April 30, 2013

టీడీపీఅధ్యక్షుడు చంద్రబాబు ఏడు నెలల తర్వాత పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో అడుగు పెట్టబోతున్నారు. బుధవారం మేడే సందర్భంగా ఆయన పార్టీ కార్యాలయానికి వచ్చి కార్మిక విభాగం నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అక్టోబర్ రెండో తేదీన పాదయాత్రకు బయలుదేరి వెళ్లిన తర్వాత ఆయన పార్టీ కార్యాలయానికి రావడం ఇదే మొదటి సారి.

నేడు పార్టీ కార్యాలయానికి బాబు

తన పిల్లలు ఏం కావాలంటూ సీబీఐ అధికారులను ప్రశ్నించిన వైఎస్ భారతి తన భర్త, మామ వల్ల అక్రమ కేసుల్లో ఇరుక్కొన్న ఇతరుల పిల్లల గురించి ఏనాడైనా ఆలోచించారా అని తెలుగు యువత నేతలు ప్రశ్నించారు. "రూ. లక్ష కోట్లకు వారసులైన మీ పిల్లలే పిల్లలా......మిగిలినవారి పిల్లలు పిల్లలు కాదా ''అని వారు అడిగారు. తెలుగు రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మంగళవారం ఇక్కడ ఒక ప్రకటన చేశారు. 'పులివెందుల నియోజకవర్గంలోని వేల్పులలో టీడీపీ నేతలు సతీష్ రెడ్డి, రాంగోపాల్ రెడ్డిపై మీ కుటుంబ సభ్యులు అక్రమ కేసులు పెట్టి.. జైలుపాలు చేశారు. వీరెవరికి పిల్లలు లేరా? ఈ వ్యవహారాలతో మీ భర్త, మామలకు సంబంధం లేదని మీ పిల్లలపై ప్రమాణం చేస్తారా?' అని వారు భారతికి సవాల్ విసిరారు.

పిల్లలు మీకేనా? మిగిలిన వాళ్లకు లేరా?: టీడీపీ

రూపకర్తలు వేమూరు శిల్పులు

వేమూరు: టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు కాంస్య విగ్రహాన్ని మే 7వ తేదీన పార్లమెంటులో ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహాన్ని గుంటూరు జిల్లా వేమూరుకు చెందిన శిల్పి దేవు శంకర్, ఆయన కుమారులు మయాచార్య, నాగమయ నారాయణాచార్యులు, మరో ఇద్దరు శిల్పుల సహకారంతో రూపొందించారు. టన్ను బరువు కలిగిన తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహాన్ని తయారు చేసేందుకు ఆరు నెలలు పట్టింది. రూ.13 లక్షల విలువైన ఈ విగ్రహాన్ని వేమూరులోని సత్య శిల్పశాల నుంచి విగ్రహాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లారీలో మంగళవారం ఢిల్లీకి తరలించారు.

పార్లమెంటుకు ఎన్టీఆర్ విగ్రహం

మారిన మనిషిని!
1999కు మునుపు చంద్రబాబును
సత్వర ఫలితాల కోసమే నాడు తాపత్రయం
ఆ ఆత్రుతలోనే తప్పులు దొర్లాయి
పాదయాత్రతో చాలా నేర్చుకున్నాను
ఇచ్చిన హామీలన్నీ అమలుకు సాధ్యమే
అదెలాగో ప్రత్యేక ప్రణాళిక ప్రకటిస్తాను!
రాష్ట్రాన్ని బాగు చేయడం తెలుగుదేశానికే సాధ్యం
కేసీఆర్‌కు టీడీపీ అంటే భయం..అందుకే పదేపదే విమర్శలు


హైదరాబాద్: "నేను మారాను. పాదయాత్ర మరింత మార్పు తీసుకొచ్చింది'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తాము అమలు చేసిన విధానాలు సరైనవేనన్నారు. కానీ, వాటి ఫలితాలు ప్రజలకు చేరలేదని, ఈసారి వాటిని సరిచేసుకుని ముందుకు వెళతామని వివరించారు. ప్రజల కష్టాలు తీర్చడం, భావితరాల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడానికి సంబంధించి టీడీపీపై చరిత్రాత్మక బాధ్యత ఉందని స్పష్టం చేశారు.

ఆధునిక ఆంధ్రప్రదేశ్ నిర్మాణం ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యమన్నారు. పాదయాత్ర ముగిసినా.. ప్రజల కష్టాలు ఇంకా కళ్లల్లోనే తిరుగుతున్నాయని చెప్పారు. ఇటీవలే పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ వచ్చిన చంద్రబాబుతో ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ మంగళవారం నిర్వహించిన 'బిగ్ డిబేట్'లో చంద్రబాబు అనేక అంశాలపై మనసు విప్పి మాట్లాడారు. రాధాకృష్ణ అడిగిన ప్రశ్నలకు, కొందరు విశ్లేషకులు అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబులు ఇచ్చారు.

ఆ వివరాలు.. ఏడు నెలల పాదయాత్ర తర్వాత మామూలుగానే ఉన్నారా? నడక అలవాటై నిద్రలో కూడా నడుస్తున్నారా? 
 మామూలుగానే ఉన్నా. నా మైండ్, బాడీ ఎప్పుడూ నా నియంత్రణలోనే ఉంటాయి. లక్ష్య సాధనలో వెనకబడొద్దనే నిశ్చయంతోనే ఉంటాను. కానీ, కొన్ని ఇబ్బందులు. కుంటుకుంటూ నడవాల్సిన పరిస్థితి. ఈ నొప్పి జీవితాంతం ఉంటుందన్నారు. అది శాశ్వతం కాకుండా జాగ్రత్త పడుతున్నాను. రాష్ట్ర రాజకీయాల్లో మీరు, వైఎస్ సమకాలికులు. పాదయాత్ర ద్వారా ఆయన సీఎం అయ్యారు. మీరు ఒకసారి సీఎంగా చేసి, మరోమారు సీఎం అవడానికి పాదయాత్ర చేశారు.

మరి ఆ పదవిని అందుకోబోతున్నారా? 
రాష్ట్రంలో ఎవరికీ దక్కని గౌరవాన్ని ప్రజలు నాకిచ్చారు. తొమ్మిదేళ్లు సీఎంగా చేశాను. రెండుమార్లు ప్రతిపక్ష నేతను. సంపదను ఎలా సృష్టించాలి? ఆ సంపదను ప్రజలకు ఎలా అందించాలన్న దిశగా నేను చేసిన కృషిని ప్రపంచమంతా గుర్తించింది. ఈరోజు తప్పులు చేసిన వాళ్లు రోడ్లెక్కి నవ్వుకుంటూ తిరుగుతున్నారు. ప్రజలను మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసింది.

ఇవన్నీ చెప్పడానికే పాదయాత్ర చేశాను. ప్రజల్లో తెలివి తేటలున్నాయి. పదవి నాకు ముఖ్యం కాదు. అలాగని, పదవి వద్దని నేనడం లేదు. తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలోకి రావాల్సిందే. ప్రజల కష్టాలు చూసిన తర్వాత టీడీపీ మీద చరిత్రాత్మకమైన బాధ్యత ఉందని భావించాను. ప్రజల కష్టాలు తీర్చడం, భావితరాల భవిష్యత్తును కాపాడడమన్నవి ఆ బాధ్యతలు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి. ఆ విషయమే కార్యకర్తలతో కూడా చెబుతూ వచ్చా. అధికారంలోకి రావడం ఎంత ముఖ్యమో, దానికంటే రాష్ట్రాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం.

పాదయాత్ర నుంచి ఏం నేర్చుకున్నారు? 
చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు నేను మారిన మనిషిని. నేను మాట్లాడటం తగ్గించుకుని ఎదుటివారు చెప్పేది ఎక్కువగా వింటా ను. వాటి నుంచి నేను తీసుకోవాల్సిన నిర్ణయం నేను తీసుకుంటాను. అందరినీ కలుపుకొని పోతూ అందరి అభిప్రాయాలు స్వీకరిస్తూ వెళ్తాను. ఒక్కమాటలో చెప్పాలంటే.. 1999కి ముందు చంద్రబాబును చూస్తారు. 1999 తర్వాత కీర్తి కండూతి, ఫలితాలు త్వరగా సాధించాలన్న ఆత్రుత కొన్ని తప్పులు చేయించాయి.

కొన్ని విషయాలను పట్టించుకోలేదు. వాటినుంచి నన్ను నేను దిద్దుకొన్నాను. ఇందుకు పాదయాత్ర నాకు బాగా ఉపయోగపడింది. రాజకీయాలన్న తర్వాత పార్టీ లోపలా.. బయటా సమస్యలు ఉంటూనే ఉంటాయి. కుటుంబ సభ్యులు ఎవరైనా తప్పులు చేసినా వాటిని దిద్దుకొని వెంట తీసుకు వెళ్తాం. పార్టీ నేతలను కూడా అలాగే తీసుకువెళ్తాను. రాకపోతే నా దారిన నేను ముందుకు వెళ్లిపోతాను.

పాదయాత్ర ఫలితం ఎలా ఉంది? 
 ఏదో చేశామని ఒక ప్రాంతంలో ఒక పార్టీ చేస్తున్న మోసపూరిత ప్రచారం నుంచి ప్రజలను బయటకు తెచ్చాను. సెంటిమెంటును అడ్డం పెట్టుకొని మరో ప్రాంతంలో మోసం చేస్తున్న వారి నుంచి కూడా ప్రజలను బయటపడవేయగలిగాం. నాకు సంతృప్తి కలిగింది. ప్రజలు, పార్టీ కార్యకర్తలకు కూడా విశ్వాసం కలిగింది. పగలబడి నవ్వడం...కన్నీళ్లు పెట్టుకోవడం మొదటిసారి చూశాం. ఇంత మార్పు ఎలా? జీవితంలో అన్నీ ఉంటాయి. కాకపోతే ఆనందంతో ఉప్పొంగిపోవడం, బాధతో కుంగిపోవడం నాకు రాదు. కానీ, ప్రజల్లోకి వెళ్లిన తర్వాత వారి బోళాతనం, కొన్ని ఘటనలు ప్రతిస్పందించేలా చేశాయి. నా కాలి చిటికెనవేలి గాయం నిజంగా నాకు రోజుల తరబడి విపరీతమైన నొప్పి కలిగించింది. ప్రజల ఆదరణ అవన్నీ మర్చిపోయి నడిచేలా చేసింది.

పాదయాత్రలో ఏం సాధించారు? ఏం గ్రహించారు? 
 ఎక్కువే సాధించాను. పాదయాత్రలో చూసిన ప్రజల సమస్యలు కళ్లల్లో తిరుగుతున్నాయి. మేం అధికారంలో ఉన్నప్పుడు సృష్టించిన సంపదను ప్రజలకు చేర్చడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. ఎందరికి ఇళ్లిచ్చారు? కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలకు ఒక్కొక్కరికి నాలుగేసి ఇళ్లిచ్చారు. మూడు నెలలకే రోడ్లు దెబ్బతింటున్నాయి. రోడ్లు వేయకుండానే బిల్లులు తిన్నారు. నేను సీఎంగా ఉన్నప్పుడు జన్మభూమి, శ్రమదానం చేశా. పాలనను ప్రజల వద్దకే తీసుకెళ్లా.బాగానే చేశారు. కానీ, ఇప్పుడేమో 'ఉద్యోగులు పని చేయకపోయినా అడగను' అంటున్నారు.

అందరం కలిసి పనిచేద్దామని, రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందామని అంటున్నాను. ఆ రోజు తపనతో ఒత్తిడి చేశా. దానిని కొందరు అపార్ధం చేసుకున్నారు.2004లో ఉచిత విద్యుత్తు ఉంటే సీఎంగా మీరే కొనసాగేవారా?రాష్ట్రాన్ని వైఎస్ మోసం చేశాడు. 1994కు ముందు విద్యుత్తు కోతలుండేవి. వాటిని అధిగమించాం. సంస్కరణలు తెచ్చాం. గ్రాంట్లు తెచ్చాం. జవాబుదారీతనం పెంచాం. కోతల్లేకుండా చేశాం. రాష్ట్రం కోసమే తపన పడ్డాను.సీఎంగా ఉన్నప్పటి కంటే పాదయాత్రలోనే ప్రజల సమస్యలను ఎక్కువగా గమనించారు. సీఎంగా ఉండి కళ్లకు గంతలు కట్టుకున్నారు. ఎవరైనా చెప్పినా వినటానికి ఇష్టపడలేదు.

1991 వరకు రాష్ట్రంలో సంస్కరణలు లేవు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఓ నమ్మకాన్ని కలిగించాం. కానీ, వైఎస్ లాంటి వాళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారు. ఓ స్టేట్స్‌మన్‌గా రాష్ట్రాభివృద్ధికి తపనపడ్డాను. అప్పుడూ ప్రజల్లోనే ఉన్నాను. ఇప్పుడు ఇంకా దగ్గరగా తిరిగాను. ఎంత దగ్గరగా తిరిగితే అంతగా నిజాలు తెలుస్తాయి. ఈ ఏడు నెలల్లో చూసిన ప్రజల కష్టాలు ఇంకా కళ్లల్లోనే తిరుగుతున్నాయి. మిమ్మల్నో, ఇంకొకరినో నమ్మించడానికి చెప్పడం లేదు. ఈ వయసులో నేను ఎందుకు నడవాలి? రాష్ట్రం కోసం, ప్రజల కోసమే నడిచా.

మళ్లీ యాత్ర ఉంటుందా?ఉంటుంది. వచ్చే ఏడాదిలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ప్రజల్లోకి మరింతగా వెళ్లాలి. అదే సమయంలో అభ్యర్థుల ఎంపిక, పార్టీ యంత్రాంగాన్ని సమర్థంగా తీర్చిదిద్డుకోవడం చేయాలి. వీటన్నింటికీ ఒక ప్రణాళిక రూపొందించుకుంటాను. నా రెండో విడత యాత్ర త్వరలోనే ఉంటుంది. సీఎం పదవి కోసం ఒకపక్క మీరు, మరోవైపు జగన్, కిరణ్.. చాన్స్ వస్తే సీఎం అవ్వాలని కేసీఆర్... మరి మీకు మాత్రమే ఎందుకు ఓటేయాలి? సీఎం పదవి నాకు కొత్త కాదు. తొమ్మిదేళ్లు సీఎంగా చేశా.

ఒకాయనవి జైలు రాజకీయాలు. అలాంటి వ్యక్తి ఎటువంటి పాలననిస్తారు? తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు దోచుకున్న వ్యక్తులు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందని ప్రజలు ఆలోచిస్తున్నారు. టీఆర్ఎస్ ఒక ప్రాంతానికే పరిమితం. కేసీఆర్ ఎక్కడి నుంచో ఊడిపడలేదు. ఇక సీఎం కిరణ్ నిద్ర లేచిన దగ్గర నుంచి ఏదో ఒక హామీ ఇచ్చి పబ్బం గడుపుకొనేందుకే ప్రయత్నిస్తున్నారు. తప్ప సమర్థ పాలన లేదు. విద్యుత్తును కూడా సక్రమంగా ఇవ్వలేకపోతున్నారు. మంచినీళ్లు లేవు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే, మంచి పరిపాలన జరగాలంటే ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యం.

మీరు చేసిన వాగ్దానాల అమలు ఎలా సాధ్యం!?
 
