March 29, 2013

విద్యుత్ కోతలను నిరసిస్తూ టీడీపీ ధర్నా

కోహెడ: హైదరాబాద్‌లో టీడీపీ ప్ర జా ప్రతినిధుల నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా కోహెడ టీడీపీ ఆధ్వర్యంలో సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా గురువారం నిర్వహించారు. విద్యుత్ కోత లు, సర్‌చార్జీల పెంపు సబ్‌స్టేషన్ ఎదు ట టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. హుస్నాబాద్ కోహెడ ప్ర ధాన రహదారిపై రాస్తారోకో చేశారు. సుమారు రెండు గంటలకుపైగా రోడ్డు పై బైఠాయించయడంతో వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు. కరెంట్ కో తల ప్రభుత్వ మాకోద్దంటూ నినాదా లు చేశారు.

సక్రమంగా విద్యుత్ సరఫ రా చేసి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఖమ్మం వెంకటే శం, మండల పార్టీ అధ్యక్షుడు సంధి శ్రీనివాస్‌రెడ్డి, తిప్పారపు నాగరాజు, అన్నబోయిన సంపత్, బిట్ల రాజమ ల్లు, అంతటి రాజు, గూళ్ల సతీష్, ఎం కి రణ్, నవీన్‌కుమార్, విక్రమ్, ఆర్ రవీందర్, ఏ రమేష్, కొంరెల్లి, మల్లేశ్‌యాదవ్, సంతోష్‌రెడ్డి, శ్రీధర్‌లున్నారు.

భీమదేవరపల్లిలో...

విద్యుత్ కోతలు, సర్‌ఛార్జిలు పెం పుకు నిరసనగా మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు. అధికార దుర్వినియో గం ప్రజలను, రైతులను మోసపుచ్చుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వంగ సత్తయ్యగౌడ్, జిల్లా కార్యదర్శు లు గూడ రాజయ్య, బోనగిరి రాం బా బు, రేణ బాపన్న, కొదురుపాక సార య్య, రామ్‌సింగ్, రాంగోపాల్‌రావు, నాగరాజు, దేవరాజు శంకర్, ఆశీర్వాదం, సంగ అయిలయ్యలున్నారు.