June 24, 2013

ప్యాకేజీ నిర్ణయం వెనుక కేసీఆర్‌

ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకుండా కేంద్రం తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించినట్లు వస్తున్న వార్తల వెనుక టీఆర్‌ఎస్‌ అధినేత కేసిఆర్‌ హస్తం ఉందని తెలుగుదేశం పార్టీ సందేహం వ్యక్తం చేసింది. పార్టీ ఉపాధ్యక్షుడు ఇనుగాల పెద్దిరెడ్డి సోమవారం నాడిక్కడ ఎన్టీఆర్‌ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేసిఆర్‌ అసలు రంగును ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. కేసిఆర్‌తో సంప్రదింపులు జరిపాకే కేంద్రం ప్యాకేజీ నిర్ణయానికి వచ్చిందని పెద్దిరెడ్డి ఆరోపించారు. తెలంగాణ సెంటిమెంటును అడ్డంపెట్టుకుని కేసిఆర్‌కోట్లు దండుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికలు ఓట్లు సీట్లు ఇదే కేసిఆర్‌ విధానమని, వాదంతో ఓట్లు వేసుకుని ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్‌లో కలిపేసి రాహుల్‌ను పీఎంను చేసేందుకు తోడ్పడాలన్నది టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్యన కుదిరిన రహస్య ఒప్పందం అని పెద్దిరెడ్డి ఆరోపించారు.