January 14, 2013



స్సెమ్మెస్‌లో శక్తిమంతమైన సాధనాలు
ఒక్కొక్కరికి పది చొప్పున పంపించండి
వివేకానందుడి స్పూర్తితో ఉద్యమించండి
యువతకు టీడీపీ అధినేత పిలుపు
కాంగ్రెస్, వైసీపీలు ఒక్కటే
వాటి సిద్ధాంతం దోచుకోవడం

 వైసీపీ నేత జగన్ అవినీతిపై మొబైల్ వార్ చేయాలని యువతకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పిలుపునిచ్చారు. ఒక్కొక్కరికి పది ఎస్సెమ్మెస్‌లు పంపాలని పిలుపునిచ్చారు. వివేకానందుడి స్ఫూర్తితో అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి వద్ద శనివారం పాదయాత్ర ప్రారంభించారు. వరంగల్ క్రాస్ రోడ్డు, పెద్దతండా, జలగంనగర్, నాయుడుపేట, నయాబజార్ కళాశాల, మయూరిసెంటర్, బస్‌డిపో, రాపర్తినగర్, బైపాస్ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్ వరకు 15.4 కిలోమీటర్లు నడిచారు. ఈ సందర్భంగా ఖమ్మం పట్టణంలో జరిగిన భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడారు.

"ఈ తొమ్మిదేళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన రాక్షస పాలన సాగింది. అందుకే అన్నివర్గాల బతుకులు చితికిపోయాయి. రాష్ట్రం చీకటి రాజ్యమైంది. అవినీతి పెచ్చుమీరింది. కాంగ్రెస్ దొంగలు ర్రాష్టాన్ని దోచుకుని కోట్లు గడించారు.. ఈ పరిస్థితి పోవాలంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, ఈ మార్పు మీ చేతుల్లోనే ఉంది'' అని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. పాదయాత్రలో భాగంగా శనివారం రాత్రి ఖమ్మం పట్టణంలో నిర్వహించిన భారీ సభలో ఆయన మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్‌ను అంధకార రాష్ట్రంగా మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని దుయ్యబట్టారు. కరెంట్ ఇవ్వలేక ర్రాష్టాన్ని అంధకారంలో ఉంచారని, రాని కరెంట్‌కు బిల్లులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచానికే ఆదర్శ ప్రదేశ్‌గా టీడీపీ పాలనలో చూపిస్తే.. హైదరాబాదును అవినీతికి రాజధానిగా మార్చిన ఘనత కాంగ్రెస్ పాలకులదన్నారు. కేంద్రం నుంచి ర్రాష్టానికి నిధులు తేవడంలోనూ ఈ కిరికిరి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. కాంగ్రెస్, వైసీపీలు ఒకే తానులో ముక్కలన్నారు.

అభివృద్ధి అంటే నై.. అవినీతి అంటే సై అనడమే ఈ పార్టీల సిద్ధాంతమని దుయ్యబట్టారు. జగన్‌ను జైలులో కలుసుకుని ఆ పార్టీలో చేరుతున్నవారికి నీతిలేదని విమర్శించారు. అక్రమంగా సంపాదించిన డబ్బులతో జగన్..ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు. నాయకులు అమ్ముడుపోయినా కార్యకర్తలు అమ్ముడు పోవడం లేదని, వారే పార్టీకి శక్తి అని ప్రశంసించారు. ఎన్ని జన్మలెత్తినా కార్యకర్తల రుణం మరువలేనని తెలిపారు.

ఈ సమయంలో సభలో కొంతమంది యువకులు మొబైల్‌లో మాట్లాడటం కనిపించింది. " తమ్ముళ్లూ.. అందరి దగ్గరా సెల్‌ఫోన్లుఉన్నాయి కదా. వాటితో కూడా మీరు అవినీతిపై పోరాటం చేయొచ్చు. జగన్‌కు వ్యతిరేకంగా ఒక్కొక్కరికి పది ఎస్సెమ్మెస్‌లు పెట్టండి'' అని సూచించారు. అంతకుముందు.. ఖమ్మం పట్టణంలో వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు అడుగడుగునా బాబుకు బ్రహ్మర«థం పట్టారు.

జగన్ అవినీతిపై 'మొబైల్' వార్!




