July 29, 2013

 ఒంగోలు గ్రామ సంగ్రామంలో రెండు దశల ఎన్నికలు ముగిశాయి. జిల్లాలోని ఒం గోలు, కందుకూరు రెవెన్యూ డివిజ న్‌ల పరిధిలో 44 మండలాల్లోని 818 పంచాయతీలకు సర్పంచ్‌లు ఎన్నిక య్యారు. రెండు దశల్లోనూ సైకిల్ స వారీ చేసింది. వైసీపీకన్నా 62 పంచా యతీలను అధికంగా తన ఖాతాలో వేసుకుని ఆధిపత్యం సాధించింది. రెం డో స్థానంలో వైసీపీ నిలవగా, కాం గ్రెస్ పార్టీ మూడో స్థానానికి పరిమి తమైంది. మొత్తం పది అసెంబ్లీ సెగ్మెం ట్‌లలో తొలి, మలిదశ పంచాయతీ పోరు జరగ్గా ఐదు నియోజకవర్గాల్లో తెదేపా మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుని ఆధిక్యతను చాటుకుంది. రెండు చోట్ల కాంగ్రెస్, మరో రెండు సెగ్మెంట్లలో వైసీపీ ముందంజ వేశా యి. ఒక నియోజకవర్గంలో తెదేపా, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోరు కన్పించింది. మొత్తం ఫలితాలపై తెదే పా వర్గీయుల్లో ఆనందోత్సాహాలు వ్య క్తమవుతుండగా, వైసీపీ వర్గీయుల్లో కొంత నిరాశ కనిపిస్తున్నది. అయితే అనేక పంచాయితీల్లో ఆయా పార్టీల మద్దతుదారులు ఒక అవగాహనతో పోటీ చేసి గెలుపొందడం, ఏకగ్రీవం గా ఎన్నికవడం వలన స్వతంత్ర అభ్య ర్థులు కన్పిస్తున్న సర్పంచ్‌ల సంఖ్య భారీగానే ఉంది. ఆయా పార్టీల ఆధిక్యంలో వీరు కీలకంగా మారే అవకాశం ఉంది.
జిల్లాలో తొలిదశలో 313, మలి దశలో 475 వెరసి 818 పంచాయ తీలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో తొలిదశలో 141, మలిదశలో 163 పంచాయతీల్లో తెదేపా మద్దతుదారు లు గెలుపొందారు. ఆ ప్రకారం ఇప్ప టి వరకూ ఆ పార్టీ మద్దతుదారులు 304 సర్పంచ్ పీఠాలను దక్కించుకు న్నారు. వైసీపీ మద్దతుదారులు తొలి దశలో 100, మలిదశలో 142 వెరసి 242 పంచాయతీలను కైవసం చేసు కున్నారు. కాంగ్రెస్ మద్దతుదారులు తొలిదశలో 66, మలిదశలో 119 కలిపి 185 పంచాయతీల్లో విజయం సాధించారు. మలిదశలో సీపీఎం మద్దతు అభ్యర్థి ఒకరు గెలుపొందారు. తొలిదశలో 36మంది, మలిదశలో 50మంది స్వతంత్రులు గెలుపొందా రు. వీరి విషయంలో ఆయా పార్టీల ఫలితాల్లో వ్యత్యాసం కన్పిస్తున్నది. తొలిదశ ఎన్నికల్లో పర్చూరు, సంత నూతలపాడు, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెదేపా మద్దతుదా రులు ఆధిక్యతను సాధించుకున్నారు. మలిదశలో దర్శి, కొండపి నియోజక వర్గాల్లో ఆ పార్టీ మద్దతుదారులు ముందువరసలో నిలిచారు. తద్వారా మొత్తం ఐదు సెగ్మెంట్లలో తెదేపా అధిక్యతను సాధించింది.
కాంగ్రెస్ పార్టీ తొలిదశలో చీరాల లోనూ, మలిదశలో కనిగిరిలో మాత్ర మే ఆధిక్యతను సాధించింది. అద్దంకి, మార్కాపురం నియోజకవర్గాల్లో వైసీ పీ ముందుకు దూసుకెళ్లింది. అద్దం కిలో తమ పార్టీ మద్దతుదారులు అధి క స్థానాలను కైవసం చేసుకున్నట్లు తెదేపా సీనియర్ నాయకుడు కరణం బలరాం ప్రకటించారు. కాగా కందు కూరు అసెంబ్లీ నియోజకవర్గంలో తెదేపా, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరా హోరీ పోరు జరిగింది. శనివారం పోలింగ్ జరగ్గా ఆదివారం కొంత మంది స్వతంత్రులు వారి అభిప్రాయా లను వెల్లడించారు.
