March 29, 2013

నీతివంతమైన రాజకీయాలకు చంద్రబాబు రోల్ మోడల్

విస్సన్నపేట: నీతివంతమైన రాజకీయాలకు రోల్‌మోడల్‌గా దేశంలో ఒక్క చంద్రబాబు నాయుడే ఉన్నారని జిల్లా తెలుగుదేశం ప్రధానకార్యదర్శి బచ్చులఅర్జునుడు అన్నారు. బుధవారం విస్సన్నపేటలో జరిగిన తెలుగుదేశం పార్టీ సర్వసభ్యసమావేశంలో బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ నేడు కాంగ్రెస్, వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ అవినీతిలో పూర్తిగా మునిగిపోయి ప్రజలను కూడా అవినీతి పరులుగా మార్చేప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని కోరారు. నేటి రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిగా నీతివంతమైన రాజకీయాలకు రోల్‌మోడల్‌గా చంద్రబాబు నాయుడే ఉన్నారని అన్నారు. 63ఏళ్ల వయస్సులో పాదయాత్ర చేస్తూ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు చంద్రబాబు చేస్తున్న కృషిని, అలాగే కాంగ్రెస్, వై.ఎస్్.ఆర్ కాంగ్రెస్‌పార్టీల అవినీతిని, నేడు రాష్ట్రంలో ఉన్న దుర్భర పాలనను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి టీడీపీ నాయకులు, కార్యకర్తల పై ఉందని అర్జునుడు అన్నారు. చిన్నచిన్న విభేదాలు పక్కన పెట్టి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందడుగు వేయాల్సిన కీలక తరుణం ఇదేనని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో నియోజక వర్గ ఇన్‌ఛార్జి నల్లగట్లస్వామిదాసు, జిల్లా తెలుగురైతు అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు,రాష్ట్ర తెలుగురైతు కార్యనిర్వాహక కార్యదర్శి నెక్కళపు వెంకటేశ్వరరావు, నూజివీడు పట్టణ పార్టీ అధ్యక్షుడు నూతక్కివేణుగోపాల రావు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మట్టావేణుగోపాల రావు, మాజీ ఎంపీపీ ముత్తంశెట్టి వెంకటేశ్వరరావు,జిల్లా తెలుగుమహిళా నాయకురాలు నాదెండ్ల నాగమ ణి, వీరమాచనేని అమరేంద్ర ప్రసాద్, ఎన్టీ వెంకటేశ్వరరావు,డాబా శ్రీను, నెక్కళపు శంకర్‌రావు పాల్గొన్నారు.