June 24, 2013

ఉత్తరాఖండ్‌లో రాష్ట్రానికి చెందిన యాత్రికులు పడుతున్న నరక యాతనకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చలించి పోయారు. హైదరాబాద్‌ నుండి ఎంపీలు నామా నాగేశ్వరరావు, రమేష్‌ రాథోడ్‌లతో కలిసి డెహరాడూన్‌లో పర్యటించిన బాబు అక్కడి పరిస్థితులను యాత్రికులను అడిగి తెలుసు కున్నారు. ఉత్తరాఖండ్‌ సీఎంను కలిసి తెలుగువారిని ఆదుకుని ఆంధ్రప్రదేశ్‌కు పంపించే ఏర్పాట్లు చేయాల్సిందిగా అభ్యర్తించారు. అటు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కేంద్ర మంత్రులు షిండే, ప్రభృతులకూ చంద్రబాబు నాయుడు సోమవారం నాడు లేఖలు రాశారు. వరదల్లో చిక్కుకున్న యాత్రికులను సైన్యం హెలీకాఫ్టర్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు వారిని తరలించాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్‌కు తెలుగుదేశం పార్టీ ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయించిన చంద్రబాబు వారిని స్వంత జిల్లాలకు తరలించేందుకు నేతలను పురమాయించారు. కేసినేని నాని ఆధ్వర్యంలో విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌, కాజీపేట ప్రాంతాలకు తరలించేందుకు ముమ్మరంగా పన్నాహాలు చేశారు. అటు ఎన్టీఆర్‌ట్రస్ట్‌ కూడ ఉత్తరాఖండ్‌కు డాక్టర్ల బృందాన్ని పంపించింది. అలాగే పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనూ రెండు ెహెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసి 24 గంటలూ పర్యవేక్షిస్తున్నారు. బాధితులు ఎక్కడి నుండి ఫోన్‌ చేసినా తక్షణమే స్పందించేందుకు ఎన్టీఆర్‌ భవన్‌లోనూ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ బాధ్యతతో విధులు నిర్వర్తిస్తున్నారు. మొత్తం మీద అమెరికా పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చిన బాబు ఉత్తరాఖండ్‌ బాధితులను ఆదుకోవడంలో తన ఉదారతను చాటుకున్నారు. ప్రభుత్వం కంటే ముందే స్పందించిన తీరుపై పలువురు ప్రశంశల జల్లులు కురిపించారు.

రాష్ర్ట ప్రభుత్వం ముఖ్యమంత్రి, రెవిన్యూ మంత్రులు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కూడా ఇప్పటి వరకు ఉత్తరాఖండ్‌ వెళ్లక పోవడాన్ని టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు. అయితే ప్రతిపక్ష నాయుకుడై ఉండి ప్రభుత్వంలో ఉన్న వారి కంటే ఎక్కువగా స్పందించడం పార్టీ నేతలు, కార్యకర్తల్లో స్పూర్తిని నింపుతోంది. కాగా ఉత్తరాఖండ్‌ నుండి రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో విచ్చిన బాధితులకు శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చిన బాధితులను వారిని వారివారి గ్రామాలకు తరలించడానికి కేసినేని ట్రావెల్‌ వారు బస్సులను ఏర్పాటు చేశారు.

బాధితులకు బాబు ఓదార్పు

ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకుండా కేంద్రం తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించినట్లు వస్తున్న వార్తల వెనుక టీఆర్‌ఎస్‌ అధినేత కేసిఆర్‌ హస్తం ఉందని తెలుగుదేశం పార్టీ సందేహం వ్యక్తం చేసింది. పార్టీ ఉపాధ్యక్షుడు ఇనుగాల పెద్దిరెడ్డి సోమవారం నాడిక్కడ ఎన్టీఆర్‌ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేసిఆర్‌ అసలు రంగును ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. కేసిఆర్‌తో సంప్రదింపులు జరిపాకే కేంద్రం ప్యాకేజీ నిర్ణయానికి వచ్చిందని పెద్దిరెడ్డి ఆరోపించారు. తెలంగాణ సెంటిమెంటును అడ్డంపెట్టుకుని కేసిఆర్‌కోట్లు దండుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికలు ఓట్లు సీట్లు ఇదే కేసిఆర్‌ విధానమని, వాదంతో ఓట్లు వేసుకుని ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసి రాహుల్‌ను పీఎంను చేసేందుకు తోడ్పడాలన్నది టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్యన కుదిరిన రహస్య ఒప్పందం అని పెద్దిరెడ్డి ఆరోపించారు.