తదనంతరం పరి స్థితిని పరిశీలిస్తే మొత్తం 91పంచాయ తీల్లో 34చోట్ల కాంగ్రెస్, 33చోట్ల తెదే పా, 16చోట్ల వైసీపీ మద్దతుదారులు, 8 చోట్ల స్వతంత్రులు గెలుపొందారు. దీంతో స్వతంత్ర అభ్యర్ధుల వైఖరిలో మార్పు ఉంటుందా? లేక ప్రస్తుతం ఉన్నట్లే స్వతంత్రంగా ఉంటారా? అనే విష యం తేలాల్సి ఉంది. తెదేపా అధిక పంచాయతీలు దక్కిన నియోజ కవర్గాల విషయాన్ని పరిశీలిస్తే పర్చూ రులో ప్రత్యర్ధి పక్షాలకు పెట్టని కోటలు గా ఉన్న పంచాయతీలను సైతం గెలు చుకోవడం విశేషం. ఇందుకు యద్దన పూడిని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే డెయిరీ మాజీ చైర్మన్ చెంగల య్య ఆధిపత్యానికి ఇప్పటి వరకూ తిరుగులేని కోనంకిలో తెదేపా మద్దతు దారులు విజయం సాధించారు. అదే తరహాలో స్వర్ణ పంచాయతీని తెదేపా దక్కించుకోవడం ప్రాధాన్యతను సం తరించుకుంది. మండల కేంద్రాల్లో మార్టూరు, ఇంకొల్లు, కారంచేడు పం చాయతీలు కూడా తెదేపా దక్కడం విశేషం. సంతనూతలపాడు నియోజక వర్గంలో కూడా తెదేపా గణనీయమైన సంఖ్యలో పంచాయతీలను రాబట్టుకో గలిగింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ మద్దతుతో పలు పంచాయతీలలో పో టీ చేయడం విశేషం. కొండపి ని యో జకవర్గంలో తెదేపా భారీ ఆధి క్యతను సాధించుకున్నారు. దర్శి సెగ్మెంట్‌లో లభించిన ఆధిక్యత అక్కడ తెదేపా పట్టు పెరిగిన విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. కాంగ్రెస్ ఆధిక్యత సాధిం చి చీరాలలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ వ్యక్తి గత ప్రభావం ఉన్నట్లు చెప్పుకోవచ్చు.
కనిగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించి మెజారిటీ పంచాయ తీల్లో తమ మద్దతుదారులు గెలిపిం చుకోవడం ద్వారా కాంగ్రెస్‌ను ముం దువరసలో నిలిపారు. ఇక్కడ తెదేపా అనూహ్యంగా మూడో స్థానానికి పడి పోవడం విశేషం. వైసీపీ అద్దంకి, మా ర్కాపురం నియోజకవర్గాల్లో ఆధిక్యత లో నిలిచింది. అద్దంకిలో తెదేపా నా యకులు ప్రకటించిన లెక్కలను పరిగ ణలోకి తీసుకున్నా తొలివిడత ఎన్నిక లలో అక్కడ గణనీయమైన సంఖ్యలో పంచాయతీలను వైసీపీ మద్దతుదా రులు దక్కించుకున్నారు. మలివిడత లో మార్కాపురం నియోజకవర్గంలో ఆ పార్టీ ఆధిక్యత సాధించింది. ఆ సెగ్మెంట్‌లో ఇంకో మండలంలో ఎన్ని కలు జరగాల్సి ఉన్నప్పటికి ఇప్పటికే వైసీపీ మంచి ఆధిక్యత లభించింది. ద్వితీయ స్థానంలో తెలుగుదేశం, తృతీయస్థానంలో కాంగ్రెస్‌పార్టీ ఉండ టం విశేషం. ఒంగోలు నియోజకవ ర్గంలో తెదేపా పార్టీ ప్రధమ స్థానంలో నిలిచింది. అయితే తెలుగుదేశం, కాం గ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేయడం, వైసీపీని చెందిన ఎమ్మెల్యే
బాలినేనిని దెబ్బతీయటమే లక్ష్యమన్నట్లుగా ముందుకు సాగటం గమనార్హం.
కీలకంకానున్న స్వతంత్రులు
ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా తొలి దశలో 36 మంది, మలి దశలో 56 మంది మొత్తం 86 మంది స్వతం త్రులుగా ఎన్నికయ్యారు. వీరిలో అనే క మంది రెండు పార్టీల మధ్య కుదిరి అవగాహనతోనూ, ఒక పార్టీ మద్దతు తోనే విజయం సాధించిన వారే. అయి తే వీరు చివరికి ఏ పార్టీ పక్షాన నిలు స్తారన్న విషయం అర్ధంకాని విధంగా ఉంది. కొందరైతే పూటకో పార్టీపేరు చెప్తూ అయోమయానికి గురి చేస్తున్నా రు. దీంతో ప్రధాన పార్టీలు ఎవరికి వారే వీరిలో కొందరు తమ ఖాతాలో వేసుకుంటున్నారు. అయితే తుది దశ ఎన్నికలు కూడా ముగిసి, స్వతంత్రు లు ఏపార్టీ పక్షాన నిలుస్తారన్న విష యం కచ్ఛితంగా తేలితే ఆయా పార్టీ ల్లో ఏది ముందు వరసలో నిలుస్తుం దో తేటతెల్లమవుతుంది. ఇప్పటి వరకు ఐతే తెదేపానే ముందంజలో ఉంది.

రెండు దశల్లోనూ సైకిల్ సవారీ