September 19, 2013




  ఈ నెల 21వ తేదీన ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలిసి రాష్ట్ర పరిస్థితులను వివరిస్తానని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించా రు. 'అందరికీ న్యాయం జరగాలని టీడీపీ కోరుకుంటోం ది. ఎన్నికల కోసమో, రాజకీయ లబ్ధికోసమో విద్వేషాలు రగిలించడం సరికాదు. మీకు ఇబ్బంది ఉంటే పార్టీలను పక్కనపెట్టండి. ఇరువైపులా జేఏసీలు, విద్యార్థులు, ప్రజా సంఘాలను పిలిచి మాట్లాడండి. సమస్యలు తెలుసుకొని పరిష్కరించండి. రాష్ట్రపతికి ఇదే విజ్ఞప్తి చేస్తాను' అని వెల్లడించారు. ఎక్సయిజ్ శాఖలో డిప్యూటీ కమిషనర్ (విజయవాడ)గా చేసి ఇంకా పదేళ్ళు సర్వీసు ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన బాణోత్ మోహన్‌లాల్ గురువారం ఇక్కడ టీడీపీలో చేరారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణను అభివృద్ధి చేసింది, ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ సమస్యలపై పోరాడింది ఒక్క టీడీపీయేనన్నారు. తెలంగాణ ప్రజల హృదయాల నుం చి తమను దూరంచేయడం ఎవరితరమూ కాదన్నారు. బయ్యారంలో లక్షన్నర ఎకరాల ఇనుప ఖనిజం గనులను వైఎస్ తన అల్లుడికి రాసిచ్చినప్పుడు టీడీపీ ఒక్కటే నిలబడి పోరాడిందని, ఆ రోజు టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. 'మూడేళ్లు తెలంగాణలో ఆందోళనలు. కొందరు చనిపోయారు. ఇప్పుడు రెండో వైపు ఉద్యమాలు. సమస్య పరిష్కరించాలని మనం కోరితే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేశారు.

చిత్తశుద్ధి ఉంటే ఈ తొమ్మిదేళ్లు ఏంచేశారు? సరిగ్గా ఎన్నికల ముందే గుర్తుకొచ్చిందా? ప్రకటన చేసిన నోటితోనే టీఆర్ఎస్ విలీనం గురించి మాట్లాడతారు. విలీనం కోసం చేసిన ప్రకటనా లేక ప్రజల కోసం చేసిందా? జగన్ పార్టీ డీఎన్ఎ, తమ డీఎన్ఎ ఒకటేనని గొప్పగా చెప్పుకొంటున్నారు. దొంగల డీఎన్ఎ మీదీ ఒకటేనంటే ఇద్దరూ ఒకటేనన్నమాట. మొద్దబ్బాయి ప్రధాని కావాలి... ఇక్కడ దొంగబ్బాయి సీఎం కావాలి. ఎలాగైనా టీడీపీ గెలవకూడా చేయాలి. ఖబడ్దార్... మీరెన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్‌కు సమాధానం చెబుతాం. తిరుగులేని శక్తిగా అవతరిస్తాం. ఈ సారి టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరు' అని ఆయన ప్రకటించారు.

ఈసారి టీడీపీ గెలిస్తే ఐదు వందల జనాభా ఉన్న ప్రతి గిరిజన గ్రామాన్ని పంచాయతీ చేస్తామని, జిల్లా యూనిట్‌గా గిరిజనులకు రిజర్వేషన్లు అమలు చేస్తామని, గిరిజనుల పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య అందిస్తామని, గిరిజన రైతులకు రూ.ఐదు లక్షల వరకూ పూచీలేని రుణం ఇప్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మోహన్‌లాల్‌ను వరంగల్ జిల్లా మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా నియమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తెలంగాణలో ఈసారి మెజారిటీ ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు గెలుస్తామని టిడిపి తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు ధీమా వ్యక్తం చేశారు. కాగా, చంద్రబాబు ఈ నెల 21న ఢిల్లీ వెళ్లి 23వరకు అక్కడే ఉంటారు. 21న ఆయనకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ లభించగా, వివిధ పార్టీల నేతలను కలిసేందుకు 22న అక్కడే ఉంటున్నారు. మరునాడు జాతీయ సమగ్రతా మండలి సదస్సులో పాల్గొంటారు.


courtesy: andhrajyothy

. తెలంగాణ ప్రజల హృదయాల నుం చి తమను దూరంచేయడం ఎవరితరమూ కాదు...........

'రాష్ట్రం తగలబడుతుంటే దానిని వదిలిపెట్టి చంద్రబాబు తన ఆస్తులు ఇప్పుడు ఎందుకు ప్రకటించాలని జగన్ పార్టీ నేతలు అడుగుతున్నారు. రాష్ట్రం తగలబడుతుంటే ఇప్పుడు జగన్ బెయిల్‌కు ఏం తొందర వచ్చిందని దాని కోసం మీరంతా తిరుగుతున్నారు? ఆయన ఇంకో ఏడాదో, ఆరు నెల్లో జైల్లో ఉంటే ఏం కొంపలంటుకు పోవుగదా! వాళ్ళు కూడా టైం ప్రకారం భోజనం, టిఫిన్ పెడతానే ఉంటారు. ఇప్పుడు ఆయన బయటకు వచ్చి చేసేది కూడా ఏమీ లేదు' అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అనుముల రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. అవినీతిపై పోరాటంలో ఆదర్శంగా నిలవాలన్న ఉద్దేశంతో చంద్రబాబు తన ఆస్తులు, కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు ప్రకటించారని, జగన్ సహా వైఎస్ కుటుంబంలోని వారంతా తాము కూడా తమ ఆస్తులు ప్రకటించి సగర్వంగా నిలబడే బదులు చంద్రబాబును తిట్టిపోయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. 'చంద్రబాబు తనకు ఉన్న మొత్తం ఆస్తుల వివరాలు ఇచ్చేశారు. ఇంకా తనకు ఏవైనా ఉంటే చూపించమని సవాల్ విసిరారు. దాని జోలికి పోకుండా కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లు అందులో ఏవో వెతికే ప్రయత్నం చేస్తున్నారు. తన ఆస్తులు తాను కొన్ననాటి రేటును చంద్రబాబు చెప్పారు. ఈ రోజు రేటు చెప్పలేదు. మార్కెట్ ధరలు రోజుకో రకంగా మారుతుంటాయి. వాటిని అమ్మితే నిజంగా ఆ రోజు ధర తెలుస్తుంది. జగన్ కుటుంబంలో ఏ ఒక్కరూ తమ ఆస్తులు చెప్పరు...తమకు ఎన్ని కంపెనీలుఉన్నాయో...వాటికి అన్ని వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పరు. ఎవరైనా స్వచ్ఛందంగా చెబితే వారిపై ఒంటి కాలిపై లేస్తున్నారు. తమను కూడా ప్రజలు నిలదీస్తారేమోనన్న భయం వారిని పట్టుకొంది' అని రేవంత్ విమర్శించారు.
వైఎస్ కుటుంబంలోని వారు తమ ఆస్తులేగాక చివరకు తమ కుటుంబ సభ్యులు ఎవరో కూడా చెప్పుకోలేకపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 'షర్మిల తాను రాజన్న కూతురునని...జగనన్న చెల్లెలని చెప్పుకొంటారుగాని బ్రదర్ అనిల్ భార్య అని ఎక్కడా చెప్పుకోరు. లక్ష్మీ పార్వతి ఎన్టీ రామారావు కుటుంబంలో చేరి చిచ్చు పెట్టినట్లు షర్మిల బ్రదర్ అనిల్ కుటుంబంలో చేరి చిచ్చు పెట్టారు. అనిల్ భార్యా బిడ్డలకు షర్మిల చేసింది ద్రోహం కాదా? చంద్రబాబు కోడలు బ్రాహ్మణి పెట్టుకొన్న వజ్రాల గొలుసు లెక్కేదంటూ జగన్ పార్టీ నేతలు కుంటి కూతలు కూస్తున్నారు. బ్రాహ్మణి తాత ఒక పెద్ద అగ్ర హీరో. ముఖ్యమంత్రిగా చేశారు. ఆమె తండ్రి సినీ పరిశ్రమలో మరో పెద్ద హీరో. ఆమెకు వజ్రాల గొలుసు కొనుక్కొనే తాహతు లేదా? జగన్‌ను చూడటానికి భారతి జైలుకు వెళ్ళేటప్పుడు పెట్టుకొనే వజ్రాల దిద్దుల లెక్కలు మీరు ఏనాడైనా చెప్పారా? అధికారాన్ని అడ్డు పెట్టుకొని లక్ష కోట్లు దోచుకొన్న మీరు కూడా ఇతరుల గురించి మాట్లాడతారా? మీరు అబద్ధాలు మాట్లాడటం మానకపోతే మేం మీ గురించి మరిన్ని నిజాలు మాట్లాడాల్సి ఉంటుంది' అని ఆయన హెచ్చరించారు.
గుమస్తా ఉద్యోగం ఇచ్చిన గని యజమాని వెంకట నరసయ్యను చంపి ఆ గనిని హస్తగతం చేసుకొన్న వైఎస్ కుటుంబానికి ఉన్న నేర చరిత్ర తరాల తరబడి కొనసాగుతోందని, చంద్రబాబు కుటుంబానికి అటువంటి నేర చరిత్ర లేదని జగన్ పార్టీ నేతలు గుర్తించాలని ఆయన సూచించారు.

జగన్ బెయిల్‌కు ఏం తొందర వచ్చిందని దాని కోసం మీరంతా తిరుగుతున్నారు?