March 29, 2013
కాంగ్రెస్కు ప్రజలే బుద్ధి చెబుతారు..
ఉండి : సమయం వచ్చినపుడు
కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని తెలుగుదేశం పార్టీ
జిల్లా అధ్యక్షరాలు తోట సీతారామలక్ష్మి పేర్కొన్నారు. హైదరాబాద్లో టీడీపీ
ఎమ్మెల్యేలు చేపట్టిన దీక్షకు మద్దతుగా ఉండిలో గురువారం దీక్షలను
కొనసాగించారు. ఈ దీక్షలను టీడీపీ జిల్లా అధ్యక్షరాలు తోట సీతారామలక్ష్మి
ప్రారంభించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజల సమస్యల ను పరిష్కరించడంలో
ప్రభుత్వం విఫలమైయిందని విమర్శించారు. మండ ల టీడీపీ అధ్యక్ష, కార్యదర్శులు
జుత్తుగ శ్రీను, మోపిదేవి శ్రీను మా ట్లాడుతూ పెంచిన విద్యుత్ చార్జీలను
తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దవిళి శ్రీను, పోలుబోతు రాము,
వనిమ శ్రీనివాస్, యిర్రింకి సత్యనారాయణ, కాగిత సత్యనారాయణ, కొల్లి మహంకాళి,
దండు సు బ్బరాజు,బి.రమేష్, పాలకోడేరు మం డల టీడీపీ అధ్యక్షుడు కొత్తపల్లి
గోపా ల కృష్ణంరాజు,చలమలశెట్టి సత్యనారాయణ,కాగిత మహంకాళి, కట్టా గంగాధరరావు,
కైలా రాజు పాల్గొన్నారు.
Posted by
arjun
at
8:13 AM