పెరిగిన ధరలు చూస్తుంటే మనసు రావడం లేదు
ఖమ్మం పట్టణం పాదయాత్రతో హోరెత్తింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో.. జనం హర్షధ్వానాల మధ్య చంద్రబాబు ఉద్వేగంగా ప్రసంగించారు. పదేపదే ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ, వారిని మధ్య మధ్య ప్రశ్నిస్తూ ఆయన ప్రసంగం సాగింది. "మీకు పండుగ శుభాకాంక్షలు తెలపాలా?'' అని అడిగి తిరిగి తానే " కష్టం చేసుకున్నా మీ కష్టాలు తీరడం లేదు. పండుగ రోజున కూడా మీరు కూలి పనులు పోవాల్సిన పరిస్థితి ఉంది. పెరిగిన ధరలు, పెట్రోల్ ధరలు, విద్యుత్ చార్జీలు చూస్తుంటే మీకు పండుగ శుభాకాంక్షలు తెలపలేకపోతున్నాను'' అని ఆవేదనతో అన్నారు.

సారీ.. శుభాకాంక్షలు చెప్పలేను!




వివేకానంద..యువతలో స్ఫూర్తి రగిలించిన వ్యక్తి. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్ర పంచానికి చాటిన మహానుభావుడు. ఆయన జయంతి రోజున ఖమ్మం పట్టణంలో అడు గుపెట్టాను. దానికి తగినట్టే దారిపొడవునా యువత ఉరకలెత్తింది. వాళ్ల ఉత్సాహమే నాకు కొండంత బలం. నా యాత్రా మార్గానికి ముందూవెనక బైకు ర్యాలీలతో కుర్రాళ్లు హోరె త్తించారు. వారి భవిష్యత్తును తీర్చిదిద్దగలనన్న భరోసాతో నాకు అండగా నిలుస్తున్నారు.

వరంగల్ క్రాస్, పెద తండా వద్ద ఇంజినీరింగ్, మెడికల్ విద్యార్థులు కలిశారు. వారిలో కోర్సులు చదువుతున్నవారు కొందరైతే, పూర్తిచేసి ఉద్యోగాలు లేక బతుకుపై విరక్తి పెంచు కుంటున్న తమ్ముళ్లూ చెల్లెళ్లు మరికొందరు. "సార్ నేను ఇంజినీరింగ్ పూర్తిచేశాను. ఏ కంపెనీ మెట్లెక్కినా ఉద్యోగం దొరికే పరిస్థితి లేద''ని ఒక తమ్ముడు ఆవేదన వ్యక్తం చేశాడు.

ఎంబీఏ అయిపోయి ఏడాదవుతున్నా ఖాళీగానే ఉండాల్సి వస్తున్నదని మరో చెల్లెలు వాపోయింది. బీఈడీ పూర్తి చేసిన తనకు ఎస్జీటీకి అవకాశం కల్పించాలని ఇంకొందరు వేడుకున్నారు. ప్రత్యేక బీఎడ్ నిర్వహించి మిగతావారిలాగే ఎస్జీటీకి అర్హులను చేస్తానన్న నా హామీని వారికి గుర్తుచేసి ఓదార్చాను.

గుజరాత్ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నదని, ఎక్కడెక్కడి పెట్టుబడులూ అక్కడికే వెళుతున్నాయని పత్రికల్లో కథనాలు చూసినప్పుడు ఈర్ష్య కలిగింది. పరిస్థితులు, పాలకులు బాగుంటే ఆ స్థాయిలో వెలగాల్సింది మన రాష్ట్రమే. నా తొమ్మిదేళ్ల పాలన అటువంటి ఆశను చిగురింపజేయగా తరు వాత వచ్చిన వాళ్లంతా దాన్ని చిదిమేశారు.

ఇప్పుడు చూస్తే.. మనకు రావాల్సిన లక్షల కోట్ల పెట్టుబడులు అటే పోతున్నాయి. మనకు రావాల్సిన ఉద్యోగాలూ ఆ వైపే తరలి పోతున్నాయి. మనకు మాత్రం మాఫియా, అవినీతి మిగిలాయి. ఈ పరిస్థితుల్లో ఒక్కో యువకుడు ఒక్కో వివేకానందుడై పోరాడినప్పుడే రాష్ట్రానికి పూర్వ వైభవం సాధ్యం!

రాష్ట్రం బాగుంటేనే యువతకు భవిత



చేతగాకపోతే దిగిపో!

