June 24, 2013

కేవీపీ బంధువుపై విచారణ చేయాలి

హైదరాబాద్‌ : నెల్లూరు కలెక్టర్‌గా పని చేసిన కేవీపీ బంధువు నాలుగేళ్లలో రూ.300 కోట్లు సంపాదించారని టీడీపీ నేత సోమిరెడ్డి ఆరోపించారు. కృష్ణపట్నం భూ ఆక్రమణను జగన్‌ కేసులో భాగంగా సీబీఐ విచారించాలని ఆయన డిమాండ్‌ చేశారు. సహజ వనరులను ఓ కుటుంబానికి ధారదత్తం చేసే అధికారం వైఎస్‌కు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు.