January 9, 2013





తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పాదయాత్ర చేపట్టి 100 రో జులు పూర్తయిన సందర్భంగా తెలుగుయువత రాష్ట్ర కమిటీ అధ్వర్యంలో పూల తీవాచీలు పరిచారు. వందో రోజు యాత్ర ప్రారంభించేందుకు బాబు వస్తున్న దారి పొడవునా పసుపు బంతిపూలు పరి చి, తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇందుకోసం ఖమ్మం విజయవాడ నుంచి మూ డు క్వింటాళ్ల బంతిపూలు తెప్పించారు. చంద్రబాబు బస చేసిన గుడారం నుంచి రాష్ట్ర కమిటీ సమావేశం వేదిక వరకు బ ంతిపూలను నేలపై పరిచారు.

ముగ్గులేసిన మహిళలు

చంద్రబాబు పాదయాత్ర చేపట్టి వంద రోజులు పూర్తయిన సందర్భంగా తెలు గు మహిళ రాష్ట్ర కమిటీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ రంగవల్లి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పాదయాత్ర ని మిత్తం జిల్లాలో అడుగిడిన చంద్రబాబునాయుడుకు తెలుగు మహిళలు శు భాకాంక్షలు తెలిపారు. అందమైన ము గ్గులను వేశారు. బంతిపూలతో ఆలంకరించారు. రాత్రి 8గంటలకు ముగ్గును ప్రా రంభించి తెల్లవారు జా మున పూర్తి చే శారు. కార్యక్రమంలో తెలుగు మహి ళా కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు శోభాహైమావతి, కార్యదర్శి సుప్రియ, నాయకురాళ్లు సత్యవాణి, ప ద్మ జా, సేకిలారెడ్డి, పాల్గొన్నారు.

వంద కిలోల భారీ కేక్‌ల కటింగ్

చంద్రబాబునాయుడు పాదయాత్ర చేప ట్టి వందరోజులు పూర్తయిన సందర్భం గా మాదిరిపురంలో రెండు వంద కిలో ల భారీ కేక్‌లను కట్ చేశారు. చంద్రబాబు బస చేసి న గుడారం వద్ద నారా లోకేష్ యువసేన రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వంద కిలోల కేక్‌ను పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కట్‌చేశారు. తరువాత పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం వద్ద జిల్లా తెలుగు యువత అ ధ్వర్యంలో ఏర్పాటు చేసిన మరో కేక్‌ను చంద్రబాబు కట్ చేశారు. సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన నాయకులు కా ర్యకర్తలకు కేక్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుయువత జిల్లా నాయకులు కేతినేని హరీష్, చింతని ప్పు కృష్ణచైతన్య, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి తోటకూర రవిశంకర్ లోకేష్ యువసేన రాష్ట్ర నాయకులు గు ర్రం రామకృష్ణ, భానుచందర్, రా మా రాజు, అ శోక్ తదితరులు పాల్గొన్నా రు.

సావనీర్ ఆవిష్కరణ

వంద రోజుల పాదయాత్ర విశేషాలను వివరిస్తూ కార్యక్రమ సమన్వయకర్తలు దీపక్‌రెడ్డి, గరికపాటి రాంమోహన్‌రావు తదితరులు రూపొందించిన సావనీర్‌ను చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. వారిని అభినందించారు.

అధినేత కోసం విచిత్రవేషం

చీరాలకు చెందిన అభిమాని మనోహర్ హరిదాసు వేషం వేశారు. అందర్నీ అలరించారు.

తల కెక్కిన అభిమానం

చంద్రబాబునాయుడిపై అభిమానాన్ని చాటుకుంటూ నగరంలోని ప్రకాశ్‌నగర్ కు చెందిన అప్జల్ అనే కారు డ్రైవర్ తన తలపై చంద్రబాబు అనే అక్షరాన్ని కనిపి ంచేలా జుత్తును కత్తిరించుకున్నారు.

