విద్యుత్ బిల్లులు వేలకు వేలు వస్తున్నాయని తెలిపింది. చంద్రబాబు స్పందిస్తూ.. అది వైఎస్సార్ అవినీతి ఛార్జి అంటూ ఎద్దేవా చేశారు.

టీడీపీ అధికారంలో ఉంటే రాజమం డ్రి, కాకినాడ కెనాల్‌రోడ్ నాలుగులైన్ల విస్తరణ జరిగేదని బిక్కవోలు సభలో చంద్రబాబు పేర్కొన్నారు. నాణ్యమైన రహదారులు నిర్మించిన ఘనత టీడీపీదేనన్నారు.

సమర్ధవంతమైన నాయకత్వం రావాలి చాలాచోట్ల కార్యకర్తలు బాగా పనిచేస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు మాత్రం మెతకగా ఉంటున్నారని పార్టీ సమీక్ష సమావేశంలో చంద్రబాబు అ న్నారు. ఈసందర్భంగా పలువురు కార్యకర్తలు పార్టీ స్థితి,గతులు, నేతల పనితీరును చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు.

కాంగ్రెస్ దొంగలను తరిమికొట్టాలి

ఏదులాపురం:రాష్ట్రాన్ని విద్యుత్ కోతల పేరుతో అంధకారంలోకి నెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబో యే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని టీడీపీ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి పాయల శంకర్ పేర్కొన్నారు. విద్యుత్ కోతలకు నిరసనగా హైదరాబాద్‌లో టీడీపీ ఎమ్మెల్యేలు చేపడుతున్న దీక్షలకు మద్దతుగా గురువారం స్థానిక నాయకులు ఆదిలాబాద్ బస్టాండ్ ఎదుట జాతీయ రహదారి పై రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోతల వల్ల విద్యార్థులు శ్రద్ధ పెట్టి చదువలేక పోతున్నారని అన్నారు. అలాగే మరోవైపు చిరు వ్యాపారులు నష్టపోతున్నారని ఆయన వాపోయారు. కోతల వల్ల రబీలో వేసిన పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో విద్యుత్ సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ ఆదిలాబాద్ ప ట్టణ అధ్యక్షుడు మునిగెల నర్సింగ్, నాయకులు రాజారెడ్డి, గిమ్మ సంతోష్, మంచాల మల్లన్న, టి వెంకట్‌రెడ్డి, బాలాపూర్ విఠల్, యూనిస్అక్బానీ, లేఖర్‌వాడ వెంకన్నలతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.

మంచిర్యాలలో...

గర్మిళ్ల: విద్యుత్ చార్జీల పెంపు, అ ప్రకటిత కోతలకు నిరసనగా గురువారం మంచిర్యాలలో తెలుగుదేశం పార్టీ, తెలుగుయువత ఆధ్వర్యంలో ప్ర జల నుంచి సంతకాలు సేకరించారు. పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు గోనె హన్మంతరావు నాయకత్వంలో పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తా , అర్చన టెక్స్ సముదాయం, అంబేద్కర్ చౌరస్తాలోని జేఏసీ శిబిరం వద్ద నాయకులు సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా హన్మంతరావు మాట్లాడుతూ విద్యుత్ చార్జీల పెంపు భారాన్ని సా మాన్య ప్రజలు గురించి ఆలోచించకుండా ప్రభుత్వం ఏక పక్ష నిర్ణయం తీసుకోవడం విచారకరమన్నారు.