 నేను ముందు రాజకీయ నాయకుడిని. తర్వాత పరిపాలకుడిని. ఈ రెండింటినీ సమన్వయం చేసుకోవాలి. అందుకే ఈ హామీలు. ఏ హామీ ఎలా సాధ్యమో ఎన్నికలకు ముందు ఒక ప్రత్యేక ప్రణాళిక విడుదల చేసి ప్రజలకు వివరిస్తాను. కాంగ్రెస్ పార్టీ 1994కు ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కుప్పకూల్చింది. దానిని బాగు చేయడానికి నాకు తొమ్మిదేళ్లు పట్టింది. ఈసారి ఎలా అప్పగిస్తారో తెలియదు. అందుకే ఎన్నికల ముందు ప్రణాళిక ఇస్తాం.

షర్మిల పాదయాత్ర మీకు పోటీయేనా?
 
 నేను వ్యక్తుల గురించి మాట్లాడను. పదిహేనేళ్ల కిందటే నేను ప్రధాన మంత్రులను, రాష్ట్రపతులను ఎంపిక చేశాను. జ్యోతిబసు, సుర్జీత్, దేవెగౌడ వంటి వారిని సమన్వయపర్చాను. జాతీయ స్థాయిలో విధానాలను నిర్ణయించాను. ఇప్పుడు నా గురించి మాట్లాడుతున్న కిరణ్, కేసీఆర్‌ల చరిత్ర ఏమిటి? కొందరు వచ్చి నాకు ముని శాపం అంటారు. నాకు ఇంకా ఏం కావాలని అబద్ధాలు చెప్పాలి. నాకేమైనా బెయిళ్లు కావాలా? నా భార్యాపిల్లలు కష్టపడి వ్యాపారం చేసుకుంటున్నారు.

మూడు ప్రాంతాల్లో మీ పార్టీ ఎక్కడ బలంగా ఉంది? 
 రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి టీడీపీ రావాల్సిన అవసరం ఉందని మూడు ప్రాంతాల్లోనూ ప్రజలు అనుకొంటున్నారు. దాని నుంచి ఫలితం రాబట్టడం అనేది అక్కడి పార్టీ శక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది. టీఆర్ఎస్‌కు మేం ఎప్పుడూ భయపడలేదు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తానే వచ్చి మమ్మల్ని కౌగలించుకుంది. కేసీఆర్‌కు టీడీపీ అంటే భయం. అందుకే పదేపదే మమ్మల్ని టార్గెట్ చేసుకొని మాట్లాడుతుంటాడు. తెలంగాణలో ప్రతి సమస్యపైనా పోరాడింది మేం. ఆ పార్టీ చేసింది శూన్యం. తెలంగాణలో మేం బలంగా ఉన్నాం కాబట్టే నష్టపర్చాలని ప్రయత్నం.

మీ పార్టీ విధానాల్లో మౌలిక మార్పుల అవసరం ఉందా? 
 మేం ఎంచుకొన్న అభివృద్ధి నమూనా మంచిదే. సంపద సృష్టించాలి. బాగా చదివించాలి. ఉద్యోగాలు కల్పించాలన్నది మా విధానం. కానీ, ఆ విధానాలకు సంబంధించిన ఫలితాలు ప్రజలకు చేరడంలో లోపం జరిగింది. దానిని సవరించుకోవాలి. ప్రజలు, పార్టీ కార్యకర్తలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతారా? నాకు కుటుంబ బాధ్యతలు లేవు. పార్టీ కార్యకర్తలే నా కుటుంబం. ఒక కార్యకర్త ఒక సందర్భంలో 22 ఎకరాల పొలం అమ్మేశాడు. వారిని ఆదుకోవాలి. అయితే, అది కూడా చట్టప్రకారమే చేస్తాను. అక్రమంగా కాదు. నన్ను ఇంతవాడిని చేసింది ప్రజలు. వారు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతాను.

'ఆంధ్రజ్యోతి-ఏబీఎన్' ఎండీ రాధాకృష్ణతో బిగ్ డిబేట్‌లో చంద్రబాబు

RK Big Debate With Chandrababu Naidu Part - 1

హైదరాబాద్ : వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి సతీమణి భారతిపై మంగళవారం తెలుగు మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి మండిపడ్డారు. కోర్టు హాలులో మాట్లాడకూడదని ఇంగిత జ్ఞానం కూడా లేదని ఆమెపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

భారతికే పిల్లలు ఉన్నారా, ఇంకెవరికీ లేరా అంటూ శోభా ప్రశ్నించారు. దివంగత వైఎస్, జగన్‌లు చేసిన అవినీతికి మంత్రులు, ఐఏఎస్ అధికారులు ఇబ్బందులు పడుతున్నారని, జైలుకు వెళుతున్నారని, వాళ్లకు పిల్లలు ఉన్నారుకదా, ఆ విషయం భారతికి గుర్తుకు రావడం లేదా అని విమర్శించారు. అసలు జగన్ అక్రమాస్తుల కేసు విషయంలో భారతిని కూడా విచారించాలని, అప్పుడు అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని శోభా హైమావతి అభిప్రాయపడ్డారు.

భారతిపై మండిపడ్డ శోభా హైమావతి

వేమూరు : పార్లమెంట్‌లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమం త్రి నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని ఈ నెల 7వ తేదీన ఆవిష్కరించనున్నారు. ఈ వి గ్రహాన్ని గుంటూరు జిల్లా వేమూరుకు చెందిన ప్రముఖ శిల్పి దేవు శంకర్, ఆయన కుమారులు మయాచార్య, నాగమయ నారాయణాచార్యులు, మరో ఇద్దరు శిల్పుల సహకారంతో రూపొందించారు. టన్ను బరువు కలిగిన తొమ్మిది అడుగుల కాంస్య వి గ్రహాన్ని తయారు చేసేందుకు ఆరు నెలలు వ్యవధి తీసుకుంది.

రూ.13లక్షల విలువతో కూడిన ఈ విగ్రహాన్ని శిల్పులు వాస్తవికతను ఉట్టిపడేలా రూపొందించారు. మంగళవారం ఉదయం ఈ వి గ్రహాన్ని వేమూరులోని సత్య శిల్పశాల నుండి ఢిల్లీకి తరలించేందుకు సిద్ధం చేశారు. మాజీమం త్రి దేవినేని రాజశేఖర్, పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావులు వి గ్రహాన్ని సందర్శించారు.

ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో గతంలో ఆవిష్కరించిన ఆచార్య ఎన్‌జి రంగా, టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాలను కూడా వేమూరుకు చెందిన శంకర్ రూపొందించారు. తిరిగి ఆయనకే ఎన్టీఆర్ వి గ్రహం తయారు చేసే అవకాశం దక్కడంపై ఆనందాన్ని వ్యక్త పరిచారు. మంగళవారం సాయంత్రం విగ్రహాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లారీలో ఢిల్లీకి తరలించారు.

పార్లమెంట్‌కు తరలి వెళ్లిన ఎన్టీఆర్ విగ్రహం

మోత్కూరు

కేసీఆర్ ఎన్నికల కోసం సమాయత్తమవుతున్నారే తప్ప తెలంగాణ కోసం కాదన్నారు. ఓట్లు, సీట్లు, నోట్ల కోసం ఆరాటపడే కేసీఆర్‌తో తెలంగాణ రాదని మోత్కుపల్లి తేల్చిచెప్పారు. ఎన్నికల్లో సీట్లు గెలిచాక, వాటిని కేసీఆర్ కాంగ్రెస్‌కు అమ్ముకుంటారన్నారు. వైఎస్ఆర్ జీవితమంతా అవినీతేనని, జగన్ దోపిడీ చేశాడు కాబట్టే జైలులో ఉన్నాడని మోత్కుపల్లి చెప్పారు.

సీబీఐ తనిఖీల్లో దొరికిన రూ.43 వేల కోట్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని, పేదలకు పంచాలని నర్సింహులు డిమాండ్ చేశారు. చంద్రబాబు పాదయాత్ర ముగింపు సందర్భంగా విశాఖలో జరిగిన బహిరంగ సభకు లక్షలాది మంది వచ్చారని, రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చి, చంద్రబాబు సీఎం కావడం ఖాయమన్నారు
: వైఎస్.జగన్, కేసీఆర్ సమాజానికి పట్టిన చీడ పురుగులని టీడీఎల్పీ ఉపనేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా మోత్కూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్, కేసీఆర్‌ల నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలని ఆయన సూచించారు.

జగన్, కేసీఆర్ సమాజానికి పట్టిన చీడ పురుగులు : మోత్కుపల్లి

వరంగల్
: బయ్యారం గనుల విషయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత కడియం శ్రీహరి ఆరోపించారు. బయ్యారంలోనే స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే జరిగే పరిణామాలను సీఎం కిరణ బాధ్యత వహించాలన్నారు. తాను టీడీపీ లోనే ఉంటానని కడియం స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ఏ పార్టీతోనైనా చర్చిస్తానని ఆయన చెప్పారు.

సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారు : కడియం

April 29, 2013

హైదరాబాద్: బ్రహ్మణి స్టీల్స్, రక్షణ స్టీల్స్‌కు కేటాయించిన భూములను రద్దు చేయగానే సరిపోదని, వాటి ఆధారంగా చేసిన దోపిడీకి సంబంధించిన సొమ్మును కూడా రికవరీ చేసి ప్రభుత్వం తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఆపార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య సోమవారం మీడియాతో మాట్లాడారు. "రక్షణ స్టీల్స్‌కు చేసిన కేటాయింపులను అడ్డు పెట్టుకొని బయ్యారంలో వేల టన్నుల ఇనుప ఖనిజం తవ్వి కోట్లు గడించారు. ఆ డబ్బును కూడా రికవరీ చేయాలి'' అని ఆయన డిమాండ్ చేశారు.

భూముల రద్దు కాదు ...రికవరీ చేయాలి: టీడీపీ

వస్త్రాలపై వ్యాట్ తొలగింపునకు ఏడాదినుంచీ వ్యాపారులు, ప్రతిపక్షాలు పోరాడినా పట్టించుకోని ముఖ్యమంత్రి కిరణ్, ఆకస్మికంగా రద్దుకు నిర్ణయించడం వెనుక మతలబు ఉందని టీడీపీ ఆరోపించింది. ఈ మేరకు దీనిపై విచారణ జరిపించాలని సోమవారం ఆ పార్టీ అధికార ప్రతినిధి ముద్దుకృష్ణమ నాయుడు విలేకరులతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. వ్యాట్ తొలగించాలన్న వ్యాపారుల డిమాండ్ న్యాయమైనదేనని, తమ పార్టీ అధినేత చంద్రబాబుసహా ప్రతిపక్షాలన్నీ వారి ఆందోళనకు మద్దతు ప్రకటించాయని గుర్తుచేశారు.

అటుపైన మంత్రివర్గ సమావేశాల్లో సహచరుల విజ్ఞప్తి నేపథ్యంలో నాలుగు శాతం తగ్గించి, పూర్తిగా రద్దుచేసేది లేదని చెప్పారన్నారు. అప్పుడు కూడా రూ.50 కోట్లు చేతులు మారినట్లు సాక్షాత్తూ మంత్రి దానం నాగేందర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు ఆరోపించారంటూ పత్రికల వార్తలనూ చూపారు. తాజాగా సీఎం సోదరుడు సంతోష్‌కుమార్‌రెడ్డి వ్యాపారుల లాబీతో కుదుర్చుకొన్న ఒప్పందంలో భాగంగా పూర్తిగా రద్దు చేశారని ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు.

దీంతోపాటు సీఎం నియోజకవర్గం పీలేరు కేంద్రంగా సాగుతున్న ఎర్ర చందనం స్మగ్లింగ్‌పై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సీఎం కుటుంబసభ్యుల సహకారం ఉండటంవల్లనే అధికారులు ఆ స్మగ్లర్ల జోలికి వెళ్లడంలేదని ఆరోపించారు. ఇక చంద్రబాబు పాదయాత్ర ముగింపు సందర్భంగా విశాఖలో జరిగిన భారీ బహిరంగ సభ విశేషాలు పత్రికల్లో ప్రముఖంగా రాకుండా చూడటానికే సర్కారు పెద్దపెద్ద తొలిపేజీ ప్రకటనలిచ్చిందని విమర్శించారు.

యాభై పైసలు కూడా ఇవ్వలేదు: టెక్స్‌టైల్ ఫెడరేషన్ వస్త్రాలపై వ్యాట్‌ను ప్రభుత్వం రద్దు చేయడంపై ఎ.పి.ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్స్ అసోసియేషన్ హర్షం ప్రకటించింది. ఈ మేరకు సోమవారం అసోసియేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు అమ్మనబోలు ప్రకాష్, మల్లీశ్వర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. సీఎం సోదరుడు రూ.50 కోట్ల ముడుపులు పుచ్చుకున్నారన్న ముద్దుకృష్ణమ నాయుడు ఆరోపణలను వారు తోసిపుచ్చారు. "రూ.50 కోట్లు కాదుకదా... యాభై పైసలు కూడా ఇవ్వలేదు'' అని స్పష్టం చేశారు. సీఎంను మే 5న సన్మానించాలని నిర్ణయించామని ప్రకటించారు.

వ్యాట్ తొలటింపులోమతలబు: టీడీపీ

హైదరాబాద్

లండన్‌లో విజయోత్సవ సభ చంద్రబాబు పాదయాత్ర ముగింపు సందర్భంగా లండన్‌లో ఒక విజయోత్సవ సభ సోమవారం జరిగింది. టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం యూకే, యూరప్ శాఖల ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహించారు. యూకే విభాగం అధ్యక్షుడు గుంటుపల్లి జయకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ విజయోత్సవాల్లో ప్రవాసాం«ద్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ నుంచి డాక్టర్ కోడెల శివ ప్రసాదరావు, పెద్దిరెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, కె.నారాయణరావు, పయ్యావుల కేశవ్, మురళీమోహన్, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, శోభా హైమావతి, పీఆర్ మోహన్, పొట్లూరి హరికృష్ణ, కోటేశ్వరరావు, ఎల్‌వీఎస్ఆర్‌కేప్రసాద్ తదితరులు ఫోన్లో తమ సందేశాలు తెలిపారు.
: వెన్నునొప్పి.. కాళ్ల కండరాల నొప్పులు.. జీర్ణకోశ సమస్యలతో బాధపడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. రెండు వారాల పా టు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఏడు నెలల సుదీర్ఘ పాదయాత్ర ము గించిన బాబుకు ఏసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీకి చెందిన వైద్యుడు రాకేష్ ఆధ్వర్యంలోని వైద్య బృందం సోమవారం సాయంత్రం పలు వైద్య పరీక్షలు నిర్వహించింది. నొప్పులతోపాటు.. కాలి చిటికెన వేలు గాయం మూడు నెలలుగా ఆయనను వేధిస్తోంది. ఇవన్నీ పూర్తిగా తగ్గాలంటే రెండు వారాలపాటు ఇల్లు కదలకుండా విశ్రాంతి తీసుకోవాల్సిందేనని వైద్యులు స్పష్టం చేశారు.

బాబుకు రెండు వారాలు రెస్టు

విశాఖపట్నం

రక్తనిధి ఏర్పాటుకు సింబయాసిస్ సీఈవో నరేశ్ కుమార్ రూ.10 లక్షలు, ఆయన మిత్రులు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, లోకేశ్, టీడీపీ నాయకులు ఎంవీవీఎస్ మూర్తి, కోడెల శివప్రసాద్, నామా నాగేశ్వరరావు, సుజనా చౌదరి, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, వెలగపూడి రామకృష్ణబాబు, సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
: ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో విశాఖ నగరంలో రక్త నిధి ఏర్పాటైంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి ఆదివారం దీనిని ప్రారంభించారు. ఈ బ్లడ్ బ్యాంకులో మూడువేల యూనిట్ల రక్తం నిల్వ చేయవచ్చు. దీనిని రూ.కోటిన్నర వ్యయంతో ఏర్పాటు చేశారు. ఇందులో కోల్డ్‌స్టోరేజీ, బ్లడ్ సెపరేషన్, ఇతర ఆధునిక పరికరాలు సమకూర్చారు. నిల్వచేసే రక్తంలో 30 శాతాన్ని పేదలకు అందజేస్తారు.

విశాఖలో ఎన్టీఆర్ స్మారక రక్తనిధి ప్రారంభించిన చంద్రబాబు దంపతులు


మిగిలిన జిల్లాలు, నియోజకవర్గాల్లో పర్యటన

హైదరాబాద్

స్థూలంగా ఇప్పటి వరకు వచ్చిన అభిప్రాయం మేరకు.. జూన్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆయన బస్సు యాత్రను చేపట్టనున్నారు. పాదయాత్రలో ఆయన 16 జిల్లాల్లోని 86 నియోజక వర్గాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఏడు జిల్లాల్లో చంద్రబాబు పర్యటించలేదు. వీటిలో హైదరాబాద్ మినహా మిగిలిన ఆరు జిల్లాలైన నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఆయన పర్యటన ఉంటుంది. ఈ జిల్లాల్లో పర్యటన పూర్తయిన తర్వాత మిగిలిన 16 జిల్లాల్లో మిగిలిపోయిన శాసనసభ నియోజక వర్గాల్లో కూడా పర్యటించాలని చంద్రబాబు యోచిస్తున్నారు.

ఎన్నికలకు వ్యవధి తక్కువగా ఉన్నందున బస్సు ద్వారా అయితే అన్ని నియోజక వర్గాల్లోనూ పర్యటించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. 2009 ఎన్నికలకు ముందు కూడా ఆయన 'మీ కోసం' పేరిట రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టారు. ఈసారి యాత్ర కూడా అదే తీరులో ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జూన్ నుంచి సుమారు ఆరు నెలలపాటు మిగిలిన అన్ని నియోజక వర్గాల్లోనూ పర్యటించాలనేది చంద్రబాబు వ్యూహం. నిరంతరాయంగా ప్రజల్లో ఉండటం ద్వారా తాము చెప్పదల్చుకున్న విషయాలను బలంగా వారికి చేరవేయవచ్చని, అదే సమయంలో పార్టీ శ్రేణులను కూడా ఉత్తేజపర్చవచ్చన్న భావనతో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు.

రెండో విడత యాత్ర చేపట్టడానికి ముందు మే నెలలో తనకు అందుబాటులో ఉన్న సమయాన్ని పార్టీ సంస్థాగత వ్యవహారాలను చక్కబెట్టడానికి వినియోగించాలని భావిస్తున్నారు. అప్పటి వరకు సంస్థాగతంగా ఉన్న లోటుపాట్లు, నియోజక వర్గాల్లో నాయకత్వ సమస్య, నేతల మధ్య సమన్వయ లోపం వంటి వాటిపై ఆయన దృష్టి పెట్టబోతున్నారు. మే నెలఖరులో హైదరాబాద్‌లో పార్టీ మహానాడుని ఘనంగా నిర్వహించనున్నారు. ఆ తర్వాతే ఆయన రెండో విడత యాత్ర మొదలవుతుందని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి.
: పాదయాత్ర ముగిసింది! బస్సు యాత్రకు శ్రీకారం చుట్టుకోనుంది! 'వస్తున్నా మీ కోసం' దిగ్విజయమైంది! 'జన యాత్ర'కు రంగం సిద్ధం అవుతోంది! ప్రజా సమస్యలు.. ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటానికి కొనసాగింపుగా మరో విడత ప్రజల్లోకి వెళ్లాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ ఏడాది జూన్ నుంచి మరో యాత్ర చేయాలని ఆయన సంకల్పించారు. ఏడు నెలలుగా చేస్తున్న సుదీర్ఘ పాదయాత్రని ముగించుకుని ఆదివారం ఇంటికి చేరుకున్న చంద్రబాబు.. సోమవారం నుంచి చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై ఇప్పటికే కొంతమంది నాయకులతో చర్చించారు.

ఇక బాబు బస్సు యాత్ర! జూన్ నుంచి చంద్రబాబు 'జన యాత్ర'

హైదరాబాద్

మాజీ ప్రధాని చంద్రశేఖర్ 56 ఏళ్ల వయస్సులో 170 రోజులు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి 53 ఏళ్ల వయస్సులో 60 రోజులు మాత్రమే పాదయాత్ర చేశారని తెలిపారు. వయస్సురీత్యా వచ్చే అలసట, శారీరక బాధలను పంటి బిగువన అణచుకుంటూ ప్రజా సమస్యలను తెలుసుకోవాలన్న పట్టుదలతో బాబు తన లక్ష్యం చేరుకోగలిగారన్నారు.
: 'ఢిల్లీ నుంచి కన్యాకుమారి మధ్య దూరం 2767 కిలోమీటర్లు. అనంతపురం నుంచి విశాఖపట్నం వరకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేసిన పాదయాత్ర 2817 కిలోమీటర్లు. 63 ఏళ్ల వయస్సులో 208 రోజుల పాటు చంద్రబాబు చేసిన పాదయాత్ర ప్రపంచంలోనే రికార్డు' అని టీడీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయ కార్యదర్శి దశరథ జనార్దన్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఢిల్లీ-కన్యాకుమారిని దాటిన చంద్రబాబు యాత్ర

సరైన సమయంలో రాజకీయ అరంగ్రేటం

విశాఖపట్నం : 'సరైన సమయంలో రాజకీయరంగ ప్రవేశం చేస్తాను' అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తనయుడు లోకేశ్ తెలిపారు. ప్రస్తుత రాజకీయాలను ఎప్పటికప్పుడు దగ్గరగా, సునిశితంగా పరిశీలిస్తున్నానని చెప్పారు. ఆదివారం సింహాచల వరాహ లక్ష్మీనృసింహ స్వామిని దర్శించుకున్న అనంతరం 'ఆంధ్రజ్యోతి' ప్రతినిధితో లోకేశ్ కొద్దిసేపు ముచ్చటించారు. పార్టీ శ్రేణుల్లో తనకు ఆదరణ పెరుగుతున్న విషయాన్ని ప్రస్తావించగా... "అది అంత ప్రధానం కాదు. మా అందరికీ చంద్రబాబు ముఖ్యం. ప్రజలతో ఆయన పూర్తిగా మమేకమయ్యారు. మేమంతా ఆయన వెంట సేవకుల్లా నడుస్తున్నాం'' అని తెలిపారు.

చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర పూర్తిస్థాయిలో విజయవంతమైందని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారని లోకేశ్ తెలిపారు. ఇందుకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు

రాజకీయాలను పరిశీలిస్తున్నాను 'ఆంధ్రజ్యోతి'తో లోకేశ్

అప్పన్న సన్నిధిలో చంద్రబాబు, బాలకృష్ణ

సింహాచలం(విశాఖపట్నం): చంద్రబాబు ఆదివారం సింహాచలంలో వరాహ లక్ష్మీనృసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనతోపాటు బాలకృష్ణ కూడా వున్నారు. తొలుత ఆలయ ఈవో కోడూరు రామచంద్రమోహన్, ప్రధాన పురోహితుడు మోర్తా సీతారామాచార్యులు ఆధ్వర్యంలో వేదపఠనాలు, మంగళవాయిద్యాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా మంటపం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.

తదుపరి గర్భాలయంలో అష్టోత్తర శతనామార్చనలు చేశారు. అనంతరం గోదాదేవి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆస్థాన మంటపంలో వేదపండితులు ఆశీర్వదించారు. దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ పట్టువస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు.

సింహాచలేశునికి పూజలు, కప్ప స్తంభం ఆలింగనం

కిడ్నీవ్యాధితో 'నిమ్స్'లో కన్నుమూత
టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు.. ఎన్టీఆర్ వీరాభిమాని
తీరని లోటు : చంద్రబాబు నివాళి

హైదరాబాద్: అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి శ్రీపతి రాజేశ్వర్ (73) మృతి చెందారు. కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధ పడుతూ 'నిమ్స్'లో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య ప్రమీలాదేవి, కూతురు సత్యలక్ష్మి, కుమారులు సతీష్‌కుమార్, సంతోష్‌కుమార్ ఉన్నారు. తండ్రికి వారసుడిగా సతీష్ హైదరాబాద్ పార్టీ శాఖ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

ఈశ్వరయ్య, రాజమణి దంపతులకు 1944 ఫిబ్రవరి 6న జన్మించిన శ్రీపతి.. బాల్యం నుంచే ఎన్టీఆర్‌కు వీరాభిమాని. దేశంలోనే తొలిసారి 'అఖిలభారత ఎన్టీఆర్ అభిమాన సంఘా'న్ని 1952లో నెలకొల్చారు. ఆ అభిమానంతోనే 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించగా, సభ్యత్వం పుచ్చుకున్నారు. ఎన్టీఆర్‌ను ఎప్పుడూ అంటిపెట్టుకొని ఉండే ఇద్దరు ముగ్గురు నేతల్లో శ్రీపతి ఒకరు. 1983లో ముషీరాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో సనత్‌నగర్ నుంచి గెలిచి.. కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. గృహనిర్మాణం, టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు.

1989 ఎన్నికల్లో మర్రి చెన్నారెడ్డిపై పోటీచేసి ఓడిపోయారు. ఆ తరువాత 1999లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2009లో టీఆర్ఎస్‌తో పొత్తులో భాగంగా సనత్‌నగర్ నియోజకవర్గం ఆ పార్టీకి పోవడంతో ఆయన పోటీచేయలేకపోయారు. ఎన్టీఆర్ హయాంలో హుడా, సెట్విన్, చిన్నతరహా పరిశ్రమల సంస్థ, బీసీ వెల్ఫేర్, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ తదితరుల పదవులు నిర్వహించారు. 1996లో ఎన్టీఆర్ మరణానంతరం ఏటా ఆయన వర్ధంతి రోజున 'ఎన్టీఆర్ అమరజ్యోతి ర్యాలీ' నిర్వహిస్తున్నారు. కాగా, సోమవారం ఉదయం 11గంటలకు సికింద్రాబాద్ బన్సీలాల్‌పేట శ్మశాన వాటికిలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

చంద్రబాబు నివాళి
శ్రీపతి రాజేశ్వర్ మృతిపట్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతితో పార్టీకి, నందమూరి కుటుంబానికే కాక, వ్యక్తిగతంగా తనకూ నష్టం కలిగిందని ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. మంత్రిగా, ప్రజాప్రతినిధిగా ప్రజలకు ఆయన చేసిన సేవలు మరువరానివన్నారు. ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన సంస్మరణ సభలో ఆ పార్టీ నేతలు తొండపి దశరథ జనార్దన్ రావు, కంభంపాటి రామ్మోహన్ రావు, ఎల్వీఎస్సార్కే ప్రసాద్, మోత్కుపల్లి నర్సింహులు, మాగంటి గోపీనాథ్, మాజీ మంత్రి కృష్ణయాదవ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, శ్రీపతి మరణవార్త తెలిసిన వెంటనే వివిధ పార్టీల నేతలు, అభిమానులు ఆయన స్వగృహానికి తరలివచ్చారు. ఎమ్మెల్యేలు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మర్రి శశిధర్‌రెడ్డి, మాజీమంత్రి విజయరామారావు, మాజీ ఎమ్మెల్యే సాయన్న, తలసాని శ్రీనివాస్‌యాదవ్ తదితరులు ఆయన భౌతికకాయానికి నివాళి అర్పించారు.

ఎన్టీఆర్ అభిమాన సంఘం వ్యవస్థాపకుడు శ్రీపతి రాజేశ్వర్ మృతి

వేల సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు
ఆరుగంటలకుపైగా బైక్ ర్యాలీ
208 గుమ్మడికాయలతో దిష్టి



ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు బైక్ ర్యాలీ ప్రారంభించారు. సుమారు మూడువేల ద్విచక్రవాహనాలలో పార్టీ జెండా పట్టుకొని తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంగా కేరింతలు కొడుతూ శంషాబాద్ బయలుదేరారు. 1.30 గంటలకే వేలాది మంది కార్యకర్తలు, నాయకులు, పార్టీ అభిమానులు, పెద్దసంఖ్యలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు సైతం శంషాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయ ప్రాంగణం గతంలో ఎన్నడూలేని స్థాయిలో జనంతో కిక్కిరిసింది. చంద్రబాబును చూసేందుకు జనం తోసుకుని ముందుకు రావడంతో వారిని నియంత్రిచేందుకు పోలీసులు కష్టపడాల్సి వచ్చింది. సరిగ్గా 2.55గంటలకు చంద్రబాబుతో పాటు బాలకృష్ణ విమానాశ్రయం నుంచి బయటికి వచ్చారు.

ఊరేగింపు వాహనం ఎక్కారు. శంషాబాద్ నుంచి ఆరాంఘర్, అత్తాపూర్, మెహదీపట్నం, మసాబ్ ట్యాంక్ మీదుగా ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి... అక్కడ ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. అక్కడి నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌కు చేరుకున్నారు. అక్కడ గిరిజనులు సంప్రదాయ నృత్యంతో బాబుకు స్వాగతం పలికారు. పార్టీ కార్యాలయంలో నేతలతో సమావేశం కావాల్సి ఉన్నా... ఎమ్మార్పీఎస్ కార్యక్రమానికి వెళ్లాల్సి ఉండడంతో దానిని చంద్రబాబు రద్దు చేసుకున్నారు. బ్రహ్మానంద రెడ్డి పార్కు వద్ద టీడీపీ అనుబంధ తెలుగు రక్షణ వేదిక, ఎస్టీ విభాగాల ప్రతినిధులు బాబుకు స్వాగతం పలికారు. దారి పొడవునా చంద్రబాబు పలుచోట్ల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. బాబుకు స్వాగతం పలికేందుకు అక్కడక్కడ ప్రత్యేక వేదికలను కూడా ఏర్పాటు చేశారు. చంద్రబాబు స్వాగత ర్యాలీలో బాలకృష్ణ సందడి చేశారు. వాహనంపై కూర్చుని ఆద్యంతం నవ్వుతూ, అభివాదాలు చేస్తూ ముందుకు సాగారు.

పూలబాటపై ఇంటికి... ఏడు నెలల తర్వాత తిరిగి ఇంటికి చేరుకున్న చంద్రబాబుకు భావోద్వేగపూరిత స్వాగతం లభించింది. తెలుగు మహిళలు ప్రధాన రహదారి నుంచి ఇంటి గుమ్మం వరకూ బంతిపూలు పరిచారు. పూలబాటపై నడుస్తూ వచ్చిన చంద్రబాబుకు మంగళ హారతులతో స్వాగతం పలికారు. 208 గుమ్మడి కాయలపై కర్పూరం వెలిగించి దిష్టితీసి పగులగొట్టారు. హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు బాబును ఆశీర్వదించారు. 8.39గంటలకు ఇంటి ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్న బాబుకు ఆయన సతీమణి భువనేశ్వరి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించారు. లోకేశ్ కాస్త ముందుగానే ఇంటికి రాగా బాలకృష్ణ నేరుగా తన ఇంటికి వెళ్లారు. బావ మరిది రామకృష్ణ, ఇతర బంధువులు బాబును పలకరించారు. ఆరో గ్యం ఎలా ఉంది బావా? అని రామకృష్ణ కుశల ప్రశ్నలు వేశారు. చిటికెన వేలి నొప్పి గురించి ఆరా తీశారు.

హాజరు కాలేకపోయిన నేతలు... ఆదివారం హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబును స్వాగతించేందుకు పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు రాలేకపోయారు. శనివారం విశాఖలో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న పలువురు ఎమ్మెల్యేలు, నాయకులకు విమానాల్లో టికెట్లు దొరక్కపోవడంతో ఆదివారం హైదరాబాద్ చేరుకోలేకపోయారు.
కొసమెరుపు: చంద్రబాబు దృష్టిలో పడేందుకు నేతలు పోటీపడ్డారు. తమ పేర్లతో భారీ ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి బాబు నివాసం వరకు మొత్తం కటౌట్లు, బ్యానర్లతో నింపి వేశారు.
హైదరాబాద్ సుదీర్ఘ పాదయాత్రతో చరిత్ర సృష్టించి.... తిరిగి హైదరాబాద్ చేరుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి జూబ్లీహిల్స్‌లోని తన నివాసం దాకా... సుమారు 6 గంటలపాటు విజయ యాత్ర సాగించారు. ద్విచక్ర వాహనాలపై కార్యకర్తలు తరలిరాగా... భారీ వాహన శ్రేణితో చంద్రబాబు ఊరేగింపుగా బయలు దేరారు. హైదరాబాద్ నగరంతోపాటు నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ తదితర జిల్లాల నుంచి పార్టీ కార్యకర్తలు విమానాశ్రయానికి తరలి వచ్చారు.

అపూర్వ స్వాగతం శంషాబాద్ నుంచి ఇంటిదాకా నీరాజనం


లేదంటే సమరమే
ప్రతి నియోజకవర్గంలో వృద్ధాశ్రమం పెట్టాలి
నామినేషన్ కోటాలో చట్ట సభలకు పంపాలి
వృద్ధులకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి
'యుద్ధ భేరీ' వేదికపై మంద కృష్ణ గర్జన
కష్టాలు కళ్లారా చూశాను
మీ పోరాటానికి మద్దతు
చంద్రబాబు సంఘీభావం

హైదరాబాద్ : వృద్ధులు, వితంతువుల పెన్షన్లు వెయ్యి రూపాయలకు పెంచాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. దీనిపై నెలరోజుల్లోపు స్పందించకపోతే... సర్కారుపై సమరం ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన 'వృద్ధులు, వితంతువుల యుద్ధ భేరీ' కార్యక్రమంలో మంద కృష్ణ ప్రసంగించారు. " మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి. లేకపోతే... ఈ సర్కారును భూస్థాపితం చేయడానికి ఉద్యమం చేపడతాం. రాష్ట్రంలో ఇంకా 40 వేల మంది వృద్ధులు, వితంతువులకు పెన్షన్లు అందడంలేదు. వారందరికీ పింఛన్లు మంజూరు చేయాలి'' అని డిమాండ్ చేశారు.

చట్ట సభల్లో వృద్ధులు, వితంతువుల తరఫున మాట్లాడేందుకు గవర్నర్ కోటాలో, రాష్ట్రపతి కోటాలో ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులను నామినేట్ చేయాలన్నారు. పెన్షన్లు ఇచ్చినా కొంత మంది వృద్ధులు సొంతంగా జీవించే పరిస్థితి లేదని... అందువల్ల ప్రతి నియోజకవర్గంలో ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి... దానికి వృద్ధులనే మంత్రిగా నియమించాలన్నారు.

కేంద్ర ప్రభుత్వం వృద్ధులకు, వికలాంగులకు ప్రయాణ రాయితీ ఇస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణను రెండుసార్లు కలిశామని... ఆయన సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చినప్పటికీ, అది అమలులోకి మాత్రం రాలేదని మంద కృష్ణ తెలిపారు. "ప్రభుత్వం వెంటనే వృద్ధులకు, వితంతువులకు ప్రయాణ రాయితీ కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం 80 ఏళ్ల పైబడిన వృద్ధులకు రూ.500లు ఫించను ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రూ.200లు మాత్రమే ఇస్తోంది'' అని తెలిపారు.

ఆరోగ్యశ్రీ సాధించాం...
ఎమ్మార్పీఎస్ కేవలం కులం కోసమే కాకుండా... మానవతా సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేస్తుందని మంద కృష్ణ తెలిపారు. చిన్నారుల గుండె ఆపరేషన్ల కోసం పోరాటం చేసి... ఆరోగ్యశ్రీ పథకాన్ని సాధించింది తామే అని తెలిపారు.

ఈ క్రమంలో వైఎస్ నుంచి బెదిరింపులు కూడా ఎదుర్కొన్నానని చెప్పారు. "గుండె ఆపరేషన్ కోసం ఒక బాలికను వైఎస్ వద్దకు తీసుకెళితే... పాతిక వేలకంటే ఎక్కువ సహాయం చేయలేమన్నారు. నీ ఉద్యమం సంగతి, నీ సంగతి నాకు తెలుసు, నా సంగతి నీకు తెలియదు అని హెచ్చరించారు.
గుండె జబ్బుతో చనిపోయిన బాలుడి మృతదేహంతో నేను, కిషన్ రెడ్డి (బీజేపీ నేత) ఆందోళనకు దిగినప్పుడు ఢిల్లీ నుంచే ఫోన్ చేసి వైఎస్ హెచ్చరించారు. ఇవన్నీ పత్రికల్లో వచ్చినవే'' అంటూ ఆ వార్తల క్లిప్పింగ్స్‌ను మంద కృష్ణ చూపించారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి వృద్ధులు, వితంతువులు ఎంతో నమ్మకంతో ఈ సమావేశానికి వచ్చారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా లక్ష్యాన్ని సాధిస్తామని మంద కృష్ణ ప్రకటించారు. వృద్ధులు, వికలాంగుల పెన్షన్లు పెంచాలని ప్రతిపక్ష పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఇప్పటికే కోరామని... కానీ, సర్కారు స్పందించే పరిస్థితి కనపడటం లేదని తెలిపారు. మళ్లీ ఇంకోసారి ప్రతిపక్ష నేతలతో కలిసి ముఖ్యమంత్రిని కలుస్తామని... నెల రోజుల్లో స్పందన లేకపోతే సమర భేరీ మోగిస్తామని మంద కృష్ణ హెచ్చరించారు.

సంపూర్ణ మద్దతు: చంద్రబాబు మంద కృష్ణ మాదిగ ప్రారంభించిన వృద్ధులు, వికలాంగుల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. పాదయాత్ర ముగించుకుని ఏడు నెలల తర్వాత ఇంటికి వచ్చిన ఆయన... కొద్దిసేపటికే 'యుద్ధ భేరీ' సభకు వెళ్లారు. "ఏడు నెలల పాటు ప్రజల్లో ఉన్నాను. ఎన్నో గ్రామాల్లో వృద్ధులు, వితంతువులు పడుతున్న బాధలను స్వయంగా చూశాను. వృద్ధులు, వితంతువుల కోసం మంద కృష్ణ చేసిన డిమాండ్లు పరిష్కరించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం'' అని ప్రకటించారు.

బెల్టు షాపులు తీసేయాలని మహిళలు కోరుతున్నారని, తమ ప్రభుత్వం వస్తే మొట్టమొదటి సంతకం రైతుల రుణ మాఫీ, రెండో సంతకం మద్య నియంత్రణపై పెడతామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. జనాభా దామాషాన వెనుకబడిన వర్గాలకు, ఎస్సీ, ఎస్టీలకు సామాజిక న్యాయం జరగాల్సిన అవసరముందన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసినా కొన్ని కారణాలతో ఆగిపోయిందని, దానిని కాంగ్రెస్ కొనసాగించలేకపోయిందని తెలిపారు. మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన సభకు రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని చంద్రబాబు అన్నారు.

మంద కృష్ణ కాంగ్రెస్‌లోకి వస్తే: సర్వే మంద కృష్ణ మాదిగలకు జాతిపితలాంటి వాడని, అలాంటి వ్యక్తి సోనియా గాంధీతో కలిసి ప్రయాణం చేస్తే మాదిగ జాతి సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లి మాదిగలకు న్యాయం చేస్తామన్నారు. వృద్ధుల, వితంతువుల ఫించన్లు దేశ వ్యాప్తంగా అమల్లోకి తెచ్చేలా సోనియాను కోరతామన్నారు. యుద్ధ భేరీ కార్యక్రమం ఎంబీసీ అధ్యక్షుడు సండ్ర వెంకటయ్య అధ్యక్షతన జరిగింది.

మానవతా ఉద్యమం: కిషన్‌రెడ్డి మందకృష్ణ ఉద్యమం..కేవలం సామాజిక ఉద్యమమే కాదని, అదొక మానవతా ఉద్యమమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కొనియాడారు. గుండె జబ్బు పిల్లల కోసం ఆయన చేసిన పోరాటం వల్లే 'ఆరోగ్యశ్రీ' పెట్టినట్టు వైఎస్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారని తెలిపారు. వృద్ధులకు, వితంతువులకు రూ.వెయ్యి పింఛను అంశాన్ని ఎన్నికల ప్రణాళికలో చేర్చనున్నట్లు వెల్లడించారు. కాగా, తమ పార్టీ ఆవిర్భావ సభలో వృద్ధులకు, వితంతువులకు రూ.1500లు పింఛను ఇవ్వాలని తీర్మానం చేసినట్లు టీఆర్ఎస్‌పక్షనేత ఈటెల రాజేందర్ తెలిపారు. ముఖ్యమంత్రిని పింఛను పెంచాలని కోరితే డబ్బులెక్కడున్నాయని ప్రశ్నించారని, ఆ ప్రశ్నకు 'యుద్ధభేరీ'తో మందకృష్ణ సమాధానమిచ్చారని చెప్పారు. బయ్యారం లాంటి గనులు జాతికి అంకితమైతే.. ఎన్ని సంవత్సరాలైన వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పింఛన్లు ఇవ్వొచ్చని పేర్కొన్నారు.

నెల రోజులే గడువు వృద్ధులు, వితంతు పెన్షన్లు పెంచాలి


పదవులపై వ్యామోహం లేదు
తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు దోపిడీ పార్టీలు
వైఎస్‌పై మేం పోరాడుతున్నప్పుడు టీఆర్ఎస్ ఎక్కడుంది?
'విజయోత్సవ సభ'లో బాబు నిప్పులు



'వస్తున్నా మీకోసం' పాదయాత్ర ముగించుకుని ఆదివారం ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శంషాబాద్ నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు ర్యాలీగా వెళ్తూ... పలుచోట్ల చంద్రబాబు ప్రసంగించారు. అవినీతి పాలనను అంతమొందించేందుకు రాజీలేని విధంగా ధర్మ పోరాటం చేస్తానని ప్రకటించారు.

"అవినీతి, కుంభకోణాలపై పోరాడే శక్తిని మీరే అందించారు. మీ తరఫున పోరాడతాను. మంచి రోజులు వస్తాయి'' అని పేర్కొన్నారు. ప్రజలకు మంచి పాలన ఇచ్చేంత వరకు ఈ పోరు సాగిస్తానని తెలిపారు. "కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం సర్వనాశనమైపోయింది. ఆధునిక ఆంధ్రప్రదేశ్‌ను అంధకార ప్రదేశ్‌గా మార్చేశారు. నాకు పదవులపై, అధికారంపై వ్యామోహం లేదు. తెలుగు వారికి, రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు ఇవ్వడమే నా లక్ష్యం. రాష్ట్రంలో పాలన గాడిలో పెట్టి పూర్వవైభవం తీసుకురావడమే మనముందున్న కర్తవ్యం'' అని చంద్రబాబు ప్రకటించారు. "మీ ఆశీస్సులు ఉంటే మళ్లీ రాష్ట్రాన్ని అభివృద్ధిబాటలో నడుపుతాను. నిద్రపోకుండా పనిచేసి ప్రజల రుణాన్ని తీర్చుకుంటాను. టీడీపీ సత్తా మళ్లీ చాటిచెబుతాను'' అని తెలిపారు.

ఆ పార్టీలతో జాగ్రత్త... మభ్యపెడుతున్న పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ దోపిడీ పార్టీలైతే టీఆర్ఎస్ ఫామ్‌హౌస్ పార్టీ అని పేర్కొన్నారు. హైదరాబాద్ శివార్లలోని భూములను వైఎస్ తన వారికి ధారాదత్తం చేస్తున్నప్పుడు టీఆర్ఎస్ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. "బాబ్లీపై మేం పోరాడుతున్నప్పుడు టీఆర్ఎస్ ఎక్కడుంది? బయ్యారం గనులను వైఎస్ తన అల్లుడికి కట్టబెట్టినప్పుడు టీఆర్ఎస్ నేతలు ఏం చేశారు?'' అని చంద్రబాబు నిలదీశారు.

కాళ్లు మొరాయించినా... ప్రజల కష్టాలు, సమస్యలు తెలుసుకునేందుకే పాదయాత్ర చేసినట్లు చంద్రబాబు తెలిపారు. "శరీరం సహకరించకున్నా, ఎన్ని ఇబ్బందులెదురైనా ఏడునెలల పాటు 2,800 కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేశాను. 16 జిల్లాల్లోని దాదాపు 1250 గ్రామాలను తిరిగి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నాను'' అని శంషాబాద్‌లో జరిగిన విజయోత్సవ సభలో చెప్పారు. "సుదీర్ఘ యాత్రలో అనేక ఇబ్బందులు, కష్టాలు, శారీరక సమస్యలు ఎదురయ్యాయి. గొంతు పోయింది. కాళ్లు మొరాయించాయి. డాక్టర్లు అడ్డుచెప్పినా అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ముందుకుసాగాను. పొలాలు, పూరిగుడిసెల్లోకి వెళ్లాను. తినేందుకు తిండిలేక అస్థిపంజరంలా ఉన్న మనుషులనూ చూశాను'' అని చంద్రబాబు ఆవేదనతో చెప్పారు.
రంగారెడ్డి జిల్లా: "పాదయాత్రలో మొదటి అడుగు మాత్రమే నాది. మీ అభిమానం, ఆశీస్సులతోనే మిగిలిన అడుగులు పడ్డాయి. ఇంత దూరం నడిపించాయి'' అని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ఉద్ఘాటించారు. "అవినీతి పాలనపై మీ ఆశీస్సులు, సహకారంతో ధర్మపోరాటం కొనసాగిస్తాను. మరో యాత్రను ప్రారంభిస్తాను'' అని చంద్రబాబు ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే చెబుతామన్నారు.

మరో యాత్ర! ధర్మ పోరాటం కొనసాగిస్తా!

రాజేంద్రనగర్: రాష్ట్రంలో దొంగలు పడ్డారని, రాష్ట్రాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరముందని, అది తానొక్కడినే చేయలేనని, ప్రజలందరి సహకారం కావాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. వస్తున్నా.. మీ కోసం పాదయాత్ర ముగించుకొని ఆదివారం రాజేంద్రనగర్‌కు చేరుకున్న చంద్రబాబుకు స్థానిక ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్, కార్పొరేటర్ టి.ప్రేమ్‌దాస్‌గౌడ్ ఆధ్వర్యంలో ఆరాంఘర్ చౌరస్తాలో ఘన స్వాగతం పలికారు.

మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ టి.ప్రేమ్‌దాస్‌గౌడ్ చంద్రబాబుకు పుష్పగుచ్ఛాన్ని అందజేయగా, మాజీ కౌన్సిలర్ ఎస్.వెంకటేశ్ గొర్రెను, గొంగడి, గొల్ల రుమాలును బహూకరించారు. గొర్రెను తీసుకున్న చంద్రబాబు ముందు కూర్చున్న నందమూరి బాలకృష్ణకు దాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఆరాంఘర్ చౌరస్తాలో చంద్రబాబునాయుడు ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. 208 రోజులు... 2817 కిలోమీటర్ల పాదయాత్ర ముగించుకొని వస్తున్న తనకు ఆత్మబంధువులు చూపిన స్వాగతం తన జన్మ సార్థకమైనట్లుగా ఉందని చంద్రబాబునాయుడు అన్నారు.

పవ్రిత భావనతో తాను వస్తున్నా మీ కోసం పాదయాత్రను చేపట్టానన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి చేపట్టిన ఈ యాత్ర ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ఎంతో బ్రహ్మాండంగా జరిగిందని, చరిత్రలో ఎన్నడూలేనివిధంగా ప్రజల అభిమానం అక్కడ కనిపించిందన్నారు. పాదయాత్ర ప్రారంభం సందర్భంగా గత సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రజలు తనకు ఎంతో ఉత్తేజాన్ని నింపి పాదయాత్రకు పంపించారని గుర్తుచేసుకున్నారు. 207 రోజుల పాదయాత్రలో ప్రజల బాధలు చూస్తుంటే గుండెలు తరుక్కుపోయాయన్నారు.

తాను 9 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి ఫలాలు పేదవారికి చేరే సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అవినీతిలోకి నెట్టివేసిందన్నారు. హైదరాబాద్ అభివృద్ధి తెలుగుదేశం కృషేనన్నారు. కృష్ణా జలాలను నగరానికి తీసుకువచ్చింది తెలుగుదేశం అని, వాటిని ప్రజలకు సరైనవిధంగా సరఫరా చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు లేదని, ఉద్యోగాలు లేవని గుర్తుచేశారు. పేదరిక నిర్మూలన జరిగేవరకు తన పోరాటం ఆగదన్నారు.

మొదటి దశ కార్యక్రమంఅయిన వస్తున్నా మీ కోసం పాదయాత్ర ముగిసిందని, మీ అందరి సహకారంతో పార్టీ శ్రేణులతో మాట్లాడి రెండవ విడత కార్యక్రమానికి త్వరలోనే శ్రీకారం చుడతానన్నారు. పాదయాత్రలో నేను బాధపడితే రాష్ట్ర ప్రజలందరూ ఆందోళన చెందారని, అది చూసి తనకు ఎంతో ఆత్మస్థైర్యం వచ్చిందన్నారు.

ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని ముందుకు సాగుతున్న తనకు ప్రజలు మద్దతు తెలుపాలన్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ నాయకత్వంలో కాటేదాన్‌లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికులకు న్యాయం జరిగిందన్నారు. వారి పనిగంటలు తగ్గించే విషయంలో ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ చేసిన కృషి ఎంతో గొప్పదన్నారు. పాదయాత్రతో తనకు పట్టుదల పెరిగిందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రజలు తనకు భవిష్యత్తులో కూడా ఈ మద్దతును కొనసాగించాలని ఆయన కోరారు.

ఆరాంఘర్ నుంచి శివరాంపల్లి, పీడీపీ చౌరస్తా, ఉప్పర్‌పల్లి మీదుగా హైదర్‌గూడకు చేరుకున్న చంద్రబాబునాయుడుకు హైదర్‌గూడ వద్ద టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎం.రామేశ్వర్‌రావు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అత్తాపూర్ వద్ద చంద్రబాబునాయుడు ప్రజలనుద్దేశించి ప్రసంగించాలనుకోగా మైక్ సహకరించలేదు. దీంతో ఆయన తనకు స్వాగతం పలకడానికి వచ్చినవారిని పలుకరిస్తూ చేయి ఊపుతూ ముందుకు సాగారు.

కార్యక్రమంలో పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పి.మహేందర్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్, రాజేంద్రనగర్ సర్కిల్ టీడీపీ అధ్యక్షుడు, కార్పొరేటర్ టి.ప్రేమ్‌దాస్‌గౌడ్, పార్టీ సీనియర్ నాయకుడు సామ భూపాల్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ ఎస్.వెంకటేశ్‌తో పాటు పెద్దసంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

నల్గొండ జిల్లా ఆలేరు నుంచి వచ్చిన రేణుక ఎల్లమ్మ డోలు బృందం సభ్యులు చేసిన విన్యాసాలు సభికులను ఆకట్టుకున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కళాకారులు జంగిరెడ్డి తెలుగుదేశం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తూ పాటలు పాడారు. బాబు రాక సందర్భంగా రాజేంద్రనగర్ రహదారులన్నీ పసుపుమయమయ్యాయి. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు దారి పొడవునా ఏర్పాటు చేశారు. వందలాది మంది కార్యకర్తలు చంద్రబాబునాయుడుకు స్వాగతం పలకడానికి పోటీపడ్డారు.

ప్రకాశ్‌గౌడ్‌ను అభినందించిన చంద్రబాబు

కాటేదాన్‌లో పనిచేస్తున్న వేలాది మంది మహిళా కార్మికులకు 12 గంటల పనిదినాలను 9 గంటలకు తగ్గించిన ఘనత ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌కే దక్కుతుందని నారా చంద్రబాబునాయుడు అన్నారు. ప్రకాశ్‌గౌడ్ నాయకత్వంలో కాటేదాన్ కార్మికులకు ఎంతో మేలు జరిగిందని గుర్తుచేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాటేదాన్ కార్మికులందరికీ మరింత న్యాయం జరిగేవిధంగా కృషిచేస్తానన్నారు.

బాబుకు అండగా నిలవాలి: ఎమ్మెల్యే


రాష్ట్రంలో నీతివంతమైన పాలన రావాలన్నా, పరిపాలన గాడిలో పడాలన్నా చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే అన్నారు. చంద్రబాబుకు స్వాగతం పలికే కార్యక్రమంలో భాగంగా ఆయన ఆరాంఘర్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన ఘనత చంద్రబాబు కే దక్కుతుందన్నారు. 9ఏళ్ళ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పేరు ప్రఖ్యాతలు ప్రపంచ దేశాలకు తెలిస్తే కాంగ్రెస్ 9ఏళ్ళ పాలనలో అవినీతి, అక్రమాలతో నిండిపోయిందన్నారు. తెలుగుదేశం ద్వారానే ఈ రాష్ట్రం బాగుపడుతుందన్నారు. టీఆర్ఎస్ నాయకులు చెబుతున్న మాటలు నమ్మవద్దన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ అని గుర్తుచేశారు.

రాజేంద్రనగర్ తెలుగుదేశానిదే: ప్రేమ్‌దాస్


నిత్యం ప్రజలకు అండగా నిలుస్తూ వారి కష్టసుఖాల్లో చంద్రబాబునాయుడు ఏ విధంగా పాలుపంచుకుంటున్నారో అదేవిధంగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ నిత్యం ప్రజల మధ్యలో ఉంటున్నారని, తిరిగి రాజేంద్రనగర్‌లో తెలుగుదేశం విజయం సాధించడం ఖాయమని,మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ టి.ప్రేమ్‌దాస్‌గౌడ్ అన్నారు. చంద్రబాబునాయుడుకు స్వాగతం పలకడానికి పార్టీ కార్యకర్తలు, నాయకులతోపాటు స్వచ్చంధంగా ప్రజలు తరలివచ్చారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నందమూరి బాలకృష్ణ, పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి.మహేందర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ ఎస్.వెంకటేశ్‌తోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

హైదర్‌గూడలో చంద్రబాబునాయుడుకు బ్రహ్మరథం


ఆరాంఘర్ చౌరస్తానుంచి ఓపెన్ టాప్ జీపులో హైదర్‌గూడకు చేరుకున్న చంద్రబాబుకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎం.రామేశ్వర్‌రావు నాయకత్వంలో ఘన స్వాగతం పలికారు. అత్తాపూర్ వద్ద ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్‌తోపాటు కార్పొరేటర్ టి.ప్రేమ్‌దాస్‌గౌడ్, నాయకుడు సామ భూపాల్‌రెడ్డి తదితరులు చంద్రబాఋకు స్వాగతం పలికినవారిలో ఉన్నారు.

టీడీపీకి పట్టం కట్టడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారు..

పహాడిషరీఫ్: 'వస్తున్నా... మీ కోసం' పాదయాత్రను ముగించుకొని నగరానికి వస్తున్న చంద్రబాబుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టు వద్ద స్వాగతం పలికేందుకు టీడీపీ మహేశ్వరం నియోజకవర్గం ఇన్‌ఛార్జి తీగల కృష్ణారెడ్డి, టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఈరంకి శంకర్‌గౌడ్, సరూర్‌నగర్ మండల బీసీసెల్ అధ్యక్షుడు దూడల సుధాకర్‌గౌడ్‌ల నేతృత్వంలో వందలాది మంది టీడీపీ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజలు టీడీపీకి పట్టం కట్టడానికి ఎదురుచూస్తున్నారని అన్నారు. వస్తున్నా... మీకోసం యాత్రను 2012 అక్టోబర్ 2న ప్రారంభించి నేటితో ముగించుకొని నగరానికి తిరిగి వస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు స్వాగతం పలకడానికి జల్‌పల్లి పరిసర గ్రామాల నుంచి వందలాది ద్విచక్ర వాహనాలతో శం
షాబాద్ విమానాశ్రయంకు బయలుదేరామన్నారు. కాంగ్రెస్ నాయకులు భూకబ్జాలు చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారని, దీంతో ప్రజలు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.

పాతబస్తీ నుంచి టీడీపీీ ర్యాలీ..

చంద్రబాబుకు స్వాగతం పలకడానికి రక్షాపురం నుంచి టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం కార్యదర్శి నాగు నగేశ్ ఆధ్వర్యంలో పాతబస్తీ నుంచి 100 ద్విచక్ర వాహనాలలో బయలుదేరారు.

రాష్ట్ర పక్షాళనలో ప్రజల సహకారం కావాలి

April 28, 2013

హైదరాబాద్

చంద్రబాబునాయుడు విమానాశ్రయం నుంచి ర్యాలీగా బయలుదేరారు. భారీగా టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. రాజేంద్రనగర్‌వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో బాబు పాల్గొని ప్రసంగించనున్నారు. అక్కడి నుంచి ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చి ఎన్టీఆర్‌కు నివాళులర్పించి ఇంటికి చేరుకుంటారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం ఈ సాయంత్రం ఉప్పల్‌లో జరగనున్న ఎమ్మార్పీస్ యుద్ధభేరి సభలో చంద్రబాబు పాల్గొంటారు. ఏడు నెలల సుదీర్ఘ పాదయాత్ర ముగించుకుని చంద్రబాబు హైదరాబాద్ చేరుకున్నారు.
: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్టోబర్ 2న ప్రారంభించిన 'వస్తున్నా..మీకోసం' పాదయాత్ర ముగించుకుని ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న బాబుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఆయన వెంట కుమారుడు నారా లోకేష్‌నాయుడు, సినీ నటుడు బాలకృష్ణ, పార్టీ నేతలు తదితరులు ఉన్నారు.

హైదరాబాద్‌కు చేరుకున్న చంద్రబాబు

విశాఖ
: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదివారం ఉదయం విశాఖలో కొత్తగా ఏర్పాటు చేసిన టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. సినీ నటుడు బాలకృష్ణ, నారా లోకేష్ లతోపాటు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, టి. దేవేందర్ గౌడ్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి సింహాద్రి అప్పన్నను దర్శించుకునేందుకు కుటుంబ సభ్యులతో బయలుదేరి వెళ్లారు.

విశాఖలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన చంద్రబాబు

విశాఖ

హైదరాబాద్ శంసాబాద్ విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘనస్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. రెండున్నర గంటలకు బాబు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. విమానాశ్రయం నుంచి పార్టీ కార్యాలయానికి చేరుకుని నేతలను పరామర్శించి, అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుని, ఈ సాయంత్రం ఉప్పల్‌లో జరగనున్న ఎమ్మార్పీస్ యుద్ధభేరి సభలో చంద్రబాబు పాల్గొంటారు.
: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదివారం సింహాద్రి అప్పన్నను కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. ఆలయం అధికారులు బాబుకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి చంద్రబాబు హైదరాబాద్‌కు వచ్చేందుకు విమానాశ్రయానికి చేరుకున్నారు. 1-20 గంటలకు బయలుదేరే విమానంలో బాబు హైదరాబాద్‌కు రానున్నారు.

విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు

విశాఖపట్నం : కిరణ్‌వి అన్నీ ఉత్తుత్తి వాగ్దానాలే అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అవినీతి మంత్రులను కాపాడటంలో ఆయన బిజీగా ఉన్నారన్నారు. "ఒకప్పుడు ఢిల్లీకి వచ్చిన విదేశీ ప్రముఖులు అభివృద్ధి చూసేందుకు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేవారు. ఇప్పుడు రాష్ట్రాన్ని అవినీతి రాజధానిగా మార్చారు. సాక్షాత్తూ హోం మంత్రే ముద్దాయిగా ఉన్నారు. అవినీతి మంత్రులు సచివాలయంలో కూర్చుంటున్నారు.

ఇక చట్టాన్ని ఎలా అమలు చేస్తారు? వీరికి నైతిక విలువలు లేవా?'' అని చంద్రబాబు నిలదీశారు. వైఎస్ చేసిన తప్పుల్లో మంత్రులూ భాగస్వాములే అని, 26 వివాదాస్పద జీవోలు జారీ చేయడంలో వీరి పాత్ర ఉందని తెలిపారు. బయ్యారం గనులు, బ్రహ్మణీ భూముల లీజులను రద్దు చేసామని పోజులు కొడుతున్న కిరణ్... జగన్ దోచిన సొమ్మును ఎందుకు రికవరీ చేయడం లేదని నిలదీశారు. దోచుకున్న ఆస్తులు ఎందుకు స్వాధీనం చేయడంలేదని ప్రశ్నించారు. రేపోమాపో చేతులు కలపాలన్న కుతంత్రపు ఆలోచనలే దీనికి కారణమన్నారు.

అవినీతి మంత్రులను కాపాడటంలో కిరణ్ బిజీ...

విశాఖపట్నం  : టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర ముగింపు ప్రస్థానం అభిమానుల నీరాజనాల మధ్య సాగింది. శనివారం మధ్యాహ్నం 3.30గంటలకు మొదలైన ముగింపుయాత్రలో కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పైలాన్ ఆవిష్కరించిన తర్వాత చంద్రబాబు చేపట్టిన ర్యాలీ ఆద్యంతం ఉత్సాహభరితంగా కొనసాగింది. ర్యాలీలో ఏ సమయానికి ఏం జరిగిందన్న వివరాలు ఇలా ఉన్నాయి..