బాబుకు కుల సంఘాల స్వాగతం

జిల్లాలో పాదయాత్ర చేపట్టిన చంద్రబాబునాయుడుకు వివిధ వృత్తి సంఘాలు ఘనస్వాగతం పలికాయి. వృత్తి విశేషాలను చంద్రబాబు యాత్ర మార్గంలో దారి పొడవునా ప్రదర్శించారు. అనంతరం సమస్యలను పరిష్కరించాలని వివిధ కుల సంఘాల నాయకులు చం ద్రబాబుకు వినతిపత్రాలను సమర్పించారు.


సంక్రాంతి అరిశెల రుచి

తెలుగు మహిళా కమిటీ అధ్వర్యంలో సంక్రాంతి అరిశెలను తయారు చేశారు. బాబుకు రుచి చూపించారు. నెయ్యితో ప్రత్యేకంగా తయారు చేసిన అరిశెలను రాష్ట్ర కమిటీ నాయకులకు, కార్యకర్తలకు, మీడియా ప్రతినిధులకు పంచారు.


చంద్రన్న కోసం

చంద్రబాబునాయుడుపై అభిమానంతో వికలాంగులు పాదయాత్ర కార్యక్రమ ం లో పాల్గొన్నారు. నరసరావుపేటకు చెం దిన పీ.సునీల్‌కుమార్ అనే వికలాంగుడు కాళ్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోని యాత్రలో పాల్గొన్నారు. గతంలో చంద్రబాబునాయుడు నిర్వహించిన వివిధ నిరసన కార్యక్రమాల్లో కూ డా సునీల్‌కుమార్ పాల్గొన్నారు. ఈనేపథ్యంలో ఆం ధ్రజ్యోతి ఆయన్ను పలకరించగా ' క ష్టాల కడలి లో ఉన్న రాష్ట్రాన్ని ఒడ్డున పడేసేందుకు ఆయన చేస్తున్న యాత్ర ముందు నేను చేస్తున్నదెంత'' అని పే ర్కొనడం గమనార్హం.

బసవన్నల నృత్యం

చంద్రబాబు వందో రోజు పాదయాత్రను పురష్కరించుకుని డోలు వాయిద్యాల కనుగుణంగా బసవన్నలతో నృత్యం చేయించారు.

వస్తున్నా .. మీకోసం


బుధవారం తిరుమలాయపాలెం మండలం మాదిరిపురంలో జరిగిన టీడీపీ రాష్ట్రస్థాయి విస్తృత స మావేశంలో పొలిట్‌బ్యూరో సభ్యులు ప్ర భుత్వ వైఫల్యాలపై విరుచుకుపడ్డారు. పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ కేంద్రం వత్తిడితో విద్యుత్ బిల్లులను దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో 70శాతం పెం చారన్నారు. టెలిస్కోపిక్ విధానాన్ని ఎ త్తివేయడం వల్ల ప్రజలపై రెట్టిం పు భా రం పడుతోందన్నారు. 2009 ఎన్నికల ముం దు అప్పటి సీఎం వైఎస్ అధి క ధరలకు విద్యుత్ కొని డిస్కంలకు రూ. 6వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో పెట్టడంతో భారం ప్రజలపై పడిందన్నా రు. వ్యవసాయ సంక్షోభం అనే అం శం పై మాజీమంత్రి కోడెల శివప్రసాదరావు మాట్లాడుతు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు బడ్జెట్‌ను మాయాజాలంగామార్చి వ్యవసాయ రంగానికి నిధులు కేటాయిస్తున్నట్టు కేవలం లెక్కలే చూపారన్నారు. డీఏపీ «ధరను రూ.480 నుంచి 1266కు, కాంప్లెక్స్ ఎరువులు రూ. 1200 పెంచారన్నారు. కేవలం మూడేళ్ల లో 12సార్లు ధరలు పెంచి రైతన్నల నడ్డివిరిచారన్నారు. పొలిట్‌బ్యూరో సభ్యురాలు శో భా హైమావతి మా ట్లాడుతూ ఢిల్లీ లో వైద్య విద్యార్ధినిపై అతికిరాతకంగా అ త్యాచారంచేస్తే బొ త్స, షిండే , షీలాదీక్షిత్,అభిజిత్ ముఖర్జి తదితర నేతలు బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేయ డ ం సిగ్గుచేటన్నారు. ములుగు ఎమ్మెల్యే సీ తక్క మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభు త్వం దీపం ప«థకాన్ని కొండెక్కించిందనివిమర్శించారు. ఏడాదికి 10 లక్షల చొ ప్పున మూడేళ్లలో 30లక్షల కనెక్షన్లుఇస్తామని వైఎస్ఆర్ హామీ ఇచ్చినా 8 ఏళ్లలో కేవలం పదిలక్షల కనెక్షన్లు కూడా ఇవ్వకుండా నమ్మకద్రోహం చేశారని విమర్శి ంచారు. టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశ వ్ మాట్లాడుతూ ప్రజల కష్టాలు తె లు సుకునేందుకే చంద్రబాబు 63ఏళ్ల వ యస్సులో కూడా వస్తున్నా మీకోసం పేరి ట పాదయాత్ర చేస్తున్నట్టు తెలిపా రు. ఆరోగ్యం సహకరించ కపోయినా 15 81 కి.మీ. పాదయాత్ర పూర్తిచేశారని తెలిపా రు. 630 మందికి రూ. 15.87లక్ష లు ఆ ర్థికసహాయం చేశారన్నారు.