ప్యాకేజీ నిర్ణయం వెనుక కేసీఆర్‌


కేసీఆర్ కుటుంబ సభ్యుల నిజస్వరూపం, అవినీతి విశ్వరూపం బయట పడిందని పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ చైర్మన్ రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం హన్మకొండ హంటర్‌రోడ్‌లోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డంపెట్టుకొని అడ్డదారిలో అక్రమార్జనకు పాల్పడేందుకు కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్‌రావులు సాగిస్తు న్న దందాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయన్నారు. 'వీరంతా ఇప్పటికే తెలంగాణ సమాజం ముందు దోషులుగా నిలబడ్డారు.

అక్రమాలు, సాగిస్తున్న దుర్మార్గాలు రాబోయే రోజుల్లో మరి న్ని బయటకు వస్తాయి. వీరిని ఛీకొట్టే రోజులు దగ్గర పడ్డాయి. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు' అని ప్రకాశ్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు తెలంగాణ రావాలని ఏ కోశాన లేదని, ఆలోచనంతా సెంటిమెంట్‌తో ఎట్లా లాభం పొందుతామా అని ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో 100 అసెంబ్లీ, 10 పార్లమెంట్ స్థానాల్లో టీఆర్ఎస్‌ను గెలిపించాలని కోరుతున్నాడంటేనే అర్థం చేసుకోవ చ్చు.. గంపగుత్తగా అధికారం ఇస్తే చె న్నారెడ్డిలాగా ఆ సీట్లన్ని సోనియాకు తాకట్టెలని చూస్తున్నారమండిపడ్డారు.

తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ రెండో వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనే తీరిక కేసీఆర్‌కు లేదా? ఆయన అంత అనారోగ్యం తో బాధపడుతున్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం ముసుగులో కేటీఆర్ పాల్పడుతున్న భూదందాలు, సెటిల్‌మెంట్ల బాగోతాన్ని సాక్ష్యాలతో ఏబీఎన్ చానెల్, ఆంధ్రజ్యోతి బయట పెడితే...దానికి సమాధానం ఇవ్వాల్సింది పోయి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడమేకాక, బెదిరింపులకు పాల్పడుతుండడం వి డ్డూరంగా ఉందన్నారు.

కాంగ్రెస్‌కు కాపలా కుక్క
ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ కేటీఆర్‌కు ఉద్యమ నాయకుడికి ఉండాల్సి న లక్షణాలు, సంస్కారం లేదన్నారు. తప్పులు ఎత్తి చూపినప్పుడు వాటికి తగిన విధంగా వివరణ ఇవ్వాల్సి పో యింది సీమాంధ్ర మీడియా అని విరుకుపడడం విడ్డూరంగా ఉందన్నారు. తప్పులను బయటపెట్టేవారంతా తె లంగాణ ద్రోహులుగా ప్రచారం చే యడం ఆయన నీచ సంస్కృతిని స్పష్టం చేస్తోందన్నారు.

తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్ ఇప్పుడు కాం గ్రెస్‌కు కాపలా కుక్కలా మారిపోయారన్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు కష్టకాలం వచ్చినప్పుడలా ఏదో గొడవను సృష్టించి సభ జరగకుండా చేయడం ద్వారా ఆ పార్టీని కాపాడుతున్నది టీఆర్ఎస్ కాదా? అని ప్రశ్నించారు. కడియం శ్రీహరి టీడీపీని వదిలి వెళ్ళినా ఆర్థిక లావాదేవీలను మాత్రం వదులుకోవడం లేదన్నారు. పార్టీకి చెం దిన ఎమ్మెల్యే క్వార్టర్‌లోనే ఇంకా ఎం దుకు నివాసముంటున్నారని ప్రశ్నించా రు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యం వచ్చే ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి తాను పోటీ చేయకుండా మరో దళిత సోదరుడికి గెలిపించాలని సవాల్ చేశారు.

టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎడబోయిన బస్వారెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. రానున్న రోజుల్లో ఆయనకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ సమావేశంలో వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం ఇన్‌చార్జి దొమ్మటి సాంబయ్య, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈగ మల్లేశం, పరకాల నియోజకవర్గం ఇన్‌చార్జి చల్లా ధర్మారెడ్డి, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ఇన్‌చార్జి కట్టా మనోజ్ రెడ్డి, టీడీఎల్‌పీ కార్యదర్శి కేలిక కిషన్ ప్రసాద్, పుప్పాల సమ్మయ్య, పుల్లూరి ఆశోక్ కుమార్, మార్గం సారంగం, మునిగె వెంకట్రాజం, లొడంగి రాజు, షేఖ్‌బాబా ఖాదర్ అలీ పాల్గొన్నారు.

కేసీఆర్ కుటుంబాన్ని ఛీకొట్టే రోజులొచ్చాయి

విజయవాడ : కృష్టా జిల్లకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమ కృష్ణా నదిలో నిరసనకు దిగారు. డెల్టాకు నీరు విడుదల చేయాలంటూ ఎమ్మెల్యే ఉమ ఈ నిరసనను చేపట్టారు.

కృష్ణా నదిలో ఎమ్మెల్యే దేవినేని నిరసన

ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుని సురక్షితంగా ఢిల్లీకి చేరిన తెలుగువారికి ఏపీ భవన్‌లో జరుగుతున్న అవమానం చూస్తుంటే రక్తం మరుగుతోందని టీడీపీ నేత వైవీబి రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు. యాత్రికులు కటిక నేలపై పడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 25 ఎకరాల ఏపీ భవన్ ప్రాంగణం కాంగ్రెస్ నేతలు గంజాయి పండించడానికేనా అని ఆగ్రహించారు. తెలుగు యాత్రికులకు వసతులేవి అని రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు.

యాత్రికులు కటికనేలపై పడుకుంటున్నారు : రాజేంద్రప్రసాద్

రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కాకిలెక్కలతో ప్రజలను మోసం చేస్తోందని టీడీపీ నేత వర్లరామయ్య ఆరోపించారు. ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుని బాధితులు అవస్థలు పడుతుంటే సీఎం కిరణ్ ప్రారంభోత్సవాల్లో బిజీగా ఉన్నారని మండిపడ్డారు. వరద బాధితులను కాపాడే విషయంలో ప్రభుత్వం సరైన రీతిలో స్పందించడం లేదని వర్లరామయ్య వ్యాఖ్యనించారు.

రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కాకిలెక్కలు చూపుతోంది : వర్లరామయ్య

హైదరాబాద్‌ : నెల్లూరు కలెక్టర్‌గా పని చేసిన కేవీపీ బంధువు నాలుగేళ్లలో రూ.300 కోట్లు సంపాదించారని టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపించారు. కృష్ణపట్నం భూ ఆక్రమణను జగన్‌ కేసులో భాగంగా సీబీఐ విచారించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సహజ వనరులను ఓ కుటుంబానికి ధారదత్తం చేసే అధికారం వైఎస్‌కు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు.

కేవీపీ బంధువుపై విచారణ చేయాలి

ఢిల్లీ : ఏపీ భవన్‌లో ఆశ్రయం పొందుతున్న రాష్ట్రానికి చెందిన చార్‌థామ్‌ యాత్రికులకు వైద్య సాయం అందించేందుకు వెళ్లిన ఎన్టీఆర్‌ ట్రస్టు వైద్య బృందానికి చుక్కెదురైంది. ఏపీభవన్‌లో వైద్య శిబిరం నిర్వహించేందుకు రెసిడెంట కమిషనర్‌ అనుమతి నిరాకరించారు. ఉత్తరాఖండ్‌ బాధితులకు ప్రభుత్వ వైద్య సాయం అందుతోందంటూ రెసిడెంట్‌ కమిషనర్‌ శశాంక్‌ గోయల్‌ పేర్కొన్నారు. అనుమతి నిరాకరణపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఎన్టీఆర్‌ ట్రస్టు వైద్యబిరానికి అనుమతి నిరాకరణ

నగరంలోని చెర్లోపల్లిలో హాస్టల్ శంకుస్థాపనకు వచ్చిన మంత్రి గల్లా అరుణను టీడీపీ కార్యకర్తలు సోమవారం ఉదయం అడ్డుకున్నారు. అక్రమ అరెస్ట్‌ల విషయాన్ని మంత్రి దృష్టికి తెచ్చేందుకు టీడీపీ యత్నించింది. దీంతో టీడీపీ,కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. పోలీసులు వారిని అడ్డుకుని పరిస్థితిని అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు.

మంత్రి గల్లా అరుణను అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు

 ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి టీడీపీ మందులు పంపిణీ చేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ఈ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. మరోవైపు ఛార్‌దామ్ యాత్రికులు జిల్లాలకు చేరుకున్న తర్వాత పార్టీ పరంగా సహాయం అందించాలని టీడీపీ అన్ని జిల్లాల అధ్యక్షులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

ఉత్తరాఖండ్‌కు మందులు పంపుతున్న టీడీపీ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును వెంటనే అరెస్టు చేయాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు సోమవారం డిమాండ్ చేశారు. తెలంగాణలో జరిగిన వెయ్యి ఆత్మబలిదానాలకు కెసిఆరే కారణమని ఆరోపించారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ దగ్గర ప్యాకేజీ మాట్లాడుకొని తెలంగాణవాదాన్ని అమ్మేశారన్నారు.

సూసైడ్ నోట్ ఎఫెక్ట్: కెసిఆర్‌ను అరెస్ట్ చేయాలని టిడిపి

ఢిల్లీలోని ఏపీభవన్‌ కాంగ్రెస్‌ కార్యాలయంలా తయారైందని టీడీపీ ఎంపీ గుండు సుధారాణి ధ్వజమెత్తారు. ఉత్తరకాశీ వరద బాధితులకు వైద్యం అందించేందుకు వచ్చిన ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌ వైద్యులకు అనుమతి ఇవ్వకపోవడం దారుణమని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌ ఆఫీలా ... ఏపీ భవన్‌

ఉత్తర కాశీ యాత్రకు వెళ్ళి, అక్కడ కురిసిన భారీ వర్షాలకు చిక్కుకున్న యాత్రికులను పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఉత్తరాంఖండ్ వెళ్లనున్నారు. ఆదివారం మధ్యాహ్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. అక్కడ ఏపీ భవన్‌లో సహాయం పొందుతున్న బాధితులను పరామర్శించారు. బాధితులకు సరైన సహాయం అందడం లేదని పేర్కొంటూ, బాధితులతో సహా ఏపీ భవన్ ప్రాంగణంలో ధర్నాకు దిగారు. సోమవారం ఉత్తరాఖండ్ వెళ్ళనున్నారు. అక్కడ తెలుగు యాత్రికులను పరామర్శిస్తారు.

'ఇంత పెద్ద విపత్తు దేశాన్ని కుదిపేస్తోంది. ఇటీవలి కాలంలో ఇంత పెద్ద ప్రకతి వైపరీత్యం లేదు. కేంద్రంతో సహా ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో స్పందించాలి. దీనిని జాతీయ విపత్తుగా పరిగణించాలి' అని చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. ఇదే క్రమంలో ప్రధానికి లేఖ రాసినట్లు వెల్లడించారు. విపత్తు సహాయ నిధినుంచి సహాయ కార్యక్రమాలకు తక్షణమే నిధులు విడుదల చేయాలని, ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సానికి గురైన ప్రాంతాల్లో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని సూచించారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి మందులతో సహా 20 మంది డాక్టర్ల బృందాన్ని ఉత్తరాఖండ్‌కు పంపిస్తున్నట్లు మరో టీడీపీ నేత పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం తమకు హెలికాఫ్టర్ సదుపాయం కల్పిస్తే 20 మందే కాదు వంద ప్రాంతాలకకు డాక్టర్లను పంపేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.
మరోవైపు కేధార్‌నాథ్, భద్రినాథ్‌లో తెలుగు యాత్రికులు ధర్నాకు దిగారు. సుమారు వెయ్యి మందికి పైగా ఆందోళన చేపట్టారు. బాధితులను హెలికాఫ్టర్‌లో ఎక్కించడంలో అధికారులు వివక్షచూపుతున్నారని, ఉత్తరాదివారికే హెలికాఫ్టర్లు ఎక్కిస్తున్నారని వారు ఆరోపించారు. ఏపీ నుంచి వచ్చిన అధికారులు డెహ్రాడూన్‌కే పరిమితమయ్యారని, ఏపీ నుంచి కూడా హెలికాఫ్టర్లు పంపించాలని తెలుగు బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

