April 29, 2013
బాబుకు రెండు వారాలు రెస్టు
హైదరాబాద్
లండన్లో విజయోత్సవ సభ చంద్రబాబు పాదయాత్ర ముగింపు సందర్భంగా లండన్లో ఒక విజయోత్సవ సభ సోమవారం జరిగింది. టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం యూకే, యూరప్ శాఖల ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహించారు. యూకే విభాగం అధ్యక్షుడు గుంటుపల్లి జయకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ విజయోత్సవాల్లో ప్రవాసాం«ద్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ నుంచి డాక్టర్ కోడెల శివ ప్రసాదరావు, పెద్దిరెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, కె.నారాయణరావు, పయ్యావుల కేశవ్, మురళీమోహన్, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, శోభా హైమావతి, పీఆర్ మోహన్, పొట్లూరి హరికృష్ణ, కోటేశ్వరరావు, ఎల్వీఎస్ఆర్కేప్రసాద్ తదితరులు ఫోన్లో తమ సందేశాలు తెలిపారు.
: వెన్నునొప్పి.. కాళ్ల కండరాల నొప్పులు.. జీర్ణకోశ
సమస్యలతో బాధపడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. రెండు వారాల పా టు
విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఏడు నెలల సుదీర్ఘ పాదయాత్ర ము
గించిన బాబుకు ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీకి చెందిన
వైద్యుడు రాకేష్ ఆధ్వర్యంలోని వైద్య బృందం సోమవారం సాయంత్రం పలు వైద్య
పరీక్షలు నిర్వహించింది. నొప్పులతోపాటు.. కాలి చిటికెన వేలు గాయం మూడు
నెలలుగా ఆయనను వేధిస్తోంది. ఇవన్నీ పూర్తిగా తగ్గాలంటే రెండు వారాలపాటు
ఇల్లు కదలకుండా విశ్రాంతి తీసుకోవాల్సిందేనని వైద్యులు స్పష్టం చేశారు.లండన్లో విజయోత్సవ సభ చంద్రబాబు పాదయాత్ర ముగింపు సందర్భంగా లండన్లో ఒక విజయోత్సవ సభ సోమవారం జరిగింది. టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం యూకే, యూరప్ శాఖల ఆధ్వర్యంలో ఈ సభను నిర్వహించారు. యూకే విభాగం అధ్యక్షుడు గుంటుపల్లి జయకుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ విజయోత్సవాల్లో ప్రవాసాం«ద్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ నుంచి డాక్టర్ కోడెల శివ ప్రసాదరావు, పెద్దిరెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, కె.నారాయణరావు, పయ్యావుల కేశవ్, మురళీమోహన్, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, శోభా హైమావతి, పీఆర్ మోహన్, పొట్లూరి హరికృష్ణ, కోటేశ్వరరావు, ఎల్వీఎస్ఆర్కేప్రసాద్ తదితరులు ఫోన్లో తమ సందేశాలు తెలిపారు.
Posted by
arjun
at
9:49 PM