June 24, 2013

ఉత్తరాఖండ్‌కు మందులు పంపుతున్న టీడీపీ

 ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి టీడీపీ మందులు పంపిణీ చేస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ఈ ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. మరోవైపు ఛార్‌దామ్ యాత్రికులు జిల్లాలకు చేరుకున్న తర్వాత పార్టీ పరంగా సహాయం అందించాలని టీడీపీ అన్ని జిల్లాల అధ్యక్షులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.