June 24, 2013

రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కాకిలెక్కలు చూపుతోంది : వర్లరామయ్య

రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కాకిలెక్కలతో ప్రజలను మోసం చేస్తోందని టీడీపీ నేత వర్లరామయ్య ఆరోపించారు. ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుని బాధితులు అవస్థలు పడుతుంటే సీఎం కిరణ్ ప్రారంభోత్సవాల్లో బిజీగా ఉన్నారని మండిపడ్డారు. వరద బాధితులను కాపాడే విషయంలో ప్రభుత్వం సరైన రీతిలో స్పందించడం లేదని వర్లరామయ్య వ్యాఖ్యనించారు.