3.30 గంటలు: టీడీపీ అధినేత చంద్రబాబు కూర్మన్నపాలెం నుంచి పాదయాత్ర చేపట్టారు.
4.05: శివాజీనగర్‌లో ఏర్పాటు చేసిన పైలాన్‌ను చంద్రబాబు పైలాన్ ఆవిష్కరించారు. అనంతరం ర్యాలీ ప్రారంభమైంది. «థింసా, కోలాటం, పులివేషాలు, చెంచు నృత్యం, బిందెల నృత్యం, ఎన్‌టీ రామారావు, బాలకృష్ణ డూప్‌లు, సైకిల్ గుర్తు వంటి వాటిని ప్రదర్శించే 12 ట్రాలీలు ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ర్యాలీ మార్గంలో జనం చంద్రబాబుతో కరచాలనం చేసేందుకుపోటీ పడ్డారు. దీంతో ర్యాలీ చాలా నెమ్మదిగా సాగిం

4.30: ర్యాలీ కూర్మన్నపాలెం జంక్షన్‌కు చేరుకోగానే టీఎన్‌టీయూసీ నాయకులు చంద్రబాబును పూలమాలలతో ముంచెత్తారు.
4.55: ర్యాలీ కణితి బస్టాప్ వద్దకు చేరుకుంది. పోలీసుల వేషధారణలో కొంతమంది కార్యకర్తలు వాహనాలపై వచ్చి ర్యాలీలో చేరారు.
5.05: శ్రీనగర్ వద్ద పలువురు మహిళలు చంద్రబాబుకు హారతులిచ్చి నీరాజనాలు పట్టారు.
5.15: ర్యాలీ చినగంట్యాడ జంక్షన్ చేరుకుంది. ఈ సమయంలో ఎన్‌టీఆర్ వేషధారణతో ఉన్న ఓ వ్యక్తి ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
5.25: గాజువాక జంక్షన్‌లో కూడా భారీ సంఖ్యలోని మహిళలు చంద్రబాబుకు మంగళహారతులతో స్వాగతం పలికారు.
5.37: బీహెచ్‌పీవీ కూడలి వద్ద టీఎన్‌టీయూసీ నేతలు టీడీపీ అధినేతను పూలదండలతో సత్కరించారు.
6.05: ర్యాలీ ఎన్ఏడీ కూడలికి చేరుకుంది. అప్పటికే నాలుగు రోడ్లూ జనసంద్రంగా మారాయి. ఈ దృశ్యాన్ని చూసిన చంద్రబాబు, బాలకృష్ణతో పాటు ఇతర నేతలంతా ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.
కాన్వాయ్ ముందుకు వెళ్లడానికి అవకాశం లేకపోవడంతో పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సివచ్చింది. సుమారు పది నిమిషాల తర్వాత ర్యాలీ తిరిగి ప్రారంభమైంది.
6.25: బిర్లా జంక్షన్ వద్దకు చేరుకోగా రోడ్డుకిరువైపులా నిలబడిన జనం చంద్రబాబుకు అభివాదం చేశారు.
6.35: కంచరపాలెం ఇందిరానగర్ వద్ద స్థానికులు చంద్రబాబుకు తలపాగా బహూకరించారు.
7.15: చంద్రబాబు కాన్వాయ్ మద్దిలపాలెం మీదుగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన సభాస్థలికి చేరుకుంది.
ది.

ర్యాలీ సాగిందిలా..

విశాఖపట్నం :బహిరంగ సభ జరిగిన ఏయూ గ్రౌండ్స్‌కు మధ్యాహ్నం రెండు గంటల నుంచే ప్రజల రాక ప్రారంభమైంది.
- చంద్రబాబు 208 రోజులపాటు చేసిన పాదయాత్రను పురస్కరించుకుని విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్‌చార్జి కేశినేని నాని 208 మీటర్ల పొడవు, 30 అడుగుల వెడల్పు వున్
- కృష్ణాజిల్లా కేసరపల్లి కళాకారులడప్పు వాయిద్యాలు కార్యకర్తలను ఉర్రూతలూగించాయి
-బందోబస్తులో భాగంగా పోలీసులు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ప్రధానవేదికపై 20 నిమిషాలపాటు జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు. ఏయూ గ్రౌండ్స్‌లోకి 15 ప్రవేశద్వారాలు ఏర్పాటు చేశారు. ప్రతిద్వారం వద్ద మెటల్ డిటెక్టర్‌ను ఏర్పాటు చేశారు.
- చంద్రబాబు కాన్వాయ్ గ్రౌండ్స్‌కు రావడానికి రెండు గంటల ముందే సభా ప్రాంగణం మొత్తం జనంతో నిండిపోయింది. దీంతో వేలాది మంది రోడ్లపైనే ఉండిపోవాల్సివచ్చింది.
-వేదిక నుంచి సుమారు అర కిలోమీటరు దూరం వరకు మైకులు ఏర్పాటు చేశారు. దీంతో సభా ప్రాంగణంలోకి రాలేనివారంతా చంద్రబాబు ప్రసంగాన్ని మైకుల ద్వారా విన్నారు.
- కొందరు మహిళలు చిన్నపిల్లలతో సహా సభకు హాజరయ్యారు. వారికి ప్రత్యేకంగా కుర్చీలు వేశారు.
-మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వలంటీర్లకు మైకులో సూచనలు చేశారు.
-హైదరాబాద్ నుంచి వచ్చిన రాము అనే కార్యకర్త ఎన్టీఆర్ వేషంతో అలరించాడు.
- అరిసిమిల్లి రాధాకృష్ణ సారథ్యంలో సింగపూర్ నుంచి వచ్చిన టీడీపీ అభిమానులు సభాప్రాంగణంలో సందడి చేశారు. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు.
-స్థానిక టీడీపీ నాయకులు వాకీటాకీలు పట్టుకుని నిర్వహణ కార్యక్రమాలను పర్యవేక్షించారు. పలువురు వలంటీర్లు తమ నాయకుల ఫొటోలతో తయారుచేసిన టీ షర్టులను ధరించి సందడి చేశారు.
- చంద్రబాబు సభా ప్రాంగణంలోకి ప్రవేశించగానే ప్రత్యేకంగా తయారు చేసిన బాణసంచాను కాల్చారు.
- చంద్రబాబు 2817 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసినందుకు హైదరాబాద్ లోని హైదర్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ ఎం.భానుప్రసాద్ 2817 దీపం బెలూన్లను గాలిలోకి విడిచిపెట్టారు.
- టీడీపీ నేత కింజరాపు ఎర్రన్నాయుడి మృతికి సభ రెండు నిమిషాలపాటు మౌనం పాటించి సంతాపం తెలిపింది.
న టీడీపీ పతాకాన్ని ర్యాలీగా ఏయూ గ్రౌండ్స్‌కు తీసుకువెళ్లారు. కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్ వద్ద ప్రదర్శించారు.

టీడీపీ సభలో సైడ్‌లైట్స్

ముగిసిన బాబు పాదయాత్ర
బాబు వెంట నడిచిన బాలయ్య

విశాఖపట్నం :సుదీర్ఘ పాదయాత్రకు బహుదూరపు బాటసారి చంద్రబాబు తెరదించారు. ఏకబిగిన ఏడు నెలలపాటు నడిచిన పాదాలకు విశ్రాంతి ఇచ్చారు. రాష్ట్రంలోని నైరుతి దిక్కున వర్షాకాలం చివరిలో మొదలు పెట్టిన యాత్రను నడివేసవిలో ఈశాన్య దిక్కున ముగించారు. పదహారు జిల్లాల్లోని 86 నియోజకవర్గాల్లో 208 రోజులపాటు 2817 కిలోమీటర్లు నడిచిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.

శుక్రవారం రాత్రి కూర్మన్నపాలెంలో బసచేసిన ఆయన శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు అక్కడి నుంచి శివాజీనగర్‌లో ఏర్పాటు చేసిన 'విజయ స్థూపం'(పైలాన్) వరకు దాదాపు కిలోమీటరుపాటు నడిచారు. దీంతో ఏడు నెలలపాటు సాగిన పాదయాత్రకు తెరపడింది. పాదయాత్రకు గుర్తుగా ఏర్పాటు చేసిన పైలాన్‌తోపాటు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ప్రజలకే అంకితం.. 'వస్తున్నా మీకోసం' యాత్రను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలకు అంకితం చేశారు. పైలాన్ వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకంపై ఇదే నినాదం చేశారు. 'వస్తున్నా మీకోసం... ప్రజలకే అంకితం' అంటూ... "208 రోజులు... 2817 కిలోమీటర్ల కాలినడక... మూడు ప్రాంతాలు... 1253 గ్రామ సీమల కన్నీటి గాథలు... అడుగడుగునా ఆత్మబంధువులతో బాధలు పంచుకున్న వైనం... దేశ రాజకీయ చరిత్రలో సుదీర్ఘ ప్రయాణం... తెలుగుజాతి గుండెల్లో పదిలంగా మిగిలిపోయే జ్ఞాపకం... ఆరుపదుల వయసులో అనితర సాధ్యమైన సాహసం.... అందరి కష్టాలు వింటూ... మంచిరోజులు వస్తాయని భరోసా ఇస్తూ ముందుకు సాగిన మరో సత్యాగ్రహం...

ప్రజలు కష్టాలు మరిచిన ప్రభుత్వ నిర్లక్ష్యంపై జాతి జనుల ఆగ్రహ జ్వాలకు ఇది శిలాక్షర రూపం' అని శిలాఫలకంపై లిఖించారు. పాదయాత్ర చివరి రోజున చంద్రబాబుతోపాటు సినీ నటుడు బాలకృష్ణ, లోకేశ్, భువనేశ్వరి, ఇతర కుటుంబ సభ్యులు, పార్టీకి చెందిన సీనియర్ నేతలు పాల్గొన్నారు. పవర్ గ్యారెంటీ 8ఓ వ్యక్తి చంద్రబాబుకి నాగలిని బహుమానంగా ఇస్తూ తాను గతంలో జమ్ముకాశ్మీర్‌లో ఒమర్ అబ్దుల్లాకు, యూపీలో ములాయం సింగ్ యాదవ్‌కు ఇలాగే ఇస్తే.. వారు ముఖ్యమంత్రులు అయ్యారని, త్వరలో మీరు కూడా అవుతారంటూ మైకులో ప్రకటించాడు.

వస్తున్నా మీకోసం.. ప్రజలకే అంకితం!విజయ స్థూపం ఆవిష్కరణ

విశాఖపట్నం: వేలాది ద్విచక్ర వాహనాలు..వందలాది కార్లు..బాణసంచా సంబరాలు...సంప్రదాయ నృత్యాల మధ్య సాగిన తెలుగుదేశం ర్యాలీతో విశాఖ నగరం పసుపుమయమైంది. అగనంపూడి వద్ద పైలాన్‌ను ఆవిష్కరించిన అనంతరం.. బాలకృష్ణ, పలువురు పార్టీ నాయకులతో కలిసి ఓపెన్‌టాప్ వ్యాన్‌లో సభావేదిక వద్దకు చంద్రబాబు బయలుదేరారు. సుమారు 24 కిలోమీటర్ల మేర మూడు గంటల పాటు ర్యాలీ సాగింది.

ఈ క్రమంలో దారిపొడవునా జనం చంద్రబాబుకు జేజేలతో ఘనస్వాగతం పలికారు. పలు కూడళ్లలో చంద్రబాబు వాహనాన్ని ఆపి బొకేలు, పూలమాలలు అందజేసి అభిమానాన్ని

చంద్రబాబు వెంట మరో వాహనంలో వున్న ఆయన తనయుడు లోకేశ్ పలుచోట్ల కారులో నుంచి బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేశారు. కార్యకర్తలతో కరచాలనం చేస్తూ ఉత్సాహపరిచారు. ర్యాలీ వాహనంలో చంద్రబాబు, బాలయ్యతోపాటు పార్టీ నేతలు సుజనాచౌదరి, నామా నాగేశ్వరరావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, బండారు సత్యనారాయణమూర్తి, వాసుపల్లి గణేష్‌కుమార్, దాడి రత్నాకర్, కింజరాపు రామ్మోహన్‌నాయుడు తదితరులు ఉన్నారు.
చాటుకున్నారు. మహిళలు మంగళహారతులు పట్టి, తలపాగాలు అలంకరించారు. కొంతమంది సమస్యలపై వినతిపత్రాలను అందజేశారు. ముకుళిత హస్తాలతో ప్రజలకు నమస్కరిస్తూ, కుడిచేతితో అభివాదం చేస్తూ చంద్రబాబు ఉత్సాహంగా ముందుకు సాగారు.

పోటెత్తిన వీధులు!

హరికృష్ణ గైర్హాజరు
జూనియర్ ఎన్టీఆర్,దాడి,కడియం కూడా


విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పాదయాత్ర ముగింపు సభకు పార్టీకి చెందిన పలువురు సీనియర్లు గైర్హాజరయ్యారు. రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ, ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్, విశాఖకే చెందిన సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు దాడి వీరభద్రరావు, తెలంగాణలో సీనియర్ నేత కడియం శ్రీహరి విశాఖ సభకు దూరంగా ఉన్నారు. భారీ బహిరంగ సభకు హాజరు కాకుండా హరికృష్ణ ఢిల్లీలోనే ఉండిపోయారు. ఆ సభకు వెళతారా? అని విలేకరులు ప్రశ్నించగా.. "చూద్దాం.. ఇంకా నిర్ణయించుకోలేదు'' అని చెప్పిన హరికృష్ణ.. సభ జరుగుతున్న సమయానికి ఢిల్లీలోనే ఉండిపోయారు.

టీడీపీలో హరికృష్ణను అణిచి వేసేందుకు కుట్ర చేస్తున్నారని తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి చిట్టూరి ప్రసాద్ చేసిన ప్రకటనను ఆయన స్వయంగా ఆం«ధజ్యోతి విలేకరి దృష్టికి తీసుకువచ్చారు. కానీ, దాని ఆంతర్యమేమిటో వివరించలేదు. ఇక, కడియం శ్రీహరి పార్టీ అధిష్ఠానంపై అలకబూనారు. తన సొంత నియోజకవర్గం స్టేషన్ ఘన్‌పూర్ నుంచి కార్యకర్తలను విశాఖకు పంపిన ఆయన.. స్వయంగా వెళ్లకపోవడం చర్చనీయాంశమైంది. దీంతో, ఆయన పార్టీని వీడనున్నారనే వార్తలు వెలువడ్డాయి. దీనిపై కడియంను వివరణ కోరగా, ఇటీవల జరిగిన పరిణామాలపై మనస్తాపంతోనే సభకు వెళ్లలేదని, అంతమాత్రాన పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

సభకు వెళ్లడంపై చూద్దామన్న హరికృష్ణ

నేడు నగరానికి చంద్రబాబు

హైదరాబాద్ తర్వాత బంజారాహిల్స్ నుంచి నాగార్జున సర్కిల్, ఎల్‌వి ప్రసాద్ ఆస్పత్రి, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీదుగా జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి చేరుకుంటారు. కొంత విరామం తర్వాత పంజాగుట్ట, తార్నాక మీదుగా ఉప్పల్‌కు వెళతారు. అక్కడ మందకృష్ణ మాదిగ నేతృత్వంలో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. విమానాశ్రయం నుంచి చంద్రబాబు ఇంటివరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ర్యాలీ ప్రారంభమవుతుందని తెలిపారు.
: సుదీర్ఘ పాదయాత్ర అనంతరం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆదివారం నగరానికి విచ్చేస్తున్నారు. దీంతో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు నగర టీడీపీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న చంద్రబాబు రాజేంద్రనగర్ మీదుగా ఆరామ్‌ఘర్, అత్తాపూర్, మెహిదీపట్నం మీదుగా ర్యాలీగా వస్తారని నగర పార్టీ అధ్యక్షుడు తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా మాసాబ్‌ట్యాంక్ వద్ద భారీ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు.

భారీ ర్యాలీతో ఘన స్వాగతానికి ఏర్పాట్లు

తెలుగుదేశం అధికార ప్రతినిధి రేవంత్‌రెడ్డి తన ప్రసంగంతో సభికులను, కార్యకర్తలను ఆకట్టుకున్నారు. వేదికపైకి రాగానే.. ఈ జనసంద్రాన్ని చూసి పక్కనే ఉన్న ఆ సముద్రంలోని అలలు కూడా తలలు వంచాల్సిందేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ సుపరిపాలనకు అడ్డా అయితే.. అవినీతి అక్రమాలకు కాంగ్రెస్ పార్టీ అడ్రస్‌గా మారిందన్నారు. 'జనం కోసం జగన్.. జగన్ కోసం జనం' అంటూ జఫ్ఫాగాళ్లు చెబుతున్నారని, అవన్నీ ఒట్టిమాటలని కొట్టేపారేశారు.

