March 10, 2013



ఏలూరు : 'నేను అధికారాన్ని అనుభవించినవాడినే. నేనేమీ స్వార్థపరుడిని కాను. మీ కష్టాలను చూసి ఒక కుటుంబంలో ఒక పెద్ద దిక్కుగా బాధపడుతున్నా. మీరు ఒక అవకాశమిస్తే మీ కష్టాలను, కన్నీళ్లను తుడిచేస్తా' అని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రజల ముందు తన అభిమతాన్ని ఉంచారు. ఇప్పుడు ర్రాష్టంలో కరెంటుకు దిక్కులే దు. ఉపాధి లేదు. డ్వాక్రా మహిళలు ఇ బ్బందుల పాలవుతున్నారు. బెల్ట్‌షాపులతో కుటుంబాలు చితికిపోతున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మీలో ఒకడిగా మీ కష్టాలను చూసే మొక్కవోని ధైర్యంతో పాదయాత్ర చేస్తున్నాన ని స్పష్టం చేశారు. తల్లికాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అంటూ కాంగ్రెస్‌ను, వై ఎ స్సార్‌సీపీని అభివర్ణిస్తూ వచ్చిన ఆయ న ఈ రెండు పార్టీలకు ఇంకో కొత్త పేరు పెట్టారు.

తల్లిపాము, పిల్లపాము గా దీనిని మార్పు చేశారు. పిల్లపాము కు విషం ఎక్కువ అంటూ జగన్ పా ర్టీని ఉద్దేశించి కామెంట్లు చేశారు. వ స్తున్నా మీకోసం పాదయాత్ర 160వ రోజైన ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో కొనసాగింది. ఆకివీడు నుంచి పెద్ద అమిరం వరకు 12 కిలోమీటర్లు సాగిన ఈ యాత్రలో చంద్రబాబు చలాకీగా వ్య వహరించారు. ఒడివడిగా అడుగులు వేశారు. అనేకచోట్ల తాను ప్రశ్నలు సం ధించి ప్రజల నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. బెల్ట్‌షాపులు ఊరూరా పెట్టారు, మంచినీళ్లకు దిక్కులేదుగానీ మద్యం మాత్రం అన్నిచోట్లా దొరుకుతోందని దుయ్యబట్టారు. తాగి వచ్చి మీ భర్తలు ఎవరైనా కొడుతున్నారా అంటూ నేరుగానే మహిళలను ప్రశ్నించారు. ఇక కొడతం, గిడతం కుదురదు, బెల్ట్‌షాపులు రద్దు చేయిస్తా, మా ఆడపడుచులకు అండ గా ఉంటానంటూ తాను పెద్దన్నయ్య గా పాత్ర పోషించే ప్రయత్నం చేశారు. అర్జమూరులో కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు.

కాంగ్రెస్ కిరికిరి సీఎంల వల్లే ర్రాష్టం భ్రష్టుపట్టిందని, వాళ్లు కోట్లు సంపాదించుకుంటే కిందిస్థాయి జనం అప్పుల్లో మునిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరై నా అప్పు లేకుండా, కష్టాలు లేకుండా జీవితం గడుపుతున్నారా అంటూ ప్ర శ్నించి ఇలాంటివేమీ లేవని చేతులెత్తేవారు ఎవరైనా ఉన్నారా అంటూ బా బు ప్రశ్నించినప్పుడు కష్టాల్లో ఉన్నామనే పాదయాత్రలో పాల్గొన్న వారం తా చేతులెత్తి సంకేతాలిచ్చారు. ఇదీ ఈ ర్రాష్టపరిస్థితి. అందుకే మంచి భవిష్యత్ కోసం, అభివృద్ధి కోసం, సామాజిక న్యాయం కోసం నేను కట్టుబడి ఉన్నా, మాట తప్పేదే లేదని స్పష్టం చేశారు. ఇప్పటికీ ఊళ్లలో ఉన్న ఆడపడుచులకు చెవికి దిద్దులు లేవని, మంగళసూత్రాలకు కూడా నోచుకోలేని దుస్థితిలో ఉంటే గాలి జనార్ధనరెడ్డి లాంటివాళ్లు బంగారు పళ్లెం, బంగారు మంచం మీద కులాసా చేస్తున్నారని దుయ్యబట్టడం ద్వారా ప్రజలకు వారి అవినీతి చర్యలను వివరించారు.

ఎక్కడా తాగునీరు లేదు, సాగునీరు లేదు, కరెంటు లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కనీసం తృప్తిగా తినడానికి తిండి లేదు, దీనికి కాంగ్రెస్సే కారణమని ఆరోపించారు. తొమ్మిదేళ్ల పరిపాలనలో ర్రాష్టానికి చేయాల్సిందంతా చేశాం. మంచి జీవితాన్ని గడిపేలా దూరదృష్టితో వ్యవహరించామని చె ప్పుకొచ్చారు. సామాజిక న్యాయం కో సం నేను చేయాల్సిందంతా చేస్తున్నా ను. ఈ విషయంలో అందరికీ తగు న్యాయం చేసేంత వరకు మడమ తిప్పను అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక ఇప్పటిదాకా అన్నింటి మీదా పన్నులు వేశారు. ఇక మిగిలిందంటూ ఉంటే తలనీలాలే. వాటికి కూడా పన్ను వేస్తారు. మీరు కట్టలేదో ఉన్న తలనీలాలను కూడా పీక్కుపోయే దుర్మార్గ ప్రభుత్వం ఉందంటూ పన్నుల తీవ్రతను ఎత్తిచూపారు. ఇప్పుడు వంట గ్యాస్‌కి దిక్కు లేకుండాపోయింది. అప్పట్లో వ్యవసాయానికి పుష్కలంగా నీరు అందిస్తే ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేకుండాపోయిందని అన్నారు. ఎస్సీలకు న్యాయం చేయాలని వర్గీకరణకు మద్దతు ఇచ్చాం. బీసీలకు డిక్లరేషన్ ఇచ్చాం.

