April 29, 2013
విశాఖలో ఎన్టీఆర్ స్మారక రక్తనిధి ప్రారంభించిన చంద్రబాబు దంపతులు
విశాఖపట్నం
రక్తనిధి ఏర్పాటుకు సింబయాసిస్ సీఈవో నరేశ్ కుమార్ రూ.10 లక్షలు, ఆయన మిత్రులు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, లోకేశ్, టీడీపీ నాయకులు ఎంవీవీఎస్ మూర్తి, కోడెల శివప్రసాద్, నామా నాగేశ్వరరావు, సుజనా చౌదరి, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, వెలగపూడి రామకృష్ణబాబు, సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
: ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో విశాఖ
నగరంలో రక్త నిధి ఏర్పాటైంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి
భువనేశ్వరి ఆదివారం దీనిని ప్రారంభించారు. ఈ బ్లడ్ బ్యాంకులో మూడువేల
యూనిట్ల రక్తం నిల్వ చేయవచ్చు. దీనిని రూ.కోటిన్నర వ్యయంతో ఏర్పాటు చేశారు.
ఇందులో కోల్డ్స్టోరేజీ, బ్లడ్ సెపరేషన్, ఇతర ఆధునిక పరికరాలు సమకూర్చారు.
నిల్వచేసే రక్తంలో 30 శాతాన్ని పేదలకు అందజేస్తారు. రక్తనిధి ఏర్పాటుకు సింబయాసిస్ సీఈవో నరేశ్ కుమార్ రూ.10 లక్షలు, ఆయన మిత్రులు రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ, లోకేశ్, టీడీపీ నాయకులు ఎంవీవీఎస్ మూర్తి, కోడెల శివప్రసాద్, నామా నాగేశ్వరరావు, సుజనా చౌదరి, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, వెలగపూడి రామకృష్ణబాబు, సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
Posted by
arjun
at
6:54 AM