టీడీపీ హా మీలపై మాట్లడుతూ రైతులకు రుణమా ఫీ, బీసీలకు వంద అ సెంబ్లీ స్థా నా లు, స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేష న్లు, ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యా యం, జిల్లా యూనిట్‌గా గిరినులకు రి జర్వేషన్లు, వికలంగులకు నెలకు రూ.1 500, వృద్ధాప్య, వితంతువులకు రూ. 600 ఇస్తామని తెలిపారు. పొలిట్‌బ్యూరో స భ్యుడు కేఈ కృష్ణమూర్తి మాట్లాడు తూ స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయానికి స భ్యత్వ నమోదు ఎంతో కీలకమన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇన్‌చార్జిలను ని యమించి సభ్యత్వ నమోదు చురుగ్గాసాగేటట్టు చూ డాలని సూచించారు.

రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు







'వస్తున్నా మీ కోసం' పేరిట చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర మంగళవారం రాత్రి జిల్లాలోకి ప్రవేశించనుంది. జిల్లాలో ఏడురోజులపాటు చంద్రబాబు యాత్ర కొనసాగుతుంది. వరంగల్ జిల్లా మరిపెడ నుంచి మంగళవారం రాత్రి 9గంటలకు చంద్రబాబు తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం చేరుకుంటారు. జిల్లా సరిహద్దుల్లో పార్టీ అధినేతకు ఘనస్వాగతం పలికేందుకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, ఊకే అబ్బయ్య, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్సీలు పోట్ల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మినారాయణతోపాటు జిల్లాకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. అనంతరం చంద్రబాబు ఆ రాత్రి మాదిరిపురంలోని మిషన్ స్కూల్‌లో బస చేస్తారు. బుధవారం ఉదయం మిషన్ స్కూల్ ఆవరణలోనే టీడీపీ రాష్ట్ర కమిటీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఇదే సమావేశంలో.. చంద్రబాబు పాదయాత్ర నల్గొండ జిల్లాలో కొనసాగించాలా లేదా కృష్ణాజిల్లాలో ప్రవేశించాలా అనే విషయాన్ని నిర్ణయం తీసుకుంటారు. అనంతరం చంద్రబాబు పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని మాదిరిపురంలో ఏర్పాటు చేసిన భారీ జ్ఙాపిక స్తూపాన్ని, ఎన్టీఆర్ విగ్రహాన్ని, పార్టీ జెండాను చంద్రబాబు ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత 10 కి.మీ మేర పాదయాత్ర చేస్తారు. జిల్లాలో తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మంరూరల్, ఖమ్మం కార్పొరేషన్, ముదిగొండ, నేలకొండపల్లి మండలాల మీదుగా పాదయాత్ర సాగుతుంది. పాలేరు, ఖమ్మం, మధిర నియోజకవర్గాలకే పరిమితమైన ఈ యాత్ర జిల్లా మొత్తం మీద 101.9 కిలోమీటర్ల మేర జరుగుతుంది. సంక్రాంతి పండుగనాటికి చంద్రబాబు పాదయాత్ర ఖమ్మం పట్టణంలోకి ప్రవేశించేలా రూట్‌మ్యాప్‌ను పార్టీ నేతలు సిద్ధం చేశారు. 13న ఖమ్మం పట్టణంలో జరిగే సంక్రాంతి సంబరాల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఇందుకోసం ఇప్పటినుంచే నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు యాత్రను జిల్లా టీడీపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతంలో ఉన్న విభేదాలను పక్కన బెట్టి జిల్లాలో బాబు పాదయాత్రను విజయవంతం చేసేందుకు ఉద్యుక్తులయ్యారు. ఇందులో భాగంగా బాబు పాదయాత్ర సాగే గ్రామాలన్నీ పసుపు మయమవుతున్నాయి. భారీ కటౌట్లు, స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు.