అప్రకటిత విద్యుత్ కోతలతో కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యులను ఇక్కట్లకు గురి చేస్తుందని విమర్శించారు. రా ష్ట్రంలోని ప్రజలకు సరిపడే విద్యుత్ ను అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. రైతులకు ఏడు గంటలు విద్యుత్ సరఫరా ఇ వ్వాలని డిమాండ్ చేశారు. ప్రజలకు భారంగా పరిణమించే చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని ఆయనే పేర్కొన్నారు. కాంగ్రె స్ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో తెలుగు యు వత జిల్లా అధ్యక్షుడు గాజుల ముఖేష్ గౌడ్, నాయకులు బెల్లంకొండ మురళీదర్, కొండేటి సత్యం, జిల్లా ఉపాధ్యక్షురాలు రైసాబాను, డాక్టర్ రఘునందన్, గాదె సత్యం, పూరేళ్ల పోచమల్లు, దుర్గం రాజేష్, మట్టల రమేష్, డాక్టర్ ఫరీద్ హుస్సేన్, డీఎస్ఎం లక్ష్మి, నాగేందర్, పొలసాని సత్యనారాయణరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.

విద్యుత్ కోతలపై టీడీపీ నిరసనలు

హైదరాబాద్ : ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో శుక్రవారం ఉదయం టీడీపీ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ సీనియర్‌నేత పెద్దిరెడ్డి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో పార్టీ ఆవిర్భావ వేడుకలు

తూ.గో: వస్తున్నా...మీకోసం పాదయాత్రలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం పెదపూడిలో చంద్రబాబు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రాహానికి పూలమాలలు వేసి నివాలులర్పించారు. 32 కేజీల కేక్‌ను బాబు కట్ చేశారు. రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన బాబు, వృద్ధులకు వస్త్రాలను పంపిణీ చేశారు.

తూ.గో : పార్టీ జెండాను ఆవిష్కరించిన చంద్రబాబు

హైదరాబాద్: విద్యుత్ సమస్యలపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న నిరాహార దీక్ష శుక్రవారం నాటికి నాలుగోరోజుకు చేరింది. దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ అస్వస్థతకు గురయ్యారు. ఆమె రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. పార్లమెంటు సభ్యుడు సిఎం రమేష్ ఆరోగ్యం కూడా ఆందోళనకరంగా ఉంది.

పాత ఎమ్మెల్యే క్వార్టర్సులో కూర్చున్న ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు, ఎంపీల ఆరోగ్యాన్ని వైద్యులు ఈ రోజు ఉదయం పరీక్షించారు. వారిలో తొమ్మిది మంది ఎమ్మెల్యేల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. అయితే, ప్రభుత్వం దిగి వచ్చి విద్యుత్ సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగుతుం
దని నేతలు చెప్పారు.

టిడిపి ఎమ్మెల్యే సత్యవతికి అస్వస్థత

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని నగర పార్టీ అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. టీడీపీ 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం తలసాని, పార్టీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే తమ ముందున్న లక్ష్యమన్నారు.

ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో టిడిపి నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి అనే పదాన్ని ఉచ్చరించడానికి భయపడే విధంగా టిడిపి పాలన సాగిందన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు టిడిపిని స్థాపించారన్నారు.

టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం : తలసాని

తూ.గో.ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సమాజమే దేవాలయం, పేదవాళ్ళే దేవుళ్లు అని చెప్పిన వ్యక్తి దివంగత ఎన్టీ రామారావని, ప్రజల కోసమే ఆయన పార్టీ పెట్టారని అన్నారు. ఎన్టీఆర్ ఏ కార్యక్రమం చేపట్టినా ఒక స్పష్టమైన ఆలోచనతో మొదలు పెట్టేవారన్నారు.
: రాజకీయాల్లో ఎన్టీ రామారావుకు సాటి మరెవరూ లేరని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. వస్తున్నా...మీకోసం పాదయాత్రలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు శుక్రవారం పెదపూడిలో పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రాహానికి పూలమాలలు వేసి నివాలులర్పించి. 32 కేజీల కేక్‌ను కట్ చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన బాబు, వృద్ధులకు వస్త్రాలను పంపిణీ చేశారు.