ఏపీ భవన్ ప్రాంగణంలో చంద్రబాబు ధర్నా


పదివేల చొప్పున ఆర్థిక సాయం
అమెరికా నుంచి వచ్చీ రాగానే ఢిల్లీకి
నేడు ఉత్తరాఖండ్‌కు...
ఏ విపత్తు వచ్చినా ముందు వెళ్లేది బాబే
ఇప్పుడూ అదే వరస
ఉత్తరాఖండ్‌కు టీడీపీ వైద్యబృందం
సమీక్షలో కిరణ్‌ బిజీ
ఫెస్టివల్‌‌సలో మునిగిన చిరంజీవి

అది ప్రకృతి విపత్తయిగాగానీ, మానవ వైఫల్యం గానీ, ప్రజలను విషాదంలో ముంచిన దుర్ఘటన గానీ.. జనం కష్టాల్లో ఉంటే అందరికంటే ముందు వారి ముంగిట వెళ్లి, భుజం తట్టి భరోసా ఇచ్చే నాయకు డన్న పేరు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరోసారి చాటుకున్నారు.
కుటుంబసభ్యులతో అమెరికా వెళ్లిన చంద్రబాబునాయుడు ఆదివారం పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించి, వెంటనే ఢిల్లీకి హుటాహుటిన పయనమయ్యారు. దేశాన్ని దిగ్భ్రమపరిచిన ఉత్తరాఖండ్ విషాదంలో మన తెలుగువారు కూడా ఉండటం, ఇంకా అక్కడే సాయం కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో చంద్రబాబునాయుడు వారికి భరోసా ఇచ్చేందుకు అమెరికా నుంచీ వచ్చీరాగానే ఉత్తరాఖండ్‌కు వెళ్లారు. అందులో భాగంగానే ఢిల్లీకి వెళ్లి అక్కడ బాధితులతో మాట్లాడి, భరోసా ఇచ్చారు. ఒక్కోరికి 10 వేల రూపాయల చొప్పున ఆర్ధిక సాయం చేశారు. వారికి అందుతున్న సాయంపై అధికారులను నిలదీశారు. పార్టీ తరఫున వైద్యబృందం పంపించి బాధితులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.
నిజానికి, ఈవిధంగా చంద్రబాబునాయుడు ఇలాంటి విపత్తులు తలెత్తినప్పుడు అక్కడికి వెళ్లి, బాధితులను ఓదార్చి, పార్టీ పక్షాన ఆర్థిక సాయం చేయడమో, వారిని ఆదుకోవడమో కొత్తేమీ కాదు. గత తొమ్మిదేళ్లనుంచీ కొన సాగిస్తున్న విషయాన్ని పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. అధికారంలో ఉన్నా, లేక పోయినా విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు వెంటనే ప్రత్యక్షమయ్యే అల వాటు చాలాకాలం నుంచీ కొనసాగిస్తున్నారని, బాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తూర్పుగోదావరి జిల్లాలో ప్రకృతి సహకరించకపోయినా అక్కడే తిష్ఠవేసి, సహాయ చర్యలను స్వయంగా సమీక్షించిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో నగరంలోని గాంధీనగర్ ప్రాంతంలో కలుషిత నీరు తాగి 12మంది చనిపోతే వైఎస్ పట్టించుకోకుండా గోవాలో జన్మ దిన వేడుకలకు హాజరయితే బాబు బాధితులకు అండగా నిలిచారు. పాద యాత్ర సందర్భంగా వరదలు వచ్చిన సందర్భంలో పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి రైతులను పరామర్శించారు.

కాగా.. ఉత్తరాఖండ్ బాధితులను ఆదుకోవడంలో కేంద్ర-రాష్ట్ర ప్రభు త్వాలు తమ వంతు కృషిచేస్తున్నప్పటికీ, వాతావరణం అనుకూలించటంలేదు. ప్రధానంగా హెలికాప్టర్లు సరైనసంఖ్యలో లేకపోవడం కూడా నష్టంగా పరిణ మించింది. అటు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ అంశాన్ని ప్రతిష్ఠాత్మకం గా తీసుకుని, స్వయంగా సమీక్షిస్తున్నారు. జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసి, ఆయా జిల్లాలనుంచి వెళ్లినవారి సమాచారం, క్షేమాలు తెలుసుకునేందుకు హెల్ప్‌లైన్లు ఏర్పాటుచేయించారు. అయితే వీటికి సంబంధించిన ప్రచారం, సమాచారం సక్రమంగా ప్రజలకు చేరకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయటం లేదన్న భావన నెలకొంది. అయితే, ఇప్పటికే 1600 మందిని రాష్ట్రా నికి పంపించిన విషయాన్ని మంత్రులు గుర్తుచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు రాకముందే రాష్ట్ర ప్రభుత్వం తన విధి నిర్వహణ, బాధ్యత నిర్వర్తిం చిందని స్పష్టం చేస్తున్నారు.

