June 24, 2013

ఎన్టీఆర్‌ ట్రస్టు వైద్యబిరానికి అనుమతి నిరాకరణ

ఢిల్లీ : ఏపీ భవన్‌లో ఆశ్రయం పొందుతున్న రాష్ట్రానికి చెందిన చార్‌థామ్‌ యాత్రికులకు వైద్య సాయం అందించేందుకు వెళ్లిన ఎన్టీఆర్‌ ట్రస్టు వైద్య బృందానికి చుక్కెదురైంది. ఏపీభవన్‌లో వైద్య శిబిరం నిర్వహించేందుకు రెసిడెంట కమిషనర్‌ అనుమతి నిరాకరించారు. ఉత్తరాఖండ్‌ బాధితులకు ప్రభుత్వ వైద్య సాయం అందుతోందంటూ రెసిడెంట్‌ కమిషనర్‌ శశాంక్‌ గోయల్‌ పేర్కొన్నారు. అనుమతి నిరాకరణపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.