ఎన్టీఆర్‌కు సాటి మరెవరూ లేరు : చంద్రబాబు

హైదరాబాద్ : ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న టీడీపీ నేతలను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్ నాయుడు శుక్రవారం సాయంత్రం శిబిరా

కాగా తొమ్మిది మంది నేతల ఆరోగ్యం పరిస్థితి విషమించిందని, వారికి తక్షణం వైద్య సహాయం అవసరమని వైద్యులు సూచించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం దిగివచ్చేవరకు దీక్ష విరమించేదిలేదని, వైద్య చికిత్స అవసరం లేదని నేతలు తేల్చి చెప్పారు.
న్ని సందర్శించి, పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

దీక్ష చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలను పరామర్శించిన లోకేష్

సభ సరిగా జరపకుండా పారిపోయిన ప్రభుత్వం
ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాలు నిలబెట్టుకోవాలి

హైదరాబాద్ : రాష్ట్రంలోని విద్యుత్ సమస్యలపై తెలుగుదేశం పార్టీ నేతలు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద చేపట్టిన నిరాహార దీక్షకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు సంఘీభావం ప్రకటించారు. ఎమ్మెల్యేల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారణమని ఆయన అన్నారు. ఇది తలతిక్క, తెలివితక్కువ ప్రభుత్వం అని ఆయన మండిపడ్డారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు టీడీపీ నేతలు చేపట్టిన దీక్షా శిబిరాన్ని శుక్రవారం ఉదయం సందర్శించి, నేతలను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నేతల ప్రాణాల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వంపై పోరాటం చేసేందుకైనా నేతలు ప్రాణాలు నిలుపుకోవాలని, బదులుగా ఇతర నేతలు కూర్చోవాలని రాఘవులు సూచించారు.

శాసనసభ సమావేశాలు కూడా సరిగ్గా జరపకుండా ప్రభుత్వం పారిపోతోందని రాఘవులు ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే తమకు నిజాయితీ లేదని ప్రభుత్వం ప్రకటించుకోవాలన్నారు. మలివిడత అసెంబ్లీ సమావేశాల నాటికి విద్యుత్ సమస్యలపై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని రాఘవులు హెచ్చరించారు.

టీడీపీ నేతల దీక్షకు సంఘీభావం తెలిపిన బి.వి. రాఘవులు

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
అధికారం కోసం కాదు, ప్రజలకోసమే పోరాటం : చంద్రబాబు

తూ.గో,/హైదరాబాద్: సమాజమే దేవాలయం, పేదవాళ్ళే దేవుళ్లు అని చెప్పిన వ్యక్తి దివంగత ఎన్టీ రామారావని, ప్రజల కోసమే ఆయన పార్టీ పెట్టారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఈనాడు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయని, అసమర్ధ ప్రభుత్వం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్‌ను ఎదుర్కొనే శక్తి ఒక్క టీడీపీకే ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి రక్తదానం చేశారు. పేదలకు, వృద్ధులకు పండ్లు, వస్త్రాలను పంపిణీ చేశారు. వస్తున్నా...మీకోసం పాదయాత్రలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెదపూడిలో పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రాహానికి పూలమాలలు వేసి నివాలులర్పించి. 32 కేజీల కేక్‌ను కట్ చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన బాబు, వృద్ధులకు వస్త్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ తండ్రిని అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదించి, పిల్ల కాంగ్రెస్ పార్టీ పెట్టిందని, రాజకీయ విలువలను నాశనం చేసిందని, ఈ పార్టీ అసెంబ్లీకి వస్తే దాన్ని కూడా దోచుకుంటారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇప్పుడు తెలుగుదేశంపార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వస్తుదని, టీడీపీ కార్యకర్తలు బాగా పనిచేస్తున్నారని, వాళ్లు ఇంకా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.