జగన్ ఫాలోవర్స్ అంతా జఫ్ఫాగాళ్లని వ్యాఖ్యానించారు. వారు ఇప్పుడు "జగన్ కోసం జైలు.. జైలు కోసం జగన్'' అని ప్రచారం చేసుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో జగన్ కేడీ నంబర్‌వన్ అంటూ విమర్శించారు. జగన్ ప్రజా ఉద్యమాలు చేసి జైలుకు వెళ్లలేదని, అవినీతికి పాల్పడితే ప్ర

రాష్ట్ర ముఖ్యమంత్రి నంబర్‌వన్ మూర్ఖుడు అని, ఆయన 420 బ్యాచ్‌కి నాయకత్వం వహిస్తున్నాడని 'మహారాజశ్రీ 420' అని వ్యాఖ్యానించారు. షర్మిలచేస్తున్న సవాళ్లు వానపాము బుస కొట్టినట్టుందన్నారు. కాగా టీడీపీని అంతం చేయడం ఇందిరమ్మ వల్లే కాలేదని, ఇప్పుడు తల్లి, పిల్ల కాంగ్రెస్‌ల వల్ల ఏమవుతుందని మాజీ ఎంపీ కాలువ శ్రీనివాసులు అన్నారు. వైఎస్, కిరణ్ దయ వల్ల మంత్రులు, అధికారులు జైలుకు పోతున్నారని ఎంపీ నిమ్మల కిష్టప్ప ఎద్దేవా చేశారు.
భుత్వమే జైల్లో వేసిందన్నారు. జగన్ కోసం చోటాలు జైలుకు వెళుతున్నారని, ఆయనేమైనా కార్గిల్ యుద్ధంలో పోరాడిన సైనికుడా అని ప్రశ్నించారు.

అది 420 బ్యాచ్ రేవర్ రెడ్డి ధ్వజ

సాంస్కృతిక కార్యక్రమాలు అదుర్స్
ఉత్సాహపరిచిన సంగీత విభావరి

టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర ముగింపు సభ సందర్భంగా శనివారం ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కార్యకర్తలను, అభిమానులను ఆద్యంతం ఉత్సాహపరిచాయి. టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మండుటెండను సైతం లెక్కచేయకుండా సభా ప్రాంగణంలో ఆశీనులైన వారిని ఉత్సాహపరిచేందుకు రాష్ట్ర టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పి.సాయిబాబా సార«థ్యంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కళాకారులు ప్రదర్శించిన బుర్రకథ కాంగ్రెస్ వైఫల్యాలను చాటిచెప్పింది.


టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాలను క«థకుడు తెలియజేస్తుంటే సభా ప్రాంగణంలో కార్యకర్తలు కేరింతలు కొట్టారు. వీర్నాల కృష్ణ సారథ్యంలో జానపద కళాకారులు తమ గీతాలతో ఆకట్టుకున్నారు. మిమిక్రీ కళాకారులు హరికిషన్, నాగభూషణ్ ... ఎన్టీఆర్, రావుగోపాలరావుతోపాటు హాస్యనటుడు ఎమ్మెస్‌నారాయణ సభకు విచ్చేసినట్టయితే ఏ విధంగా మాట్లాడతారో చక్క

'కదిలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా...త్యాగాలకు వెనుదిరగని దేశభక్తులారా..'అంటూ వందేమాతరం శ్రీనివాస్ ఆలపించిన తొలి గీతానికి కార్యకర్తలు ఉప్పొంగిపోయారు. ఎన్టీఆర్ నటించిన బొబ్బిలిపులి చిత్రం నుంచి మనో ఆలపించిన 'జననీ జన్మభూమిచ్ఛా స్వర్గాదపీ, పుణ్యభూమి నాదేశం నమో నమామి, ధన్యభూమి నాదేశం సదా స్మరామి' వంటి గీతాలకు అభిమానులు నృత్యాలు చేశారు. చంద్రబాబు పాదయాత్ర సభా ప్రాంగణానికి చేరే సమయంలో మనో,వందేమాతరం శ్రీనివాస్, సునీత..'చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, సంభవం నీకే సంభవం, ధర్మానికి నువ్వే రాజువై వంటి గీతాల పల్లవులను పాడి హుషారెక్కించారు.

తరువాత చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా...పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల.. నా తల్లీ బందీ అయిపోతుందో తదితర గీతాలు వేదికపై నేత లను సైతం విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రేక్షకుల కోరిక మేరకు బాలకృష్ణ నటించిన శ్రీరామరాజ్యం చిత్రంలోని జగదానంద తారక, జయజానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం' అంటూ మనో, సునీత ఆలపించగా సభా ప్రాంగణం హర్షాధ్వానాలతో దద్దరిల్లింది.
గా అనుకరించి హర్షధ్వానాలను అందుకున్నారు. తరువాత సినీనటులు మురళీమోహన్, ఏవీఎస్‌ల సార«థ్యంలో వందేమాతరం శ్రీనివాస్, మనోల బృందం ఆలపించిన గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

విశాఖ సభలో ఆకట్టుకున్న బుర్రకథలు,మిమిక్రీ

దివంగత నేత ఎర్రన్నాయుడి తనయుడు
రామ్మోహన్‌నాయుడు ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. సభా వేదికపై అందరూ పోడియం దగ్గరకు వెళ్లి మాట్లాడగా.. రామ్మోహన్ మాత్రం మైకు పట్టుకుని చంద్రబాబు వద్దకు వెళ్లి పెద్దలందరినీ పేరుపేరున ప్రస్తావించి ప్రసంగం చేశారు. ఆరు పదుల వయసులో సుదీర్ఘ పాదయాత్ర చేసి చంద్రబాబు తెలుగు ప్రజల గుండెల్లో ఆత్మవిశ్వాసం నింపారని, దేశానికే స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు.

రాష్ట్రం నలుమూలల నుంచి ఉప్పెనలా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు ఇదే ఉత్సాహంతో వచ్చే ఎన్నికల వరకు పనిచేసి టీడీపీని అధికారంలోకి తేవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి పీఠంపై చంద్రబాబును అధిష్ఠింపజేయాలని, ఢిల్లీలో తెలుగుదేశం చక్రం తిప్పాలని ఆకాంక్షించారు. తన తండ్రి ఆశయం కూడా అదేనని, దాన్ని నెరవేర్చే బాధ్యత శ్రీకాకుళం జిల్లా ప్రజలు తన భుజస్కంధాలపై మోపారన్నారు.

అందుకు శాయశక్తులా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. తనకు చంద్రబాబు అండగా నిలిచారని, అలాగే అభిమానంతో శ్రీకాకుళం నుంచి తరలివచ్చిన అశేష అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. రామ్మోహన్‌నాయుడు ప్రసంగం ఆద్యంతం ఉత్సాహంగా, ఉద్రేకంగా, ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా సాగడంతో చంద్రబాబు సహా అందరూ ఆసక్తిగా విన్నారు. ప్రసంగం తర్వాత రామ్మోహన్‌ను పిలిచి 'శెభాష్' అంటూ చంద్రబాబు భుజం తట్టారు.

ఎర్రన్నాయుడి తనయుడి ఉద్వేగ ప్రసంగం

ఎంత చెప్పినా ససెమీరా అన్నారు
తెలంగాణలోనూ టీడీపీ పట్టు సడలలేదు..
పాదయాత్ర సమన్వయకర్త గరికపాటి


విశాఖపట్నం: ఆరు పదులు నిండిన వ్యక్తి అలుపెరగకుండా అనారోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా ఏడు నెలలు... 2,817 కిలోమీటర్లు పాదయాత్ర చేశారంటే.. అదంతా రాష్ట్ర ప్రజలు ఇచ్చిన మనోధైర్యమేనంటూ చంద్రబాబు పాదయాత్ర సమన్వయకర్త గరికపాటి మోహనరావు పేర్కొన్నారు. యాత్రకు సంబంధించిన కొన్ని విషయాలు మీకు చెప్పాలంటూ బాబు పాదయాత్ర ముగింపు సభా వేదికపై ఆయన ప్రసంగాన్ని ప్రారంభించారు. అనంతపురం జిల్లా హిందూపురంలోని ఆంజనేయస్వామి గుడిలో కొబ్బరికాయ కొట్టి కుడి పాదంతో తొలి అడుగు వేసి ప్రారంభించిన పాదయాత్ర ఏడు నెలలు కొనసాగగా, కొన్నిసార్లు ప్రతికూలతల వల్ల అవాంతరాలు ఎదురయ్యాయన్నారు.

బాబు యోగా చేస్తారు కాబట్టి ఆయనకు ఆరోగ్యం బాగుంటుందని అనుకుంటారు. కానీ వాటికంటే ప్రజలు చూపిన అభిమానమే ఆయన్ను ఇంతకాలం నడిపించిందన్నారు. గద్వాల్‌లో వేదిక విరిగి కింద పడినపప్పుడు ఆయన వెన్నెముక దెబ్బతిన్నదని తామంతా ఆందోళన చెందామని, మరుసటి రోజు వైద్యులు వచ్చి ఫరవాలేదని చెప్పేంతవరకు నాయకులు, కార్యకర్తలు ఎవరికీ కంటి మీద కునుకు లేదన్నారు. చంద్రబాబు తమ ప్రాంతంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తాం అన్నవారు పాదయాత్ర తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రవేశించినప్పుడు అడ్రస్ లేకుండా పోయారన్నారు. తెలంగాణ ప్రజలు అశేషంగా తరలివచ్చి తెలుగుదేశానికి ఏమాత్రం పట్టుసడల్లేదని నిరూపించారని, అలా ధైర్యం నింపిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఆదిలాబాద్‌లోని దట్టమైన అడవుల గుండా పాదయాత్ర చేశామని, ఆయన కాలి చిటికెన వేలు బాగా వాచిపోయిందన్నారు. డాక్టర్లు నడవద్దని చెప్పినా ఆయన వినకుండా మొండిగా ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేశారన్నారు. గుంటూరు జిల్లాలోనూ వేదిక కూలినప్పుడు ఆయన పరిస్థితి చూసి యాత్ర విరమించుకోమని తాము సూచించామని.. చంద్రబాబు మాత్రం ప్రజల కోసం నడుస్తానంటూ కొనసాగించారన్నారు. తుని దగ్గరకు వచ్చేసరికి మళ్లీ కాలు నొప్పి అధికమైందని, రెండు రోజులు విశ్రాంతి తీసుకుని కొనసాగించారే తప్ప అర్ధంతరంగా ఆపడానికి ఆయన ఒప్పుకోలేదని గరికపాటి వివరించారు.

"కనపడిన ప్రతి రాయికి, ప్రతి దేవతకి మొక్కాం. ఏడుకొండల వాడిపై భారం మోపాం. అనంతపురం ఆంజనేయస్వామిని వేడుకొన్నాం. షిర్డీ సాయిని ప్రార్థించాం. ఆయన ఆరోగ్య పరిస్థితి చూసి డాక్టర్లు మమ్మల్ని తిట్టారు. కాలి సమస్య తీవ్రమవుతుందని, జీవితాంతం ఉండిపోతుందన్నారు. ఇది చెప్పినా చంద్రబాబు పాదయాత్ర విరమణకు ఒప్పుకోలేదు. అలా ఆయన్ని ముందుకు నడిపించింది మీ అభిమానమే. ఆ అభిమానంతోనే ఆయన్ను ఏడాది తిరగకుండా ఈ ర్రాష్టానికి మరోసారి ముఖ్యమంత్రిని చేయండి. మీ సమస్యలు పరిష్కరించి రుణం తీర్చుకుంటారు'' అంటూ గరికపాటి తన ప్రసంగాన్ని ముగించారు.

ప్రజల వల్లే ధైర్యం అవాంతరాలు ఎదురైనా నడక ఆగలేదు

ఇదేనా వారి విశ్వసనీయత? : బాల కృష్ణ

ఏదైనా ఉన్నత శిఖరం చేరాలంటే సత్సంకల్పం ఉండాలని నాన్న ఎన్‌టీఆర్ చెప్పేవారని, ఆ సద్గుణాలన్నీ చంద్రబాబులో ఉన్నాయని బాలయ్య అన్నారు. తప్పుచేసిన వారిపట్ల ఎన్‌టీఆర్ చండశాసనుడిలా వ్యవహరించారని, బడుగుబలహీన వర్గాలకు జస్టిస్ చౌదరిలా న్యాయం చేశారని, సంఘ సంస్కరణలకు బొబ్బిలి పులిలా పనిచేశారని వ్యాఖ్యానించారు. పార్టీ అనేకసార్లు క్లిష్టపరిస్థితుల్లో చిక్కుకుంటే చంద్రబాబు రక్షించుకుంటూ వచ్చారన్నారు.

ఆయన పాలనాదక్షుడన్నారు. దురదృష్టం కొద్దీ రాష్ట్రంలో రెండుసార్లు తెలుగుదేశం పార్టీ ఓడిపోతే.. కాంగ్రెస్ నాయకులు అధికారం చేపట్టి ర్రాష్టాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. విద్యుత్ ఇవ్వలేక ఆంధ్రప్రదేశ్‌ను అంధకారప్రదేశ్‌గా మార్చేశారన్నారు. రాష్ట్ర బడ్జెట్ రెండు లక్షల కోట్ల రూపాయలకు చేరినా ప్రజలకు ఏమీ మేలు జరగడం లేదన్నారు.

గంగపుత్రులకు చేపల వేటకు విరామం ఇచ్చారని, తమిళనాడులో ఒక్కో కుటుంబానికి రూ. 4,700 ఆర్థికసాయం చేస్తుండగా, ఇక్కడ నయాపైసా కూడా ఇవ్వడం లేదన్నారు. బాబును అంతా డిక్టేటర్ అంటూ విమర్శిస్తున్నారని, ర్రాష్టాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలంటే ఆ డైనమిజమ్ తప్పకుండా ఉండాలని బాలకృష్ణ పేర్కొన్నారు. జైలు నుంచి బయటకు వస్తాడో రాడో తెలియని జగన్ అధికారంలోకి వస్తాడని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ర్రాష్టానికి పూర్వవైభవం తీసుకురావాలంటే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు, అభిమానులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు విశ్వసనీయత గురించి కొందరు మాట్లాడుతున్నారని, విశ్వసనీయత అంటే నమ్మినవారిని జైలుకు పంపడమేనా? అని సినీనటుడు బాలకృష్ణ వైసీపీని విమర్శించారు. రాజశేఖర్‌రెడ్డి హయాంలో పనిచేసిన మంత్రులు, ఐఏఎస్ అధికారులను ఇప్పుడు జైలుకు పంపారని, అలాంటి విశ్వసనీయత తమకవసరం లేదని బాలకృష్ణ అన్నారు. ర్రాష్టానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబేనని ఉద్ఘాటించారు. సభకు విచ్చేసిన జనవాహినిని చూస్తూ తనదైన సినీ శైలిలో "నేల ఈనిందా.. ఆకాశానికి చిల్లుపడిందా.. సప్తసముద్రాలు ఉప్పొంగాయా?'' అని వ్యాఖ్యానించారు.