అయితే, రాష్ట్రానికి సంబంధించి మొత్తం 13 మంది కేంద్ర మంత్రులు ఢిల్లీలో ఉన్నా, వారిలో ఒక్క కోట్ల జయసూర్యప్రకాశరెడ్డి మినహా ఎవరూ పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. చిరంజీవి ఒక రోజు ఏపీభవన్‌కు వచ్చి హడావిడి చేసి వెళ్లారే తప్ప, పర్యాటక శాఖ మంత్రిగా అక్కడే ఉండి, వారికి కావలసిన ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అక్కడ రాష్ట్రానికి చెందిన బాధితులు సాయం కోసం ఎదురుచూస్తుంటే, ఇక్కడ చిరంజీవి ఏరువాక, బీచ్‌ఫెస్టివల్ కార్యక్రమాల్లో పాల్గొని సన్మానాలు చేయించుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

దటీజ్‌ బాబు!బాధితులకు బాసటగా బాబు


ఉత్తరాఖండ్‌కు ఎన్టీఆర్‌ ట్రస్టు వైద్యులు

‘‘ఉత్తరాఖండ్‌లో మన రాష్ట్రానికి చెందిన యాత్రికులు వందల సంఖ్యలో చనిపోయారు. వేల మంది చిక్కుకున్నారు. మరి కొందరి సమాచారం తెలయడం లేదంటున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి నిద్ర ఎలా పడుతోందో తనకైతే అర్థం కావడం లేదు’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకుపోయి మరణించిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.తాము కూడా పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరం కలిసి ఒక నేల వేతనాన్ని ఉత్తరాఖండ్‌ సీఎం సహాయ నిధికి విరాళంగా అందజేస్తామన్నారు.

అమెరికా పర్యటన ముగించుకుని ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్న చంద్రబాబు మధ్యాహ్నం తన నివాసంలో పార్టీ నేతలు నామా నాగేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమెరికా నుండి వచ్చిన వెంటనే తాను ఢిల్లీలోని ఏపి రెసిడెంట్‌ కమిషనర్‌తో మాట్లాడానన్నారు. యాత్రికులను ఢిల్లీ నుంచి స్వస్థలాలకు తరలించేందుకు చేపట్టిన ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నానన్నారు. సాయంత్రం ఢిల్లీలో ఏపీ భవన్‌లో వరద బాధితులను పరామర్శిస్తానన్నారు. సోమ, మంగళవారాల్లో తాను ఉత్తరాఖండ్‌, చార్‌ధామ్‌లో పర్యటించనున్నారు. చార్‌ధామ్‌ యాత్రకు రాష్ట్రం నుండి 12 వేల మంది వెళ్లి ఉంటారని అంచనాఅని, రాష్ట్రానికి చెందిన వారు వందల్లో గల్లంతైనట్లు సమాచారం అందుతోందని ఆయన అన్నారు.

ఇప్పటి వరకు అధికారికంగా ఎంత మంది మృతి చెందారో తెలియడం లేదన్నారు. జాతీయ విపత్తు వచ్చినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదని చంద్రబాబు ఆరోపించారు. రాష్ర్ట వాసులు 5 వేల మంది చిక్కుకున్నారంటే రెవిన్యూ, రిలీఫ్‌ మంత్రి ఇక్కడి నుండి కదల్లేదని, ఉత్తరాఖండ్‌లో రక్షించిన వారిని స్వస్థలాలకు విమానాల్లో తరలించవచ్చుకదా? అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న రాష్ట్ర బాధితుల సమస్యలపై ప్రధానికి లేఖ రాశానని చంద్రబాబు నాయడు తెలిపారు.

సీఎంకు నిద్ర ఎలా పడుతోంది