నేనైతే ఆరు నెలల్లో కరెంటు సమస్య పరిష్కరిస్తా

కేసులు పెడితే ఖబడ్దార్
కిరణ్‌పై చంద్రబాబు నిప్పులు

పాదయాత్రలో భారీ మార్పులు

కృష్ణా నుంచి గుంటూరుకు మారిన షెడ్యూల్

"రాష్ట్రమంతా అంధకారంలో మగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో విద్యుత్ సమస్యను పరిష్కరించడం మీకు చేతకాకపోతే పక్కకు తప్పుకోండి. నేనైతే ఆరు నెలల్లో పరిష్కరిస్తా'' అంటూ కిరణ్ సర్కారుపై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. విద్యుత్ సమస్యపై పోరాడుతున్న తమ పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, రైతులపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపి, ప్రభుత్వ సొమ్మును దోచుకున్న మంత్రులనేమో జైలుకు పంపకుండా రక్షిస్తావా అంటూ నేరుగా దుయ్యబట్టారు. "ఖబడ్దార్ కిరణ్‌కుమార్‌రెడ్డి.. నీవు బయటికి వెళ్లలేవు'' అంటూ హెచ్చరించారు.

ఖమ్మం జిల్లా కూసుమంచి వద్ద ఆయన పాదయాత్ర ప్రారంభించారు. "నీకు విద్యుత్ సమస్య అర్థం కాదు. పొరుగు రాష్ట్రాల నుంచి తెప్పించడం తెలియదు. ట్రాన్స్‌మిషన్ లైన్లు ముందు జాగ్రత్తగా పెట్టుకోవు.. నీది చేతకాని, అవినీతి, అసమర్థ, దద్దమ్మ ప్రభుత్వం. నీకు కరెంటు ఇవ్వటం చేతకాక పోతే ప్రజలకు, రైతులకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయి. విద్యుత్ ఎలా ఇవ్వాలో నేను చూపిస్తా'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. "రైతులు, నాయకులపై కేసులు పెడితే భయపడరు. విద్యుత్ సమస్యలపై పోరాడిన కరీంనగర్ ఎమ్మెల్యేలపై అక్రమంగా పీడీ యాక్టు కింద కేసులు పెట్టి జైలుకు పంపుతావా?.

గుంటూరు జిల్లాలో సహకార బోగస్ సభ్యత్వాల విషయంలో పోరాడిన మాజీ మంత్రి కోడెల శివ్రపసాద్‌ను అరెస్టు చేయిస్తావా? దివంగత నేత పరిటాల రవీంద్రకుమారుడు పరిటాల శ్రీరాంను సింగపూర్‌లో పరీక్షలకు వెళ్లనీయకుండా తప్పుడు కేసులు పెట్టించి అడ్డుకుంటావా?.. అలాంటి నువ్వు నీ మంత్రివర్గంలోని అవినీతి నేతలు జైళ్లకు వెళ్లకుండా కాపాడుతున్నావు..' అంటూ బాబు ధ్వజమెత్తారు. మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరిపై కడుతున్న బాబ్లీ ప్రాజెక్టు విషయంలో తాము ఎలా పోరాడామో.. అక్కడి పోలీసులను ఎలా గడగడలాడించామో... కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు.

తమ హయాంలో ఇలాగే అక్రమ కేసులు పెట్టించిఉంటే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ కనుమరుగయ్యేదని గుర్తుచేశారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు పెట్టే దమ్మూధైర్యం ఈ ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు. చీప్‌లిక్కర్‌పై పన్ను భారం వేసి పేదలను దోచుకుంటున్నారన్నారు. టీఆర్ఎస్ నేతలు కేసిఆర్, కేటిఆర్ తెలంగాణలో ఉద్యమం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి టీడీపీని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాగా, పాదయాత్రలో భారీ మార్పులు చోటు చేసుకొన్నాయి.

నల్లగొండ, గుంటూరు జిల్లాల పర్యటనను మళ్లీ ఆయన పాదయాత్ర మార్గంలో చేర్చారు. ఖమ్మం జిల్లా నుంచి నేరుగా కృష్ణా జిల్లాలోకి వెళ్ళేలా ఆయన యాత్రను కుదించాలని మొదట అనుకొన్నారు. కానీ ఆ రూటు పూర్తిగా గ్రామీణ మార్గంలో ఒక ఇరుకు రహదారిలో ఉంది. ఆయన ఆంధ్రలో అడుగు పెడుతున్న చోట స్వాగత కార్యక్రమం నిర్వహించాలనుకొంటున్నామని, ఈ ఇరుకు రహదారిలో అంత పెద్ద కార్యక్రమం కుదరనందువల్ల రూటు మార్చాలని కృష్ణా జిల్లా పార్టీ నేతలు కోరారు.

