March 29, 2013
టీడీపీ ఎమ్మెల్యేల దీక్షకు నల్లగొండ జిల్లా నేతల సంఘీభావం
విద్యుత్ సమస్యలపై
హైదరాబాద్లోని పాతఎమ్మెల్యే క్వార్టర్లలో టీడీపీ ఎమ్మెల్యేలు చేపట్టిన
దీక్షకు పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు గురువారం సంఘీభావం ప్రకటించారు.
టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగాల స్వామిగౌడ్, నాయకులు కంచర్ల
భూపాల్రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, చిలువేరు కాశీనాథ్, పాల్వాయి
రజనీకుమారి మాదగోని శ్రీనివాస్గౌడ్, వేనేపల్లి వెంకటేశ్వర్లు, తుమ్మల
మధుసూదన్రెడ్డి, రియాజ్అలీ, కసిరెడ్డి శేఖర్రెడ్డి సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యుత్ చార్జీలను తగ్గించకపోతే
వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. దీక్షకు మద్దతుగా
జిల్లాలో కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు.
Posted by
arjun
at
8:03 AM