మైనార్టీలకు అసెంబ్లీ సీట్లలో వాటా ఇచ్చాను, ఇవన్నీ కూడా మీకోసమే అని హామీ ఇచ్చారు. ప్రజలు బ తుకు కోసం బంగారం తాకట్టు పెట్టుకుంటే వై. ఎస్ తనయులు బంగారు భూములను కూడబెట్టుకున్నారని, కో ట్లు దోచుకుతిన్నారని ఆరోపణలు గు ప్పించారు. ఇప్పుడు మీరంతా అప్పు ల్లో ఉన్నారు, రైతు పరిస్థితి బాగోలేదు. డ్వాక్రా మహిళలకు పావలాకే వడ్డీ అని ఉన్నదంతా ఊడ్చేసేలా డబ్బు వసూ లు చేస్తున్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే బ్యాంకుల్లో తీసుకున్న రుణాలన్నింటినీ మాఫీ చేస్తానని, వ్యవసాయం లాభసాటిగా ఉండేలా చూస్తాతిమని హామీ ఇచ్చారు.

స్వార్థపరుడిని కాను

భీమవరం/ఆకివీడు రూరల్/ఆకివీడు: రాష్ట్రాన్ని 'మద్యం' ప్రదేశ్‌గా మార్చి ప్రజలందరి రక్తాన్ని పీల్చుతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రెండో రోజు పాదయాత్రలో భాగంగా ఆదివారం సీఎం హైస్కూల్ వద్ద ప్రారంభమైన యాత్ర ఆకివీడు మండలం అజ్జమూరు మీదుగా ఉండి మండలంలోకి ప్రవేశించింది. అజ్జమూరు గరువు వద్ద ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు.

కష్టాలు మరిచేందుకు పేదవాడు ఒక పెగ్ మందుతాగితే దానిని కాంగ్రెస్ సర్కారు హాఫ్ వరకు తాగించేందుకు అడుగడునా బెల్ట్‌షాపులు పెట్టారని, దీంతో పేదవాడి జేబు ఖాళీకావడమే కాకుండా మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే రెండో సంతకం బెల్ట్‌షాపుల రద్దుపై చేస్తానని హామీ ఇచ్చారు.

జుట్టుపై కూడా పన్ను వేస్తారు.. తొమ్మిదిన్నరేళ్ళ కాంగ్రెస్ పాలనలో అన్నిరకాల వస్తువులు భారీగా పెరిగిపోయాయన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువులు, నిత్యావసర వస్తువులు, బియ్యం, ఇలా అన్నింటిపైనా ట్యాక్సులు వేసి భారీగా ఖజానా నింపుకుని వాటిని ప్రజా సంక్షేమానికి మాని కాంగ్రెస్‌వారి జేబులు నింపుకుంటున్నారని విమర్శించారు. తమ్ముళ్ళు మీరు ఊరుకుంటే జుట్టుపై కూడా పన్ను వేస్తారని చమత్కరించారు.

పాలనను గాడిలో పెట్టాలని.. గాడితప్పిన పాలనను గాడిలో పెట్టేందుకు తన ఆరోగ్యం సహకరించకున్నా, ఇబ్బందులు పడుతున్నా 160 రోజులుగా పాదయాత్ర చేస్తున్నానని అన్నారు. తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను, మరో తొమ్మిది సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నాను. అధికారం నాకు కొత్తకాదని, పేదవాడికీ, తెలుగువాడికి న్యాయం చేయాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ సుజల పథకం కింద ప్రతీ గ్రామానికి మంచినీరు అందిస్తామని, ఇళ్ళు లేని ప్రతీ పేదవాడికి రూ.లక్ష ఖర్చుపెట్టి ఇళ్ళు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎమ్మెల్యే కలవపూడి శివ, జిల్లా అధ్యక్షరాలు తోట సీతారామలక్ష్మీ, వైటి రాజా, కొక్కిరిగడ్డ జయరాజు, గొట్టుముక్కల సత్యనారాయణరాజు, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి మంతెన వెంకటసత్యనారాయణరాజు (పాందువ శ్రీను), మోటుపల్లి రాజు, మోటుపల్లి ప్రసాద్, బొచ్చు కృష్ణారావు, భూపతిరాజు తిమ్మరాజు, కనుమూరి రామకృష్ణంరాజు, గొంట్ల గణపతి, పాల్గొన్నారు.

రాష్ట్రాన్ని 'మద్యం'ప్రదేశ్‌గా మార్చిన కాంగ్రెస్



ఏలూరు : శివరాత్రి పర్వదినాన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు పశ్చిమ ప్రజలు దీవెనలు ఇచ్చారు. ఆయన పాదయాత్రలో అడుగులో అడుగు వేశారు. అభిమానం కురిపించారు. వరదలా ఆయన వెంట సాగారు. వెల్లువెత్తిన ఉత్సాహం ముందు బాబు సైతం 12 కిలోమీటర్ల తన ప్రయాణంలో తొమ్మిది కిలోమీటర్లను నాలుగున్నర గంటల వ్యవధిలోనే అలవోకగా దాటేశారు. అర్జమూరు నుంచి ఆదివారం సాయంత్రం ప్రారంభమైన ఆయన పాదయాత్ర నిండుగానే సాగింది. పార్టీ శ్రేణులను పసుపు రంగుతో కనువిందు చేసింది. ఉదయాన్నే శివరాత్రి పండుగను చేసుకున్న జనమంతా సాయంత్రం నాటికల్లా చంద్రుడి వెంట కదిలారు. తొలిరోజు చాలా నెమ్మదిగా సాగిన బాబు యాత్ర ఆదివారం మాత్రం అత్యంత వేగంగా, ఉత్సాహంగా ముందుకు సాగింది. అర్జమూరులో గుమ్మిగూడిన ప్రజలు బాబూ మాట్లాడండి అంటూ పట్టుబట్టారు.

