March 29, 2013

31న కాకినాడకు లోకేష్ రాక


కాకినాడ సిటీ: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తనయు డు లోకేష్ ఈ నెల 31న కాకినాడ రా నున్నారు. ఆనందభారతి గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేయబోయే బహిరంగ సభ లో ఆయన ముఖ్యవక్తగా పాల్గొని మా ట్లాడనున్నారు. సభలో జిల్లా తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్(టీఎన్ఎస్ఎఫ్), తెలుగునాడు సాంకేతిక విభాగం(టీఎన్ఎస్‌వీ), జిల్లా సాంస్కృతిక విభాగం, జిల్లా యువత ఆధ్వర్యంలో జరగనుంది.

సమన్వయకర్తలుగా కాకినాడ సిటీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చా ర్జ్ వనమాడి కొండబాబు, రూరల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పిల్లి సత్తిబాబు, టీడీపీ యువనేత ముత్తా శశిధర్, రా జానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారని పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు యనమ ల రామకృష్ణుడు తెలిపారు. చంద్రబా బు పాదయాత్రలో భాగంగా శనివా రం రాత్రి చంద్రబాబు కాకినాడ చేరుకుంటారు. కాకినాడలోనే బస చేస్తారు.

లోకేష్ పర్యటన మూడురోజులు లోకేష్ పర్యటన మూడురోజులపాటు ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్

రా ష్ట్రంలో లోకే ష్ వివిధ జిల్లాలో పర్యటించగా జనాల్లో భారీస్పందన వచ్చిం ది. ముఖ్యంగా కుప్పంలో మాట్లాడిన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. దాంతో రాష్ట్రవ్యాప్తంగా లోకేష్ పర్యటనలు ప్రా ధాన్యత సంతరించుకున్నాయి. కాకినాడలో తొలిసారిగా భారీ బహిరంగసభ లో ఆయన పాల్గొనడం ఇక్కడ యువనాయకత్వానికి అదనపు ఉత్సాహం ఉరకలేస్తుందని చెప్పవచ్చు.
నాయి. 31న జరిగే బహిరంగ సభతోపాటు ఏప్రిల్ 1,2 తేదీల్లో జిల్లాలోనే ఉంటారని చెబుతున్నారు. ఆనందభారతిలో జరిగే బహిరంగసభకు జిల్లాపార్టీ శ్రేణులు, అనుబంధ సంఘాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీఎన్ఎస్ఎప్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంజీవ్, కార్తీక్‌తోపాటు టీఎన్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు కోర్పు సాయితేజ, యువత నాయకులు, సాంస్కృతి క విభాగం నాయకులు సభ విజయవంతానికి ఏర్పాట్లు చేస్తున్నారు.