April 29, 2013
భూముల రద్దు కాదు ...రికవరీ చేయాలి: టీడీపీ
హైదరాబాద్: బ్రహ్మణి స్టీల్స్, రక్షణ స్టీల్స్కు కేటాయించిన
భూములను రద్దు చేయగానే సరిపోదని, వాటి ఆధారంగా చేసిన దోపిడీకి సంబంధించిన
సొమ్మును కూడా రికవరీ చేసి ప్రభుత్వం తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని
టీడీపీ డిమాండ్ చేసింది. ఆపార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య సోమవారం
మీడియాతో మాట్లాడారు. "రక్షణ స్టీల్స్కు చేసిన కేటాయింపులను అడ్డు
పెట్టుకొని బయ్యారంలో వేల టన్నుల ఇనుప ఖనిజం తవ్వి కోట్లు గడించారు. ఆ
డబ్బును కూడా రికవరీ చేయాలి'' అని ఆయన డిమాండ్ చేశారు.
Posted by
arjun
at
9:50 PM