హారతులిచ్చారు, ఆయనకు చేరువయ్యేందుకు పోటీలుపడ్డారు. యువకులు కేరింతలతో ఆయనకు దన్నుగా నిలిచారు. ఎవరూ వాహనాలు ఎక్కకుండా నేరుగా ఆయనకు తోడుగా అర్జమూరు నుంచి ఉండి వరకు ముందుకు సాగుతూ వచ్చారు. తన రెండోరోజు పశ్చిమయాత్రలో చంద్రబాబు వినూత్నంగా కూడా వ్యవహరించారు. ప్రజలను ఉత్తేజపరిచే ప్రసంగాలతో పాటు వారి స్థితిగతులను అడిగి తెలుసుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మీలో ఎవరైనా కోటి రూపాయలు చూశారా, కనీసం లక్ష రూపాయలు చూశారా, 500 కట్టలు చూశారా, లేదా వంద రూపాయలను చూశారా అంటూ ప్రశ్నలు అడుగుతుంటే జనం నుంచి లేదు లేదు అనే జవాబు వచ్చింది. వెయ్యి లారీల లోడు ఉన్న లక్ష కోట్లను జగన్ వెనకేసుకున్నాడు. వై. ఎస్ తన కొడుకుకి ఇచ్చిన సంపద ఇది. మీలాంటి పేదవాళ్లు అన్ని కోట్లు చూసే అవకాశం ఎలా రాగలుగుతుందంటూ వారిలో చైతన్యం నింపేందుకు ప్రయత్నించారు. ఎవరి మీదా నాకు కోపం లేదు, ధ్వేషం లేదు, ఈర్ష్య లేదు, మీరు పడుతున్న బాధలను చూసిన తర్వాతే ఇలా ముందుకు సాగాలనిపించి వచ్చాను అని చెప్పుకొచ్చారు.

గీత కార్మికులను, పండ్లు అమ్ముకునే వారిని, ఇటుక బట్టీలలో పనిచేసే కార్మికులను భుజం తట్టి పలకరించారు. 'అయ్యా.. మాకు దిక్కు లేదు. గుడిసెలోనే ఉంటున్నాం. కనీసం ఇల్లు కూడా లేదు. ఏం బతుకయ్యా మాది' అంటూ చెరుకువాడలో ఓ మహిళ కన్నీటి పర్యంతమైనప్పుడు 'అమ్మా తప్పకుండా ఇల్లు కట్టిస్తాం. బాధపడొద్దు' అంటూ ఓదార్చారు. బాబుగారు.. అప్పుల్లో ఉండిపోయాం. బ్యాంకుల్లో ఉన్న అప్పులను మాఫీ చేసేయండి.. మా బతుకు మేం బతుకుతాం' ఇది మరో మహిళ నుంచి వచ్చిన ఆవేదన. ఇంకొక దగ్గర 'మీరు రైతుల్లో రుణాలు మాఫీ చేస్తాం అంటున్నారు. అదే జరిగితే మాకే కొండంత సంతోషం' అని రైతులు పేర్కొన్నప్పుడు కూడా నా తొలి సంతకం రుణా మాఫీపైనేనని, వ్యవసాయం గిట్టుబాటు అయ్యేలా చూస్తానని ధైర్యాన్ని ఇచ్చారు. చెరుకువాడ నుంచి ఉండి వరకు మార్గమధ్యలో ఆయనకు పిల్లలు, మహిళలు, వృద్ధులు ఎదురేగి తమ కష్టాలను చెప్పుకునే ప్రయత్నం చేశారు. కలశిపూడిలో శివుడిని దర్శించుకున్నారు. చంద్రబాబు సీ ఎం కావాలని స్థానికులు అక్కడ దీవెనలు అందించారు. పెదపుల్లేరు అడ్డరోడ్డు వద్ద దివంగత సీనియర్ నేత అబ్బాయిరాజును చంద్రబాబు స్మరించారు.

ఆయన లేని లోటును గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు బిల్లులను ప్రస్తావిస్తున్నప్పుడు ఓ బాలిక ఆయనకు తాజాగా వచ్చిన బిల్లులును అందిస్తూ 'ఇంత బిల్లు ఎలా కట్టాలిసార్' అంటూ బాబు ముందు గోడు వెళ్లబోసుకుంది. ఇప్పుడు జగన్ వంటివాళ్లు దోచుకున్న సొమ్మును మీరు రికవరీ చేయగలుగుతారా అని ఉండిలో కొందరు ప్రశ్నిస్తే.. ఇతర ర్రాష్టాల్లో ఇప్పటికే ఇది సాధ్యమైంది. తప్పకుండా అధికారంలోకి వస్తే తిన్న వాటిని కక్కిస్తాం. ఆ సొమ్ము ప్రజల కోసమే ఖర్చుపెడతానంటూ తిరుగు సమాధానమిచ్చారు. అర్జమూరు నుంచి ఉండి వరకు ప్రజలతో జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. బస్సులో ప్రయాణిస్తున్న వారు, వాహనాల్లో ప్రయాణిస్తున్న వారు, పనులు చేసుకుని తిరిగి వెళ్తున్న వారు చంద్రబాబుకు అభివాదం చేస్తూ తమ అభిమానం చాటుకున్నారు. దీనికి ప్రతిగా బాబు చేతులు జోడించి ప్రతిఅభివాదం చేస్తూ ముందుకుసాగారు. ప్రజల కష్టాలు, నష్టాలు తెలుసుకుంటూనే, పార్టీ విధానాలను వివరిస్తూనే, తాను ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చబోతానో చెప్పుకుంటూనే రెండోరోజు యాత్రలో బాబు హుషారు కనబరిచారు.

తెలుగుదేశం ముఖ్యనేతలు రెండవ రోజు ఆదివారం బాబు వెంట ఆసాంతం కొనసాగారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి, ఎమ్మెల్యే శివరామరాజు, మాగంటిబాబు, పీతల సుజాత, కొక్కిరిగడ్డ జయరాజు, పాలీ ప్రసాద్, పాందువ శ్రీను, ముళ్లపూడి బాపిరాజు, శశి విద్యాసంస్థలకు చెందిన వేణుగోపాల్, గాదిరాజు బాబు, ఉప్పాల జగదీష్‌బాబు, పెనుమర్తి రామ్‌కుమార్, జూనియర్ ఎం ఆర్‌సి తదితరులు ఉన్నారు.