నిమ్మనవారిని జైలుకు పంపడమా..?వైసీపీపై బాల కృష్ణ ధ్వజం

సింహాచలం: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 'వస్తున్నా.. మీ కోసం..'పాదయాత్ర ముగిసిన నేపథ్యంలో ఆదివారం వరాహ లక్ష్మీ నృసింహస్వామిని దర్శించుకోనున్నారు. ఆయన ఉదయం పది గంటలకు సింహగిరికి రానున్నారు. చంద్రబాబు రాకను పురస్కరించుకుని స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు పాశర్ల ప్రసాద్, పిసిని వరహానరసింహం ఆధ్వర్యంలో ఘన స్వాగతానికి ఏర్పాట్లు చేశారు. ఉదయం తొమ్మిది గంటలకు స్థానిక పుష్కరిణి సత్రం ఆవరణలో నిర్మలా నృత్యనికేతన్ కళాకారులతో 'వస్తున్నా.. మీ కోసం' పాటలకు నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు.

నేడు అప్పన్న దర్శనానికి చంద్రబాబు రాక

శంషాబాద్: శంషాబాద్‌లో ఆదివారం జరిగే చంద్రబాబునాయుడు బహిరంగ సభ కోసం తెలుగుతమ్ముళ్లు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. శంషాబాద్ ఆర్టీసీ బస్టాండు సమీపంలోని హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై మధ్యాహ్నం 2.45 గంటలకు బహిరంగ సభ ప్రారంభమవుతుంది. వస్తున్నా మీకోసం పాదయాత్ర ముగించుకుని విశాఖపట్టణం నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు చంద్రబాబు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడ తెలుగుదేశం శ్రేణు లు బాబుకు ఘనస్వాగతం పలికి ఊరేగింపుగా శంషాబాద్‌లోని బహిరంగ సభా వేదికకు చేరుకుంటారు.

2.45 గంటలకు సభ ప్రారంభమవుతుంది. బహిరంగ సభను పూర్తిస్థాయి లో విజయవంతం చేయడం కోసం టీడీపీ జిల్లా అధ్యక్షుడు పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే టీ.ప్రకాష్‌గౌడ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుక్కా గోపాల్, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు ఆర్.గణేశ్‌గుప్తా, పార్టీ మండల అధ్యక్షుడు కోడిగంటి చంద్రారెడ్డి, టౌన్ ప్రసిడెంట్ దూడల వెంకటేష్‌గౌడ్, సింగిల్‌విండో చైర్మన్ కె.మహేందర్‌రెడ్డి తదితరులు బహిరంగ సభ ఏర్పాట్లు చేశారు. సభను విజయవంతం చేయడంకోసం జిల్లాలోని ఆయా నియోజకవర్గాలతో పాటు జంటనగరాలకు చెందిన దాదాపు ముఫ్పైవేల మందిని తరలించడానికి ఏర్పాట్లు చేశామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుక్క వేణుగోపాల్ తెలిపారు.

బస్టాండ్‌లో బహిరంగ సభ శంషాబాద్ బస్‌స్టాండ్‌లో హనుమాన్ దేవాలయం ఎదుట సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్కడ గుంతలను పూడ్చివేసి స్టేజీని ఏర్పాట్లను పరిశీలించారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీతో నగరానికి బయలుదేరాడానికి ఏర్పాట్లు చేశారు.

టీడీపీ బహిరంగసభకు విస్తృత ఏర్పాట్లు

చరిత్ర తిరగరాస్తాం
టీడీపీకే మళ్లీ అధికారం..
రాష్ట్రాన్ని దోచుకుంటున్న కాంగ్రెస్
పల్లెలన్నీ కన్నీరు పెడుతున్నాయ్
జైలు పార్టీగా మారిన వైసీపీ
కేసీఆర్‌కు బాబును విమర్శించే అర్హత లేదు..
విశాఖ సభలో ధ్వజమెత్తిన టీడీపీ నేతలు

కాంగ్రెస్, వైసీపీలపై ఆయన విరుచుకుపడ్డారు. రాష్ట్రం అవినీతి ఊబిలో కూరుకుపోయిందని, ఆ రెండు పార్టీల నేతలంతా జైలులోనే గడపాల్సి ఉంటుందన్నారు. కాగా చంద్రబాబు మట్టికొట్టుకుపోతాడని నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారని, ఆ మాటలు అన్న మూడు రోజుల్లో వైఎస్సే మట్టికొట్టుకుపోయాడని పొలిట్ బ్యూరో సభ్యుడు కె.ఇ.కృష్ణమూర్తి విమర్శించారు. 12 గంటలపాటు కరెంటు లేని పల్లెలు మన రాష్ట్రంలో తప్ప దేశంలో మరెక్కడా లేవని, రాష్ట్రంలో పల్లెలన్నీ కన్నీరు పెడుతున్నాయని విమర్శించారు. ఏ-5 ముద్దాయి ఐఏఎస్ శ్రీలక్ష్మి జైల్లో ఉంటే ఏ-4 ముద్దాయి హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి బయట ఉండి పాలన సాగిస్తున్నారని విమర్శించారు. శ్రీలక్ష్మికి ఒక రూలు, సబితకు మరో రూలా అని ఆయన ప్రశ్నించారు.

జగన్ అవినీతి విశ్వవ్యాప్తంగా తెలుసు: నర్సిరెడ్డి ముఖ్యమంత్రి పదవికోసం జగన్ పాకులాడితే.. కాంగ్రెస్ అధిష్ఠానం అతన్ని సీబీఐకి అప్పగించిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లూరి నర్సిరెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ తన హయాంలో ప్రజల బాగోగులు చూడకుండా బంధుప్రీతితో వ్యవహరించారని విమర్శించారు. జగన్ ర్రాష్టాన్ని ఏ విధంగా దోచుకున్నారో విశ్వవ్యాప్తంగా అందరికీ తెలుసునన్నారు. కాంగెస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజలకన్నీ కష్టాలేనని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. అత్యాచారాలు, దౌర్జన్యాలు, దోపిడీలు పెరిగాయని మండిపడ్డారు. తొమ్మిదేళ్ల చరిత్రలో చంద్రబాబు అమలు చేసిన అనేక పథకాలను ఆయన గణాంకాలతో సహా వివరించారు.

కేసీఆర్ వసూల్ రాజా: రమేష్ రాథోడ్ఈ ర్రాష్టాన్ని తల్లి, పిల్ల కాంగ్రెస్ పూర్తిగా దోచుకుంటున్నాయని ఆదిలాబాద్ ఎంపీ రమేష్‌రాథోడ్ ధ్వజమెత్తారు. ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి పథకం వంటి వాటితో కాంగ్రెస్ నాయకులు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే జైల్లో ఉన్న జగన్ బృందంతో పాటు అవినీతి మంత్రుల కోసం కొత్తగా జైలు కట్టాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను వసూల్ రాజాగా అభివర్ణించారు. ఫామ్ హౌస్‌లో కూర్చొని కలెక్షన్లు లెక్కబెట్టుకునే వ్యక్తికి చంద్రబాబును విమర్శించే అర్హత లేదని మండి పడ్డారు.

ఆత్మహత్యల్లో రాష్ట్రం తొలి స్థానం: సోమిరెడ్డి తెలుగుదేశం హయాంలో అభివృద్ధి విషయంలో తొలి స్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు ఆత్మహత్యల్లో మొదటి స్థానంలో ఉందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్ ముఖ్యమంత్రి కాగానే మడమ తిప్పకుండా కోట్లాది రూపాయలు దోచుకున్నాడని ధ్వజమెత్తారు. న్యాయస్థానాలు నిష్పక్షపాతంగా వ్యహరిస్తున్నాయి కాబట్టి ప్రజలకు అంతోఇంతో న్యాయం జరుగుతున్నదని, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను కూడా అమ్మేస్తుందని ఎద్దేవా చేశారు.
విశాఖపట్నం: రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో చరిత్రను తిరగరాస్తుందని ఆ పార్టీ నేతలు జోస్యం చెప్పారు. టీడీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. శనివారం పార్టీ అధినేత చంద్రబాబు పాదయాత్ర ముగింపు సందర్భంగా విశాఖలో జరిగిన భారీ బహిరంగ సభలో పలువురు పార్టీ నేతలు ప్రసంగించారు. ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో బహిరంగ సభ ఏర్పాటుచేస్తే టీడీపీ సత్తా ఏమిటో దేశానికి తెలిసేదని పార్టీ సీనియర్ నేత లాల్‌జాన్ పాషా వ్యాఖ్యానించారు.

జగన్ కోసం జైలు..జైలు కోసం జగన్.........వానపాము బుసకొట్టినట్లు షర్మిల సవాల్

ప్రతి హామీ నెరవేరుస్తా..
పెద్ద కొడుకునై అండగా ఉంటా
పేదరికం లేని సమాజమే నా లక్ష్యం
అసమర్థ ప్రభుత్వంతో అందరికీ కష్టాలే
అన్ని వర్గాలను ఆదుకుంటాం
ఆడబిడ్డలకు ఆత్మగౌరవం,భద్రత మభ్యపెట్టి వైఎస్ మోసం
ఆయన అవినీతి సోనియాకు తెలియదా?
కిరికిరి కిరణ్‌వి ఉత్తి మాటలే..
జగన్ దోచిన సొమ్ము రికవరీ చేయరేం?
పిల్ల కాంగ్రెస్‌కు వ్యక్తిత్వం లేదు..
టీఆర్ఎస్‌ది ఫామ్‌హౌస్‌లో కుంభకర్ణుడి నిద్ర
పాదయాత్ర ముగింపు సభలో చంద్రబాబు నిప్పులు

దారిపొడవునా ప్రతికూడలి వద్ద చంద్రబాబుకు పార్టీ కార్యకర్తలు, వివిధ వర్గాల ప్రజల నుంచి మంగళహారతులతో ఘనస్వాగతం లభించింది. బహిరంగ సభ ఏర్పాటు చేసిన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానం సూర్యాస్తమయానికి ముందే ప్రజలతో కిటకిటలాడింది. చాలా దూరం వరకు మైకులు ఏర్పాటు చేయడంతో ప్రజలు రోడ్లపైనే నిలబడి కూడా ప్రసంగాలను ఆసక్తిగా విన్నారు. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. పలువురు నేతలు చేసిన ఆసక్తికరమై ప్రసంగాలకు సభికుల నుంచి కరతాళధ్వనులతో ప్రశంసలు లభించాయి. సినీహీరో బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. యువ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ గంభీర స్వరంతో చేసిన యాంకరింగ్ సభికులను ఆకట్టుకుంది.

చంద్రబాబు సభా వేదికపైకి వస్తున్నప్పుడు అనేకమంది కార్యకర్తలు ఆయనకు పాదాభివందనాలు చేశారు. మహిళా నేతలు మంగళహారతులు ఇచ్చారు. సభావేదికపై ఉన్న నాయకులంతా లేచి నిలబడి ఎదురేగి ఆయనకు స్వాగతం పలికి వేదికపైకి తోడ్కొనివచ్చారు. సభా ప్రాంగణమంతా ఇసుకేస్తే రాలనంతగా జనంతో నిండిపోయింది. విశాఖ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు సభ విజయవంతమైంది. ఈ సభకు మూడులక్షలకుపైగా జనం హాజరైనట్టు పోలీసు అధికారులు భావిస్తున్నారు. గతంలో ఎన్‌టీ రామారావు 1982లో టీడీపీని స్థాపించిన అనంతరం ఏప్రిల్‌లో విశాఖలోని మున్సిపల్ మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు.

ఇప్పటి వరకు విశాఖ చరిత్రలో అదే అతిపెద్ద సభగా పేర్కొంటారు. దానిని తలదన్నేలా శనివారం చంద్రబాబు సభ జరిగింది. సభను విజయవంతం చేయడంలో ఉత్తరాంధ్ర టీడీపీ శ్రేణులు తమ శక్తిని ప్రదర్శించాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నేతలు తమ నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో తరలివచ్చారు. లక్షల సంఖ్యలో ప్రజల హాజరు చంద్రబాబు పాదయాత్ర ముగింపుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విశాఖకు పొరుగున్న తూర్పుగోదావరి జిల్లానుంచి కూడా గణనీయుంగా పార్టీ శ్రేణులు తరలివచ్చాయి. అధినేత పాదయాత్ర ముగింపు సభను 'నభూతో నభవిష్యత్' అన్నచందంగా నిర్వహించామని నాయకులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. చంద్రబాబు సభ విశాఖ చరిత్రలోనే కాకుండా ర్రాష్ట చరిత్రలోనే చారిత్రక ఘట్టంగా నిలిచిపోతుందని వారు పేర్కొంటున్నారు.

ఒకరిద్దరు మినహా నేతలంతా హాజరు రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని జిల్లాల నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు తరలిరావడంతో సభాప్రాంగణం టీడీపీ రాష్ట్ర కార్యాలయం మాదిరిగా కనిపించింది. ఇదే సమయంలో కొందరు ప్రముఖుల గైర్హాజరు కూడా రాజకీయవర్గాల్లో ఆసక్తిని కలిగించింది. పొలిట్‌బ్యూరో సభ్యులుగా ఉన్న నందమూరి హరికృష్ణ, దాడి వీరభద్రరావు, కడియం శ్రీహరి, సుద్దాల దేవయ్య, జైపాల్ యాదవ్ ఈ సభకు రాలేదు. చంద్రబాబుతో కొంతకాలంగా అంటీముట్టనట్టుగా ఉంటున్న హరికృష్ణ తనకు ఆరోగ్యం బాగోలేనందువల్ల రాలేకపోతున్నానని పార్టీ నాయకులతో చెప్పారు.

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక సమయంలో ఏర్పడిన వివాదంతో బాబు పాదయాత్రకు దూరంగా ఉన్న దాడి వీరభద్రరావు కూడా ఈ కార్యక్రమానికి రాలేదు. విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆయన కుమారుడు దాడి రత్నాకర్ మాత్రం చురుకుగా పాల్గొన్నారు. ఇటీవల కాలంలో కొంత అసంతృప్తిగా ఉన్న కడియం శ్రీహరి కూడా ఇటువంటి కారణాలతోనే గైర్హాజరై ఉంటారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరిగింది. పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్, నందమూరి కుటుంబానికి చెందిన సినీహీరో తారకరత్న కూడా పాల్గొన్నారు. సినీరంగానికి చెందిన వందేమాతరం శ్రీనివాస్, మనో, సునీత, తదితరుల బృందం ఆలపించిన గీతాలు సభికులను ఆకట్టుకున్నాయి. సినీ నటుడు ఏవీఎస్ కూడా వారితోపాటు పాల్గొన్నారు.
విశాఖపట్నం: విశాఖ తీరం జనసంద్రమైంది. సాగర కెరటాలకు పోటీగా జనవాహిని కెరటాలు నగరాన్ని ముంచెత్తాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పాదయాత్ర ముగింపు సందర్భంగా విశాఖలో శనివారం నిర్వహించిన ర్యాలీ, బహిరంగ సభ భారీ జనసందోహంతో కళకళలాడాయి. పాదయాత్ర ముగింపు సందర్భంగా నగర శివారులోని అగనంపూడిలో ఏర్పాటుచేసిన పైలాన్‌ను చంద్రబాబు శనివారం మధ్యాహ్నం ఆవిష్కరించారు. అక్కడనుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహిరంగ సభ ప్రాంగణం వరకు జరిగిన ర్యాలీ కనీవినీ ఎరగని స్థాయిలో జరిగింది. వేల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు, వందల సంఖ్యలో ఇతర వాహనాలు, వాటిని అనుసరిస్తూ వేలాదిమంది కార్యకర్తలతో విశాఖ పసుపురంగు పులుముకుంది.

నేనొస్తా..దారికి తెస్తా...............జన చైతన్యం కోసమే నా యాత్ర..