March 29, 2013

కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలి

గజపతినగరం: విద్యుత్ సంక్షోభానికి కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వం వెం టనే గద్దె దిగాలని మాజీమంత్రి పడా ల అరుణ డిమాండ్ చేశారు. విద్యుత్ కోతలు, చార్జీల పెంపునకు నిరసనగా గురువారం టీడీపీ ఆధ్వర్యంలో స్థానిక నాలుగు రోడ్ల జంక్షన్‌లో రహదారి పక్కన రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యు త్ సర్‌చార్జీల పేరుతో చార్జీలు పెంచు తూ వినియోగదారులపై తీవ్ర భారా న్ని మోపడంతోపాటు నాణ్యమైన వి ద్యుత్‌ను అందించడం లేదని అన్నారు. కరెంటు ఎప్పుడు ఉంటుందో , ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు.

గంట్యాడ మాజీ ఎంపీపీ కె. కొండలరావు, ఎస్.పైడిరాజు, గండ్రే డి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ సర్‌చార్జీలు వెంటనే తొ లగించాలని టీడీపీ నియోజకవర్గ నా యకులు కరణం శివరామకృష్ణ డిమాం డ్ చేశారు. పార్టీ కార్యాలయం ఎదుట కార్యకర్తలు, నాయకులతో రిలే నిరాహా ర దీక్ష చేపట్టారు. మాజీ ఎంపీపీ కం ది తిరుపతినాయుడు, త్రినాధరావు,గద్దె రవి. మండల లక్ష్ముంనాయుడు, తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు చెప్పిందే జరిగింది

సాలూరు : కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం వలన ఏర్పడిన విద్యుత్ సం క్షోభంపై చంద్రబాబు చెప్పిందే జరిగిందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ సం ధ్యారాణి అన్నారు. గురువారం స్థానిక జాతీయ రహదారి పక్కన దేశం నాయకులు నిరాహార దీక్షలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్, ఇన్‌చార్జ్ సంధ్యారాణి మాట్లాడారు. విద్యుత్ సమస్యపై చర్చించాలని ప్రతిపక్షనాయకులు, ఇతర పార్టీల నాయకులు, ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం చర్చ జరగనివ్వలేదని అన్నారు. ప్రభు త్వ చర్యలకు నిరసిస్తూ ఎమ్మెల్యేలు, నాయకులు నిరాహార దీక్షలు చేపట్టారన్నారు. వారికి సంఘీభావంగా తాము దీక్షలు చేపట్టామని చెప్పారు. శిబిరంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు నిమ్మాది చిట్టి, గిరిచిన్నిదొర, బి విశ్వేశ్వరరావు, బలగ పైడిరాజు, డబ్బి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.