జనం వరద

భీమవరం/ఆకివీడు రూరల్/ఆకివీడు: జిల్లాలో చంద్రబాబు పాదయాత్రలో భాగంగా అజ్జమూరు గ్రామంలో పాదయాత్రలో ప్రసంగిస్తూ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకున్న తీరుపై కోతి-మొసలి కథ చెప్పారు. ఒక నది గట్టుపై కోతి నివసిస్తుంది. అదే నదిలో ఒక మొసలి కూడా జీవిస్తుంది. కోతి, మొసలిలు ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. దీంతో ప్రతీ రోజు మొసలికి కోతి కొన్ని నేరేడు పండ్లు కోసి ఇస్తుండేది. వాటిని కొన్నితిని మరికొన్ని తన భార్యకు తీసుకెళ్ళేది మొసలి. అయితే మొసలి భార్యకు ఒక రోజు దుర్బుద్ది పుట్టింది. ఇంత రుచికరమైన పండ్లు తింటున్న కోతి గుండెకాయ ఎంతరుచిగా ఉంటుందోనంటూ అది తనకు తెచ్చిపెట్టమని భర్తను కోరింది. భార్య కోర్కెను తీర్చేందకు భర్త మొసలి కోతి వద్దకు వచ్చి నదిలో షికారు తిప్పుతానని వీపుపై కూర్చొపెట్టుకుంది. నది మధ్యలోకి వెళ్ళాక దీని కోర్కెను బయటపెట్టింది.

దీంతో కంగుతిన్న కోతి తెలివిగా ప్రవర్తించి అరే నా గుండెను ఈ రోజు చెట్టుపై పెట్టి వచ్చానే ముందే చెబుతే తీసుకువచ్చేదానిని కదా అంటూ వెనక్కి తిప్పాలని కోరింది. దీంతో మొసలి చెట్టువద్దకు తీసుకొచ్చింది. ఆ వెంటనే ఒక్క ఉదుటున చెట్టెక్కిన కోతి ఇన్నాళ్ళు నీలాంటి దుష్టులతో స్నేహం చేశాను ఇకపై ఈ పక్కకు రావద్దని హెచ్చరించింది. ఈ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజల నుంచి అన్నీ లాక్కుని గుండె మాత్రమే ఉంచిందని చమత్కరించారు. మీరు ఆదమరిస్తే తమ్ముళ్ళు ఆ గుండెను కూడా తినేస్తారని అన్నారు.

మొసలి- కోతి కథతో బాబు చమత్కారం


టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు యనమల రామకృష్ణుడు, శమంతకమణి, మహ్మద్ సలీం సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఉదయం 10.45 గంటలకు ఎన్టీఆర్ భవన్ నుంచి బయలుదేరి ఎన్టీఆర్ ఘాట్ మీదుగా శాసనసభకు వెళ్లి.. మధ్యాహ్నం 1-1.30 మధ్య నామినేషన్లు దాఖలు చేస్తారని పార్టీ నేత ఎల్వీఎస్సార్కే ప్రసాద్ వెల్లడించారు.

నామినేషన్లు నేడు...



ప్లీజ్.. అర్థం చేసుకోండి
ఎంత మందికి అవకాశం ఇవ్వగలను?
పశ్చిమగోదావరిలో చంద్రబాబు వెల్లడి

"పార్టీ కోసం ప్రాణాలు అర్పించేవారున్నారు. కష్టపడుతున్న వారున్నారు. త్యాగాలు చేస్తున్న వారు ఉన్నారు. నేను సామాజిక న్యాయం కోసం ఒక మాట ఇచ్చాను. ఆ కోణంలోనే ఈసారి ముగ్గురికి అవకాశం ఇచ్చాను. ఇంకా ఎంతమందికి ఇవ్వగలను? మా వాళ్లు అర్థం చేసుకోవాలనే కోరుకుంటున్నా'' అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. "మా పార్టీలో సీనియర్ నాయకుల్లో దాడి వీరభద్రరావు ఒకరు. ఆయనంటే మాకు గౌరవం ఉంది. నిన్న, ఈ రోజు ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నించా. దురదృష్టవశాత్తు ఆయన మాట్లాడలేదు. ఆయన కూడా ఎమ్మెల్సీ సీటు వస్తుందని ఆశించారు. రాలేదన్న బాధవల్లే నాతో మాట్లాడలేకపోయి ఉండొచ్చు'' అన్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో 'వస్తున్నా.. మీ కోసం' పాదయాత్ర కొనసాగిస్తున్న చంద్రబాబు ఆదివారం సాయంత్రం ఆకివీడులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా యనమల రామకృష్ణుడు, శమంతకమణి, మహ్మద్ సలీం పేర్లను ఆయన అధికారికంగా ప్రకటించారు. ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం దక్కలేదని శనివారమే చంద్రబాబు ఎదుట భోరుమన్న వికలాంగుడు కోటేశ్వరరావు ఉదంతాన్ని కూడా చంద్రబాబు విలేకరుల సమావేశంలో ప్రస్తావించారు. కోటేశ్వరరావులా పార్టీలో కష్టపడి పనిచేసే నేతలు చాలామంది ఉన్నారని, వీరికి కచ్చితంగా అవకాశం ఇస్తామని చెప్పారు.

"ప్రస్తుతం మా బలాన్ని బట్టి.. మూడు ఎమ్మెల్సీ సీట్లకే అవకాశం ఉంది. అన్ని అంశాలూ చర్చించాం. శనివారం సాయంత్రమే ఒక కొలిక్కి వచ్చింది. మూడు ప్రాంతాల్లోని విభిన్నవర్గాలకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించాకే ఈ కసరత్తు పూర్తి చేశాం. ఎవరి విషయంలోనూ రాగద్వేషాలు లేవు. పార్టీలో కొందరికి అన్యాయం, మరికొందరికి న్యాయం జరగదు'' అన్నారు. దాడి వీరభద్రరావుకు ఎమ్మెల్సీ సీటు రాకపోవడంతో ఆయన అనుచరులు రాజీనామాలు చేసిన అంశాన్ని ప్రస్తావించగా, బాధతో కొందరు అలా స్పందించి ఉండొచ్చని.. ప్రస్తుత పరిస్థితులను బట్టి అందరికీ ఒకేసారి అవకాశాలు ఇవ్వలేమని చెప్పారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని అందరినీ అభ్యర్థిస్తున్నానని తెలిపారు.