బాబు దృష్టికి జిల్లా సమస్యలు :


చంద్రబాబు పాదయాత్ర జరిగే గ్రామాల్లో ప్రధాన సమస్యలను పార్టీ నేతలు చంద్రబాబుకు వివరించనున్నారు. ప్రధానంగా జిల్లాలో సాగునీటి సమస్య, జలయజ్ఞం ప్రాజెక్టుల నత్తనడక, యూనివర్శిటీ ఏర్పాటు, శ్రీరాంసాగర్ కాలువ పనుల తీరు, గ్రానైట్ పరిశ్రమ సంక్షోభం, విద్యుత్ కోత, రైతాంగ సమస్యలు వివిధ కులవృత్తులకు సంబంధించి ఆయా కులసంఘాలు వారి వారి సమస్యలను కూడా బాబు దృష్టికి తీసుకువెళ్లనున్నారు. రైతులు, వ్యవసాయకూలీలు, గిరిజనుల, ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి పార్టీ డిక్లరేషన్‌ను కూడా చంద్రబాబు పాదయాత్ర సభల్లో ప్రజలకు తెలియచేయనున్నారు. చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా జిల్లాలో బహిరంగసభలు, వందరోజుల పాదయాత్ర విజయోత్సవ వేడుకను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తామని ఆ పార్టీనేతలు తుమ్మల నాగేశ్వరరావు, నామ నాగేశ్వరావు, కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్యేలు ఊకే అబ్బయ్య, సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీలు పోట ్లనాగేశ్వరరావు, బాలసాని లక్ష్మినారాయణ తెలిపారు.




వస్తున్నాడదిగో ...



 
వచ్చే ఎన్నికల్లో కాం గ్రెస్ గెలిస్తే బీసీలకు మిగిలేది మట్టేనని టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డి సు బ్రమణ్యం విమర్శించారు. మంగళవారం సాయంత్రం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్‌రె డ్డి హయాంలో 93 బీసీ కులాలను 145కు పెంచారని, రిజర్వేషన్లు మాత్రం పెంచలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో మహిళా బీ సీలకు అన్యాయం జరిగిందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బీసీల సం క్షేమానికి పాటుపడే వ్యక్తని కొనియాడారు. బీసీల డిక్లరేషన్‌ను ప్రకటించిన చంద్రబాబుకే బీసీల మద్దతు ఉంటుందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుతారన్నారు. చంద్రబాబునాయుడు పాదయాత్ర ప్రారంభించి వంద రోజులైన సందర్భంగా జి ల్లాలో చంద్రబాబుకు కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం చెబుతామన్నారు. బీసీల్లోని అన్ని కులాల వారు ఈ స్వాగత కా ర్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్సింహగౌడ్, కార్యదర్శి రాము, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రామారావు, శ్రీరాములు, కందగట్ల రాజేందర్, నాయకులు నాగేశ్వరరావు, నర్రా ఎల్లయ్య, కాపర్తి వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ వల్ల బీసీలకు నష్టమే