March 29, 2013
కాంగ్రెస్ దొంగలను తరిమికొట్టాలి
కాకినాడ: అవినీతి, అ సమర్ధ
కాంగ్రెస్ దొంగల్ని తరిమికొట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు నా యుడు
పిలుపునిచ్చారు. గురువారం వస్తున్నా మీ కోసం పాదయాత్ర 178వ రోజు బిక్కవోలు,
జి.మామిడాడ, పె ద్దాడ, పెదపూడిల్లో సాగింది. చంద్రబా బు మాట్లాడుతూ
ఇందిరమ్మ పేరుతో పేదలకు ఇవ్వాల్సిన ఇళ్లలోనూ కాంగ్రె స్ దొంగలు
దోచుకుతింటున్నారని చం ద్రబాబు ఆక్షేపించారు. గ్రామాలకు తా గునీరు, కరెంటు
ఇవ్వలేని అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనం పి టీడీపీకి అధికారం
కట్టబెట్టాలని చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ హయాంలో
ట్యాంకర్లతో తాగునీరు సరఫరాచేశామని గుర్తుచేశారు.
అన్నదాతను ఆదుకుంటాం! టీడీపీ అధికారంలోకి వస్తే వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వ్యవసాయ పెట్టుబడులు 300 శాతం పెరిగితే ధాన్యం, ఇతర పంటలు కేవలం 30 శాతం మాత్రమే పెరిగాయన్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బాబు ఆవేదన వ్యక్తం చేశారు.
జలయజ్ఞంలోనూ దోపిడీ ఈ తొమ్మిదేళ్లలో కాంగ్రెస్ రూ.80 వేల కోట్లు జలయజ్ఞంలో ఖర్చుచేస్తే అందులో రూ.20 వేల కోట్లు నిరర్ధకం గా పోయాయని, రూ.30 వేల కోట్లు దోచుకున్నారని సాక్షాత్తూ కాగ్ నివేదిక తేటతెల్లం చేసిందని గుర్తుచేశారు.
అది వైఎస్సార్ చార్జి కరెంటు సర్ఛార్జీల భారంపై ఎక్కడికక్కడ చంద్రబాబు దృష్టికి తీసుకువ
స్తున్నారు. బిక్కవోలులో ఒక మహిళ మా ట్లాడుతూ.. విద్యుత్ బిల్లులు వేలకు వేలు వస్తున్నాయని తెలిపింది. చంద్రబాబు స్పందిస్తూ.. అది వైఎస్సార్ అవినీతి ఛార్జి అంటూ ఎద్దేవా చేశారు.
టీడీపీ అధికారంలో ఉంటే రాజమం డ్రి, కాకినాడ కెనాల్రోడ్ నాలుగులైన్ల విస్తరణ జరిగేదని బిక్కవోలు సభలో చంద్రబాబు పేర్కొన్నారు. నాణ్యమైన రహదారులు నిర్మించిన ఘనత టీడీపీదేనన్నారు.
సమర్ధవంతమైన నాయకత్వం రావాలి చాలాచోట్ల కార్యకర్తలు బాగా పనిచేస్తున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జిలు మాత్రం మెతకగా ఉంటున్నారని పార్టీ సమీక్ష సమావేశంలో చంద్రబాబు అ న్నారు. ఈసందర్భంగా పలువురు కార్యకర్తలు పార్టీ స్థితి,గతులు, నేతల పనితీరును చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు.
Posted by
arjun
at
7:49 AM