మహిళా నేతలు కూడా పార్టీ కోసం నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నారని, వారు కూడా సముచిత స్థానం కోరుకుంటారని.. అందుకే అన్ని వర్గాలకూ ఇకముందు పదవుల్లో అవకాశాలు ఇస్తామని ప్రకటించారు. గుర్తింపు లేదని ఎవరూ అసంతృప్తి చెందొద్దని.. అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి.. ముఖ్యమంత్రిగా కూడా పనిచేసి... ఇప్పుడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వెళ్లలేకపోవడంపై విలేకరులు ప్రశ్నించగా.. "నిజమే.. నేను అసెంబ్లీకి వెళ్లాల్సిందే. కానీ ప్రజా సమస్యల పరిష్కారాన్ని ఒక యజ్ఞంగా భావించి పాదయాత్ర ప్రారంభించాను. మా పార్టీలో నాతో పాటు అనుభవం ఉన్న నాయకులు ఎంతోమంది ఉన్నారు. వారు కచ్చితంగా అసెంబ్లీలో ప్రభుత్వ తీరును ఎండగట్టి తీరుతారు. నేనెలాగూ జనం మధ్యనే ఉన్నాను కాబట్టి అక్కడే సర్కార్‌ను ఎప్పటికప్పుడు నిలదీయడానికి వెనుకాడబోను' అన్నారు.

అందరూ పార్టీ కోసం కష్టపడిన వారే

ఆప్యాయతలకు.. అనురాగాలకు.. గోదావరి జిల్లాల ప్రజలు పెట్టింది పేరు! అతిథులు ఎవరు వచ్చినా వారికి మర్యాదలు చేయడం, ఆప్యాయతను పంచడంలో ఈ ప్రాంతానికి సాటి లేదు. అదే సమయంలో.. అల్లూరి సీతారామరాజు లాంటి పోరాట యోధులకు జన్మనిచ్చిన గడ్డ ఇది. ఇక్కడ యాత్ర చేస్తున్నప్పుడు.. ఆ మన్నెం వీరుడి స్ఫూర్తి అడుగడుగునా కనిపిస్తోంది. చెరుకువాడ, కలిసిపూడి, ఉండి.. ఇలా ఇక్కడ ఏ ప్రాంతానికి వెళ్లినా రహదారికి ఇరువైపులా పచ్చగా పరుచుకున్న కొబ్బరి చెట్లు, పంటపొలాలే!

కానీ.. ఈ పచ్చదనం రైతుల ఇంట సిరులు కురిపిస్తుందన్న గ్యారెంటీ లేదు. తుఫాను వస్తే పండుటాకులా వణికిపోయే ప్రాంతమిది. చేతికందిన పంట తుఫానుపాలు కావడం ఇక్కడి ప్రజలకు అలవాటైపోయిన విషయం. తడిసిన ధాన్యం తమకు భారం కాకూడదని.. గత్యంతరం లేని పరిస్థితుల్లో వాటిని అయినకాడికి అమ్ముకోవడం ఇక్కడి రైతన్నలకు అలవాటైపోయింది. గోదావరి డెల్టా అని పేరుకేగానీ, ఆ వైభవం అంతరించిపోయే ప్రమాదం ముంచుకొస్తోంది. కాలువల వ్యవస్థ అంతా శిథిలావప్థకు చేరుతోంది.

ఒక్క రైతులనే కాదు.. ఈ ప్రాంతంలో అరటి పళ్లు అమ్ముకునేవాళ్లను, దర్జీలను, ఇటుకలు తయారుచేసే వాళ్లను, కల్లుగీత కార్మికులను కలిశాను. అందరిదీ ఒకటే వ్యధ. ఎవరి పరిస్థితీ బాగాలేదు. 'ఎలా ఉన్నారు' అని అడిగితే.. అందరివీ కన్నీటి కథలే. 'ఇల్లు కూడా లేదు, ఎలా బతకాలయ్యా' అని ఒక మహిళ బోరుమంది. 'బ్యాంకుల్లో వడ్డీలు కట్టలేకపోతున్నాం.. రుణాలు మాఫీ చేస్తే మా బతుకు మేం బతుకుతాం' అని మరో మహిళ వాపోయింది. వారందరి కష్టాలూ విన్నాక నా కర్తవ్యం మరోసారి బోధపడింది. రుణమాఫీతో పాటు మరిన్ని అడుగులు వేస్తే తప్ప వారి కష్టాలు తీర్చలేననీ.. కన్నీళ్లు తుడవలేననీ అర్థమైంది.

ఆ పచ్చదనం.. అంతరించే ప్రమాదం

  చంద్రబాబు ఎడమ కాలి బొటన వేలి గాయం తిరగబెట్టింది. ఆదివారం అర్ధరాత్రి ఉండిలో బహిరంగ సభను ముగించుకొని పెద అమిరంలో ఏర్పాటుచేసిన రాత్రి బసకు వెళుతున్న తరుణంలో గాయం తీవ్రమైంది. అప్పటిదాకా పంటిబిగువున బాధను అనుభవిస్తూనే ముందుకు సాగేందుకు చంద్రబాబు ప్రయత్నించారు.

ఉండి నుంచి కిలో మీటరు మేర ప్రయాణించాక గాయం బాధ తట్టుకోలేక రోడ్డు మీదే కుర్చీలో చాలాసేపు కూర్చుండిపోయారు. వెంటనే ఆయన రక్షణ బృందంలో ఉన్న వారు సపర్యలు చేశారు. అనంతరం రాత్రి బసకు బయలు దేరారు. గడచిన కొద్దికాలంగా బొటన వేలి గాయం వేధిస్తున్నా ఆయన పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఆదివారంకూడా అర్జమూరు నుంచి ఉండికి 11 కిలోమీటర్ల దూరాన్ని సుమారు ఐదున్నర గంటల వ్యవధిలోనే అధిగమించారు. ఫలితంగా గాయం తిరగబెట్టింది.