తమకు అధికార కాంక్ష లేదని, టీడీపీ ప్రజలకోసమే పోరాటం చేస్తుందని, స్వార్ధం కోసంకాదని చంద్రబాబు పేర్కొన్నారు. విద్యుత్ సమస్యలపై నాలుగు రోజులుగా టీడీపీ ఎమ్మెల్యేలు దీక్షలు చేస్తున్నది ప్రజలకోసమేనని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని పాలించే శక్తి ఒక్క టీడీపీకే ఉందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమలో పాల్గొన్న ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ, పాదాలు నొప్పులు పెడుతున్నా ప్రజల కోసం పాద యాత్ర చేస్తున్నారని ఆయన మీడియా ముందు భావోద్వేగానికి లోనయ్యారు. టీడీపీ అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయిని యనమల అభిప్రాయపడ్డారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో శుక్రవారం ఉదయం టీడీపీ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ సీనియర్‌నేత పెద్దిరెడ్డి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి అనే పదాన్ని ఉచ్చరించడానికి భయపడే విధంగా టిడిపి పాలన సాగిందన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు టిడిపిని స్థాపించారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద విద్యుత్ సమస్యపై దీక్ష చేస్తున్న ఎమ్మెల్యేలు అక్కడే పార్టీ అవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగర పార్టీ అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇతర పార్టీ శ్రేణులు ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే తమ ముందున్న లక్ష్యమన్నారు.

కార్యకర్తల సమావేశంలో భావోద్వేగానికి లోనైన యనమల

ప్రస్తుతం రాష్ట్రంలో వినిపిస్తున్న పేర్లు రెండే రెండు! కరెంటు కోతలు! కరెంటు షాకులు! కోతలతో విద్యార్థుల నుంచి పారిశ్రామికవేత్తల వరకు అన్ని వర్గాలూ ఇబ్బంది పడుతుంటే.. షాకులతో పదిమందికి అన్నం పెట్టే రైతన్న అర్థంతరంగా రాలిపోతున్నాడు! పొద్దు పొద్దున్నే రైతులు కరెంటు షాకులతో చనిపోయిన వార్త చూసి మనసు చిదిమేసినట్టు అయిపోయింది. రైతుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అన్నం పెట్టాల్సిన వాళ్ల బతుకులు గాలిలో దీపాలుగా మారాయి. దీనంతటికీ కారణం పాలకుల నిర్లక్ష్యమే. వీళ్లకు చిత్తశుద్ధి లేదు. స్పందించే హృదయం అంతకన్నా లేదు. కూడు పెట్టేవాడు వీళ్ల నిర్లక్ష్యానికి పాడెక్కే దుస్థితి వచ్చింది. కరెంటు షాకులకు రైతులు పిట్టల్లా రాలుతున్నా వీళ్లకు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఈ పాపం ఊరికే పోదు!

బిక్కవోలు, జి.మామిడాడల్లో పదో తరగతి విద్యార్థులు వచ్చి కలిశారు. వాళ్లకు అసలు పరీక్ష వాళ్లు రాసే పదో తరగతి పరీక్ష కాదట. కరెంటు కోతలే వాళ్ల పాలిట అగ్ని పరీక్షగా మారాయి. పరీక్షల సమయంలో గుడ్డి దీపాల కింద చదువుకోవడం ఈ ప్రభుత్వం వాళ్లకు ఇచ్చిన బహుమతి. "లక్షల కోట్ల బడ్జెట్లు పెడుతున్నారు. అయినా, మాకు పైసా పనులు జరగడం లేదు. ఈ డబ్బంతా ఎటుపోతోంది సార్'' అంటూ ఓ యువకుడు వేసిన ప్రశ్న ఎంతో అర్థవంతమైనది. ప్రజలు రక్తం చిందించి కట్టిన సొమ్ములన్నీ కాంగ్రెస్ అవినీతి ఖజానాకే చేరుతున్నాయి.

బిక్కవోలులో రజక సోదరులు కలిశారు. ఆనాటి 'ఆదరణ' లాంటి ఆదరణ కావాలని కోరారు. త్వరలోనే ఆ కల నెరవేరుస్తానని హామీ ఇచ్చి ముందుకు కదిలా!!

కోతలు.. షాకులే సర్కారు ఘనతలు