నట చంద్రుడు

మూడు నిమిషాల ఫిల్మ్‌కు ఫోజు
 లీడర్ చంద్రబాబు కాస్తా హీరో చంద్రబాబు అయ్యారు. ఆయనపై మూడు నిమిషాల వీడియో ఫిల్మ్‌ను చిత్రీకరించే అవకాశం బాలీవుడ్ దర్శకుడు మణిశంకర్‌కు దక్కింది. అయిదు హిందీ సినిమాలతో పాటు 1500యాడ్ ఫిల్మ్‌లను చేసిన మణిశంకర్ చంద్రబాబును డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారు. ఇటీవల నరేంద్రమోడీపై వీడియో ఫిల్మ్ తీసిన విషయం తెలిసిందే. అయితే జాతీయ స్థాయిలో ఆ చిత్రానికి ప్రచారం లభించటంతో అదే తరహాలో బాబుపై చిత్రీకరించారన్న ప్రచారం జరుగుతోంది.

మా కార్యకర్తలను, రైతులను తాకితే సహించం



ఈ రోజు నా యాత్ర జరిగిన ప్రాంతమంతా గ్రానైట్ క్వారీల పరిధిలోదే. గ్రానైట్ పరిశ్రమ ఒకప్పుడు సిరులు పండించేది. లక్షల మందికి ఉపాధి కల్పించేది. తెలుగువాళ్లే కాక రాజస్థాన్, గుజరాత్, బీహార్ నుంచి కూడా చాలామంది వచ్చేసి ఈ పరిశ్రమపై ఆధారపడి జీవించేవారు. వెంకటగిరి సమీపంలో నాకు కొంతమంది గ్రానైట్ కార్మికులు, యజమా నులు ఎదురుపడ్డారు. పరిశ్రమ గతంలో మాదిరిగా నీడని ఇవ్వలేకపోతున్నదని కార్మికులు వాపోయారు. యాజమాన్యం పడుతున్న ఇబ్బందులవల్ల తమ ఉపాధికి భరోసా లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రమాదంలో చనిపోయినా లేక వికలాంగులుగా మారినా ఆదరించే నాథుడే లేడని బాధపడ్డారు. ప్రభుత్వ విధానాలతో కుదేలవుతున్నామని యజమానులు మొర పెట్టుకు న్నారు. "విద్యుత్ సమస్యతో కోలుకోలేని దెబ్బతిన్నాం. అధికారికంగా నాలుగు గంటల కోత ఉండగా, అనధికారంగా మరో ఎనిమిది గంటలు కోత పెడుతున్నారు.

మరి మేం పరిశ్రమ ఎలా నడపగలం? పీక్ అవర్స్‌లో మామూలు కంటే 6 రెట్లు ఎక్కువ వసూలు చేస్తున్నారు. బ్యాంకు వడ్డీలూ చెల్లించలేకపోతున్నాం. యూనిట్‌కు నాలుగు రూపా యలు కాదు, అవసరమైతే తొమ్మిది రూపాయలు కడతామన్నా కరెంటు ఇవ్వలేని ఈ ప్ర భుత్వం ఎందుక''ని వారు ప్రశ్నించారు. మూడు లక్షలమందికి పైగా ఉపాధిని కల్పిస్తున్న ఈ పరిశ్రమపై ప్రభుత్వానికింత శీతకన్నా!

పెరిగిన ధరలు, విద్యుత్ చార్జీలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలను కలుసుకుంటున్న వాడిగా బోగి పండగను జరుపుకునేందుకు మనసు రావడంలేదు. రాత్రి ఒక క్రిస్టియన్ స్కూ ల్లో నేను బస చేశాను. నేను అక్కడ ఉన్నానని తెలిసి ఖమ్మం ఆడపడుచులు గుంపులుగా వచ్చారు. నేనున్న స్కూలు ఆవరణలో ముగ్గులు వేసి పండగ కళ తెచ్చారు. నాకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. వ్యక్తిగతంగా ఇష్టం లేకపోయినా, క్రిస్టియన్ స్కూల్లో సంక్రాంతి జరుపుకొని మత సామరస్యానికి వేదికగా మారినందుకు ఆనందంగా ఉంది.

ధరల మంటలో బోగి పండగ!