తిరగబెట్టిన 'బాబు' గాయం

ఒకటి తల్లిపాము.. ఇంకొకటి పిల్లపాము
అందులో పిల్లపాముకి విషమెక్కువ
కాంగ్రెస్, వైసీపీలపై చంద్రబాబు ధ్వజం
సామాజిక కోటాలోనే ఎమ్మెల్సీ అభ్యర్థులు
పశ్చిమ పాదయాత్రలో టీడీపీ అధినేత



"కాంగ్రెస్, వైసీపీలు తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లు కాదు. ఒకటి తల్లి పాము.. ఇంకొకటి పిల్లపాము. వీటిలో పిల్లపాముకి విషమెక్కువ'' అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. " వైఎస్, కిరణ్‌కుమార్‌రెడ్డి లాంటి వాళ్లు కిరికిరిలు చేసి ర్రాష్టాన్నే అధోగతి పాల్జేశారు. అందుకే ర్రాష్టాన్ని బాగుచేద్దామని, ఒక గాటికి తీసుకువద్దామని శరీరం సహకరించకపోయినా మీకోసం వస్తున్నా'' అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. చంద్రబాబు తలపెట్టిన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో రెండో రోజు కొనసాగింది. ఆకివీడు నుంచి ఉండి గ్రామం వరకు యాత్ర సాగింది. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో అభిమానులనుద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు.

టీడీపీకి మతం, కులం వంటి వివక్ష లేవీ లేవని స్పష్టం చేశారు. బీసీలకు తాము ఒక స్పష్టతతో కూడిన డిక్లరేషన్‌ను ప్రకటించామని, కాంగ్రెస్ వాళ్లు ఇప్పటిదాకా బీసీలకు ఏదైనా చేశారనుకుంటే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు అసెంబ్లీలో వంద సీట్లు ఇస్తామని టీడీపీ ప్రకటించిందని.. అంత దమ్ము మరే పార్టీకైనా ఉందా అని ప్రశ్నించారు. స్వార్థం కోసం ఈ పాదయాత్ర చేయడం లేదని, ప్రజల ఇబ్బందులను గమనించే ముందుకు సాగుతున్నానని ఆయన స్పష్టం చేశారు. "వైఎస్‌కు తాను పెద్దకుమారుడిని అని గాలి జనార్దన్‌రెడ్డి స్వయంగా చెప్పారు. ఆయనేమో ర్రాష్టంలో బంగారమే లేనంతగా దోచేశారు. రెండవ కుమారుడు జగన్ లక్ష కోట్లు తినేశాడు'' అని బాబు వ్యాఖ్యానించారు.

వెంకటేశ్వరస్వామికి బంగారం మంచం లేదుగానీ, గాలి జనార్దనరెడ్డి వంటి వారికి బంగారు మంచం, కంచం ఎలా వచ్చాయో ఓసారి ఆలోచించాలని హితవు పలికారు. "నాకున్నది ఒకే అబ్బాయి. బాగా చదివించి అతణ్ని ప్రయోజకుడిగా తీర్చిదిద్దుతున్నాను. నా భార్య చిన్న వ్యాపారం చేస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఆమే నాకు తిండిపెడుతోంది. మా ఇంట్లో నా భార్యకు, కోడలికి కూడా స్వేచ్ఛ ఇచ్చాను. వాళ్లు కూడా కష్టపడే తత్వాన్నే అలవర్చుకున్నారు'' అని తన కుటుంబం గురించి బాబు చెప్పుకొచ్చారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైఎస్ ఇంటి స్థలం ఇవ్వాలని అడిగారని.. గజం 30-50 వేలు చేసే స్థలాన్ని వెయ్యి రూపాయలు ఖరీదు కట్టి ఇమ్మని అడిగితే తాను తిరస్కరించానని గుర్తు చేశారు.

ఇప్పుడు వైఎస్ తనయుడు బెంగళూరులోను, లోటస్‌పాండ్‌లోను ప్యాలెస్‌లు కట్టారన్నారు. హైదరాబాద్ వచ్చిన ఎవరైనా తన ఇంటిని, జగన్ ప్యాలెస్‌లను చూసి ఎవరు స్వార్థపరులో అవినీతిపరులో తేల్చిచెప్పాలని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కాపాడేందుకు తనకో అవకాశం ఇవ్వాలని చెరుకువాడ, అర్జమూరు సభల్లో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వర్గీకరణపై వెనక్కి తగ్గబోమన్నారు. తాగి వచ్చి భార్యలను వేధించే వారి భరతం పడతానని హెచ్చరించారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలోనూ సామాజిక న్యాయం పాటించానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. పేదవాళ్ల పొట్టకొట్టడంలోను, ర్రాష్టాన్ని భ్రష్టు పట్టించడంలోనూ కాంగ్రెస్ సీఎంలు పోటీపడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. శివరాత్రి కావడంతో తాను బసచేసిన చోటే సతీమణి భువనేశ్వరితో సహా బస్సులోనే పూజలు చేశారు.

టీడీపికి మతం, కులం లేవు

చిత్తూరు : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ తన మూడు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటనను ముగించుకుని శనివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో చిత్తూరుకు వచ్చారు. ఈ సందర్భంగా లోకేష్‌కు పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులు, జిల్లా ప్రధాన కార్యదర్శి గౌనివారి శ్రీనివాసులు, చిత్తూరు నగర అధ్యక్షుడు మాపాక్షి మోహన్ ఘన స్వాగతం పలికారు. తొలుత లోకేష్ కాజూరులోని పార్టీ జిల్లా కార్యదర్శి కాజూరు బాలాజి ఇంటిలో తేనీటి విందుకు వెళ్ళారు. అక్కడ బాలాజి కుటుంబ సభ్యులతో కొంత సేపు చర్చించారు. ఈ సందర్భంగా లోకేష్‌ను పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నాని, కాజూరు బాలాజి శాలువా, గజ మాలతో సన్మానించారు. అక్కడ నుంచి లోకేష్ నేరుగా లక్ష్మీనగర్ కాలనీలోని పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులు ఇంటికి వెళ్ళారు. అక్కడ ఆయనకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.

లోకేష్‌తో ఫొటోలు తీసుకోవడానికి నేతలు, కార్యకర్తలు పోటీపడ్డారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, జంగాలపల్లె శ్రీనివాసులు, మాజీ ఎంపీ దుర్గ, నేతలు దొరబాబు, కఠారి మోహన్, ఇందిర, వైవి రాజేశ్వరి, షణ్ముగం, శ్రీదర్ వర్మ, విల్వనాధం తదితరులతో లోకేష్ కొంత సేపు పార్టీ స్థితిగతులపై చర్చించారు.కాగా, కొంగారెడ్డిపల్లె వద్ద పూతలపట్టు నియోజకవర్గ నేత ఎన్.పి భాస్కర్‌నాయుడు లోకేష్‌కు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

చిత్తూరు నేతలతో లోకేష్

చిత్తూరు : వివిధ వర్గాల సంక్షేమం కోసం టీడీపీ తయారు చేయించిన డిక్లరేషన్లను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పార్టీ జిల్లా పరిశీలకుడు,మాజీ మంత్రి కోడెల శివప్రసాద రావు పిలుపునిచ్చారు. త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపునకు ఇప్పటినుంచే తయారు కావాలని కోరారు. శనివారం చిత్తూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేలా వున్నాయన్నారు. సాధారణ ఎన్నికలకు సైతం ఏడాది మాత్రమే గడువుందని,కాబట్టి నాయకులంతా తమ మధ్య ఉన్న మనస్పర్థలు, బిడియాలు పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలతో ప్రజలు విసిగిపోయారని, ఇక వైసీపీ నేతల అవినీతి గురించి అందరికీ తెలిసిందేనన్నారు.

సంపాదన తప్ప ప్రజా సంక్షేమం పట్టని జగన్ జీవితం ఇక జైల్లోనే వుంటుందన్నారు.ఈ పరిస్థితుల్లోనే ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడం కోసం చంద్రబాబు చేపడుతున్న పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. చంద్రబాబు పాదయాత్రతో టీడీపీకి పూర్వ వైభవం వచ్చిందని, ఇదే స్ఫూర్తితో పార్టీ నేతలు, కార్యకర్తలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమర్ధవంతంగా పాలించగల సత్తా ఒక్క చంద్రబాబుకే ఉందని ప్రజలే చెబుతున్నారన్నారు. ఇటీవల జరిగిన కుప్పం టౌన్ బ్యాంకు, సింగిల్ విండో ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటిందని, ఇదే స్ఫూర్తితో పార్టీ నేతలు, కార్యకర్తలు కష్టపడి పనిచేసి పంచాయతీ ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధం కావాలన్నారు. చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్ ,ఎమ్మెల్యేలు బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి,హేమలత మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను జనంలోకి తీసుకెళ్ళి వారిని చైతన్యపరచాలన్నారు.

తొలుత ఎన్‌టీఆర్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎంపీ దుర్గ, మాజీ ఎమ్మెల్యేలు పట్నం సుబ్బయ్య, చదలవాడ కృష్ణమూర్తి, గాంధీ, లలిత కుమారి,నేతలు దొరబాబు,నాని, అశోక్ రాజ్, నరసింహ యాదవ్, శ్రీనాథ రెడ్డి, షణ్ముగం, కఠారి మోహన్, శ్రీధరవర్మ, వై.వి రాజేశ్వరి, పుష్పావతి, పర్వీన్ తాజ్, అశోక్ ఆనంద్ యాదవ్, మాపాక్షి మోహన్, విల్వనాధం తదితరులు పాల్గొన్నారు. టీడీపీ సమావేశం అనంతరం నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని పరిశీలకుడు కోడెల శివప్రసాద రావు,అధ్యక్ష కార్యదర్శులు జంగాలపల్లె శ్రీనివాసులు,గౌనివారి శ్రీనివాసులు, ఎంపీ శివప్రసాద్ సమీక్షించారు.జిల్లా కార్యవర్గ సభ్యులను శనివారం ప్రకటించాల్సి వున్నప్పటికీ అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు.

టీడీపీ డిక్లరేషన్లను ప్రజల్లోకి తీసుకెళ్లండి

(విజయవాడ) 'వస్తున్నా.. మీకోసం ..' అంటూ రెండు విడతలుగా జిల్లాకు వచ్చిన చంద్రబాబు కేడర్‌కు టానిక్ ఇచ్చారు. పార్టీకి పునాదులు... జవసత్వాలను ఇచ్చే కార్యకర్తల స్థైర్యాన్ని పెంచారు. వారిలో ఉత్సాహాన్ని తీసుకు వచ్చారు. పార్టీని నాయకుల కంటే నడిపించాల్సిందే మీరేనంటూ కర్తవ్య పథాన్ని గుర్తు చేసి తట్టి లేపారు. చావులోనూ పోరాట పంథా వీడకండి అంటూ ధైర్యాన్ని నూరి పోశారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయటంతో పాటు, అటు ప్రజల మెచ్చిన నాయకుడిగా అలుపెరగని బాటసారి జేజేలందుకున్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి 'డిక్లరేషన్'ను ప్రకటించి తన విజన్ చూపారు. అటు తొలి విడత, ఇటు రెండవ విడత కలిపి 28 రోజుల పాటు 10 నియోజకవర్గాలలో .. 15 మండలాలలో .. 143 గ్రామాలలో.. 3 మునిసిపాలిటీలు.. ఒక కార్పొరేషన్‌లో 310.5 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన బాబు జిల్లాలో టీడీపీకి ఒక శక్తి ఇచ్చి వెళ్ళారు.

నీరసం, నిస్సత్తువలో ఉన్న తెలుగు తమ్ముళ్లకు, కార్యకర్తలకు చంద్రబాబు ఊపిరిలూదారు. పాదయాత్రతో ఇటు పార్టీని పటిష్ఠపరచటంతో పాటు.. అటు ప్రజ ల్లో ఎనలేని సింపతి చంద్రబాబు పొందారు. జనవరి 21న జిల్లాలో మొదటి విడత జగ్గయ్యపేట దగ్గర గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఫిబ్రవరి 6వ తేదీ వరకు 6 అసెంబ్లీ నియోజకవర్గాలు (జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, నగరంలో తూర్పు, పశ్చిమ, మధ్య నియోజకవర్గాలు)లో 7 మండలాలు, 83 గ్రామాలు, 2 మునిసిపాలిటీలు, ఒక మునిసిపల్ కార్పొరేషన్‌తో కలిపి 17 రోజుల పాటు 155.3 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. అనంతరం గుంటూరు పర్యటనకు వెళ్ళిన చంద్రబాబు తిరిగి మళ్ళీ ఫిబ్రవరి 27న రెండవ విడతగా అవనిగడ్డ మీదుగా జిల్లాకు వచ్చారు. ఈసారి అవనిగడ్డ, పామర్రు, గుడివాడ, కైకలూరు నియోజకవర్గాలలో 8 మండలాల పరిధిలో 60 గ్రామాలు, 1 మునిసిపాలిటీ పరిధిలో 155.2 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.

ప్రస్తుత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విరుచుకు పడ్డారు. ప్రజలకు అర్థమయ్యే భాషలో వారిని చైతన్యవంతం చేసే దిశగా బాబు సఫలీకృతులయ్యారు. తన హయాంలో ఐటీ ఎలా ఉందో చెప్పిన బాబు, ఇప్పు డు ఎలా ఉందో బేరీజు వేస్తూ జనంలోకి చొచ్చుకుపోయారు. రెండవ విడతగా జిల్లాకు వచ్చినప్పుడు చంద్రబాబు పార్టీని బలోపేతం చేసే విషయమై ఎక్కువగా దృష్టి సారించారు. ప్రతి రోజూ 2 నియోజకవర్గ కార్యకర్తల సమావేశాలలో పాల్గోనేవారు. కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారో వా రి నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకునే వారు. సలహాలు స్వీకరించారు. వారిలో ఉత్సాహాన్ని తీసుకు వ చ్చారు. ఏడాది పాటు సెలవులు పెట్టి పనిచేయాలం టూ చెప్పారు. అవసరమైతే మీ వంతు ఖర్చు పెట్టండి. తర్వాత నేను చూసుకుంటానని హామీ ఇచ్చారు. శాసనసభలో ప్రభుత్వ అసమర్థ విధానాలపై ఎలా పోరాడాలో ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు.

చంద్రోత్సాహం

గుడివాడ : రాష్ట్రాన్ని వైఎస్సార్ దోచేస్తే.. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రజలపై పన్నుల భారం మోపుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. కైకలూరు మండలం ఆలపాడులో శనివారం మైలవరం, కైకలూరు నియోజకవర్గ కార్యకర్తల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో దొంగలు పడ్డారు. ప్రజలు సమస్యలతో మగ్గుతున్నారు. అరాచిక శక్తులు అధికారంలో అర్రులు చాస్తున్నాయి. వీటిని సంహించలేక ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కష్టపడితే అధికారం మనదేనన్నారు. చంద్రబాబు సమావేశంలో ఎక్కువ సమయం కార్యకర్తలకే కేటాయించారు. పాదయాత్రకు సమయం కావడంతో ముఖాముఖిలో కొద్ది మందికే అవకాశం కల్పించారు.

ఈ క్రమంలో కార్యకర్తలు పలు సూచనలు చేశారు. రుణమాఫిలో కాంగ్రెస్ అవినీతికి పాల్పడిన విషయాన్ని తెలుగుదేశం పార్టీ విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కుల వృత్తులు కుంటు పడిన విషయాలను ప్రజల్లో తీసుకెళ్ళాలన్నారు. పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటాన్ని తప్పని సరిగా ఏర్పాటు చేయాలన్నారు. మండలానికి ఒక అబ్జర్వర్‌ను నియమించాలని కోరారు.అనంతరం బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో పిల్ల కాంగ్రెస్ వలలో నాయకులు లొంగుతున్నారు గానీ, కార్యకర్తలు ఎవరూ లొంగడం లేదన్నారు. మైలవరం, కైకలూరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉన్నారని వారికి అండదండగా నిలిచి కార్యకర్తలు ఆహర్నిశలు శ్రమించాలని పిలుపునిచ్చారు.

ఎన్నికలకు ముందే నియోజకవర్గ, ఏరియా, బూత్ ఇన్‌ఛార్జీల ద్వారా పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తానన్నారు. విద్యుత్ కోత, సర్‌చార్జీల పేరిటభారం, అధిక ధరలు, నిరుద్యోగం లాంటి విషయాలను కూడా నియోజకవర్గంలో ప్రచారం చేయాలన్నారు. ఈ క్రమంలో కమిటీలు పని చేస్తేనే పార్టీ పటిష్ఠంగా ఉంటోందన్నారు.జగన్‌పార్టీకి తెలంగాణలో సీన్ లేదని, టీఆర్ఎస్ సహకార ఎన్నికల్లో చతికల పడిందని, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరమైందని చంద్రబాబు అన్నారు. నాయకులు, కార్యకర్తలు చిన్నచిన్న స్పర్థలుంటే సర్థుబాటు చేసుకోవాలన్నారు.

మొత్తం మీద అధినేత కార్యకర్తలు పార్టీ మనుగడకు ఢోకా లేదని గెలుపు కష్టం కాదని నిర్ణయానికి వచ్చారు. సమావేశంలో ఎమ్మెల్యేలు జయమంగళ వెంకటరమణ, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

వైఎస్ దోచేస్తే..కిరణ్ పన్నులతో బాదేస్తూ..